Wednesday, 18 March 2026

Blog

విశాఖపట్నం

జబ్బరితోట వద్ద సామాజిక భవనాన్ని ప్రారంభించిన నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*37 వార్డు , జబ్బరితోట వద్ద సామాజిక భవనాన్ని ప్రారంభించిన నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *నియోజకవర్గంలో అన్ని వార్డులలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపిన ఎమ్మెల్యే* ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రథమ కర్తవ్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు 37 వ వార్డు పరిధిలోని జబ్బరితోట వద్ద సుమారు 42 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మించిన సామాజిక భవనం రెండవ అంతస్తు ను దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ చెన్న జానకిరామ్ లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పన ప్రధమ కర్తవ్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతుల పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు చేరువులో ఉంటుందన్నారు. ప్రజలకు మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీలకతీతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జబ్బర తోటలోని ప్రజల అవసరాల మేరకు సామాజిక భవనాన్ని కి అదనపు అంతస్తు నిర్మించి నేడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, జబ్బరి తోటలో సామాజిక భవనాన్ని ప్రారంభించి ఇక్కడ ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, జీవీఎంసీ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వరరావు, సహాయక ఇంజనీరు, సచివాలయం కార్యదర్శులు, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి గారు స్థానిక కూటమి నేతలు శ్రీ గరికిన రవి గారు, శ్రీ చిన్న గారు, తాతలు మాస్టర్, శ్రీ తాతాజీ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ తాతారావు గారు, పెద్దయ్య గారు, కే ఎఫ్ రాజు, అయ్యప్ప గారు, పలువురు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఐదవ వార్డు లో యూజిడి సమస్యకు పరిష్కారం*

*ఐదవ వార్డు లో యూజిడి సమస్యకు పరిష్కారం* *సుమారు రూ.3 కోట్ల నిధులతో రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలలో యూజీడి పనులకు శ్రీకారం.* *_5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత_* *మధురవాడ* విశాఖ పున్నమి ప్రతినిధి: జీవీఎంసీ ఐదవ వార్డ్ పరిధిలోగల రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలలో యూజీడి సమస్య శాశ్వత పరిష్కారానికై సుమారు మూడు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఐదవ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత అన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆ పనులకు కార్పొరేటర్ హేమలత భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ వార్డు లో యూజీడి సమస్య చాలా ఎక్కువగా ఉందని, దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఆ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ యుజిడి సమస్యను పరిష్కరించాలని చాలా సార్లు జివిఎంసి కౌన్సిల్ సమావేశాలలో మాట్లాడడం జరిగిందని,గత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో చాలా అలసత్వంగ ఉండడం వలన అప్పుడు ఈ సమస్య పరిష్కారం కాలేదని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ సమస్యపై జీవీఎంసీ కౌన్సిల్ ద్వారా మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లానని అలాగే స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సహకారంతో ఈరోజు వార్డులో యూజిడి సమస్య పరిష్కారానికై సుమారు 6 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అందులో భాగంగా మొదట విడతగా రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలో సుమారు మూడు కోట్ల నిధులతో పనులు ప్రారంభించమని, మిగిలిన పనులు కూడా తొందరగానే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,వాండ్రాశి అప్పలరాజు, ఈగల రవికుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, కొండపూ రాజు, వంకా నూకరాజు, శ్రావణ్, చక్రీ,నాగేశ్వరరావు, రామునాయుడు,రమేష్, ఇమందిరాజు ,ప్రమీలదేవి,కృష్ణవేణి, మాధవ,రాంబాబు, రవీంద్ర,మోహన్, హరికృష్ణ,లక్ష్మీనారాయణ, అప్పారావు, వాయుకుమార్ సచివాలయ కార్యదర్శులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ల ద్వారా బీఎల్వోల‌కు అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి*

*ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ల ద్వారా బీఎల్వోల‌కు అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి* *రాష్ట్ర ప్ర‌ధాన‌ ఎన్నిక‌ల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ అనంత‌రం అధికారుల‌ను ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్ *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి * కేంద్ర‌, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ల ఆదేశాల మేర‌కు చేప‌ట్టే అన్ని ర‌కాల ప్ర‌క్రియ‌ల‌పై, అంశాల‌పై బీఎల్వోలు స‌మ‌గ్ర అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, ఆ మేర‌కు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు క్ర‌మం త‌ప్పకుండా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్లో స్థానిక క‌లెక్ట‌రేట్ వీసీ హాలు నుంచి భాగ‌స్వామ్య‌మైన క‌లెక్ట‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాకు సంబంధించిన అన్ని అంశాల‌ను వెల్ల‌డించారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌, పోలింగ్ స్టేష‌న్ల రేష‌న‌లైజేష‌న్, మ్యాపింగ్ ప్ర‌క్రియ‌లు, ఇత‌ర అంశాల‌పై నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల‌, గ్రామ స్థాయి అధికారుల‌కు శిక్ష‌ణ స‌ద‌స్సులు నిర్వ‌హించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. తాజాగా ఈ నెల 25వ తేదీన బీఎల్వోల‌కు శిక్ష‌ణ అందించామ‌న్నారు. ఎప్పుడొచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను అప్పుడే ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, పెండింగ్ లేకుండా చూసుకుంటున్నామ‌ని చెప్పారు. జిల్లాలో ఒక ఈఆర్వో, ఒక ఏఈఆర్వో స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంద‌ని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. వీసీ అనంత‌రం జిల్లా అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన క‌లెక్ట‌ర్ ప‌లు అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. రాబోయే అవ‌స‌రాల‌ను, జాబితా స‌వ‌ర‌ణ, మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌టి నుంచే అంద‌రూ స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని సూచించారు. ప్రీ ఎస్.ఐ.ఆర్. నేప‌థ్యంలో 2002 జాబితాను 2025 ఓట‌ర్ల జాబితాతో స‌రిచూసి ప‌రిశీలించాలని చెప్పారు. ఓట‌ర్ల మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు వీలుగా ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక చేసుకోవాల‌న్నారు. రోజుకో గంట స‌మయం కేటాయించాల‌ని, బీఎల్వోల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా శిక్ష‌ణ‌లు ఇస్తూ అన్ని విష‌యాల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఈఆర్వోలు, ఏఈఆర్వోల‌కు సూచించారు. బీఎల్వోలు క‌చ్చితంగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించాల‌ని, మ్యాపింగ్ ప్ర‌క్రియ‌లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఏఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌లు, పోస్ట‌మెన్ల స‌హ‌కారం తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఎక్క‌డైనా బీఎల్వోలు లేక‌పోతే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈఆర్వోల‌ను ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎల‌క్ష‌న్ డీటీలు, ఎల‌క్ష‌న్ సెల్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మొదటి గురువారం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు*

*శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మొదటి గురువారం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * * వైభవంగా ప్రారంభమైన మొదటి గురువారం పూజా కార్యక్రమం * అమ్మవారి గర్భాలయంలో పంచామృతాలతో మొదటి గురువారం పూజ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు * పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజా దంపతులు పంచామృత అభిషేకాలతో పూజలు ప్రారంభించారు. ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజ అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న మండపంలో ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారని మొదటి గురువారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ముందు జాగ్రత్తతో అధికసిబ్బంది తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని తెలిపారు . కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ , కూటమి నేతలు, పోలీసు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా

వెంకటాచలం నవంబరు (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు డేవిడ్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, సత్య ప్రియ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రానికి పూలదండ అర్పించి ఆయన చేసిన రాజ్యాంగ సేవలను స్మరించారు. అనంతరం సిబ్బంది, విద్యార్థులు కలిసి రాజ్యాంగ పీఠికను వాచించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డేవిడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో ప్రారంభమైన రచనా ప్రక్రియ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు సాగి, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిందని, 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి విద్యార్థులు రాజ్యాంగ విలువలను ఆచరించి ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు. తరువాత వక్తృత్వ, క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మిఠాయిలు పంచి, జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. ఉపాధ్యాయులు కొమ్మల కృష్ణయ్య, శ్రీలక్ష్మి, సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం*

*ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం* *రాజోలు విశాఖ పున్నమి ప్రతినిధి:- * – రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0 – గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం – రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు, రూ.375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు – రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు – ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు – మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది – అబద్ధపు హామీలతో జెన్ జి యువతను మోసం చేయలేం – సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది – రాజోలు నియోజక వర్గం శివకోడు గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండగ తొలి దశకు సంబంధించి చేపట్టిన పనులు ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా తిలకించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ. ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం. ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మీ సిమ్‌ దుర్వినియోగమైతే మీదే బాధ్యత: డాట్‌

కొందరు సిమ్‌కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి మూలన పడేస్తుంటారు. వాడడం లేదన్న కారణంతో ఏదో ఒక సందర్భంలో తెలిసిన వ్యక్తులే కదా అని ఇచ్చేస్తుంటారు. ఒకవేళ అలా ఇచ్చిన నంబర్‌ సైబర్‌ మోసాలకో, చట్టవ్యతిరేక కార్యకలాపాలకో వాడినట్లు తేలితే ఆ సిమ్‌ కార్డు యజమానిగా మీరూ బాధ్యులే!

అన్నమయ్య

కందుల గుండయ్య నాయుడు బౌతికాయానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించిన కె.కె. చౌదరి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీ కందుల గుండయ్య నాయుడు గారి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ​బుధవారం ఉదయం చిట్వేలి మండలంలోని కె. కందులవారిపల్లిలో కందుల గుండయ్య నాయుడు గారి అంతిమ యాత్రకు ముందు, చైర్మన్ కె.కె. చౌదరి ఆయన భౌతికకాయానికి టీడీపీ జెండాను కప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, ప్రజలకు కందుల గుండయ్య నాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. ​ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు, చిట్వేలి మాజీ ఎం.పీ.పి కట్టా గుండయ్య నాయుడుతో పాటు చిట్వేలి మండలంలోని పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు అంతా కలిసి దివంగత నాయకుడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అన్నమయ్య

కందుల గుండయ్య నాయుడు బౌతికాయానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించిన కె.కె. చౌదరి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీ కందుల గుండయ్య నాయుడు గారి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ​బుధవారం ఉదయం చిట్వేలి మండలంలోని కె. కందులవారిపల్లిలో కందుల గుండయ్య నాయుడు గారి అంతిమ యాత్రకు ముందు, చైర్మన్ కె.కె. చౌదరి ఆయన భౌతికకాయానికి టీడీపీ జెండాను కప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, ప్రజలకు కందుల గుండయ్య నాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. ​ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు, చిట్వేలి మాజీ ఎం.పీ.పి కట్టా గుండయ్య నాయుడుతో పాటు చిట్వేలి మండలంలోని పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు అంతా కలిసి దివంగత నాయకుడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.