Friday, 6 March 2026

Blog

ఖమ్మం

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల వివాదం: పేదల గుడిసెల కూల్చివేతపై కన్నీటి కథనం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న 60 ఎకరాల భూదాన్ భూములు మరోసారి వివాదాల కేంద్రంగా మారాయి. గత పదేళ్లుగా అక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యాయి. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఖమ్మం కార్పొరేషన్ అధికారులు చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. జేసీబీలు గర్జించగా, మహిళలు, వృద్ధులు, చిన్నారుల రోదనలు ఆకాశాన్ని తాకాయి. కన్నీటి వర్షం మధ్య కూల్చివేత సుమారు 600కి పైగా కుటుంబాలు పదేళ్లుగా అక్కడే నివసిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చాలా మంది కూలీ పనులు చేసుకుంటూ, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. “మాకు ఎక్కడికీ వెళ్లే చోటు లేదు… మా పిల్లల చదువు ఏమవుతుంది?” అంటూ మహిళలు విలపించారు. కొందరు వృద్ధులు గుడిసెల ముందే కూర్చుని నిరసన తెలిపారు. అయితే అధికారులు ఖాళీ చేసే వరకు అక్కడే మోహరించి, ఒక్కొక్క గుడిసెను కూల్చివేశారు. రాజకీయ ఆరోపణలు, ప్రజల వాపోయింపు ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేతల పేర్లు ప్రస్తావిస్తూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు అయిన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను గెలిపించి పంపితే, ఇప్పుడు తమనే రోడ్డు మీదకు నెట్టేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. “పేదల దగ్గర నుంచి దోచుకుని ధనవంతులకు ఇస్తున్నారు” అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారుల వాదన ప్రకారం భూములు ప్రభుత్వ అధీనంలో ఉన్నవని, అక్రమ నిర్మాణాలు తొలగించడమే తమ విధి అని చెబుతున్నట్లు సమాచారం. కోర్టు కేసు – ఆదేశాలపై సందేహాలు ఈ భూములపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధమని బాధితుల తరఫు న్యాయవాదులు అంటున్నారు. “కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సింది. ఇలా హఠాత్తుగా చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని వారు పేర్కొన్నారు. మానవ కోణం – రోడ్డున పడిన జీవితాలు ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ప్రస్తుతం రోడ్డుపై తాత్కాలికంగా గుడారాలు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారుల చదువులు, మహిళల భద్రత, వృద్ధుల ఆరోగ్యం వంటి అనేక ప్రశ్నలు ముందుకు వచ్చాయి. సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి పునరావాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ముందున్న మార్గం? వెలుగుమట్ల ఘటన ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పేదల పునరావాసంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కోర్టు తీర్పు ఏ మలుపు తీసుకువస్తుంది? ప్రజలకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలియనుంది. ఇప్పటికైతే వెలుగుమట్లలో కూల్చివేతల దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. పేదల కళ్లలో కన్నీరు ఆగాలంటే తక్షణ చర్యలు అవసరం అనే అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది.

E-పేపర్

వీధి కుక్కల దాడిలో.. ఆవుదూడ మృతి..? యాచారం మండలం నజ్దిక్ సింగారంలో వీధి కుక్కల బారిన పడి ఆవుదూడ మృతి

పున్నమి న్యూస్ 24 ఫిబ్రవరి 2026 వీధి కుక్కల దాడిలో.. ఆవుదూడ మృతి..? యాచారం మండలం నజ్దిక్ సింగారంలో వీధి కుక్కల బారిన పడి ఆవుదూడ మృతి చెందిందని రైతు కడారి జంగయ్య తెలిపాడు. తన వ్యవసాయ పొలంలో రోజులాగే ఆవులు, దూడలను కట్టేసి వెళ్ళానన్నాడు. రాత్రి వీధి కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్ర శేఖర్ ను మర్యాద పూర్వకoగా కలిసిన మర్రిపాడు చిన్న జనసేన

నెల్లూరు లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్ర శేఖర్ ను మర్యాద పూర్వకoగా కలిసిన మర్రిపాడు చిన్న జనసేన మర్రిపాడు చిన్న జనసేన మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని పార్టీ ప్రతిష్టతను పెంచేందుకు ఎన్ని ఆవుమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఓర్పు సహానంతో మర్రిపాడు మండలం లో పార్టీ అభ్యునతికి నిరంతరం కృషి చేస్తున్నామని అయన మాట్లాడారు.

పల్నాడు

ఫిబ్రవరి 28నే పింఛన్లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ 4 వేలు పెన్షన్ పంపిణీ చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తోంది. ప్రతీ నెలా సీఎం చంద్రబాబు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు పైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా.. ఈ నెల పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మార్చి 1న పెన్షన్ పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1, 2026 బదులుగా ఫిబ్రవరి 28నే పింఛన్లు అందనున్నాయి. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 27 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 28 నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ, ఏవైనా మిగిలిపోతే, ఆయా పింఛన్లను మార్చి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి1న ఆదివారం కావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కీలక తీర్పు, ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!! ఈ నెల 28నే పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు రూ.4000 అందిస్తున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.6000, పూర్తి వికలాంగులకు రూ.10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10000 ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్‌దారులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజునే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్దం అయిది. ఆ రోజున ఎవరికైనా అందక పోతే మార్చి 2న లబ్దిదారులకు అందించనున్నారు.

E-పేపర్

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను కబ్జా చేసిన పట్టించుకోరా ??????

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 9640204826 24 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పేరు మీద ఉన్న మూడు ఎకరాల ఎండోమెంట్ భూమిని దొంగ చాటున భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సతీమణి గౌర వసంత పైన తూలేఖర్డ్ రెవిన్యూ గల సర్వే నెంబర్ 98 /2 లో మూడు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్మన్నగూడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూముల పరిరక్షణ కమిటీ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు బండ మల్లేష్ మండల సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 98/2 లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పేరు మీద భూమి ఉందని తెలిపారు ఈ భూమిని గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటివరకు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలంతా కలసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ ధర్మన్నగూడ గ్రామ ప్రజలందరికీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిని సర్వే చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పేరు పేరు మీదికి తక్షణమే మార్చాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి మండల నరసింహ. మండల గోపాలకృష్ణ మండల జంగయ్య కొంపోజు సురేష్ చారి. బుడిగలి మల్లేష్ బుర్రి వెంకటేష్ మండల నరేందర్ ఇతరులు పాల్గొన్నారు

E-పేపర్

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను కబ్జా చేసిన పట్టించుకోరా ??????

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 9640204826 24 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పేరు మీద ఉన్న మూడు ఎకరాల ఎండోమెంట్ భూమిని దొంగ చాటున భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సతీమణి గౌర వసంత పైన తూలేఖర్డ్ రెవిన్యూ గల సర్వే నెంబర్ 98 /2 లో మూడు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్మన్నగూడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూముల పరిరక్షణ కమిటీ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు బండ మల్లేష్ మండల సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 98/2 లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పేరు మీద భూమి ఉందని తెలిపారు ఈ భూమిని గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటివరకు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలంతా కలసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ ధర్మన్నగూడ గ్రామ ప్రజలందరికీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిని సర్వే చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పేరు పేరు మీదికి తక్షణమే మార్చాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి మండల నరసింహ. మండల గోపాలకృష్ణ మండల జంగయ్య కొంపోజు సురేష్ చారి. బుడిగలి మల్లేష్ బుర్రి వెంకటేష్ మండల నరేందర్ ఇతరులు పాల్గొన్నారు

తిరుపతి

శ్రీకాళహస్తిలో చాగంటి ప్రవచనామృతం-శివతత్వంతో పులకించిన భక్తజనం

శ్రీకాళహస్తి, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక సాంస్కృతిక కళావేదిక (ధూర్జటి ప్రాంగణం) నందు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు శివతత్వాన్ని, శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను వివరిస్తూ చాగంటి వారు సాగించిన ప్రవచనం ఆద్యంతం భక్తిభావంతో సాగింది. మానవ జన్మ సార్థకతకు భక్తి మార్గమే శరణ్యమని, పరమశివుని అనుగ్రహం పొందేందుకు నిరంతర నామస్మరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని మహత్తును, జ్ఞానప్రసూనాంబికా దేవి కరుణాకటాక్షాలను పురాణగాథలతో జోడించి ఆయన వివరించిన తీరు భక్తుల హృదయాలను హత్తుకుంది. చాగంటి ప్రవచనాన్ని ఆలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కళావేదిక ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం చాగంటి వారిని స్థానిక శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, ఆలయ పరిపాలన అధికారి బాపిరెడ్డి దంపతులు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనంగా సత్కరించి శ్రీ స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు నేటితో (ఫిబ్రవరి 23) శాంతి అభిషేకంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే నంది సేవ, రథోత్సవం, కళ్యాణోత్సవం వంటి ప్రధాన ఘట్టాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలను రద్దు చేసి, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

తిరుపతి

నిరవధిక సమ్మె చేపట్టిన సొసైటీ ఉద్యోగులు

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు శ్రీకాళహస్తి డిసిసి బ్యాంకు పరిధిలోని నాలుగు సహకార సంఘాలు తంగేళ్ల పాలెం, కోవనూరు, కాటూరు, కాపు గున్నేరు సొసైటీ ఉద్యోగులు అందరూ కలిసి పాల్గొని నిరవధిక సమ్మెను తమ న్యాయమైన కోరికలు సాధనకై సంఘము నందు టెంట్ వేసి అందరూ నిరాహార దీక్షకు నిరసన తెలియజేసి ధర్నాలో పాల్గొని నిరసనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పప్పు చిరంజీవి రెడ్డి మరియు సహకార సంఘం ఉద్యోగిని ఉద్యోగులు శ్రీనివాసులు శేఖర్ బాబు వాసు భాస్కర్ దివ్య రాజశేఖర్ మహేష్ శ్రీనివాసులు సుదర్శన్ రెడ్డి అరుణ్ సుబ్బయ్య శ్రీనివాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

బసవయ్యపాలెంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టంబేడు మండలంలలోని బసవయ్యపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాలలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 19మంది పేషెంట్లు చూపించుకోవడంతో వీరిలో 10మంది కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించి వారందరికీ శ్రీ భక్తకన్నప్ప కంటి ఆసుపత్రిలో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేస్తామని త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ వారు తెలిపినారు. వైద్య శిభిరంలో పాల్గొన్నా వారందరికీ ఉచితంగా పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది దామోదర్,స్వాతి, గ్రామస్తులు వాణి, రానెమ్మ, కనకమ్మలు ముందుండి ఐ క్యాంపుని విజయవంతం చేశారు.

తిరుపతి

పటాన్ ఫరీద్ పితృవియోగం పట్ల సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఫరీద్ తండ్రి దివంగత పటాన్ కాలేషా కర్మక్రియ కార్యక్రమం ఆదివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరై, కాలేషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాషా,గోర, ఫజల్,గఫూర్,జూమ్లేష,జిలాని, బాబు, మున్నా రాయల్,కంట ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్, శివకుమార్ యాదవ్,కంచి గురవయ్య, పెరుమాళ్ చౌదరి, టైలర్ శీను, యోగ, జస్వంత్, నారాయణ, నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు,కార్యకర్తలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని ఫరీద్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.