కలిసొచ్చిన కాలం (కథ) – డాక్టర్ బద్రి పీర్ కుమార్
మానవత్వం ఉన్న ప్రతి మనిషి అందరిని సమానంగా చూస్తాడు. నైతిక విలువల పట్ల విధేయత చూపుతాడు. మనసు మనసు తోడై ఆకర్షితులైన స్త్రీ పురుషులు జీవితానికి పూలబాట వేసుకుని జీవన రథచక్రాలై సరైన మార్గంలో సాగి పోతారు. ‘ప్రేమ’ కొలువున్న ప్రదేశం కల్మషం లేని హృదయం. ఈ హృదయాలను ధరించిన జంటలు మేరువులై జీవన స్రవంతిలో పూబంతులై పరిమళిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. కష్ట సుఖాలు, కలిమి లేములు జీవన యాత్రకున్న లక్షణాలు. చీకటి వెన్నెలవోలె కష్ట సుఖాలు. ఇదే కదిలే కాలం. చీకటిని అనుభవించిన తర్వాతే వెన్నెల కున్న ప్రాముఖ్యత చక్కగా బోధపడుతుంది. జీవితం మీద విరక్తి కల్గించిన కాలం కల్పవృక్షమై నిలిస్తే అదే ‘కలిసొచ్చిన కాలం’ బ్రహ్మరాతలకు రూపు దిద్దుకున్న అలంకారం. ఇక కథలోకి వెళ్దాం… బస్సు వేగంగా సాగిపోతుంది. చల్లని గాలి వీస్తుంది. తన తలపులలో కొలువుండే వనజకు పెళ్ళవుతుందన్న వార్త తెలుసుకున్న సుమంత్ హృదయం బరువెక్కి నీటిలో రాయిలా ఉంది. వెనక్కి పోతున్న చెట్లను విచారంగా చూస్తూ ఉన్నాడు. గడిచిన తన 20 సం॥రాల జీవితం కళ్ళముందు కనబడుతుంది. తీపి గుర్తులు చేదుగుర్తులయ్యేటట్లున్నాయి. క్షణమునకో ఆలోచన ఉదయిస్తుంది. ఓ చోట ఉన్నట్లుండి బస్సు ఆగింది. రోడ్డు ప్రక్కనున్న మైలురాయి కనిపించింది. దాని పై హైదరాబాద్ 45 km అని వ్రాసుంది. మరో గంటలో హైదరాబాద్ లొ ఉంటాననుకొని, ‘వనజను కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు అతనెవరో చూడాలి. అయినా మావయ్య నాకు ఆహ్వానం పంపలేదు’ అక్కడి కెళ్ళడం మర్యాద కాదేమోనని తలచి తన మిత్రుడు మాధన్ ఇంటికెళ్ళాలనుకున్నాడు. కాస్సేపటిలో బస్టేషన్ వచ్చేసింది. వనజను తన కళ్ళల్లోనే దర్శించు కుంటూ బస్సు దిగాడు సుమంత్. మాధన్ ఇల్లు విద్యుత్ నగర్ లో ఉంది టౌన్ సర్వీస్ కూడా సిద్దంగానే ఉంది. ఆ బస్సెక్కాలో లేదా వనజ కళ్యాణ మండపం వైపెళ్ళాలో దిక్కుతోచడం లేదు సుమంత్కి. వనజ పెళ్ళయినా కళ్ళారా చూడాలని తన మనసు ఉబలాట పడుతున్నది. ‘వనజకు నేనంటే ఇష్టమే, కాని నాపై ఉన్న ఇష్టం కన్నా తన తండ్రిమీదే ప్రేమెక్కువ. అతని మాటకు ఎదురివ్వక అతని ఇష్ట ప్రకారమే పెళ్ళికంగీకరిచిందేమో.. మనిషికి మనసుంటే చాలదు. మనీ కూడా కావాలి.. అది నా దగ్గిర లేదు గనుకే వనజకు మేనల్లుణ్ణి నేనొకడున్నానని కూడా చూడకుండా మ్యారేజ్ ఫిక్స్ చేశాడు మామయ్య.. సర్లే వనజ నన్ను పెళ్ళాడినట్లయితే వనవాసమే.. కాదామరి! పేదవాణ్ణి పెళ్ళాడితే.. రాతలు ప్స్’ అని తన మనసు తో మాట్లాడి నిరాశ ముఖం తో టౌన్ సర్వీసెక్కబోయాడు. అనుకోకుండా మాధవ్ అదే బస్సులోంచి దిగుతూ ‘ఏరా సుమంత్ పి.జి. పూర్తయిందా.. అన్నట్లు ఎప్పుడొచ్చావ్.. అమ్మ బాగుందా..’ అంటూ 5 నిముషాలు డబడబా మాట్లాడేశాడు మాధవ్. ‘ఇప్పుడే దిగారా.. ఈమధ్య మనసేం బాగోలేదు నిన్ను కలవాలనిపించింది.. వెంటనే వచ్చేసా.. అంతే’ ఏదో దాస్తున్నట్లు చెప్పాడు సుమంత్. ‘సరే.. అన్నీ తర్వాత మాట్లాడుతాం గానీ.. మరో 30 ని॥లలో ఆ… కన్పించే కళ్యాణ మండపంలో మా చిన్నాయన కొడుక్కి పెళ్లి’ అంటూ దూరంగా ఉన్న దాన్ని వేలెత్తి చూపిస్తూ ‘పెళ్ళి కుమార్తె పేరు వనజ.. వాళ్ళు కూడా బాగా ఉన్నవారే సుమా!’ అంటూ టాక్సీని పిలిచాడు మాధవ్. ‘ఉన్నవాళ్ళు కాబట్టే నన్ను దూరం చేసుకున్నారు’ నోటిలో గొణుక్కుంటూ ఎలాగయినా సరే వనజ తనకి దక్కకున్నా ఆ దక్కించుకునే వాణ్ణి చూడాలన్న తాపత్రయం తనలో ఎక్కువైంది. మరేం చెప్పలేక సరే పదమంటూ మిత్రుడితో కలిసి కళ్యాణ మండపానికి బయల్దేరాడు సుమంత్. కళ్యాణ వేదిక విద్యుద్దీపాలంకరణలతో శోభాయ మానంగా ఉంది. ఆ కాంతులలో వనజ సౌభాగ్య లక్ష్మిగా దర్శన మిచ్చింది. ‘వేసవి సెలవులలో మా ఇంటి కొచ్చి నాతో ఆడి పాడిన వనజేనా ఈమె’ అనుకుని ఆ అందాన్ని మరెప్పుడూ చూడలేనట్లు చూస్తూ నిలబడిపోయాడు సుమంత్. ‘కూల్ డ్రింక్ ప్లీజ్’ అన్న శబ్దం వినబడింది. తీసుకున్న కూల్ డ్రింక్ చేతిలోనే ఉంచుకొని వనజను తనివి తీరా చూస్తూ నిలబడి పోయాడు. తన మావయ్య ఆ పెళ్ళి సందడిలో సుమంత్ను కనీసం పలకరిచనూ లేదు. మాధవ్ సుమంత్ని పెళ్ళికొడుక్కి పరిచయం చేస్తూ ‘హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’ అని చెబుతాడు. ప్రక్కనే ఉన్న వనజ సుమంత్ రాక చూసి ఆనందిస్తుంది కాని అతని ప్రేమను గ్రహించలేదు. చనువుగా ప్రవర్తించేది ఆ చనువే ప్రేమగా భావించాడు సుమంత్. చనువుతో పాటే వారిరువురి వయసు కూడా పెరగడంతో వీరెక్కడ ప్రేమించి పెళ్ళి చేసుకుంటారోనని, అలా జరిగితే తన కూతురు పేదింటి కోడలవుతుందని రాకపోకలను కట్చేసి చివరకు ఆహ్వానం కూడా పంపలేదు తన మావయ్య. పురోహితులు మంత్రాలు చదువుతుండగా, మంగళ వాయిద్యాలతో వనజ మెడలో మూడుముళ్ళు పడ్డాయి. వనజకు వెళ్ళాస్తానంటూ తన చూపులతోనే తెలిపాడు సుమంత్. సుమంత్ను ఆపి మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే తన తండ్రి అడ్డు పడడంతో ఏమీచేయలేక తటస్థంగా ఉండిపోయింది వనజ. తను ఆశించింది పొందలేనపుడు ఎవరికైనా బాధే. మాధవ్ ఎంత బ్రతిమలాడినా ఉండకుండా తన గ్రామానికి బయల్దేరాడు సుమంత్. *** ‘ఎప్పటి నుంచో చెబుతూనే వచ్చాను.. మీ మావయ్య ధనమే జీవితం అనుకునే మానవత్వం లేని మనిషని, అతనికి రక్త సంబంధం, మమతాను రాగాల విలువ తెలియదు. తెలిసిందల్లా ఒకటే.. ధనం, హోదా.. ఇప్పటికైనా అన్నీ మరచిపో బాబు’ అంటూ సుమంత్ ని ఓదార్చుతూ గిన్నెలో అన్నం పెడుతుంది తన తల్లి అన్నపూర్ణమ్మ. కాని ప్రేమించిన నేరానికి శిక్ష ఉపవాసం ఇది కాలం చెప్పే మాటగా ఆ రోజంతా పస్తుండి పోయాడు సుమంత్. ** నిరాశ నిస్పృహల మధ్యన తను చదివిన చదువు కూడా మరచాడు సుమంత్. అన్నపూర్ణమ్మకు ఐదుగురు బిడ్డలు. నలుగురి ఆడపిల్లలకు అతి కష్టం మీద పెళ్లి చేయ గలిగింది. ఆఖరివాడు సుమంత్. నాలుగిండ్లలో పని చేసి తను పోషిస్తున్న అమ్మను చూసి ఏదో ఒక ఉద్యోగం చేయాలనిపించి విశాఖపట్నం లో టైపిస్టు పోస్టు ఖాళీగుందని తెలిసి మరేం ఆలోచించక కష్టపడుతున్న తన తల్లిని పోషించుటకు ఒక బిస్కెట్ ప్యాక్టరీలో టైపిస్టుగా చేరాడు సుమంత్. *** ‘అమ్మా రూపా.. చదివిన చదువు చాలు.. ఇక నుంచి నీవు చదవాల్సిన అవసరం లేదు మనకేం తక్కువ?.. ఆరు ఫ్యాక్టరీలున్నాయి. B.A. వరకు చదివి అంతో ఇంతో తెలివితేటలు సంపాదించావు.. నీ కంతగా బోరనిపిస్తే.. ఏదో నీకిష్టమొచ్చిన ప్యాక్టరీని మేనేజ్చేయి’ అంటాడు దీప తండ్రి గుణశేఖర్. ఇతను చాలా సహృదయుడు పెంచిన మమకారం తప్ప తన కన్నకూతురు కాదనే భావన ఎప్పుడు రానివ్వలేదు. చదువు మానేసి ఇంట్లో కూర్చోవటం ఇష్టంలేక వారి బిస్కెట్ ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉండడానికి ఒప్పుకుంది దీప. ఓ రోజు గుణశేఖర్ బిస్కెట్ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరిని దీపకు పరిచయం చేస్తూ ‘ఇతను సుమంత్ అని టైపిస్టు ఈ మధ్యనే చేరాడు ఇతనికి ఇక్కడ ఓ ప్రత్యేక స్థానముందమ్మా.. ఏంటంటే చేరిన మొదటి రోజు మెయిన్ ఆపి నన్ను ఈ ఫ్యాక్టరీని రక్షించాడు. లేకుంటే ఆ… విద్యుత్ తీగ తెగి పెద్ద ప్రమాదమే సంభవించేది’. ‘నా దేముందండి విధి ధర్మం మీదయ’ వినయంగా పలికాడు సుమంత్. పేరుకు తగ్గట్టు అతని వినయశీలతకు దీర్ఘదృష్టికి దీప ఆకర్షితురాలయింది. ‘అంతా వివరించాను ఇక ఈ ఫ్యాక్టరీ బాధ్యత నీదే.. వెళ్ళోస్తానమ్మా’ అంటూ వేరే పని మీద వెళ్ళిపోయాడు గుణ శేఖర్. ఏదో పోగొట్టుకొని నిరాశతో ఉన్నట్లు సుమంత్ ముఖకవళికను బట్టి దీప గ్రహించింది. ‘చూడండి సుమంత్ గారు.. ఈ ఫ్యాక్టరీ లోని వర్కర్స్ అందరి నేమ్స్, వారి ఏజ్ టైప్ చేసి నాబల్ల మీదుంచండి’ అని చల్లని గాలి వీచినట్లుగా చెప్పింది దీప. ‘అలాగే మేడమ్’ అంటూ చకచక టైప్ చేసి దీప బల్లమీదుంచాడు సుమంత్. నిజానికి అతన్ని పలకరిచాలనే ఉద్దేశ్యంతోనే దీప అలా అంది. సుమంత్ ను గమనిస్తూ ‘మీ ఊరేంటి’ అడిగింది దీప. ‘చిరుకాలం’ ‘ప్రస్తుతం ఎక్కడున్నారు’. ఈ విశాఖపట్నం లోనే ఓ అద్దె గదిలో నేనూ మా అమ్మా ఉంటున్నాం’ ‘మీ నాన్నగారు లేరా!’ ‘నాకు తెలియని వయసులోనే కాలం చేశాడు మేడమ్’ నిదానంగా విధేయతగా సమాధాన మిచ్చాడు సుమంత్. సుమంత్ యొక్క ప్రవర్తన మాటల్లో దాగుండే అంతరార్థం, బాహ్యతేజస్సు దీపకు బాగా నచ్చాయి. అదే విధంగా దీప యొక్క పలుకు పలకరించే తీరు చూస్తుంటే సుమంత్ హృదయంలో ఏదో ఆశా జ్యోతి వెలుగుతోంది. ‘సుమంత్ అందరిలా కన్పించడేంటి.. తనపనేమో తానేమో.. ఆ నిరాశ పూరిత వైఖరికి కారణం తెలుసుకోవాలి’ అనుకుంది దీప. అతనితో పదే పదే మాట్లాడాలనిపిస్తుంది. ఏమిటో ఆ తెలియని ప్రేమ. కాలేజీ రోజుల్లో ఎంత మంది అందమైన అబ్బాయిలు తనచుట్టూ తిరిగినా పట్టించుకునేది కాదు. ఆడవారి మాటలకు అర్థాలే కాదు మనస్తత్వాలు కూడా వేరు. అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడడు సుమంత్. ధనవంతులకు దూరంగా ఉండాలనే భావన అతనిలో బాగా పేరుకు పోవడమే కారణం. రోజూ డైరీ వ్రాసుకోవడం అలవాటే సుమంత్కు. వనజ పట్లున్న మౌనప్రేమ, P.G. విశేషాలు అందులో చక్కగా వ్రాసుకున్నాడు. ప్రతి రోజు డైరీ చూసుకోందే ఉండలేడు. ఓ రోజు టేబుల్ మీదుంచి మరచి పోవడంతో అది దీప గమనించి అతని గూర్చి పూర్తిగా తెలుసుకునే చక్కని మార్గంగా భావించి చదువుతుంది. ‘ప్రేమ రెండు హృదయాల మధ్య వారధి. ఈ వారధి కిరువైపుల ఆస్తులు, అంతస్తులు సమపాళ్ళలో ఉన్నపుడే ఇది అమరత్వ ప్రేమ సుధా సన్నిధి’ అని ఇటువంటి వాక్యాలెన్నో.. ఆ డైరీలో వ్రాసున్న అంతరార్ధం దీపకు చక్కగా బోధపడుతుంది. తను M.A. వరకు చదివి ఈ టైపిస్టు ఉద్యోగం చేస్తున్నాడంటే విచారించవలసిన విషయమే అనుకొని ఆ రోజు గుణ శేఖర్కు అంతా వివరించి చెప్తుంది. గుణశేఖర్ అభిమానం ఉన్న వ్యక్తి కనుక ఆసక్తిగా ఆలకించి తను కాలేజ్ కమిటీ చైర్మన్ కావడం చేత దీప కోరిక కాదనలేదు. ఓ రోజు సుమంత్ ను పిలిచి ‘మిమ్మల్ని









