Saturday, 2 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామo లో 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి, స్కూల్ చైర్మన్

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలోని ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తురకపల్లి స్కూల్లోని హెచ్ఎం సంధ్యారాణి, దత్తాత్రేయ, దుత్తలూరు మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, స్కూల్ చైర్మన్ పోల్ అంకిరెడ్డి, పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి మరియు పోలు అంకి రెడ్డి వారు మాట్లాడుతూ, 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది 1950 జనవరి 26న భారతదేశ సార్వభౌమ రాజ్యాంగం ప్రకటించింది ఈ రోజున మన భారతదేశ స్వతంత్ర పొందిన తర్వాత మన దేశాన్ని ఒక గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకుంది మన దేశ స్వతంత్ర సమరయోధులను, మన దేశం స్వాతంత్ర తెచ్చిన వీరులను, మన దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నాం అని వారు మాట్లాడారు

ఆంధ్రప్రదేశ్

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో కళాశాలలో పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం అసువులు బాసిన నేతల గురించి స్మరించుకోవడం జరిగింది వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగింది Uploaded Video:

ఆంధ్రప్రదేశ్

అర్హులైన జర్నలిస్టులందరికీ* *అక్రిడిటేషన్లు మంజూరయ్యేలా కృషి చేద్దాం: కె.ఎస్. రంగశాయి*

* అమరావతి జనవరి ( పున్నమి ప్రతినిధి) – *స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్. రంగశాయి* – *అక్రిడిటేషన్ కమిటీల సభ్యులుగా నియమితులైన అసోసియేషన్ ప్రతినిధులకు శిక్షణా సదస్సు* *విజయవాడ:* అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరయ్యేలా కృషి చేయాలని స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్. రంగశాయి అన్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటీల సభ్యులుగా నియమితులైన అసోసియేషన్ ప్రతినిధులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగశాయి ప్రసంగిస్తూ.. అక్రిడిటేషన్ జీవోలోని నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకుని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటమే కాకుండా.. అక్రిడిటేషన్ల జారీలో చిన్న, మధ్య తరహా పత్రికలకు అన్యాయం జరక్కుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జీవోలో ఉన్న కొన్ని నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సమాచార శాఖ డైరెక్టరు దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఎంప్యానల్డ్ పత్రికలకు అక్రిడిటేషన్ల సంఖ్యను పెంచాలని, నాన్ ఎంప్యానల్డ్ పత్రికలకు రాష్ట్ర స్థాయిలో కనీసం ఒక్క అక్రిడిటేషన్ అయినా మంజూరు చేయాలని అన్నారు. ఈ అంశాలపై ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో అసోసియేషన్ నుంచి చేసిన ప్రతిపాదనలకు డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కమిటీల సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అసోసియేషన్ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని కోరారు. ఎంప్యానల్మెంట్ పెండింగ్ ఫైళ్లు, ఇతర సమస్యల గురించి త్వరలోనే ఐ అండ్ పీఆర్ డైరెక్టరును కలిసి పరిష్కారమయ్యేలా చూస్తామని రంగశాయి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపీనాథరావు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు నిట్టల శ్రీనివాస్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాల అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఉత్తమ అర్చకునిగా మునగలేటి రమేష్ శర్మకు రాష్ట్ర ప్రభుత్వ ప్రశంస

ఖమ్మం, జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా డి.డి.ఎన్ అర్చక సంఘం అధ్యక్షులు మునగలేటి రమేష్ శర్మను ఉత్తమ అర్చకునిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనీదీప్ దురిశెట్టి చేతుల మీదుగా రమేష్ శర్మ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల రమేష్ శర్మ హర్షం వ్యక్తం చేస్తూ, తనను ఉత్తమ అర్చకునిగా ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ గౌరవానికి సహకరించిన దేవాదాయ ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ వీరస్వామి గారికి, కార్యాలయ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర్లు గారికి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక సంఘం అధ్యక్షులు దాములూరు వీరభద్రం శర్మ గారికి, రాష్ట్ర డి.డి.ఎన్ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నావజ్జల ప్రసాద్ శర్మ గారికి, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి యం.భర్గవాచార్యులు గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు ఖమ్మం జిల్లా డి.డి.ఎన్ అర్చకులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు

వనపర్తి

ఘనంగా,77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల

*77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాలలో* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 26 /1/ 2026* *77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల గణపురం మండలం యందు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప తెలియజేశారు, జాతీయ పతాకావిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ ఇటీవల నూతనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నిక కాబడిన వారందరినీ శాలువాతో సన్మానించడం జరిగింది. వారందరు ఉన్నత పాఠశాలలో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, 10వ తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు పొందాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, సర్పంచ్ బాల లింగయ్య మాట్లాడుతూ మేము పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రయ్య వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు,ప్రతిభ కనబరిచారు, ప్రతిభ కనబరిచిన వారందరికీ బహుమతుల ప్రధానోత్సవం అందించారు*

వనపర్తి

ఘనంగా,77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల

*77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాలలో* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 26 /1/ 2026* *77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల గణపురం మండలం యందు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప తెలియజేశారు, జాతీయ పతాకావిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ ఇటీవల నూతనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నిక కాబడిన వారందరినీ శాలువాతో సన్మానించడం జరిగింది. వారందరు ఉన్నత పాఠశాలలో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, 10వ తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు పొందాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, సర్పంచ్ బాల లింగయ్య మాట్లాడుతూ మేము పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రయ్య వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు,ప్రతిభ కనబరిచారు, ప్రతిభ కనబరిచిన వారందరికీ బహుమతుల ప్రధానోత్సవం అందించారు*

రాజన్న సిరిసిల్ల

రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసిన కట్టమైసమ్మ టీం

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/జనవరి మద్దికుంట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో రన్నర్‌గా నిలిచిన కట్టమైసమ్మ టీం, తమకు లభించిన బహుమతిని సేవా కార్యక్రమంగా మార్చి ప్రశంసలు అందుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కట్టమైసమ్మ టీం సభ్యులు గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. , పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కట్టమైసమ్మ టీం చర్యను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో పరిశుభ్రతతో పాటు సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పలువురు తెలిపారు. ఆటల పోటీలలో గెలుపు ఓటమి సహజమని అవసరమైన వారికి ఉపయోగపడే సేవేయే నిజమైన గెలుపు అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు టీం సభ్యులను అభినందించారు

రాజన్న సిరిసిల్ల

రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసిన కట్టమైసమ్మ టీం

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/జనవరి మద్దికుంట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో రన్నర్‌గా నిలిచిన కట్టమైసమ్మ టీం, తమకు లభించిన బహుమతిని సేవా కార్యక్రమంగా మార్చి ప్రశంసలు అందుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కట్టమైసమ్మ టీం సభ్యులు గ్రామంలోని పాఠశాల విద్యార్థు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. , పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కట్టమైసమ్మ టీం చర్యను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో పరిశుభ్రతతో పాటు సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పలువురు తెలిపారు. ఆటల పోటీలలో గెలుపు ఓటమి సహజమని అవసరమైన వారికి ఉపయోగపడే సేవేయే నిజమైన గెలుపు అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు టీం సభ్యులను అభినందించారు

జోగులాంబ గద్వాల

సిటీ పాడు లో 77వ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న నూతన సర్పంచ్..

సిటీ పాడు లో 77వ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న నూతన సర్పంచ్.. జోగులాంబ గద్వాల్ జనవరి 26 (పున్నమి ప్రతినిధి ) ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పడ్డ సర్పంచులు మరియు ఉపసర్పంచ్లు ఆధ్వర్యంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గ్రామ సర్పంచ్ మరియు పంచాయతి కార్యదర్శి ముందుగా మహానీయుల చిత్ర పటలకు పూలమాలతో సత్కారించి అనంతరం సర్పంచ్ జెండా వేగరేయడం జరిగింది.. సర్పంచ్ గారు టీ. మహేశ్వరీ గారు మాట్లాడుతూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం విలువలతో మన గణతంత్రం ఎల్లప్పుడూ వెలుగొందాలి. స్వేచ్ఛను ఆస్వాదించడమే కాదు, దాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే. సమరయోధుల పోరాట బలం. అమర వీరుల త్యాగఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన గణతంత్ర దినోత్సవం సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన సందర్భాన 77వ గణతంత్ర దినోత్సవ”శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమనికి పంచాయతీ కార్యదర్శి అనిల్ గారు మరియు వార్డ్ మెంబెర్స్ మరియు గ్రామ పెద్దలు గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తెలంగాణ

గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆచార్యులకు జిల్లా స్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డులు

పున్నమి ప్రతినిధి భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కళాశాలలో జంతు శాస్త్ర విభాగ ఆచార్యులుగా పనిచేస్తున్న డా. కొసారి సంతోష్ కుమార్ గారికి విద్యారంగంలో అందించిన విశిష్ట సేవలకు “ఉత్తమ అధ్యాపకుల ప్రశంసనీయ అవార్డు” లభించింది. అలాగే జాతీయ సేవ పథకం (NSS) కార్యక్రమాల ద్వారా సామాజిక సేవలు అందించిన ఆరె రాజు గారికి “ఉత్తమ జాతీయ సేవా సమన్వయ కార్యకర్త అవార్డు” ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహమ్మద్, జిల్లా ఎస్.పి. జానకి షర్మిల గార్ల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ళ బుచ్చయ్య గారు అభినందనలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.