Saturday, 2 May 2026

Blog

తూర్పు గోదావరి

లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం. సుందరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాళ్లపూడి రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సింహాద్రి జనార్ధన్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరించి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేవిగా ఉన్నాయని విమర్శించారు. పని గంటల పెంపు, మహిళలతో రాత్రి షిఫ్టులు చేయించడం వంటి నిబంధనలను వ్యతిరేకించారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైస్‌మిల్ హమాలి కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కార్మిక హక్కుల పరిరక్షణ కై ఐఎన్టియుసి ధర్నా

స్టీల్ ప్లాంట్, జనవరి 30, పున్నమి ప్రతినిధి. కార్మిక హక్కుల పరిరక్షణ, ఉక్కు కార్మిక లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉక్కు ఐఎన్టియుసి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఉక్కు బి.సి. గేట్ ధర్నా నిర్వహించారు. ఉక్కు ఐఎన్టియుసి అధ్యక్షులు పి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా లో కార్మిక సమస్యలు అయిన నవంబర్ 15 సర్కిలార్ ని విత్డ్రా చేస్తూ ఉత్పత్తికి తో సంబంధం లేకుండా పూర్తి జీతాలు చెల్లించాలి, వేతన బకాయిలు సకాలంలో చెల్లించాలి, నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏ ను యధాతధంగా కొనసాగించాలి, టౌన్షిప్ లో కరెంట్ బిల్లును తగ్గించి పూర్వ పద్ధతిలో కొనసాగించాలి, ఎంప్లాయిస్ షఫ్లింగ్ అదే డిపార్ట్మెంట్కు పరిమితం చేయాలని, ఉక్కును సెయీల్ లో విలీనం చేయాలనీ , తొలగించి న కాంట్రాక్ట్ వర్కర్స్ ను తిరిగి తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఉ కార్యక్రమం లో ఉక్కు ఐఎన్టియుసి నాయకులు నీరుకొండ రామచంద్ర, మంత్రి. గోపి నారాయణ, పోలీస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

హెల్త్ టిప్స్

రోజువారీ ఆహారంలో నువ్వులు ఎందుకు అవసరం?

రోజువారీ ఆహారంలో నువ్వులు ఎందుకు అవసరం? శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, కాల్షియం అందిస్తాయి ఎముకలు బలంగా మారేందుకు సహాయపడతాయి డయాబెటిస్‌ను నియంత్రించడంలో ఉపకరిస్తాయి రక్తస్రావం సమస్యలను తగ్గిస్తాయి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి తినే విధానం: రోజూ ఉదయం 1–2 చెంచాల నువ్వులను నానబెట్టి లేదా పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అనకాపల్లి

గ్రామ ప్రజల ఆరోగ్యానికి చేయూత – ఏటికొప్పాకలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ..!

అనకాపల్లి జిల్లా, జనవరి 30 పున్నమి న్యూస్ ప్రతి నిధి ఆనంద్ : ఏటికొప్పాక గ్రామపంచాయతీ పరిధిలో వేదంతా మహాశక్తి ఫౌండేషన్ సహకారంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో అపోలో డాటర్స్ వైద్య బృందం ఏర్పాటు చేసింది. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, కంటి సమస్యలు, మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, వార్డు మెంబర్ నాయుడు మాస్టారు, ఈసరుపు శ్రీను, అన్నం సరోజీరావు, పంచాయతీ గుమస్తా నాగరాజు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించారు. దాదాపు 200 మంది వరకు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ మెడికల్ క్యాంపును గ్రామ సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు.

తిరుపతి

మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జనసైనికులు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీ కాళహస్తి జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ తమ మిత్ర బృందంతో కలసి స్థానిక మండల కార్యలంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ.. బాపూజీ భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి, సత్యం, అహింస, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అంటరానితనం, అనేక సిద్ధాంతాల మీద పోరాటం చేసి, బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజి అని ప్రతి ఒక్కరు న్యాయమార్గంలో నడిచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్, హరి, చందు, జానీ, రాజా, భాను, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: విజయవాడ ఆంధ్ర రత్న భవనంలో PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశమునకు తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నరు. సమావేశంలో YS షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త పథకం VB గ్రామ్ జీ పథకం వల్ల నిరుపేదలకు తీరని అన్యాయం జరుగుతుందని, రాబోవు రోజుల్లో ఆ పథకంపై నిరసన తెలుపుతూ జిల్లాల పర్యటన కార్యక్రమం తో ప్రజలకు చేరువై ఉపాధి హామీ పథకం యొక్క విశిష్టతను తెలియజేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బల్ల హరి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సీతారామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివశంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎంజీఎం పాఠశాలలో జాతీయ రహదారి భద్రతపై వ్యాసరచన పోటీలు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర నాయుడు ఆద్వర్యంలో జాతీయ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్. టి. ఓ. మాట్లాడుతూ.. పిల్లలందరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేశారు. అనతరం ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎంజీఎం స్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ ను పాటించే విధంగా తమ స్కూల్ నుండే ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని తప్పక హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా ప్రోత్సహించాలని విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా సూచించారు. జాతీయ రహదారి భద్రత వ్యాసరచన పోటీలలో ఎంజీఎం స్కూల్ విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఎస్ టి యు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ టి యు రాష్ట్ర శాఖ ఆదేశాలు మేరకు ఎస్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దారుకు వినతి పత్రం సమర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుణశేఖర్, ప్రధాన కార్యదర్శి వి మధు, జిల్లా అధ్యక్షులు వూడి సుధాకర్ యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్ చిర్రి. హరికృష్ణ యాదవ్, జిల్లా ఆదనపు ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళి, జిల్లా ఉపాధ్యక్షులు తొండు కృష్ణయ్య ,శ్రీకాళహస్తి డివిజనల్ కన్వీనర్ సురగాని. నాగూర్ పాల్గొని, ఉపాధ్యాయుల సమస్యలను తహసీల్దార్ కి వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ టి యు అధ్యక్షులు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిందిగా కోరామనీ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోSTU నాయకులు శివ కుమార్, మోహన్, దామోదరం, స్టాలిన్, రమణయ్య ,శ్రీనివాసులు, హరినాధ రెడ్డి , శ్రీహరి, చంద్రశేఖర్ ,ధన కిషోర్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

పల్నాడు

చలికాలానికి ఔషధం లాంటి అంజీర్

చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడంలో అంజీర్ సహాయపడుతుంది • అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది • కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహకరిస్తుంది • జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది • జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం నివారిస్తుంది • గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది • స్త్రీలు, పురుషులలో సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది • చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి మెరుపు తీసుకువస్తుంది • శక్తిని పెంచి అలసటను తగ్గిస్తుంది

అనకాపల్లి

కొండకర్ల ఆవ పర్యాటక అభివృద్ధితో అనకాపల్లి జిల్లాకు కొత్త ఊపిరి..!

అనకాపల్లి జిల్లా, జనవరి 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): అనకాపల్లి ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారు, రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ గారు, ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయకుమార్ గారు తదితర ప్రజాప్రతినిధులు హాజరై ఉత్సవాలకు శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొండకర్ల ఆవలో ఏర్పాటు చేసిన బోటు షికారీ, సెల్ఫీ పాయింట్‌ను వారు సందర్శించారు. అక్కడ అమలులో ఉన్న పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కొండకర్ల ఆవ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను సందర్శించి స్థానిక కళాకారులు, స్వయం సహాయక సంఘాల ద్వారా తయారైన వస్తువులను పరిశీలించారు. కొండకర్ల ఆవను పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, దీని ద్వారా స్థానిక మత్స్యకారులు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.