లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం. సుందరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాళ్లపూడి రైస్మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సింహాద్రి జనార్ధన్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరించి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేవిగా ఉన్నాయని విమర్శించారు. పని గంటల పెంపు, మహిళలతో రాత్రి షిఫ్టులు చేయించడం వంటి నిబంధనలను వ్యతిరేకించారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైస్మిల్ హమాలి కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.











