అత్యంత విజయవంతంగా సాగిన *మెగా రక్తదాన శిబిరం* శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల , ఎన్ఎస్ఎస్ విభాగం…….
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆధ్వర్యంలో 10 /11 / 2025 వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం , రెడ్ రిబ్బన్, రెడ్ క్రాస్ సొసైటీ మరియు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .వి.వి.సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ శరీరంలో ఉన్న రక్తాన్ని దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు అని, రక్తదానం చేయడం వల్ల ఎవరికి హాని కలగదని, రక్తదానం చేసిన వెంటనే తిరిగి శరీరానికి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ మద్దినేని . సుధాకర్ , స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ,హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ,ఏపీ సెక్రటేరియట్ గారు మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చు అని 1994 నుంచి బ్లడ్ డొనేషన్ మొదలు పెట్టారని రక్తదానం చేసేవారిలో ఆడవారు ఎక్కువగా ఉన్నారని ఇప్పటివరకు వందసార్లు సుమారుగా రక్తదానం చేశారని అన్నారు. అలాగే డాక్టర్. ఎస్. మదనమోహన్ ,చీఫ్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన క్యాన్సర్ హృదయ సమస్యలు రక్తపోటు రాకుండా ఉంటాయని అలాగే ఇలా రక్తదానం చేసినటువంటి రక్తం క్యాన్సర్ బాధితులకు తలసీమియా కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో చాలా అవసరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ బి కళ్యాణ్ చక్రవర్తి ఎండి పెథాలజీ ల్యాబ్ డైరెక్టర్, పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,విజయవాడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో 12% రక్తం శరీరంలో ఖచ్చితంగా ఉండాలని 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్నవారు రక్తదానం చేయాలని లేదా కుటుంబంలో కానీ ,చుట్టాలలో కానీ, ప్రతి ఒక్కరికి 12 శాతం రక్తం ఉండేలా చూసుకోవాలని అన్నారు . తర్వాత డాక్టర్ పిన్నమనేని కళ్యాణి గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు చెక్ చేయవచ్చని ,బిపి ఆరోగ్యస్థితి గురించి ఆరా తీస్తారని, ఈ విధంగా ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవచ్చని అన్నారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ చిలుకూరి మధుసూదన్ గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియలో వేగం కుంటుందని, దానివల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2, 3 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె. సరళ , శ్రీమతి టి. నాగరాణి ,శ్రీమతి శ్రీ భారతి మరియు ఎం. సుభాషినీ, కమిటీ సభ్యులు, విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 327 మంది మెగా రక్తదార శిబిరంలో పాల్గొని వారి యొక్క సేవ భావాన్ని వ్యక్తపరిచి రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.











