Monday, 16 March 2026

Blog

E-పేపర్

అత్యంత విజయవంతంగా సాగిన *మెగా రక్తదాన శిబిరం* శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల , ఎన్ఎస్ఎస్ విభాగం…….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆధ్వర్యంలో 10 /11 / 2025 వ తేదీన ఎన్ఎస్ఎస్ విభాగం , రెడ్ రిబ్బన్, రెడ్ క్రాస్ సొసైటీ మరియు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .వి.వి.సుబ్రహ్మణ్య కుమార్ గారు మాట్లాడుతూ శరీరంలో ఉన్న రక్తాన్ని దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు అని, రక్తదానం చేయడం వల్ల ఎవరికి హాని కలగదని, రక్తదానం చేసిన వెంటనే తిరిగి శరీరానికి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ మద్దినేని . సుధాకర్ , స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ,హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ,ఏపీ సెక్రటేరియట్ గారు మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చు అని 1994 నుంచి బ్లడ్ డొనేషన్ మొదలు పెట్టారని రక్తదానం చేసేవారిలో ఆడవారు ఎక్కువగా ఉన్నారని ఇప్పటివరకు వందసార్లు సుమారుగా రక్తదానం చేశారని అన్నారు. అలాగే డాక్టర్. ఎస్. మదనమోహన్ ,చీఫ్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన క్యాన్సర్ హృదయ సమస్యలు రక్తపోటు రాకుండా ఉంటాయని అలాగే ఇలా రక్తదానం చేసినటువంటి రక్తం క్యాన్సర్ బాధితులకు తలసీమియా కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో చాలా అవసరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ బి కళ్యాణ్ చక్రవర్తి ఎండి పెథాలజీ ల్యాబ్ డైరెక్టర్, పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,విజయవాడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో 12% రక్తం శరీరంలో ఖచ్చితంగా ఉండాలని 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్నవారు రక్తదానం చేయాలని లేదా కుటుంబంలో కానీ ,చుట్టాలలో కానీ, ప్రతి ఒక్కరికి 12 శాతం రక్తం ఉండేలా చూసుకోవాలని అన్నారు . తర్వాత డాక్టర్ పిన్నమనేని కళ్యాణి గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు చెక్ చేయవచ్చని ,బిపి ఆరోగ్యస్థితి గురించి ఆరా తీస్తారని, ఈ విధంగా ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవచ్చని అన్నారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ చిలుకూరి మధుసూదన్ గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియలో వేగం కుంటుందని, దానివల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2, 3 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె. సరళ , శ్రీమతి టి. నాగరాణి ,శ్రీమతి శ్రీ భారతి మరియు ఎం. సుభాషినీ, కమిటీ సభ్యులు, విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 327 మంది మెగా రక్తదార శిబిరంలో పాల్గొని వారి యొక్క సేవ భావాన్ని వ్యక్తపరిచి రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

నిర్మల్

డిసెంబర్ 10. పక్షులకు జీవించే హక్కు ఉంది

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా లోని జంతుశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ కోసారి సంతోష్ కుమార్ పక్షుల.జంతుల సంరక్షణ మన బాధ్యత అని తెలియజేశారు ఈరోజు డిసెంబర్ 10 పక్షులు జీవించే హక్కుల దినోత్సవం అని వాటికి కూడా జీవించే హక్కు ఉందని వాటి వాటి పట్ల మనం మానవత్వాన్ని ప్రదర్శించాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య మాట్లాడుతూ పక్షల పట్ల మీరు చూపిన ప్రేమ జాలి. చాలా గొప్పదని జంతు శాస్త్ర అధ్యాపకుని అభినందించారు💐💐💐💐

నిర్మల్

డిసెంబర్ 10. పక్షులకు జీవించే హక్కు ఉంది

గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసా లోని జంతుశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ కోసారి సంతోష్ కుమార్ పక్షుల.జంతుల సంరక్షణ మన బాధ్యత అని తెలియజేశారు ఈరోజు డిసెంబర్ 10 పక్షులు జీవించే హక్కుల దినోత్సవం అని వాటికి కూడా జీవించే హక్కు ఉందని వాటి వాటి పట్ల మనం మానవత్వాన్ని ప్రదర్శించాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోళ్ల బుచ్చయ్య మాట్లాడుతూ పక్షల పట్ల మీరు చూపిన ప్రేమ జాలి. చాలా గొప్పదని జంతు శాస్త్ర అధ్యాపకుని అభినందించారు💐💐💐💐

కడప

పూర్తయిన కోటి సంతకాల సేకరణ

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరులో ముగిసింది ఒక లక్షా నాలుగు వందల సంతకాలను రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారి నేతృత్వంలో సేకరించడం జరిగింది. ఆ సేకరించిన పుస్తకాలన్నింటిని సెంట్రల్ పార్టీ ఆఫీసుకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

అన్నమయ్య

దేశ రక్షణ కోసం చిట్వేలి ఎన్సీసీ క్యాడెట్ల ఫ్లాగ్ డే విరాళాల సేకరణ

-సైనికుల సంక్షేమానికి కవచంగా నిలవాలి: ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు -విరాళాలు సేకరించిన ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీ చిట్వేలి, డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల సంక్షేమం కోసం చిట్వేలిలో ఎన్సీసీ క్యాడెట్లు ఫ్లాగ్ డే (ఆధునిక సైనిక దళాల పతాక దినోత్సవం) సందర్భంగా స్వచ్ఛంద విరాళాల సేకరణ చేపట్టారు.30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ అధికారి ఆదేశాల** మేరకు చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. -ప్రారంభం – సందేశం: ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ కొరకు కవచంగా ఏర్పడి ఉన్న సైనికులకు ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. -సైనికుల త్యాగం: ట్రూప్ ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల సంక్షేమం కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో వివరించారు. సైనికుల త్యాగానికి గుర్తుగాఇస్తున్న ఈ విరాళం ఎంతో విలువైనదని, సేకరించిన విరాళాలను జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి అందజేస్తామని తెలిపారు. -విరాళాల ర్యాలీ: ఈ కార్యక్రమం పాఠశాల నుండి మొదలై కొత్త బస్టాండ్, పాత బస్టాండ్‌ మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ రూపంలో కొనసాగింది. ఎన్సీసీ విద్యార్థులు ప్రజల నుండి, వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న అధికారుల నుండి స్వచ్ఛంద విరాళాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు, మండల అభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, వెలుగు సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం లో వి ఆర్ రాసాని రచనలు ఆవిష్కరణ

———————————————— వెంకటాచలం సరస్వతి నగర్లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం లో తిరుపతికి చెందిన తెలుగు విశ్రాంత ఆచార్యులు డా వి ఆర్ రాసాని మూడు రచనలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సభా అధ్యక్షులుగా ప్రాచీన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వ్యవహరించి రచయిత పరిచయం చేసి పుస్తక ఆవిష్కరణలు చేయించారు. తాజా కథాసంపుటి ప్రసిద్ధ కథా రచయిత్రి వి ప్రతిమ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు. తనంత తానుగా రూపాన్ని సంతరించుకున్న సహజ కథల సంపుటి మా ఊరికథలు అన్నారు. ఈ కథలు ఆట ప్రధానంగా రాసినవి అంటూ పలు కథలు పరిచయం చేశారు. డా రాసాని భాష ప్రతిభ అసామాన్యమైనదని అన్నారు. సీమకథలు పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు. సీమకథలు పరిచయం చేస్తూ రాసాని చిరకాల మిత్రుడు అంటూ ఆయన ముఖ్యంగా జానపద రచనల్లో పట్టు సాధించారు అన్నారు..రాసాని కథలలో చింతచెట్టు కథతో తాను మమేక మయ్యానన్నారు .. స్థానికత ఈ కథల్లో పదునుగా నమోదు చేసారన్నారు. మతసామరస్యం ఒక కథలో ఏ మతమైతే ఏమున్నదీ మంచి చేయడానికి అని చెప్పడం బాగా విశ్లేషించారు. శ్రవ్య,దృశ్య నాటక రచన గ్రంథం సీమ యవనిక విశ్రాంత ఆచార్య నాగోలు కృష్ణా రెడ్డి అంతర్జాతీయకవి సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరణ చేసి విశ్లేషణ చేశారు. శ్రవ్య నాటక పరిచయం చేస్తూ నాగోలు కృష్ణారెడ్డి రాసాని తరిగొండ వెంగమాంబ నాటకం 100 ప్రదర్శనలు పూర్తి చేసుకుందని, దీనివల్ల వెంగమాంబ అందరికీ పరిచయం అయిందని అన్నారు. విలక్షణ వస్తువులపై రాసాని రచనలు చేయడం లో దిట్ట అన్నారు. దృశ్య రూపకాలు విశ్లేషణ చేస్తూ డా పెరుగు రామకృష్ణ రాసాని నాటకాలు చదివినప్పుడు కర్ణాటక నుండి నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తో సారూప్యత గురించి తులనాత్మక అధ్యయనం చేశారు. వీరిద్దరూ సామాజిక బాధ్యత తో దృశ్య రచన చేశారు అన్నారు..నేలతీపి, దేవర మాన్యం లాంటి గొప్ప నాటకాలు అన్నారు. చివరగా రచయిత స్పందన వినిపిస్తూ రాసాని తన శ్రీమతి కూడా వైద్యురాలు, రచయిత్రి కనుక ఆమె సహకారం వల్లే ఇంత సాహితీ జైత్ర యాత్ర చేయగలిగాను అన్నారు..పరిశోధనే నా రచనల ప్రాణం అన్నారు..ప్రాచీన కేంద్రం పరిశోధక బృందం ప్రార్థన-వందనసమర్పణ చేశారు..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ఆత్మకూరుకు మరో వరాన్ని తీసుకొచ్చిన మంత్రి ఆనం..*

*ఆత్మకూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* ఆత్మకూరు పట్టణానికి మరో వరాన్ని మంజూరు చేయించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటి 40 లక్షలతో మంజూరైన నగర వనంను ఆహ్లాదకరంగా ఆత్మకూర్ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతులతో… ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని నెల్లూరుపాలెం సెంటర్లో…. ఆహ్లాదకరమైన పార్కు కోసం కోటి 40 లక్షల అటవీశాఖ నిధులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారని మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజనుల సంక్షేమo కోసం ….వారి బ్రతుకులో మార్పు కోసం చలో కలెక్టరేట్…..సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి

మర్రిపాడు:డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)” అనంతసాగరం మండల కేంద్రంలో ఉండే గిరిజనులకు ST కార్పొరేషన్ ద్వారా గిరిజనులకు సహాయ సహకారాలు అందించి వారి జీవితాలు బాగుచేయాలని కోరుతూ సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యం లో ఛలో కలెక్టరేట్ కు తరలిన గిరిజనులు….ST కార్పొరేషన్ ద్వారా తమకు సహాయం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది….*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కంప సముద్రం ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన దాత

మర్రిపాడు: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మర్రిపాడు మండలం కంపసముద్రం ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన ధాత గోపవరం కాంతారెడ్డి ఒక కంప్యూటర్ మరియు ప్రింటర్ ను బహూకరించారు.ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు పాఠశాల అవసరాలను గుర్తించి సహాయ సహకారాలను అందజేయడం అభినందనీయమని అన్నారు.అనంతరం పాఠశాల సిబ్బంది ధాతను ఘనంగా సత్కరించి పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

-జెండా ఊపి ప్రారంభించిన నాయకులు, ప్రజాప్రతినిధులు

అనుకూలమైన వారికి అందించేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి –నియోజకవర్గాల సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికి ఆత్మకూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిది) రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి తమ అనుకూలమైన వారికి పీపీపీ విధానంలో కట్టబెట్టి ప్రజలను దగా చేసేందుకు సిద్దమవుతున్నారని, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అందరం కలిసి దానిని అడ్డుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య. కూనం సుధాకర్ రెడ్డి, పార్టీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర బాధ్యుడు పూనూరు రామ్మనోహర్ రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర విభాగ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ రెడ్డి, మండలాల కన్వీనర్లు బిజివేముల పిచ్చిరెడ్డి, చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి, పులగం శంకర్ రెడ్డిలతో కలసి బుధవారం జిల్లా కేంద్రమైన నెల్లూరుకు తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పేర్నాటి కోటేశ్వర రావు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణలో ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని ప్రజల సహకారంతోనే నియోజకవర్గంలో 60వేలకుపైగా సంతకాల సేకరణ జరిగిందన్నారు. పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం చేసేలా కూటమి పాలనలో ప్రైవేటీకరణ జీఓను ప్రవేశపెట్టడం దారుణమన్నారు. గత వైఎస్సార్ పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు విద్యతోనే యువత అభివృద్ధి సాధ్యం అన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి అందులో ఏడు కళాశాలలను పూర్తి చేశారన్నారు. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పనంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు పూనుకోవడం ప్రజలను దగా చేయడమేనన్నారు. జగనన్న పాలనలో రెండేళ్ల కరోనా సమయంలో వైద్యసేవలు ఇంటింటికి అందించారన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఇవన్నీ సాధ్యమయ్యాయని, కూటమి పాలనలో ఆ వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. పీహెచ్ సీలకు ఇద్దరు డాక్టర్ల ఏర్పాటు, జగనన్న ఆలోచనల మేరకు జరిగిందన్నారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం ఇప్పటికైనా ప్రవేటీకరణ ఆలోచనను మానుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన ప్రతులను 15వ తేదీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చనున్నట్లు ఆ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలసి సంతకాల సేకరణ ప్రతులను నెల్లూరు పార్టీ కార్యాలయానికి తరలించే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతులను తీసుకెళ్లే ప్రత్యేక వాహనం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపో వరకు ర్యాలీగా సాగారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.