Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన*

*విశాఖలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన* *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి * విశాఖ భీమిలి మండలం కాపులుప్పాడలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ (Fluentgrid Limited) ఐటీ సంస్థ క్యాంపస్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సీఈవో, ఎండీ జి.మురళీ కృష్ణ, ప్రెసిడెంట్ జి.రత్న, డైరెక్టర్ జి.విప్రేష్ ఆనంద్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖపట్నం ఆర్థిక ప్రాంతాన్ని గ్లోబల్ ఎకానమిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం**

**విశాఖపట్నం ఆర్థిక ప్రాంతాన్ని గ్లోబల్ ఎకానమిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం** **విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం (VER)‌ను గ్లోబల్ ఎకానమిక్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతం పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, నగరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు వంటి అన్ని రంగాలలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని స్లమ్‌ల రహిత నగరంగా మార్చాలని సూచించారు. రాష్ట్ర మొత్తం అభివృద్ధిని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే మూడు ఆర్థిక ప్రాంతాల ద్వారా సాధిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి VER అభివృద్ధిపై అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమగ్ర అభివృద్ధి, రహదారులు, రైల్వేలైన్లు, పోర్టులు, లాజిస్టిక్స్ తదితర రంగాలకు సంబంధించిన 49 ప్రధాన ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం జీడీపీని 2024 నాటికి ఉన్న 52 బిలియన్ డాలర్ల నుండి 2032 నాటికి 125–135 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం. 7 వృద్ధి చోదకాలు మరియు 10 ప్రోత్సాహక విధానాల ద్వారా VERలో 30 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే, 2047 నాటికి ఇది 750–800 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందగలదని చెప్పారు. ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్ ప్రకారం వచ్చే మూడు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాల కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. VER‌లోని విస్తృత వనరులను సద్వినియోగం చేసుకుంటే, స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మా సిటీ, టూరిజం వంటి అన్ని రంగాలలో అసాధారణ పురోగతి సాధించవచ్చని పేర్కొన్నారు. అనకాపల్లిలో మెడ్‌టెక్ జోన్–2 త్వరలో ప్రారంభమవుతుందని, టాయ్స్ పార్క్‌లో పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. రక్షణ తయారీ సంస్థలను కూడా ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో అనుసంధానమయ్యేలా చర్యలు తీసుకోవాలని, రహదారి నెట్‌వర్క్‌ను విస్తరించాలన్నారు. ప్రతి శాఖకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు సమిష్టిగా ముందుకు వస్తే, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్‌ల స్థాపనకు అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలను తీసుకురావడం వలనే వలస సమస్యను పూర్తిగా తొలగించవచ్చని చెప్పారు. విశాఖపట్నం ప్రాంతం పలు పంటలకు అనుకూలమని చెప్పారు. ఆయిల్ పామ్‌తో పాటు కోకో, అరటి, మిరియాలు వంటి అంతర పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కోళ్లు పెంపకం రైతుల ఆదాయాన్ని పెంచగలదని అన్నారు. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి,పార్వ తీపురం, మణ్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ అనే తొమ్మిది జిల్లాలను కలిగి ఉంది. ఈ ఆర్థిక ప్రాంతాన్ని గ్లోబల్ పోర్ట్, నెక్స్ట్ జెన్ ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్‌కేర్ హబ్, ప్రణాళికాబద్ధ నగరీకరణ & గృహ నిర్మాణం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అనే 7 వృద్ధి చోదక రంగాల ద్వారా అభివృద్ధి చేయనున్నారు. కైలాసగిరి నుండి భీమిలి వరకు 40 చ.కి.మీ తీర ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యాటక నగర కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, పి. నారాయణ, టి.జి. భారత్, కందుల దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్, సీనియర్ అధికారులు, తొమ్మిది జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖలో నాన్ రెల్ టెక్నాలజీస్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ*

*విశాఖలో నాన్ రెల్ టెక్నాలజీస్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ* *విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెంబర్-2లో నాన్ రెల్ టెక్నాలజీస్ (Nonrel Technologies Private Limited) యూనిట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు హిల్ నెంబర్-2లోని సంస్థ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. విశాఖలో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో నాన్ రెల్ టెక్నాలజీస్ ఎండీ వినయ్ బాబు మేక, సీఈవో పవన్ కుమార్ సామినేని, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా శాఖ అధికారులతో ఈరోజు విశాఖపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించారు

*విశాఖపట్నం డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి* రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆయా శాఖ అధికారులతో ఈరోజు విశాఖపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరు ఫలితాలు గురించి తెలుసుకున్నారు. విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్సైజ్ అధికారులతో ఏడాది కాలం పనితీరు గురించి సమీక్ష చేశారు. అక్రమ మద్యం నివారించడంలో అందరూ గట్టిగా కృషి చేయాలని సూచించారు. బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలని, నాటు సారా, కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు ఆదేశం జారీ చేశారు. అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు

ఆదిలాబాదు

సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోఠి గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణకై ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ మాట్లాడుతూ ఫోన్ కు వచ్చే అపరిచిత కాల్స్, మెసేజ్ లకు స్పందించ వద్దన్నారు. ఏపీకే ఫైల్స్, రివర్ ఫైల్స్, లింక్స్ ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసాలపై ఎలాంటి అనుమానం ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

బి.ఆర్‌.టి.ఎస్ బాధితుల న్యాయ పోరాటానికి పూర్తి న్యాయం — టిడిఆర్లు మంజూరు

సింహాచలం తొలి పావంచ నుండి పాత అడవివరం వరకు బి.ఆర్‌.టి.ఎస్ ప్రాజెక్టుతో నష్టపోయిన బాధితుల సమస్యలు చివరకు పరిష్కారం దిశగా వెళ్లాయి. రెండు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని సరిదిద్దుతూ, ప్రస్తుత ప్రభుత్వం బాధితులకు టిడిఆర్లు మంజూరు చేసింది. బాధితుల తరఫున పాశర్ల ప్రసాద్, మాజీ సర్పంచ్ అడవివరం, కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ— “బి.ఆర్‌.టి.ఎస్ పేరుతో మా ఇళ్లు, భూములు తీసుకునిపోయినా, అప్పటి ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఇప్పటి ప్రభుత్వం మా మాట విని, మా సమస్య పరిష్కరించింది. మా కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనం” అని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ, విశాఖ పార్లమెంటు సభ్యుడు మతుకుమిల్లి భరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిసి కీలక పాత్ర పోషించారు. టిడిఆర్లు మంజూరైన వార్తతో అడవివరం, పాత అడవివరం, సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఆనందం వెల్లివిరిసింది. బి.ఆర్‌.టి.ఎస్ బాధితుల దీర్ఘకాల పోరాటానికి ఇది న్యాయవిజయం గా భావిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసిపి రాష్ట్ర యువ నాయకులు జక్కంపూడి రాజా, భూమన అభినయ్ రెడ్డిలను కలిసిన సీతారామపురం వైసిపి యువ నాయకుడు పాలగిరి ముద్దుకృష్ణమరాజు

సీతారామపురం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ ఐదు జిల్లాల జోనల్ ఆత్మీయ సమావేశం తిరుపతిలోని డీపీఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పిలుపుమేరకు సీతారామపురం మండలానికి చెందిన నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ సంయుక్త కార్యదర్శి పాలగిరి ముద్దుకృష్ణమరాజు ఆధ్వర్యంలో యువత పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లో యువత పాత్ర ముఖ్యమైనదని ప్రతి ఒక్కరూ పట్టుదలతో వైయస్ జగన్మోహన్ రెడ్డిని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకునేలా పనిచేయాలన్నారు. రాబోయే జగనన్న 2.0 ప్రభుత్వంలో యువతకు ప్రాముఖ్యతను కల్పిస్తూ జగనన్న పాలన ఉంటుందని కావున యువత మరింత ఉత్సాహంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర నాయకులు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం వైసిపి యువ నాయకులు సరస్వతి నారాయణ రాజు, ఓంకారం పవన్, షేక్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా తెలిసిన రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్

శుక్రవారం రాష్ట్ర ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర కొప్పుల–వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి వి జీ కుమార్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పోలుపర్తి సత్యవతి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిని కలిసి సామాజిక వర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, కార్పొరేషన్ ద్వారా చేపట్టాల్సిన పలు అభివృద్ధి చర్యలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. రాష్ట్రంలోని కొప్పుల–వెలమ వర్గాలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు తగిన పథకాలు, ఉపాధి అవకాశాలు, చిన్నతరహా వ్యాపారాల ప్రోత్సాహం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చైర్మన్ పీవీ జీ కుమార్ మాట్లాడుతూ— “కొప్పుల–వెలమ వర్గాల అభివృద్ధిపైన ముఖ్యమంత్రి చూపుతున్న ఆసక్తి అభినందనీయం. సమాజానికి మరింత ఉపయోగపడేలా కార్పొరేషన్ కార్యాచరణను విస్తరించేందుకు ముఖ్యమంత్రి అనుకూల సూచనలు అందించారు” అని పేర్కొన్నారు. అలాగే, మాజీ జెడ్పీటీసీ పోలుపర్తి సత్యవతి — “గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉపాధి, స్త్రీశక్తి పెంపు వైపు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కి వినతిపత్రం సమర్పించాము. ముఖ్యమంత్రి గారు అన్ని సమస్యలను శ్రద్ధగా విని, త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు” అని తెలిపారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ప్రతినిధులతో మాట్లాడుతూ— రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గం సమానంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం సుస్థిర చర్యలు తీసుకుంటుందని, యువత, మహిళలు, చిన్నచిన్న వ్యాపారస్తులకు ఉపాధి, స్వయం సమృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు. ప్రతినిధుల ఈ భేటీ సానుకూల వాతావరణంలో సాగింది. రాష్ట్ర అభివృద్ధిలో కొప్పుల–వెలమ వర్గాల పాత్ర మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తమైంది

కామారెడ్డి

ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన సర్పంచ్ వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

కామారెడ్డి, 12 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా,ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ రామారెడ్డి మండలానికి చెందిన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ఘన సన్మానం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామారెడ్డి మండలం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ జెండా గర్వంగా ఎగురవేసిన పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎమ్మె ల్యే మదన్మోహన్‌రావు ఘనంగా సన్మానం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయా న్ని జరుపుకున్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి గెలిచిన సర్పంచ్‌లు, సభ్యులు తమ గ్రామాలను అత్యంత వైభవంగా అభివృద్ధి చేసి మోడల్ పంచాయతీలుగా మార్చా లని పిలుపునిచ్చారు. “కాంగ్రెస్ పాలిత పంచాయ తీలు గ్రామాల అభివృద్ధికి ముందంజలో ఉంటా యని ఆశీస్సులు తెలిపారు. మనం కలిసి ఈ సెగ్మెంట్‌ను జిల్లా మోడల్‌గా తీర్చిదిద్దాలి” అని ఆయన స్పష్టం చేశారు.స్థానికులు ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, కాంగ్రెస్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఊపందుకునేలా చేస్తోంది.కాంగ్రెస్ పాలిత పంచాయతీల విజయం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారింది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు సన్మానం చేసిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు భవిష్యత్‌లో మోడల్ గ్రామాలు రూపొందించేలా కృషి చేస్తారని సంతోషం వ్యక్తం చేశారు.

కామారెడ్డి

ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన సర్పంచ్ వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

కామారెడ్డి, 12 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా,ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ రామారెడ్డి మండలానికి చెందిన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ఘన సన్మానం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామారెడ్డి మండలం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ జెండా గర్వంగా ఎగురవేసిన పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎమ్మె ల్యే మదన్మోహన్‌రావు ఘనంగా సన్మానం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయా న్ని జరుపుకున్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి గెలిచిన సర్పంచ్‌లు, సభ్యులు తమ గ్రామాలను అత్యంత వైభవంగా అభివృద్ధి చేసి మోడల్ పంచాయతీలుగా మార్చా లని పిలుపునిచ్చారు. “కాంగ్రెస్ పాలిత పంచాయ తీలు గ్రామాల అభివృద్ధికి ముందంజలో ఉంటా యని ఆశీస్సులు తెలిపారు. మనం కలిసి ఈ సెగ్మెంట్‌ను జిల్లా మోడల్‌గా తీర్చిదిద్దాలి” అని ఆయన స్పష్టం చేశారు.స్థానికులు ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, కాంగ్రెస్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఊపందుకునేలా చేస్తోంది.కాంగ్రెస్ పాలిత పంచాయతీల విజయం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారింది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు సన్మానం చేసిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు భవిష్యత్‌లో మోడల్ గ్రామాలు రూపొందించేలా కృషి చేస్తారని సంతోషం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.