Saturday, 14 March 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అరకు: షెడ్యూల్ ఏరియాలోపెసా గ్రామసభలుదే నిర్ణయాధికారం

ఐదవ షెడ్యూల్ పరిది గిరిజనుల ఆచార, సాంప్రదాయాల పరిరక్షణలో పెసా గ్రామసభ ప్రాముఖ్యతను అరకులోయ ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యన్నారాయణ తెలిపారు. షెడ్యూల్ ఏరియాలో పెసా చట్టం ఆవశ్యకత, గ్రామ తగాదాలు, భూ వివాదాల పరిష్కారంలో, స్థానిక వనరులు వినియోగంలో పెసా గ్రామసభ అధికారాలను ట్రైనర్ మహేష్ వివరించారు. సోమవారం తో ముగిసిన పెసా శిక్షణలో పెసా అధ్యక్షులు, సెక్రటరీలు లు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: నేటి పెసా గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్

అరకులోయ మండలం లోని చొంపి, సుంకరమెట్ట పంచాయతీలలో ఈ రోజు పెసా గ్రామసభలు జరుగుతాయని ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. పెసా మహోత్సవంలో భాగంగా ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ హాజరవుతారని ఇంఛార్జ్ ఎంపీడీఓ పేర్కొన్నారు. అరకులోయ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఆకట్టుకున్న విద్యార్ధినుల గణిత వస్తు ప్రదర్శనశాల

అరకులోయ కేజీబీవీ పాఠశాలలో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. వేడుకల్లో కేజీబీవీ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి, మ్యాథ్స్ టీచర్ అరబీరు పార్వతి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ మేరకు విద్యార్థినిలకు శ్రీనివాస రామానుజన్ గురించి వివరించారు. విద్యార్ధినిలు గణిత వస్తు ప్రదర్శనశాల నిర్వహించి, తోటి విద్యార్థులకు చక్కగా వివరించారు.

E-పేపర్

రాజంపేట బంద్ కు మద్దతు తెలుపుతున్న సెయింట్ జోసెఫ్ యాజమాన్యం

అన్నమయ్య జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని జేఏసీల పిలుపు మేరకు మంగళవారం నాడు బంద్ జరుగుతున్న వేళ, నందలూరు మండలంలో గల సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఈరోజు పాఠశాల ను మూసివేయడం జరిగిందని అలాగే రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అను బ్యానర్ తో తాము బంద్ కు మద్దతు తెలుపుతున్నామని. ఆ పాఠశాల కరెస్పాండంట్ భూమన శంకర్ రెడ్డి తెలిపారు.

నాగర్‌కర్నూల్

కొలువు తీరిన కొత్త పాలకవర్గం నాగులపల్లి గ్రామ సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి

పున్నమి: డిసెంబర్ 22 నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామ పంచాయతీలో కొలువు తీరిన కొత్త పాలకవర్గం సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గం ఏర్పడడంతో దీంతో గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. కోడేరు మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామాలలో నియమించిన ప్రత్యేక అధికారులచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను అప్పగించారు. గత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్నికలు వాయిదా పడటం, సుమారు రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు కొత్త పాలకవర్గాల రాకతో ఆశలు చిగురించాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా (గణిత)మ్యాథ్స్ దినోత్సవం :-

వింజమూరు మండలంలోని రాధాకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాకల కొండ నందు అంగరంగ వైభవంగా మ్యాథ్స్( లెక్కల) దినోత్సవమును ప్రధానోపాధ్యాయులు పోలు బోయిన రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా గణిత ఉపాధ్యాయులు అయినటువంటి సురా తులసీరామ్ రెడ్డి గారు గణితము నందు విశేషమైన కృషిచేసిన శ్రీ శ్రీనివాస రామానుజన్ గురించి చక్కగా వివరించడం జరిగింది. గణితమునకు ఆయన చేసిన కృషిని, మరియు విశేష సేవలను కొనియాడడం జరిగింది. తదుపరి విద్యార్థి,విద్యార్థులకు గణితంలో వివిధ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. పై కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అయినటువంటి ఏ. సుభాషిని, మమోలాబీ, ప్రతాప్, నరేష్,మస్తానయ్య, వెంకటేశ్వర్లు, మోహన్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి కృష్ణ, జూనియర్ అసిస్టెంట్ రామిరెడ్డి, బాల సుందరం పాల్గొన్నారు

గూడూరు

ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

గూడూరు @ 22 డిసెంబరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్గీయ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏం. సింహాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, గణిత శాస్త్ర అధ్యాపకురాలు మరియు కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి కిరణ్మయి, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, తదితరులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడుతూ 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారని, శ్రీనివాస రామానుజన్ గారు ప్రపంచ గణిత మేధావి అని, గణితం లేకపోతే ప్రపంచం పురోగతి సాధించలేదని, వ్యాపారంలోను, ఆర్థిక నిష్పత్తులు లెక్కించడానికి, సమాచార డేటా విశ్లేషించడానికి, భవిష్యత్తు ఆర్థిక ధోరణులను అంచనా వేయడానికి గణిత నైపుణ్యాన్ని ఉపయోగిస్తారని, ప్రపంచములో అందరు ఏదో ఒక రూపంలో గణితాన్ని తమ జీవితాలలో వాడటం జరుగుతుందని, గణిత ప్రాధాన్యాన్ని వివరించారు. రామానుజన్ గణిత శాస్త్రంలో విశేషమైన పరిశోధనలు చేసిన ప్రతిభావంతుడని, మన దేశమే కాకుండా ప్రపంచ మానవాళి గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి రామానుజన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ శైలజ, కృపా కరుణ వాణి, భీమవరపు లక్ష్మి, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, హిమబిందు, శైలజ, శ్రీలత, ఉష, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కె.జగన్నాధపురం హైస్కూల్ లో ఘనంగా మ్యాథ్స్ డే

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా సోమవారం గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సూర్య కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది రామానుజన్ చిత్రపటానికి వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ 1887 డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత, గణిత శాస్త్రవేత్త, గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ తమిళనాడులో జన్మించారని, గణితశాస్త్రంలో స్వయంకృషితో అద్భుతాలు చేపట్టారని అన్నారు. గణిత శాస్త్రంలో రామానుజన్ అద్భుతమైన కృషి చేశారని, ఆయన ఆలోచనలు, ఫార్ములాలు ఎంతోమంది మేధావులను ఆశ్చర్యపరిచాయన్నారు. గణితం యొక్క ప్రాముఖ్యతను ఆయన దేశం మొత్తం చాటి చెప్పారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2012 లో అప్పటి భారత ప్రభుత్వం ఆయన జన్మదినం అయిన డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారన్నారు. విద్యార్థులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అనంతరం మ్యాథ్స్ డే సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు వేసిన రామానుజన్ చిత్రపటం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

*శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ గుడి* *చైర్మన్ మురుగన్ ఉదారత*

*శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ గుడి* *చైర్మన్ మురుగన్ ఉదారత* 👉ఓం శక్తి భక్తులకు ఉచిత తీర్థయాత్ర! పలమనేరు,పున్నమి ప్రతినిధి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న పట్టణ పరిధిలోని గంటావూరు బీసీ కాలనీలో నెలకొన్న శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ మురుగన్ ఓం శక్తి మాల ధరించిన భక్తుల కోసం మూడు రోజుల పాటు పుణ్యక్షేత్రాల దర్శనానికి ఉచిత తీర్థయాత్రను ఏర్పాటు చేశారు. *ఇందులో మూడు రోజులు.. నాలుగు మహా క్షేత్రాలు ఉన్నాయి.* ఈ యాత్రలో భాగంగా భక్తులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన * తమిళనాడు నందలి శక్తి క్షేత్రమైన మేల్ మరువత్తూరు (అమ్మవారి ప్రధాన క్షేత్రం) * కన్యాకుమారి * చిదంబరం * రామేశ్వరం పుణ్యక్షేత్రాలకు ఉచితంగా చైర్మన్ మురుగన్ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. *ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు:* * ఉచిత రవాణా: అత్యాధునిక బస్సు సౌకర్యం కల్పించబడుతుంది. * భోజన వసతి: యాత్ర జరిగే మూడు రోజులూ మూడు పూటలా రుచికరమైన మరియు శుచికరమైన భోజన వసతి ఉచితంగా అందించబడుతుంది. ఈ సందర్బంగా చైర్మన్ మురుగన్ మాట్లాడుతూ… “ఓం శక్తి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలన్నదే మా సంకల్పం. మాల వేసి నియమనిష్టలతో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి” అని మురుగన్ కోరారు. ఈ యాత్రకు సంబంధించిన మరింత సమాచారం కోసం మరియు తమ పేర్లను నమోదు చేసుకోవడం కోసం గంటావూరు శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీని సంప్రదించవలసిందిగా అయన తెలిపారు.

చిత్తూరు

హిందువులపై దాడులకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

పలమనేరు , డిసెంబర్ 22 (పున్నమి ప్రతినిధి) : బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… బంగ్లాదేశ్‌లో హిందువుల ఆస్థులు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని మతోన్మాదులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హిందువులు, హిందూ ఆలయాలను ధ్వసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా హిందుత్వ జాతీయ వాద శక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిలిటరీ సిద్దయ్య, సత్య ప్రకాష్ , జనార్దన్,మురుగన్, రాజేంద్ర స్వామి,శరవణ, ఆనంద తీర్థ, గోవింద్, ప్రవీణ్, మోహన్,వంశీ, భార్గవ్, శక్తి, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.