Friday, 13 March 2026

Blog

హైదరాబాద్

హైదరాబాద్‌–సికింద్రాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్‌ మరియు సికింద్రాబాద్‌ నగరాల్లో క్రిస్మస్ పండుగ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. డిసెంబర్‌ 25న యేసు క్రీస్తు జన్మదినాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు ప్రార్థనలు, ప్రత్యేక పూజలతో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ప్రసిద్ధ చర్చిలైన మెదక్‌ కేథడ్రల్‌, సెయింట్‌ జోసెఫ్‌ కేథడ్రల్‌, సెయింట్‌ మేరీస్‌ బసిలికా తదితర చర్చిలు అందమైన దీపాల అలంకరణతో వెలుగొందుతాయి. క్రిస్మస్ ఈవ్ రోజున అర్థరాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. చర్చిల్లో కేరోల్స్‌ పాటలు, యేసు జననం సూచించే క్రిబ్‌ అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటాయి. నగరమంతా క్రిస్మస్ చెట్లు, సాంటా క్లాజ్‌ బొమ్మలు, నక్షత్రాలతో శోభిల్లుతుంది. హైదరాబాద్‌–సికింద్రాబాద్‌లలో క్రిస్మస్ కేవలం క్రైస్తవుల పండుగగా కాకుండా అన్ని మతాల ప్రజలు కలిసి జరుపుకునే పండుగగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ కేకులు, స్వీట్లు పంచుకుంటారు. ఈ పండుగ నగరంలో సోదరభావం, ఐక్యత, ప్రేమను మరింత బలపరుస్తుంది.

అన్నమయ్య

చిట్వేల్ ప్రజలకు ఎస్సై వినోద్ కుమార్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్వేల్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్. వినోద్ కుమార్ మండల ప్రజలకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అయిన క్రిస్మస్ పండుగ ప్రతి కుటుంబానికి ఆనందాన్ని, శుభసమృద్ధిని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ – క్రిస్మస్ సందేశమైన సోదరభావం, మానవత్వం సమాజంలో మరింత విస్తరించాలని అన్నారు. అన్ని మతాలు, వర్గాలు పరస్పర గౌరవంతో మెలగాలని, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. పండుగ వేళల్లో ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిల వద్ద, రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిట్వేల్ మండల ప్రజలంతా ఆనందోత్సాహాలతో, సుఖశాంతులతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఎస్సై వినోద్ కుమార్ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

E-పేపర్

మీకు తెలుసా 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు

పున్నమి ప్రతినిధి: మీకు తెలుసా 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త

ఖమ్మం

కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నాయకుడు మట్ట ప్రసాద్

ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం దుద్దుపూడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు మట్ట ప్రసాద్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాగమయి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ సమక్షంలో మట్ట ప్రసాద్ అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయనకు పార్టీలో స్వాగతం పలికారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని మట్ట ప్రసాద్ పేర్కొన్నారు.

E-పేపర్

చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80 % మేర పూర్తయ్యాయని తెలిపారు డాక్టర్,, ఉక్కుల అశోక్

పున్నమి ప్రతినిధి: చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80 % మేర పూర్తయ్యాయని తెలిపారు డాక్టర్,, ఉక్కుల అశోక్ కొంగరకలన్ డివిజన్ చింతపల్లిగూడ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80% మేర పూర్తయ్యాయని డాక్టర్, ఉక్కుల అశోక్ తెలిపారు మరియు ప్రస్తుత పనుల ప్రగతి, పనితీరును సంబంధించిన వివరాలు గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలతో చర్చించారు వారితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చింతపల్లిగూడ , మల్షెట్టిగూడ, రాందాస్ పల్లి, కోహెడ, అంబర్ పేట, హయత్ నగర్ మరియు రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్ వాసులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు ఇరువైపుల మట్టి పోయాలని సూచించారు. డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని, కొంగరకాలన్ డివిజన్ పరిధిలో ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ఈ రోడ్డును *మా ప్రియతమా నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ,, శ్రీ,,మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌ,,శ్రీ,, మల్ రెడ్డి రాంరెడ్డి ప్రారంభిస్తారు* ఈ కార్యక్రమం లో ఏ, వర్క్ ఇన్స్పెక్టర్ చింతపల్లిగూడ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్ నాయకులు శేరి రమేష్, ఉడుతల రవి గౌడ్, జోగు నర్సింహ, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు… *డా,, ఉక్కుల అశోక్* కొంగరకలాన్ డివిజన్

కామారెడ్డి

ఉప్పల్వాయి గ్రామంలో ఎన్నికల ఓటమి.. మద్యం బాటిల్స్‌తో పంచాయతి ముందు మహిళలు ఆందోళన!

కామారెడ్డి, 25 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, ఉప్పల్వా యి ఇక్కడేగ్రామంలో పంచాయతీ ఎన్నికల ఓటమి మహిళలను మద్యానికి మళ్లించిందా? వింత ఘట న గ్రామాన్ని ఆశ్చర్యపరిచింది. రామారెడ్డి మండ లం ఉప్పల్వాయి గ్రామంలో 2వ వార్డు మెంబర్ పోటీ చేసిన మహిళ ఓడిపోయాక ఆగ్రహం మద్యం తో బాహాట్ అయింది. ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు తిట్ల తుఫాను…. అసభ్య పదాలు, భూత మాటలతో గ్రామస్తులను తొక్కుతూ, మహిళలు పంచాయతీ కార్యాలయం ముందు కల్లు ప్యాకెట్లు, బీర్ సీసాలు, చీరలు పట్టుకొని ఆందోళన చేశారు!ఈ మహిళ పోటీకి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నా రు. గెలవకపోతే కళ్లు తెరిచి, ఎవరైతే డబ్బులు పంచారో వాళ్లకు తిరిగి తిట్లు తిప్పేశారు. పోలీసు లు ప్రత్యక్షం కావడంతో చేసేదిఏమిలేక గ్రామ పంచాయతీ ఆవరణలో మద్యం బాటిల్స్‌తో నిరస న తెలిపి వదిలేసి వెళ్లిపోయారు.ఈ వింత దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయా రు. రాష్ట్ర వ్యాప్తం గా పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి విచిత్ర ఘటన లు జరుగుతున్నాయి. ఓడిపోయిన తర్వాత ఆందోళనలు, తిట్లు.. గ్రామ శాంతి భంగపడుతోంది. స్థానికులు పోలీసుల చర్య కోరుతున్నారు.

విశాఖపట్నం

వైసీపీ హింసాత్మక రాజకీయాలపై పల్లా ఘాటు విమర్శలు

విశాఖ/గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మారణాయుధాలతో బహిరంగ ప్రదర్శనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లు పట్టుకుని ర్యాలీలు నిర్వహించడం శాంతి భద్రతలకు ముప్పని పేర్కొంటూ, ఆర్మ్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హింసాత్మక రాజకీయాలు పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. జగన్, వైసీపీ హింస సంస్కృతిని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని పల్లా స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేట మండలంలో అంబరాన్ అంటిన క్రిస్మస్ సంబరాలు సంబరాలు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐ బి సి చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొని సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు మరియు ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఉప సర్పంచ్ మందారపు బాల్రెడ్డి మాజీ ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి వార్డు సభ్యులు అంగూరి ప్రవీణ్ అంతెరుపుల గోపాల్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాడి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

చిత్తూరు

*ఘనంగా క్రిస్మస్ వేడుకలు* *ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్*

*ఘనంగా క్రిస్మస్ వేడుకలు* *ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్* *కేక్ కటింగ్, దుస్తుల పంపిణి చేసి శుభాకాంక్షలు వ్యక్తం* *ప్రభువు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే* పలమనేరులో క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చిలు కిటకిటలాడాయి. పలమనేరు పట్టణంలోని సిఎస్ఐ (ఓల్డ్ ) చర్చ్ నందు, కొత్త సిఎస్ఐ చర్చ్ మరియు శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో శాసన సభ్యులు అమరనాథ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలసి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎలిజర్, మున్సిపల్ కౌన్సిలర్ సునీతా నాగరాజు గారి స్వగృహలలో జరిగిన వేడుకల్లో సైతం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి కేకులను కట్ చేసి అందరికీ పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ నందు పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ పండుగను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ చల్లని కృప మరియు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో రాణించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాలలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి, గిరి బాబు, సుబ్రహ్మణ్యం గౌడు, సుదర్శన్ బాలాజీ, కృష్ణమూర్తి గౌడు,రూపేష్, మదన్, శ్రీధర్, సుధాకర్, రమేష్, సురేష్, చిన్నీ, సుబ్బు, శీనా జనసేన నాయకులు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

టెక్ స్పార్క్స్ – 2K25: టెక్నాలజీ ……రాష్ట్రస్థాయి సాంకేతిక కార్యక్రమము…..SDMSM కళాశాల…. డాక్టర్ వి.వి. ఎస్ కుమార్….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల లోని కంప్యూటర్ సైన్స్ విభాగం, స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా ” టెక్ స్పార్క్స్ – 2K25: వర్స్ ఆఫ్ టెక్నాలజీ • అనే రాష్ట్రస్థాయి సాంకేతిక కార్యక్రమమును 24 డిసెంబర్ 2025 న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. వి.ఎస్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు వెబినార్ హాల్ లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కర రావు గారు, వైస్- చైర్మన్, APSCHE మరియు వైస్-చాన్సలర్ (ఇన్ఛార్జ్), డా|| బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆలోచనలు మరియు నైపుణ్యాల ప్రాధాన్యతను మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రతి విద్యార్థి నూతన సమాజానికి IQ విశ్లేషణాత్మక సామర్ధానికే’ కాకుండా విద్యార్థి విజయానికి మాత్రమే రోషద పడుతుందని, మరియు EQఅనేది భావోద్వేగ మేధస్సును వృద్ధి చేస్తుందని ప్రతి విద్యార్థి బేరిక్షా వేసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేసారు. విద్యార్థులు జట్టుగా పనిచేయడం వల్ల విద్య మరియు వృత్తి జీవితాలలో విజయం సాధించడానికి సమిష్ట కృషి ఎంతో అవసరం అని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో తగిన ఉద్యోగ అవకాశాలు ఉండాలని (Employeebility) degree పూర్తయిన తరువాత ఉద్యోగం సాధించటం ఒక్కటే మీ గమ్యం కాదని, అక్కడ నుండి ఈ రెండు సమానంగాఉన్నత స్థానాలు అధి గమించటానికి డిగ్రీ ఎంట్రీ టికెట్ లాంటిదని, దీర్ఘకాలక విజయానికి ఇది ఒక సోపానమని చెప్పారు. విద్యార్థులు బాధ్యతగా, వృత్తి–పరులుగా మాత్రమే కాకుండా మంచి మనుషులుగా మారాలని తెలియజేసారు. ఈ కార్యక్రమములో కళాశాల పిన్సిపాల్ డా|| వి. వి. సుబ్రమణ్య కుమార్ -గారు సమర్థవంతమైన నాయకత్వంతో నిర్వహించబడింది. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి Technical Events ద్వారా జట్టు సామధ్వం, వినూత్న భావాలను వ్యక్త పరుచుకునే ఏరస్పర ఆలోచనలను మార్చుకునే వేదికగా ఉపయోగ పడుతాయని మరియు నాయకత్వ లక్షణాలు వెలికి తీసే ఒక సోపానమని తెలియజేశారు. టెక్ స్టోర్క్స్ – 2 K25 యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సాంకేతిక నైపుణాలు, సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని STUD-WEBER, TECHNO-FIESTA, TECH BLIN-C, PREDICAMENT, SHORT FILM IREEL, INSIGNIA, GAME MINIATURE వంటి పలు పోటీలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుండి 380 మంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గోని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరితంగా మార్చారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించగా పాల్గొన్నప్రతి విద్యార్థికి సర్టిపికెట్లు అందించబడ్డాయి. ఈ కార్యక్రమం లో కంప్యూటర్ విభాగాధిపతి శ్రీమతి యం. ప్రవీణ,విభాగ అధ్యాపకులు… విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.