Tuesday, 28 April 2026

Blog

కడప

కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ. 2. 52 కోట్ల రూపాయలు స్వాధీనం.

ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముద్దనూరు నుంచి వస్తున్న కారులో 500 రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు. నగదు ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిదని తెలిసింది. సరైన బిల్లులు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి

కల్తీ పాలపై ‘ఫుడ్ సేఫ్టీ’ పంజా-పాల సొసైటీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తిలోని స్థానిక పాల సొసైటీ కేంద్రాన్ని శుక్రవారం నాడు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పాలను అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసింది. గురువారం నాడు పాల కేంద్రంలోని నిల్వలను పరిశీలించిన అధికారులు, పాల నాణ్యతను పరీక్షించేందుకు కొన్ని నమూనాలను సేకరించారు. ఈ సందర్బంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ…. సేకరించిన పాల నమూనాలను విశ్లేషణ కోసం ల్యాబొరేటరీకి పంపనున్నట్లు అయన వెల్లడించారు. పాలను నిల్వ చేసే విధానం, పరిసరాల పరిశుభ్రతపై సొసైటీ కేంద్రం నిర్వహుకులను ఆరా తీశారు. స్టెయిన్‌లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను భద్రపరచాలని, ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాలను వాడవద్దని పాల నాణ్యతలో లోపాలున్నా లేదా కల్తీకి పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జగదీష్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కల్తీకి పాల్పడే వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పాల కేంద్రాలు, విక్రయ కేంద్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

సరస్వతి బాయి పాఠశాలలో సైన్స్ డే సంబరాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సరస్వతి బాయి పాఠశాలలో నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని చాటుతూ జాతీయ సైన్స్ దినోత్సవ ముందస్తు వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ నిర్వహించిన పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రంగుల హరివిల్లులో విజ్ఞాన చిత్రాలు సైన్స్ అంటే కేవలం పుస్తకాలు కాదు, అది ఒక కళ అని నిరూపిస్తూ విద్యార్థులు వేసిన సైన్స్ రంగోలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణహిత రంగులతో మానవ శరీర భాగాలు, అంతరిక్ష ప్రయోగాలు మరియు పర్యావరణ రక్షణపై వేసిన చిత్రాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థుల మేధస్సుకు పరీక్షగా నిలిచిన సైన్స్ క్విజ్ పోటీ అత్యంత ఉత్సాహంగా సాగింది. నాలుగు టీంల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోరులో విద్యార్థిని హర్షిత బృందం ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు డి.రమేష్ మాట్లాడుతూ..విద్యార్దులకు వైజ్ఞానిక దృక్పథం ఎంతో అవసరం ఉందని 28 ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని కేవలం చదువుకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక విద్య ద్వారానే విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హర్షిత మాట్లాడుతూ.. తమ ఉపాధ్యాయులు అందించిన లోతైన బోధన, ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించగలిగామని గర్వంగా చాటింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

రంగారెడ్డి

*బిజినెస్ పాలసీల్లో తెలంగాణ ప్రభుత్వం భేష్: KLR* ==బిల్డర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు సదస్సు –హైదరాబాద్ కు అంతర్జాతీయ కంపెల క్యూ: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 :బిల్డర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరుగుతున్న నేషనల్ మేనేజింగ్ కమిటీ & జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక, నిర్మాణాల నూతన పాలసీలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర పద్మజ ఫామ్ గ్రోవ్స్ రిసార్ట్ లో కాసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ అపార్ట్ మెంట్స్, విల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుతున్నాయని లక్ష్మారెడ్డి అన్నారు. బిల్డర్స్ అసోషియేషన్ సైతం మహేశ్వరం నియోజకవర్గం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కాంగ్రెస్ నేత KLR కోరారు. ఈ బిజినెస్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెల బిల్డర్స్ & ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన బొజ్జల బృందమ్మ, రిషిత రెడ్డి

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు తొట్టంబేడు మండలంలోని దయనేడు, చిన్న సింగమల, సంబయపాలెం, ఎల్ఐసి కాలనీ పలు గ్రామాల్లో గ్రీన్ ప్యానెల్ ఆధ్వర్యంలో గ్రామస్తుల భాగస్వామ్యంతో నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లను బొజ్జల బృందమ్మ, రిషిత రెడ్డిలు పాల్గొని ప్లాంట్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా బొజ్జల కుటుంబ సబ్యులు మాట్లాడుతూ…. గ్రామస్తులకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం, గ్రీన్ ప్యానెల్ వారు, గ్రామస్తుల సహకారంతో ఈ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు నిర్మించబడ్డాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజు నాయుడు ఈ కార్యక్రమంలో గ్రీన్ ప్యానెల్ మణికంఠ, ఎంపీడీవో సురేంద్రబాబు, ఆఫీసర్ సౌమ్య నాగరాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

చంద్రశేఖర్ ఆజాద్ సిద్దాంతాలను అనుసరిద్దాం-జనసైనికులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ నాయకులు స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలువేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ……భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లతో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దేశంలో ఉన్నటువంటి యువత యొక్క గుండెల్లో ధైర్యాన్ని నింపి, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బ్రతకాలనే నినాదంతో అందరిని చైతన్యపరిచి భారతదేశ స్వాతంత్రం కోసం కేవలం 25 సంవత్సరాలకే ప్రాణదానం చేసి అందరిలోనూ ధైర్యాన్ని నింపిన చంద్రశేఖర్ ఆజాద్ ది ఒక గొప్ప చరిత్ర, ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గంధం శీను, లక్ష్మణ్, కల్లిపూడి వెంకటేష్, ప్రదీప్ కుమార్, మహేష్, నవీన్, నాదెండ్ల రాజేష్, భాను, రాజా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైకాపాలో నూతన నియమాకలు పొందిన వారికి ఘనసన్మానం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫారం జాయింట్ సెక్రెటరీగా నియమితులైన కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని నూతన పదవి బాధ్యత చేపట్టిన కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, తిరుపతి శ్రీకాళహస్తి పార్లమెంటు పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి,కర్నూల్ పార్లమెంట్ పరిశీలకులు సూర్య ప్రకాశ్ రెడ్డి తదితరులు కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష,ఉత్తరాజీ సర్వణ కుమార్, శ్రీవారి సురేష్,తీగల చిన్న, మాతయ్య,మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యం రాయల్, పటాన్ ఫరీద్,శివ కుమార్ యాదవ్, చందర్ రాజు, పెరుమాళ్ చౌదరి, కామి వెంకటేశ్వర్లు, గఫూర్, దూదాకుల సంఘం అధ్యక్షుడు బాబు, జూమ్లేష, గుణ,జీవీకే రెడ్డి,కుమార్, సునీత సింగ్, హిమబిందు, సుధాకర్ రెడ్డి, పురుషోత్తం గౌడ్, యోగ, జయ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించుకున్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ శుక్రవారం నాడు ఆయలనికి విచ్చేసారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పాలక మండలి సభ్యులు, టి.డి.పి. మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు, ఆలయ అధికారులు, ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం ఆలయ వెడపండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ, ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, గుర్రపు శెట్టి, ఆలయ సిబ్బంది, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టియుసిసి మంత్రికి వినతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి హమాలీ ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ పీ సీడ్స్ కార్పొరేషన్ విజయవాడ,వ్యవసాయ శాఖ మంత్రి గింజరపు అచ్చం నాయుడుకి మెమోరాండము సమర్పించిన ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ నాయకులు. విజయవాడలోని మంత్రి నివాసము నందు ఆయనను కలుసుకుని గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కేంద్రం విజయవాడ శ్రీకాళహస్తితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని బ్రాంచులు పూర్తిగా మూత పడిపోతున్న ఈ పరిస్థితులలో వేలాదిగా ఉన్న హమాలీ ముఠా కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను వెంటనే తెరవాలని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని బ్రాంచీలలో పని విధానాన్ని మెరుగుపరచాలని మంత్రికి టియుసిసి ప్రతినిధి బృందం వివరించడం జరిగింది, వ్యవసాయ శాఖ మాత్యులు స్పందిస్తూ ఏపీ సీడ్స్ ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో (టి యు సి సి)ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే,వీ నరసింహామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులుయు, నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దొడ్ల గౌరీ, హమాలీ నాయకులు మునయ్య, నంద్యాల గంగాధర్ లు పాల్గొన్నారు.

తిరుపతి

సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించండి- మాజీ ఎమ్మెల్యే యస్సీ.వి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి శుక బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వామీజీని మాజీ శాసనసభ్యులు నాయుడు శుక్రవారం నాడు ఘనంగా సత్కరించారు. ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామి పిలుపుమేరకు ఎస్ సి వి నాయుడు పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశ్రమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఏప్రిల్ లో నిర్వహించే ఆశ్రమ వార్షికోత్సవాలు తదితర అంశాలపై చర్చించారు. శుక బ్రహ్మ ఆశ్రమం చేపట్టే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తామని ఎస్ సి వి నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో నైతిక విలువలు పెంపొందించి, ఆధ్యాత్మిక చింతనతో సత్ప్రవర్తనతో ప్రతి వ్యక్తి నడుచుకునేలా చేసే గురుతర బాధ్యతలు ఆశ్రమ పీఠాధిపతులు తీసుకోవాలని, ధార్మిక ప్రచారాలు విస్తృతంగా నిర్వహించాలని ఎస్ సి వి నాయుడు స్వామిజీని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.