Tuesday, 28 April 2026

Blog

రంగారెడ్డి

* కందుకూరు మండలం విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న – కొండా విశ్వేశ్వర్ రెడ్డి –ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల బిజెపి అధ్యక్షులు నిమ్మ అంజి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మండల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొప్పు బాషా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లను, వార్డు మెంబర్లను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని మండలంలోని వివిధ పాఠశాలలో పదవ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు జే.కే.యం.ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహక చెక్కులను అందించారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీని కాదని మండల ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అపూర్వ విజయాన్ని అందించి 12 సర్పంచ్లను గెలిపించుకున్నారని…వాళ్ల నమ్మకాన్ని అదేవిధంగా కొనసాగించేలా గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేయాలని… అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. శ్రీరాములు మాట్లాడుతూ రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు సాద మల్లారెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, అమరేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన దేప భాస్కర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామం యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్ల శ్రీకాంత్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సి హెచ్ యాదయ్య సర్పంచ్ చేపంగి ప్రవీణ్ దాంతోజు నర్సింహ చారి, కె జె ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన శ్రీరాములు అందెల —మొన్న సాయి కిషోర్ పై నేడు క్యాబ్ డ్రైవర్ సురేష్ పై వరుసగా దాడి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరుసగా ఒక వర్గం వారు హిందువులపై దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఇటీవల నాగోల్ లో మొబైల్ సెంటర్ నిర్వాహకుడు ఖదీర్ సాయి కిషోర్ పై దాడి చేసిన విషయం తెలిసినదే కాగా నిన్న రాత్రి హిందూ క్యాబ్ డ్రైవర్ సురేష్ తన కారుపై జైశ్రీరామ్ అని రాసుకున్నందుకు కేవలం హిందువు అని టార్గెట్ చేసి ఒక వర్గానికి చెందిన యువకులు దాడి చేసి సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిరసన తెలిపారు. వారి వెంట జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్లు బిజెపి రాష్ట్ర నాయకులు హిందూ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి

* బీజేపీ ప్రశ్నిస్తేనే కదులుతున్న జిహెచ్ఎంసి అధికారులు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నిరసన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించి శుక్రవారం సమస్యలపై పనులు ప్రారంభించడం గమనార్హంప్రజల సమస్యలను స్వయంగా పరిష్కరించాల్సిన అధికారులు, ఆందోళన తర్వాతే చర్యలు తీసుకోవడం బాధాకరంమని ప్రజల హక్కుల సాధన కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తెలిపారు

విశాఖపట్నం

పూర్తి జీతాలు చెల్లించాలి

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, పున్నమి ప్రతినిధి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్య రామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ కార్మికులుకు పూర్తి జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్ తో స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులు తమ నిరసనను తెలియజేస్తూ సంతకాలు చేశారు. ఆపత్తులను నేడు స్టీల్ ఉన్నత యాజమాన్యానికి స్టీల్ సిఐటియు ఉక్కు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ నేడు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గడానికి కారణం ఉన్నత యాజమాన్యం అనుసరించిన అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు న్యాయంగా రావలసిన వేతనాలపై కార్మిక ఉన్నత అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించిన వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన వివరించారు. కార్మికులు 2012, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నారని వాటిలో కూడా కోతలు విధిస్తే కుటుంబ పోషణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుందని ఆ హద్దు మీరి నేడు యాజమాన్యం చట్టాలు ఉల్లంఘిస్తూ నిరంకుశ నిర్ణయాలతో కార్మికులను బానిసలుగా చూడటం మంచిది కాదని ఆయన హితవుపలికారు. ఇప్పటికైనా ఉన్నత యాజమాన్యం తమ వైఖరిని మార్చుకొని పునరాలోచించి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు కాకుండానే స్టీల్ యాజమాన్యం ఇక్కడ వాటి అమలుకు ఒక ప్రయోగశాల గా స్టీల్ ప్లాంట్ ను మారుస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉన్నత యాజమాన్యం సకాలంలో అందిస్తే ఉత్పత్తి చేయడానికి స్టీల్ కార్మికులు సంసిద్ధంగా ఉన్నామని నిరూపించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల త్యాగాన్ని గాని, అంకిత భావాన్ని గాని గుర్తించని యాజమాన్యం మొండి వైఖరితో పరిశ్రమలో అశాంతిని సృష్టించి కార్మికులను భయాందోళనకు గురి చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. స్టీల్ జిఎం (హెచ్ఆర్) మధుసూదన్ గారు మాట్లాడుతూ స్టీల్ ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు చేసిన ఈ సంతకాల సేకరణ పతులను ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. సమస్య తీవ్రతను నేను అర్థం చేసుకున్నానని ఉన్నత యాజమాన్యానికి మీ ఆవేదనను తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారి డాక్టర్ రాధిక గారు, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, యు మరిడయ్య, బి ఎన్ మధుసూదన్, బి తౌడన్న, వి ప్రసాద్, అప్పలరాజు, పవన్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏకాదశి సందర్భంగా చెన్నకేశవ స్వామికి హస్త, పాద కవచాల వితరణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు అంబేద్కర్ నగర్‌లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన నాశిన వెంకయ్య స్వామి, ఆయన సతీమణి స్వప్న దంపతులు రూ.8,000 విలువైన హస్త, పాద కవచాలను ఆలయానికి వితరణగా అందించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు క్షీర పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కోసూరు మస్తానయ్య గౌడ్, అంజమ్మ దంపతులు భక్తితో పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్ల నిర్వాసితులకు బీజేపీ నేత దేవకీ వాసు దేవా రావు ఆధ్వర్యంలో ఆహార పంపిణి

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ ప్రాంతంలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం అంబేద్కర్ సెంటర్ వద్ద తలదాచుకుంటున్నారు. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలుస్తూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవకీ వాసుదేవరావు గత రెండు రోజులుగా నిర్వాసితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శుక్రవారం కూడా అయన ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం అందజేసి వారి ఆకలి తీర్చే కార్యక్రమం నిర్వహించబడింది. ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సహాయం వారికి తాత్కాలిక ఊరటనిస్తోంది. ఈ సేవా కార్యక్రమంలో బీజేపీ మరియు జనసేన నాయకులు వల్లల రమేష్, రుద్రగాని మాధవ, మిర్యాల రామకృష్ణ తదితరులు పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు. నిర్వాసితుల పట్ల మానవత్వంతో ముందుకు వచ్చిన నేతలను బాధితులు కృతజ్ఞతలతో అభినందించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. వెలుగుమట్ల ఘటనతో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ సహాయం అవసరమని నేతలు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల

తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి డిపాజిట్ పథకం.

సిరిసిల్ల ఫిబ్రవరి 27 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త డిపాజిట్లపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న ఏకైక బ్యాంకు ప్రభుత్వ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో కాకుండా మన గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేసుకుని అధిక వడ్డీ పొందగలరని వృత్తి వివరాలకు నీ దగ్గరలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకును సంప్రదించగలరు.

ఖమ్మం

అటల్ జీ శతజయంతి ఉత్సవాలు మార్చి 1 న జరిగే సభ ని జయప్రదం చెయ్యండి:

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ అటల్ బిహారీ వాజ్‌పేయి ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుద్దుకూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దుకూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అటల్ జీ మహోన్నత వ్యక్తిత్వం, సిద్ధాంతాలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తినివ్వాలని, సమాజంలో విలువలతో కూడిన రాజకీయ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ ఉత్సవాల లక్ష్యమన్నారు. మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎస్.ఆర్. గార్డెన్స్‌లో “అటల్ జీ కి అక్షర నిరాజనం” పేరుతో కవితా సంకలనాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. అలాగే ఈ సభకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వాగత కమిటీ అధ్యక్షుడిగా కాటమనేని రమేష్ వ్యవహరించనున్నారు. ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మందడపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అజాతశత్రువుగా పేరుగాంచిన అటల్ జీకి నివాళి అర్పించేందుకు జాతీయవాదులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సభలో కవి పండితులకు సన్మానం, “ఘనమైన మన ఖమ్మం” నృత్యరూపకం, అటల్ జీకి నివాళి గేయం ఆవిష్కరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, వడ్లమూడి సురేష్, కోశాధికారి మల్లెంపాటి రమేష్, కార్యదర్శులు యాలగందుల మధు, పోతుల చంద్రశేఖర్, తవిడబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Featured

పెళ్లి అనంతరం తొలిసారి బయటకు వచ్చిన విజయ్–రష్మిక

ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తొలిసారి కొత్తజంట ఉదయపూర్ విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ‘వీరోష్’ జంటను చూసిన అభిమానులు శుభాకాంక్షలు తెలపగా, వారు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉత్సాహపరిచారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.