Friday, 13 March 2026

Blog

విశాఖపట్నం

సృష్టి వరల్డ్ స్కూల్‌లో ASCENDIA కెరీర్ గైడెన్స్ సెషన్ 30 ఏళ్ల విద్యా ప్రావీణ్యానికి మరో ఘన అడుగు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): విద్యా రంగంలో 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రావీణ్యాన్ని పురస్కరించుకుని సృష్టి వరల్డ్ స్కూల్, ఉక్కునగరం క్యాంపస్‌లో 9–10 తరగతుల విద్యార్థుల కోసం ASCENDIA కెరీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను గురువారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం సృష్టి స్కూల్ పెర్ల్ జూబిలీ వేడుకలలో భాగంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేక సెషన్‌కు ప్రఖ్యాత విద్యావేత్త, విశాఖ సైన్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ డా. జోస్యుల గౌరి శంకర్ దాస్ ముఖ్య వక్తగా హాజరై, విద్యార్థులకు ఎమర్జింగ్ మరియు ఇంటర్‌డిసిప్లినరీ కెరీర్ మార్గాలు, ప్రారంభ దశలోనే కెరీర్ స్పష్టత, స్వీయ అన్వేషణ, వ్యక్తిత్వ వికాసం, లైఫ్ స్కిల్స్ ప్రాధాన్యతపై లోతైన అవగాహన కల్పించారు. ASCENDIA కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించగా, క్యాంపస్‌లో ప్రత్యక్ష ప్రసంగంతో పాటు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విస్తృత స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇది సృష్టి స్కూల్‌లో దీర్ఘకాలిక, క్రమబద్ధమైన కెరీర్ ఎడ్యుకేషన్ ప్రయాణానికి తొలి అడుగుగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులకు భవిష్యత్ దృష్టితో రూపొందించిన కెరీర్ క్లస్టర్లను పరిచయం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ & ఆటోమేషన్ సైన్స్, రీసెర్చ్ & ఇన్నోవేషన్ ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్ & మేనేజ్‌మెంట్ మార్కెటింగ్, డిజిటల్ మీడియా & కంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ-అలైన్‌డ్ మరియు ఇంటర్‌డిసిప్లినరీ కెరీర్లు ఫ్యూచర్ స్కిల్స్, న్యూ-ఏజ్ ప్రొఫెషన్స్ విద్యార్థుల్లో ఆలోచనాత్మక దృష్టి, మారుతున్న కెరీర్ అవకాశాలపై అవగాహన, లక్ష్యసాధనకు అవసరమైన ప్రణాళికాత్మక దృక్పథాన్ని ఈ కార్యక్రమం పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు. లెర్నింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు గైడెడ్ వర్క్‌షీట్లు అందించగా, ఇవి స్వీయ విశ్లేషణ, కెరీర్ అన్వేషణ, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకంగా నిలవనున్నాయి. కీలక విద్యా నిర్ణయాలకు ముందే కెరీర్ గైడెన్స్ ప్రారంభించాలనే సృష్టి స్కూల్ విద్యా తత్వానికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, సైన్స్ చరిత్ర, భారతీయ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు, భవిష్యత్ అవకాశాలపై విలువైన అవగాహన పొందారు. సమగ్ర విద్యా అభివృద్ధి మరియు భవిష్యత్‌కు సిద్ధం చేసే విద్యా దృక్పథాన్ని సృష్టి వరల్డ్ స్కూల్ మరోసారి నిరూపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. స్కూల్ డైరెక్టర్ శ్రీమతి సుశీలా రాణి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మేఘనా కంభం మాట్లాడుతూ, ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమాలు స్కూల్ విజన్ అయిన **“Rising with Purpose, Learning with Vision”**కు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి చంద్రిక, ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపాల్ శ్రీమతి కిరణ్, చీఫ్ అకడమిక్ హెడ్ శ్రీ సంతోష్ కుమార్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. IGNITIA 2025, FUTURIZE 2026కు ఏర్పాట్లు పెర్ల్ జూబిలీ వేడుకలలో భాగంగా డిసెంబర్ 26–27 తేదీలలో IGNITIA 2025 అనే రెండు రోజుల అనుభవాత్మక STEM లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రపంచ ప్రఖ్యాత అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రకటించింది. ఇందులో 80కి పైగా వర్కింగ్ సైన్స్ ఎగ్జిబిట్లు, హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్‌లు, ప్రత్యక్ష శాస్త్ర అనుభవం విద్యార్థులకు అందనుంది. అదేవిధంగా పెర్ల్ జూబిలీ వేడుకలు జనవరి 3, 2026న FUTURIZE 2026 అనే ఘనమైన సాంస్కృతిక మహోత్సవంతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతిభ, సృజనాత్మకత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు భాగస్వాములు కావాలని సృష్టి వరల్డ్ స్కూల్ యాజమాన్యం ఆహ్వానించింది.

విశాఖపట్నం

వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) పాత గాజువాక జంక్షన్‌లో కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల కోసం నిర్భయంగా పోరాడిన నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మోహనరంగా ఆశయాలను నేటి యువత కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ యూత్ ఫోర్స్ సభ్యులు, పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మోహనరంగా త్యాగాలను స్మరించుకున్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరులో టీడీపీ ప్రజా దర్బార్ – ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారాలు

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాఘవరాజుపురం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కుడా (KUDA) చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భూ ఆన్లైన్ సమస్యలు, విద్యుత్, రోడ్లు, త్రాగునీరు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలను వివరించారు. వాటిని శ్రద్ధగా విన్న ముక్కా రూపానంద రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన న్యాయపరమైన అంశాలపై విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలే తన ప్రథమ లక్ష్యమని ఆయన తెలిపారు.

కామారెడ్డి

గిరిజన మండలానికి అంబులెన్సు 108 ఎందుకు లేదు?

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి. : జిల్లా అధికారులకు మత్తు వీడలేదా !! గిరిజన పల్లెలు అధికంగా ఉన్న మండలానికి ఇది పెద్ద అన్యాయం?? కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలానికి ఇప్పటికీ ఒక్క 108 సర్వీ స్ అంబులెన్స్ తటస్థంగా లేకపో వడం, ప్రత్యేకంగా గిరిజన పల్లెలు అధికంగా ఉన్న మండలానికి ఇది పెద్ద అన్యాయం అని స్థానికులు మండి పడుతు న్నారు.తెలంగాణ వ్యాప్తంగా 108 అత్యవసర అంబులెన్సుల దళం 400కుపైగా వాహనాలతో, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక బైక్ అంబులెన్సు లు కూడా నడుస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.కొత్తగా జోడించిన అంబులెన్సుల్లో పలు ట్రైబల్ జోన్లు, సేవలు లేని రూరల్ మండలా లకు కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతుండగా, రామారెడ్డికి మాత్రం ఇంకా 108 నోచుకోకపోవడం జిల్లా అధికారుల మొండి వైఖరి ని బహిర్గతం చేస్తోంది. కాగితాలపై వాగ్దానాలు – నేలమీద ఖాళీ ప్రాంగణం 108 అంబులెన్స్ ఎక్కడ చేరక ముందే ‘గోల్డెన్ అవర్’లో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రకటించగా, రామారెడ్డి మండలంలో అయితే ఫ్రిజ్ శవపేటికే దవాఖాన అంచులో మూలన పడి పోయింది.వైకుంఠ రథంగా వాడాల్సిన ఫ్రిజ్ శవ పేటిక ఇలా గడ్డి మధ్య పడి తుప్పు పట్టిపోతుండ గా, గ్రామీణ పేదలకు మాత్రం అత్యవసర అంబులె న్స్ దొరకక ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 108 సేవ లక్ష్యం – రామారెడ్డిలో విఫలమా? డయల్ 108 దేశవ్యాప్త అత్యవసర నంబర్, వైద్య, అగ్ని, పోలీస్ వంటి పరిస్థితుల్లో ఉచితంగా స్పం దించి, ప్రాథమిక–అధునాతన చికిత్సతో రోగిని సమీప ఆసుపత్రికి తరలించడమే దీని లక్ష్యం అని మార్గదర్శకాలు చెబుతున్నాప్పటినీ రామారెడ్డి మండలానికి ప్రత్యేక 108 వాహనం కేటాయించక పోవడం వల్ల ప్రమాదాలు, హార్ట్‌ఎటాక్‌లు, గర్భిణీ పేషంట్లకు సమయానికి వైద్యం చేరే అవకాశం కోల్పోతున్నారని స్థానిక సంఘాలు ఆరోపిస్తున్నా యి.“గిరిజన పల్లెల ప్రాణాలు తక్కువా?” ప్రజల ప్రశ్న? రామారెడ్డి మండలంలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వారిని అత్యవసర వైద్య సేవల చట్రం నుంచి బయట పెట్టడం ఏ న్యాయం అని యువజన సంఘాలు, గ్రామ కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలోని ఇతర మండలాలకు 108లు, బైక్ అంబులెన్సులు ఇవ్వగలిగిన అదే ప్రభుత్వం, రామారెడ్డిని బేస్‌గా తీసుకొని ప్రత్యేక అంబులెన్స్, ఫ్రిజ్ శవపేటిక, వైకుంఠ రథం ఎప్పటి నుంచి అందుబాటులో పెడతారో తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు సవాల్ – డెడ్ బాడీ కాదు, లైవ్ పేషంట్‌ని కాపాడండి దవాఖాన ఆవరణలో మూలన పడి ఉన్న ఫ్రిజ్ శవపేటిక, చెత్తపాలు అయిన వైద్య సామాను కంటే, బతికే పేషంట్లను కాపాడే 108 సేవ ముఖ్యం అని ప్రజలు హెచ్చరిక ఇస్తున్నారు.రామారెడ్డి మండలానికి వెంటనే ఒక పూర్తి స్థాయి108 అంబు లెన్స్, అదనంగా ట్రైబల్ పల్లెల కోసం బైక్ అంబు లెన్సులు కేటాయించి, డ్రైవర్ (EMT )పోస్టులు భర్తీ చేసి, సేవలు ప్రారంభించే వరకు ప్రజా ఉద్య మం కొనసాగుతుందని గ్రామ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

అన్నమయ్య

చిట్వేల్లో గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్ విక్రయం – ఆరోగ్యానికి ముప్పు

చిట్వేలు పట్టణంలో కొన్ని దుకాణదారులు రెండు నెలల క్రితమే గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను నిర్లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు లేబుల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ తేదీని గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చల్లటి వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో శీతల పానీయాల వినియోగమే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటిది గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను సేవిస్తే జీర్ణ సమస్యలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్‌తో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీటిని తీసుకోవడం మరింత ప్రమాదకరమని తెలిపారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే దుకాణాలపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వినియోగదారులు కూడా కొనుగోలు ముందు ఎక్స్‌పైరీ తేదీని తప్పనిసరిగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అన్నమయ్య

చిట్వేల్లో గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్ విక్రయం – ఆరోగ్యానికి ముప్పు

చిట్వేలు పట్టణంలో కొన్ని దుకాణదారులు రెండు నెలల క్రితమే గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను నిర్లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు లేబుల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ తేదీని గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చల్లటి వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో శీతల పానీయాల వినియోగమే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటిది గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను సేవిస్తే జీర్ణ సమస్యలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్‌తో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీటిని తీసుకోవడం మరింత ప్రమాదకరమని తెలిపారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే దుకాణాలపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వినియోగదారులు కూడా కొనుగోలు ముందు ఎక్స్‌పైరీ తేదీని తప్పనిసరిగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అన్నమయ్య

చిట్వేల్లో గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్ విక్రయం – ఆరోగ్యానికి ముప్పు

చిట్వేలు పట్టణంలో కొన్ని దుకాణదారులు రెండు నెలల క్రితమే గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను నిర్లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు లేబుల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ తేదీని గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చల్లటి వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో శీతల పానీయాల వినియోగమే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటిది గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను సేవిస్తే జీర్ణ సమస్యలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్‌తో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీటిని తీసుకోవడం మరింత ప్రమాదకరమని తెలిపారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే దుకాణాలపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వినియోగదారులు కూడా కొనుగోలు ముందు ఎక్స్‌పైరీ తేదీని తప్పనిసరిగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

గ్రామాల అభివృద్ధియే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

గ్రామాల అభివృద్ధి శాఖ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని కేకే మహేందర్ రెడ్డి గారు పేర్కొన్నారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సాధించిన కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో గెలుపొందిన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని గ్రామస్థాయి నాయకులకు పూర్తి మద్దతు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బాట పట్టిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్ గారు వార్డు సభ్యులు సత్యం శేఖర్ గంధం రాజు యాదగిరి సత్యపాల్ గారు నేడు కేకే మహేందర్ రెడ్డి గారి సమక్షంలో వారి స్వగ్రామమైన నామాపూర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామ శాఖ అధ్యక్షులు దాకూరి మాధవరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ తోని గారి ఆధ్వర్యంలో స్పాట్లో చేరారు ఈ సందర్భంగా వారిని కేకే మహేందర్ రెడ్డి గారు వారికి శాలువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనపై వారికి అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణు గుగ్గిల శ్రీకాంత్ బైరినేని రాము సత్తు శ్రీనివాస్ గారు తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

కామారెడ్డి

అధికారుల నిర్లక్ష్యం!! దవాఖాన ఆవరణే చెత్త మైదానం

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో మూలన పడి కుళ్ళిపోతున్న శవ పేటిక సామాన్లు కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో శవపేటిక, ఇనుప గరిటెలు, కార్డ్బోర్డు పెట్టెలు గడ్డి మధ్య పడి ఉన్నాయి.రోగుల కోసం ఉండాల్సిన ఆవరణలోనే చెత్త పేరుకుపోయి, దవాఖాన ప్రతిష్టను, పరిశుభ్ర తను తుడిచిపెట్టేస్తోం ది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలపై మాత్రమే అంబు లెన్స్ సేవరామారెడ్డి మండలానికి 108 అత్యవసర అంబులెన్స్ సేవ అందుబాటులో ఉండాల్సినా, ప్రస్తుతం ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే విధం గా ఆ సదుపాయం కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 108 అంబులెన్సులు 24 గంటలు ఉచితంగా సేవ లు అందించాలన్నే ప్రభుత్వ నిబంధనలు కానీ అత్యవసర సమయంలో డీజిల్ పేరుతో డబ్బులు అడుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారుల కోసమే అంబులెన్స్… అన్న మండిపాటుదవాఖాన ముందు నిలిపిన అంబులెన్స్ సాధారణ పేద రోగికి అందని ద్రాక్షలా మారి, అధికారులు, ప్రభావశీలుల కోసం మాత్రమే కదులుతుందనే మాటలు మండలంలో వినిపిస్తు న్నాయి. మాకు హార్ట్ ఎటాక్ వస్తే పట్టించుకునే వా రు లేరు,పెద్దలకేం అయితే ఈ అంబులెన్స్ స్టార్ట్ అవుతుంది అని ప్రజలు విరుచుకుపడుతున్నా రు. డ్రైవర్ జీతం లక్షల్లో, సేవ మాత్రం బీటల్లో? తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్లకు నెలకు 15 నుండి 25 వేల వరకు జీతాలు ఇస్తున్న ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తున్న పరిస్థితిలో, రామారెడ్డి ప్రజలు తమ మండలంలో మాత్రం ఒక అంబు లెన్సు డ్రైవర్ 35 వేల వరకూ ఖర్చు పెడుతూ నిరు పేదలకు సేవ చేయడం లేదని ఆరోపిస్తున్నా రు.పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూపాయలు, ఆరోగ్య బడ్జెట్ ద్వారా వస్తున్న నిధు లు చివరికి శవపేటికల లా మూలన పడిపోవడం చూస్తుంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఓపెన్ ఛాలెంజ్108 అంబులెన్స్ సేవ ఉచితం, ఎవరైనా కాల్ చేసుకునే హక్కు ఉందని చెప్పే ప్రభుత్వ నియమాలు అమలు అవుతున్నాయా లేదా స్వయంగా వెళ్లి చూడాలని జిల్లా మెడికల్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ప్రజల సంఘాలు సవాల్ విసురుతున్నాయి.రా మారెడ్డి సర్విస్ అంబులెన్సు ను విధిగా నూతనం గా ప్రవేశ పెట్టాలి, శవపేటిక సామాన్లు, చెత్త తొల గింపు, అంబులెన్స్ నిజంగా పేదలకు అందుబాటు లోకి వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.