Tuesday, 28 April 2026

Blog

E-పేపర్

గుండోజీ రంగాదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నూతన కార్యవర్గ ఎన్నిక

*గుండోజీ రంగాదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నూతన కార్యవర్గ ఎన్నిక* పున్నమి న్యూస్ ప్రతినిధి 02 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బండరావిరాల గ్రామంలో *”గుండోజీ రంగదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్”* నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించబడింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధి, విద్య మరియు సామాజిక సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ క్రింది సభ్యులను వివిధ బాధ్యతలకు ఎంపిక చేశారు. *నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:* సలహాదారులు: కోదాసు శ్యామ్ సుందర్, నెమరగోముల ముత్యాలు, ఏర్పుల నవీన్ కుమార్. అధ్యక్షులు : ఏర్పుల నరేష్ ప్రధాన కార్యదర్శి: కొత్త ప్రశాంత్ గౌడ్ ఉపాధ్యక్షులు: కందికంటి నిఖిల, నెమరగోముల కరుణ్, ఒంగూరి రమేష్. కోశాధికారి: కందికంటి మధు సహయ కార్యదర్శులు: పిల్లి పూజిత, ఏమ్ముల శివ శంకర్. ఈ సందర్భంగా సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని, నూతన కార్యవర్గం గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ట్రస్ట్ ద్వారా విద్యా పరమైన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఏర్పుల నరేష్ మరియు ఇతర సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి సర్పంచ్ కి, అడ్వైజర్లకు మరియు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా విద్యార్థులకు విద్యనందిస్తున్న ట్యూటర్లను ట్రస్టు సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్ , వార్డు సభ్యులు గుండ్ల భవాని – శివ ముదిరాజ్ , ఏర్పుల హరికృష్ణ గ్రామ యువకులు కందికంటి కృష్ణ , ట్యూషన్ పాయింట్ కమాండర్లు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాదిగ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేస్తాం

మాదిగ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేస్తాం ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే నేడు దుత్తలూరు టౌన్ లోని ఏసి కాలనీ నందు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం కొవ్వత్తులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ పోల్గొని వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమరుల త్యాగ ఫలితమేనని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అతి తక్కువ మందితో ప్రారంభమైన ఉద్యమం నేడు ప్రధానమంత్రినే కదిలించే విధంగా తయారైందని తెలిపారు అనేక ఒడిదుడికలతో కష్టనష్టాలతో ఉద్యమం ముందుకు సాగి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించేంతవరకు కొనసాగిందన్నారు అమరవీరుల త్యాగఫలితంగానే వర్గీకరణ జరిగిందని తెలిపారు ఈ వర్గీకరణతో నేడు డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు పొందగలిగామని అదే విధంగా భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం చేపట్టే విధంగా మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ముందుకు సాగుతామని వర్గీకరణ కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఆశయాలతో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్రంలోని మాదిగ ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఎంతో పుణ్యాత్ములు అన్నారు వారి ఆశయాలను. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల నాయకులు సొంగ రవి మాదిగ,యనమల గిరి మాదిగ,వడ్లపల్లి కల్యాణ్ మాదిగ,యనమల ఉపేంద్ర, ఎ పాపయ్య,ప్రసన్న, ఏడుకొండలు మాదిగ విధ్యార్ధులు మాదిగ పెద్దలు యువకులు తదితరులు అధికసంఖ్యలో పొల్గన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు

చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు నెల్లూరు లోని ప్రభుత్వ హాస్పిటల్ఈ రోజు ఉదయం 11 గంటలకు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్న, చిన్నా జనసేన వారి అబ్బాయిని, కుటుంబాన్ని, పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం అందజేసిన జనసేన నాయకులు, నూనె మల్లికార్జున యాదవ్, పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, ఆఫీసు ఇంచార్జ్ జమీర్, ఏటూరి రవికుమార్, గుర్రం కిషోర్, పవన్ యాదవ్ కపాటి పాలెం సనత్, మరియు వీర మహిళలు ఎంఎస్ నందిని, లత, ప్రమీల, వెంకటసుబ్బమ్మ, భూలక్ష్మి… చిన్నా గారి అబ్బాయి త్వరగా కోలుకోవాలని ఆశీస్సులు అందచేశారు. జనసేన పార్టీ ఆఫీస్ గోమతి నగర్ నెల్లూరు జిల్లా….

విశాఖపట్నం

తక్షణమే ప్రహరీ నిర్మాణం చేపట్టండి

అధికారులకు పల్లా ఆదేశం విశాఖపట్నం, మార్చి 1, పున్నమి ప్రతినిధి. అండమాన్ కొండయ్యవలస కొలనీ వాసుల ఆరాధ్య దేవత బంగారమ్మ ఆలయ ప్రాంగణం లో ప్రహరీ గోడ నిర్మాణం అడ్డుకుంటున్న వారిపై స్థానిక యం ఎల్ ఏ పల్లా శ్రీనివాస రావు కి గ్రామస్తులు నగరం లో ఉన్న స్వగృహం లో కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన తక్షణమే స్పందించి అక్రమణ దారుడ్ని అడ్డు పెట్టుకుని ప్రహరీగోడ నిర్మాణం ను అడ్డుకునే వారికి హెచ్చరించి, పనిని నిలుపుదల చేసిన అధికారులకు పనిని వెంటనే మొదలు పెట్టి పూర్తి చెయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా బంగారమ్మ కొలనీ వాసులు వందలాది మంది యం ఎల్ ఏ పల్లా శ్రీనివాస రావు గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పామల వసంతరావు, మదాసు రామక్రిష్ణ, మదాసు గణేష్, కలిమి సుధాకర్, బలిరెడ్డి అప్పారావు, నారాయణరావు, విందుల పాపారావు, జోగారావు, రాజు, రాజేష్, ఇందల అశోక్, శ్రావణ్ కుమార్, సూర్నపూడి నూకరాజు, ఎస్ నారాయణ, జాజుల లక్ష్మి, మంగమ్మ, జయ, వరలక్ష్మి. ఇందుమతి, నీలవేణి, లుకలాపు తవిటమ్మ, కొవ్వాడ అప్పలనసరమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం అర్బన్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గా ఆచంటి కోటేశ్వరరావు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారతీయ జనతా పార్టీ ఖమ్మం అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి గా యువకుడు, ఉత్సాహ వంతుడు, మృదు స్వభావి అయినా ఆచంటి కోటేశ్వరరావు నియమితులు అయ్యారు. అర్బన్ మండల అధ్యక్షులు వంకదాని రామకృష్ణ నియామక పత్రం అందజేశారు. ఆచంటి కోటేశ్వరరావు నియామకం పట్ల పలువరు సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేసారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“*కుమ్మర మాన్యం కబ్జా*.

“*కుమ్మర మాన్యం కబ్జా*. *భూబకాసురుల రాక్షస హస్తాలలోకుమ్మరకుంట..* *ఈ బూర్జువా పార్టీల నాయకుల్లో* *పేదలకు న్యామెక్కడ* *వెల్లూరు సుమన్ ప్రజాపతి…ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.* *మర్రిపాడు. పున్నమి ప్రతినిది* మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో 293 గల సర్వే నంబర్ గల 3: 32 ఎకరాల కుమ్మర మాన్యాన్ని అదే గ్రామానికి చెందిన అగ్ర కుల నాయకులు కబ్జా చేసి తమ పేర్లు మీద ఆన్లైన్లో చేసుకున్నారని తమకు న్యాయం కావాలని కుమ్మరి మాన్యాన్ని తమకు ఇవ్వాలని స్థానిక రెవిన్యూ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.వెల్లూరు సుమన్ ప్రజాపతి అర్జీ సమర్పించారు. 70 సంవత్సరాలకు పైగా ఉన్న 3 ఎకరాల కుమ్మరకుంట, భూబకాసురుల రాక్షస హస్తాలలో చిక్కుకుందని,ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరగక పోతే పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన, ఈ సమస్యపై కూడా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మర్రిపాడు మండల రెవెన్యూ తహసీల్దార్ ఈ విషయం ఫై క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్నట్లు తెలియజేసారు. . Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“*కుమ్మర మాన్యం కబ్జా*.

*భూబకాసురుల రాక్షస హస్తాలలోకుమ్మరకుంట..* *ఈ బూర్జువా పార్టీల నాయకుల్లో* *పేదలకు న్యామెక్కడ* *వెల్లూరు సుమన్ ప్రజాపతి…ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.* *మర్రిపాడు. పున్నమి ప్రతినిది* మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో 293 గల సర్వే నంబర్ గల 3: 32 ఎకరాల కుమ్మర మాన్యాన్ని అదే గ్రామానికి చెందిన అగ్ర కుల నాయకులు కబ్జా చేసి తమ పేర్లు మీద ఆన్లైన్లో చేసుకున్నారని తమకు న్యాయం కావాలని కుమ్మరి మాన్యాన్ని తమకు ఇవ్వాలని స్థానిక రెవిన్యూ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.వెల్లూరు సుమన్ ప్రజాపతి అర్జీ సమర్పించారు. 70 సంవత్సరాలకు పైగా ఉన్న 3 ఎకరాల కుమ్మరకుంట, భూబకాసురుల రాక్షస హస్తాలలో చిక్కుకుందని,ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరగక పోతే పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన, ఈ సమస్యపై కూడా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మర్రిపాడు మండల రెవెన్యూ తహసీల్దార్ ఈ విషయం ఫై క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్నట్లు తెలియజేసారు. . Uploaded Video:

సాహితీ

అసహజం మాటున నిజం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

నేటి సామాజిక, ఆర్థిక పర్యావరణ కాలుష్య ప్రభావంతో మారిపోతున్న మనిషి మనోదృశ్యరూపకం … ఈ కవిత భౌతిక అకర్షణను ప్రేమ అంటున్నారు గాని కన్నవారి ప్రేమను అర్థం చేసుకోలేకున్నారు. సారం లేని సహజీవనాన్ని సంసారం అంటున్నారు గాని సర్వం అర్పించే కుటుంబ బంధాలు భారమంటున్నారు. ఆస్తుల పంపకాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు గాని ఉమ్మడికుటుంబ విలువలు మరచిపోతున్నారు. సంస్కార రహిత సరదాలను సంస్కృతి అంటున్నారు గాని సామాజిక ఆదర్శాలను అనగదొక్కుతున్నారు. గ్రాఫిక్ జిమ్మిక్కుల చిత్రాలకు జైకొడుతున్నారు గాని జీవన ఆరాటానికై పోరాటాలకు వెల కట్టలేకున్నారు. డ్రమ్ముల దరువులమ్యాజిక్తో చిందులేస్తున్నారు గాని సంగీత ప్రవాహమైన ప్రకృతిని ఆస్వాదించలేకున్నారు. ఆస్తులంతస్తులున్నవాన్నే గొప్పవాడంటున్నారు గాని ఆప్యాయతానురాగాలను గాలికొదిలేస్తున్నారు. మందు పార్టీలిచ్చే వాడినే స్నేహితుడంటున్నారు గాని ముందుతరాలకు మార్గం చూపేవాడిని పిచ్చోడంటున్నారు. నిజాయితీపరులను అసమర్ధులంటున్నారు గాని నటించి నమ్మించే వారిచే మోసపోతున్నారు. లాభం ఏదైనా ఎగబడుతున్నారు గాని నిజం పలికితే మాత్రం పగబడుతున్నారు. భుక్తి కోసం భవిష్య విద్య అంటున్నారు గాని స్వలాభ కాంక్షతో సంఘ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు ప్రశాంతతలేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. జనజీవన పరమార్ధం సుఖవంతం దైవం గా భావిస్తే ధర్మతత్వం వాస్తవిక దారిలో జీవితం అవని పై జనహితం. అసహజం మాటున నిజం నేటి జన జీవన సమాజం పరిశీలనే మనోనేత్ర తేజం

తిరుపతి

శ్రీవారిని దర్శించుకున్న గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

పున్నమిప్రతినిధి, 01 మార్చి 2026 తిరుమల తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ కి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఆలయ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అటు తరువాత టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గౌ,భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం గౌ, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరహస్వామి వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు లో జనసేన ఉద్యమి కార్యక్రమం పాల్గొన్న ఉదయగిరి ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు

​దుత్తలూరు 1-3-2026 స్థానిక నందిపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. : కొట్టె వెంకటేశ్వర్లు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ‘ఉద్యమి’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు,నియోజకవర్గ అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, మార్పు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ​”ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే జనసేన లక్ష్యం. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తాం.” – కొట్టె వెంకటేశ్వర్లు ​కార్యక్రమంలో పాల్గొన్న వారు: ​ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల కన్వీనర్స్థా దుంపలగడ్డ రవి గారూ, మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.