Tuesday, 28 April 2026

Blog

ఖమ్మం

బంజారా న్యాయవాదులతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ భేటీ – సమస్యలపై చర్చ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ జిల్లా బార్ కౌన్సిల్‌కు చెందిన బంజారా న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బంజారా న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత సమస్యలు, అలాగే స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సమాజానికి న్యాయం జరిగే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హుస్సేన్ నాయక్ సమస్యలను పరిశీలించి తగిన స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో న్యాయ వాదులతొ పాటు బీజేపీ నాయకులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు కోటేశ్వరరావు, జాటోతూ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్లకు ఢిల్లీ దృష్టి: జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ – అధికారులపై కఠిన చర్యల హెచ్చరిక. కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రాక తొ మొదలైన అధికారులలో వణుకు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితుల సమస్య ఇప్పుడు జాతీయ స్థాయికి చేరుకుంది. దశాబ్దాలుగా సొంత స్థలం కోసం పోరాడుతున్న పేదల వేదనపై స్పందించిన జాతీయ స్థాయి వ్యవస్థ రంగంలోకి దిగడంతో స్థానిక అధికార యంత్రాంగంలో కలకలం రేగింది. బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటించడం పరిస్థితిని మలుపుతిప్పిన ఘటనగా మారింది. ఆయన పర్యటన సందర్భంగా రెవెన్యూ వ్యవస్థ స్పందనపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధితుల వేదన – కమిషన్ స్పందన వెలుగుమట్లలో భూదాన్ భూముల వ్యవహారంలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమాల ఆరోపణలు, ఇళ్ల కూల్చివేతలతో ఏర్పడిన మానవీయ సంక్షోభం కమిషన్ దృష్టికి వెళ్లింది. బాధితులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నారులకు కనీస సదుపాయాలు కూడా అందని పరిస్థితి ఉందని వివరించడంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో కమిషన్ సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు కోరింది. వారం గడువు – నివేదిక ఆదేశం వెలుగుమట్ల ఘటనలపై సమగ్ర నివేదికను ఒక వారం రోజుల్లో సమర్పించాలని కమిషన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బాధితులకు జరిగిన అన్యాయం, భూముల కేటాయింపులో జరిగిన ప్రక్రియ, కూల్చివేతల పరిస్థితులు వంటి అంశాలపై పూర్తి వివరాలు అందించాలని సూచించింది. నివేదికలో నిర్లక్ష్యం, అస్పష్టత లేదా వాస్తవాలకు విరుద్ధమైన సమాచారం ఉంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిషన్ అధికారాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్‌కు విస్తృతమైన విచారణాధికారాలు ఉన్నాయి. అవసరమైతే సంబంధిత అధికారులను పిలిపించి వివరణ కోరే అధికారం కమిషన్‌కు ఉంది. బాధితుల పట్ల నిర్లక్ష్యం లేదా వివక్ష తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు సూచించే అవకాశముంది. ప్రత్యేకించి షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గాల హక్కులకు భంగం కలిగితే, సంబంధిత చట్టాల కింద విచారణ జరిపే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికార యంత్రాంగంలో ఆందోళన కమిషన్ జోక్యం నేపథ్యంలో ఖమ్మం జిల్లా అధికారుల్లో అప్రమత్తత పెరిగింది. భూదాన్ భూముల వ్యవహారంపై పూర్తి సమాచారం సేకరణ, పత్రాల పరిశీలన, విధానపరమైన అంశాలపై సమీక్ష మొదలైన ప్రక్రియలు వేగవంతమయ్యాయి. పరిపాలనా వ్యవస్థలో బాధ్యత, పారదర్శకతను నిర్ధారించే దిశగా కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాధితులకు ఆశ వెలుగుమట్ల బాధితుల సమస్యపై జాతీయ స్థాయిలో స్పందన రావడం వారికి కొంత న్యాయం దిశగా ముందడుగుగా భావిస్తున్నారు. గతంలో స్థానిక స్థాయిలో పరిష్కారం దొరకని సమస్య ఇప్పుడు కేంద్ర దృష్టికి వెళ్లడంతో పరిణామాలు మారే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలతో వెలుగుమట్ల భూదాన్ వివాదం ఇక సాధారణ పరిపాలనా అంశం కాకుండా, రాజ్యాంగబద్ధ సంస్థల పర్యవేక్షణలోకి వెళ్లిన కీలక వ్యవహారంగా మారింది.

ఖమ్మం

15లోపు పట్టాలు – ఇందిరమ్మ ఇళ్లు: వెలుగుమట్ల నిర్వాసితులకు మంత్రి పొంగులేటి భరోసా

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం: వెలుగుమట్ల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ.5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆదివారం ఖమ్మం ఐడీఓసి వేదికగా జరిగిన బాధితుల ముఖాముఖి సమావేశంలో మంత్రి పాల్గొని వారి సమస్యలను స్వయంగా విన్నారు. అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వివరించగా, “మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని మంత్రి భరోసా ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దళారుల మోసానికి గురై రూ.30 వేల నుంచి రూ.8 లక్షల వరకు అప్పులు చేసి స్థలాలు కొనుగోలు చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దళారులపై కఠిన చర్యలు తీసుకుని, వారి నుంచి డబ్బులు రికవరీ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత తొమ్మిది నెలలుగా కరెంటు, నీరు వంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొనగా, కొత్త కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గాల వారీగా గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రతిపక్షాలపై మంత్రి ఘాటుగా స్పందించారు. పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్నప్పుడు పేదల సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శక సర్వే ద్వారా అర్హులైన వారినే ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 15న తానే స్వయంగా వచ్చి ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్లు అందజేస్తానని మంత్రి వెల్లడించారు. అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Featured

ఏఎన్ఎంలకు పదోన్నతులపై ఏపీ హంస ఆవేదన

01.03.2026 నెల్లూరులో ఓల్డ్ వెన్నెల ఐస్‌క్రీమ్‌లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్ రావు ఏఎన్ఎంలకు 28 ఏళ్లుగా పదోన్నతుల జాప్యం జరుగుతోందని పేర్కొంటూ కొత్త పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జంగా శ్రీనివాసులును జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తిరుపతి

వాయులింగేశ్వరుని సేవలో త్రిపుర ముఖ్యమంత్రి

శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనార్ధం త్రిపుర ముఖ్యమంత్రి మనీష్ షా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల, ప్రత్యేక దర్శనం చేయించి దర్శనానంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

టిటిడి ప్రతిష్టను దిగజార్చాలన్నదే వైకాపా లక్ష్యం- తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి నియోజికవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు టీటీడీ పాలకమండలి అధ్యక్షులు బీ. ఆర్. రెడ్డి పై జరుగుగున్న అసత్యప్రచారంపై వ్యతిరేకిస్తూ ఆదివారం నాడు పత్రిక ప్రకటన ద్వారా వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా తెదేపా రాష్ట్ర బిసి విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, మాట్లాడుతూ…. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల చేత పూజలందుకుంటూ, హిందువుల కోర్కెలు తీర్చే కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ధార్మిక సంస్థ అయిన టిటిడి పైన జగన్ ముఠా పగబట్టిందని ఆరోపించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బి.ఆర్.నాయుడును వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసి, తద్వారా టిటిడి ప్రతిష్టను దిగజార్చాలన్న లక్ష్యంతో ఈరోజు కొందరు బి.ఆర్.నాయుడు పైన ఫేక్ వీడియోలు రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసిపి ప్రభుత్వ పాలనాకాలంలో టిటిడి ఛైర్మన్ లుగా పనిచేసిన వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి లు తిరుమల తిరుపతిలలో కొలువైయున్న దేవాలయాలలో సాగించిన అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజల ముందుకు తీసుకొని వచ్చారన్న కక్షతో ప్రస్తుత టిటిడి ధర్మకర్తల మండలిపైన జగన్ రెడ్డి ముఠా అనైతిక చర్యలకు పాల్పడుతూ, దుశ్చర్యలకు దిగుతున్నదని కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకొని నకిలీ వీడియోలు, ఫోటోలను సృష్టించి టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పైన మానసికంగా దాడి చేసి, ఆయన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటం దుర్మార్గపు చర్య, ఇదేవిధంగా ఇటీవల సియం చంద్రబాబు నాయుడు పైన కూడా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ట్రోల్ చేయడం వైసిపి వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం మన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వైసిపి ప్రభుత్వ పాలనాకాలంలో టిటిడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టిన జగన్ బృందం వరుసగా టిటిడికి చెందిన గోశాల పైన, క్యూలైన్ల పైన, వైకుంఠ ఏకాదశి ముందు టికెట్ జారీ ప్రక్రియ పైన, ధర్మకర్తల మండలి సభ్యుల పైన దుష్ప్రచారానికి దిగుతూ ఈరోజు ఛైర్మన్‌గా ఉన్న బి.ఆర్.నాయుడు పైనే అనైతిక దాడులకు తెగబడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఐకమత్యంతో వన్నెకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ గుడి కళ్యాణమండపంలో వన్నెకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాన్ని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో వన్నే కుల క్షత్రియ నాయకులు మాట్లాడుతూ….వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఆద్వర్యంలో ఈనెల 8 వ తేదీ తిరుపతిలో జరుగు వన్నెకుల క్షత్రియ యువతి యువకుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్గదర్శకంగా ఉండాలని, ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. మనమందరం రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మనం ఎన్నికల్లో పార్టీ తప్ప మిగతా అప్పుడు అంతా ఏకతాటిపై ఉండి ఐకమత్యంతో మన కులంలో ఉన్నటువంటి అందరిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా రేపు రాబోవు రోజుల్లో మన వన్నెకుల క్షత్రియులకు కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం ద్వారా కూడా స్థలాన్ని, నిధులను సాధించి పూర్తి చేసి అది మన కులస్తులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఐక్యమత్యంతో ఒక రాజకీయమే కాకుండా సామాజిక దృక్పథంతో మన యువకులు బాగా చదువుకొని వారు ముందుకు పోయే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదో తారీకు జరుగుతున్నటువంటి సమావేశాన్ని పార్టీలకతీతంగా అందరూ కూడా విజయవంతం చేసి మనం ఇంకా కూడా ముందుకు పోవాలని కోరారు.అనంతరం వధూవరుల పరిచయ వేదిక సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించారు. వన్ని కుల క్షత్రియులు ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి వారి గురువారెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి రాష్ట్ర ఎన్నికల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు మిన్నల్ రవి,తేజోవతి, బాల సుబ్రహ్మణ్యం, మునిరత్నం, నియోజకవర్గం వన్ని కుల క్షత్రియ నాయకులు సత్రవాడ ప్రవీణ్,రామారావు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు రెడ్డి, వడ్లతంగల్ బాలాజీ రెడ్డి, చెంజి రత్నం రెడ్డి, ఆర్కాడు ముత్తు, జనార్దన్ రెడ్డి, దొరై రాజు రెడ్డి,ముని రెడ్డి, పెరుమాళ్ రెడ్డి,సోయిండి ఈశ్వర్ రెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, మస్తాన్ రెడ్డి, ఎమ్మెస్ రెడ్డి నాగరాజా,గోపాల్ రెడ్డి,చంద్రారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చంద్రారెడ్డి, గుణ, ప్రతాపరెడ్డి, భయ్యా రెడ్డి,సుబ్రహ్మణ్యం రెడ్డి, శేషాద్రి,మునిరాజా రెడ్డి, శంకర్ రెడ్డి,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ సత్య సాయి మందిరంలో ఘనంగా టైలర్స్ దినోత్సవం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీదిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సుమారు 20 మంది టైలరింగ్ ని నేర్చుకుంటున్నారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమం అనంతరం టైలర్ మాస్టర్ ఎం సరితకు సంస్థ తరఫున సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పాండురంగయ్య, కమిటీ సభ్యులు మురుగేషన్, సుబ్బయ్య ,లలితమ్మ, సుబ్బమ్మ , వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ సేవనాధం ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) శ్రీ సేవనాధం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అరుంధతి వాడలోని శ్రీ శ్రీ శ్రీ మాతమ్మ దేవాలయ నూతన నిర్మాణానికి రూ.50,000లు ఆలయ కమిటీకి అందజేశారు. చేంద్రమౌళి నగర్‌కు చెందిన గడ్డం పద్మ చికిత్స కోసం రూ.10,000లు సహాయం చేశారు. బద్దెవోలు రోడ్డులో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన రత్నయ్య కుటుంబానికి అవసరమైన ఇంటి సరుకులు, వంట పాత్రలు, నగదు అందించారు. కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సూర్యాపేట

సూర్యాపేట లో మొబైల్ యూనియన్ ఎన్నికలు

సూర్యాపేట : సూర్యాపేట లొ మొబైల్ షాప్స్ అసోసియేషన్ యూనియన్ ఎన్నికలు కిరాణా అండ్ ఫాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ బిల్డింగ్ యందు అందరి సభ్యుల సమక్షంలో అధ్యక్షులుగా సయ్యద్ గౌస్ పాషా , ప్రధాన కార్యదర్శిగా నర్సింగ్ సురేష్ ,కోశాధికారిగా మాడుగుల జయప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బత్తుల శశిధర్,జాల గిరిప్రసాద్, ఉప్పల శ్రవణ్,గొడిశాల విజయ్,నెమ్మది బాబు , చల్లా శశిధర్,సుంకర నరేష్ ,తాటికొండ రమేష్ రెడ్డి ,జాల శ్రీకాంత్ ,సతీష్ రెడ్డి , బద్రి,నాని, బెలీదే ముకుందం, యర్రమల్ల ప్రసాద్, బెలిదే నాగేందర్ ,సందీప్ , పవన్,ఖదీర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.