Friday, 13 March 2026

Blog

విశాఖపట్నం

జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల

జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల నియామక పత్రాలు. * ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడపాలి . *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * విశాఖ నగరంలో గల ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి పొరుగు సేవల ద్వారా సుముఖ స్థానం కల్పిస్తున్నారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అయిన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని 20 మంది ట్రాన్స్ జెండర్స్ కు జీవీఎంసీ పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులుగా నియమామక పత్రాలను శంఖబ్రత భాగ్చి తో కలిసి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నగరంలో ఉన్న ట్రాంజెండర్స్ భిక్షాటన కాకుండా గౌరవం ప్రియతమైన జీవనాన్ని గడిపేందుకు వారికి ఉద్యోగాలు కల్పిస్తూ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ చొరవతో 20 మంది ట్రాన్స్ జెండర్లకు మిషన్ జ్యోతిర్గమయ ద్వారా పొరుగు సేవl పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమిస్తూ నియామక పత్రాలను అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లను అందరిలో గౌరవప్రదంగా ఉండేలా గౌరవప్రదమైన జీవితం జీవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు భిక్షాటన , వివాదాలకు జోలికి పోకుండా గౌరవప్రదంగా బతకాలని ఆయన తెలిపారు. నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కృషితో 20 మందికి పొరుగు సేవల పద్ధతిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగ కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

ఏపీఈపీడీసీఎల్ కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

*ఏపీఈపీడీసీఎల్ కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం సాగర్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విశాఖ ఉత్తర శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సాయి తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం కేవలం భద్రత మాత్రమే కాదని, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తించి సేవాభావంతో పని చేయాల్సిన కర్తవ్యమని అన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో పని చేయడం అంటే ప్రజల దైనందిన జీవితాలకు నేరుగా సంబంధం ఉన్న కీలక బాధ్యత అని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పని చేయాలని సూచించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన వారు తమ కుటుంబాలకు ఆసరా కావడమే కాకుండా, సమాజానికి కూడా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో గాజువాక నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై పల్లా శ్రీనివాసరావు అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఉపకేంద్రాల పనితీరు, పెదగంట్యాడ విద్యుత్ ఉపకేంద్రానికి సంబంధించిన అంశాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు, అవసరమైన చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల మార్పిడి, భూగర్భ కేబులింగ్ పనులు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. గాజువాకలోని పలు ప్రధాన రహదారుల్లో చేపట్టిన భూగర్భ కేబులింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ప్రమాదాల వల్ల చోటుచేసుకుంటున్న దుర్ఘటనలను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, కరెంట్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పల్లా గారు ఆదేశించారు. అపార్ట్‌మెంట్లకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు, పరిహార అంశాలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, చిన్న లోపాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, విద్యుత్ శాఖలోని సమస్యలను దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆర్ ఎస్ ఎస్ దేశానికి పట్టిన విషం సినీ నటుడు ప్రకాష్ రాజ్

ఆర్ ఎస్ ఎస్ దేశానికి పట్టిన విషం పోరాటాలతో కార్పొరేట్ల దోపిడీ నియంత్రణ సీఐటీయూ నాకిష్టమైన సంఘం సినీ నటుడు ప్రకాష్ రాజ్ *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి:- * “100 ఏళ్ళ ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ నుంచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారి ఒక్క పేరు చెప్పగలరా.? ఈ వందేళ్లలో చెడ్డీ ల నుంచి ప్యాంటు లకు వచ్చారు తప్ప సాధించింది ఏమీ లేదని ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ ఎద్దేవాచేశారు. కమలం పువ్వు కింద ఉన్న విషపు వేళ్లను చూస్తే ఆర్ ఎస్ ఎస్, బీజేపీ ఈ దేశానికి పట్టిన విషం. అని అన్నారు. భారతదేశం సరోవరం అయితే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్ ఎస్ ఎస్ అని వ్యాఖ్యానించారు. సీఐటీయూ అలిండియా మహాసభలు 31 నుంచి జనవరి 4వరకూ విశాఖ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న సందర్బంగా 27న శ్రామిక్ ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖకు శనివారం విచ్చేసిన అయన దసపల్ల హోటల్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.. కార్మికుల కోసం పోరాడే వారంటే నాకెంతో ఇష్టం. సీఐటీయూ పిలవగానే వచ్చేశాను అని తెలిపారు. నేను నటుడుని మాత్రమే కాదు. అభ్యుదయ ఆలోచనలు ఆందోళనలకు అండగా ఉంటాను అన్నారు. సీఐటీయూ వంటి గొప్ప పోరాట సంఘాలు పిలిస్తే రావడం నా బాధ్యత… చెమట చుక్కకి ఓటమి ఉండదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించడంపై స్పందిస్తూ అమ్మేవాడు ఒకడు కొనేవాడు ఒకడు.. కళ్ళముందే వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటె ప్రభుత్వాన్ని నడిపేవారే అమ్ముడు పోయారు కాబట్టి అని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా విమాన యాన రంగం పెద్దోళ్ళు చేతుల్లో ఉండడం వీరికి ప్రభుత్వాలు అమ్ముడు పోవడం కల్లారా చూసామని విమర్శించారు.. ఒకవేళ ప్రశ్నిస్తే పోలీసులు రాజ్యాంగ యంత్రం వారి చేతిలో ఉన్నాయి కదా పిడి చట్టాలు పెడతారు, స్థాన్ స్వామికి స్ట్రా కూడా ఇవ్వరు, గౌరీ లంకేశ్ ని చంపిన వారు బెయిల్ పై బయటకి వచ్చేస్తారు.. వారికి ప్రశ్నించే వారు వుండకూడదు. ప్రజలు నిరంతరం ప్రశ్నించడమే మార్గమన్నారు. మెడికల్ కాలేజీలని ఏపీలో పి పి పి పేరుతో అమ్మడం ప్రజలకు నష్టం అని, అసలు ప్రజలు ఎన్నికల్లో ఎవరిని బల పరచాలో నేర్చుకోవాలన్నారు.. కర్ణాటక లోని బెంగళూరు లో 1007 ఎకరాల వ్యవసాయ భూమిని ఇది వరకు ఒకసారి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకున్నపుడు ప్రజలంతా కలిసి పోరాడి అప గలిగారన్నారు. మీ డియా కూడా అమ్ముడు పోయిందని ఎంతో కొంత ఇండిపెండెంట్ మీడియా పని చేస్తుందన్నారు. సినిమాలు మీడియా ద్వారా 90శాతం చెత్తను పాలకులు ఎక్కిస్తున్నారని కేరళ ఫైల్స్ అనే సినిమా తీయించి స్వయంగా మోడీ యే రూ కోట్లు ఖర్చు చేసి సినిమా చూడాలనే కాంపెయిన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.. అబద్దాలతో భయాన్ని కలిగించే సామ్రాజ్యాన్ని దేశంలో పాలక శక్తులు నిర్మిస్తున్నాయని ప్రజలు అనునిత్యం పోరాడాలని ఈ వ్యవస్థ ను అర్ధం చేసుకుని పోరాడేలా సీఐటీయూ వంటి సంస్థ లు చేస్తున్నాయని అభినందించారు.. శివాజీ మాటలపై ఆగ్రహం ఆడవాళ్ళ పై శివాజీ మాటలు అహంకారం తో కూడినవి అని అన్నారు. వేదికల మీద మాట్లాడేప్పుడు ఒళ్ళు, భాష జాగ్రత్తగా ఉండాలన్నారు.అనసూయకు నా మద్దతు….అని ప్రకాష్ రాజ్ అన్నారు..మహిళలను కు సంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ళ అవయవాలు మాత్రమే కనిపిస్తాయి…..అన్నారు ఐ బొమ్మ రవి దొంగ తనం చేశాడు…. దొంగ…దొంగే….? అంటూ స్పందించారు.. టికెట్ధ ధరలు పెరిగితే ప్రజలు సినిమాలు చూడొద్దు అని సలహా ఇచ్చారు. మావోయిస్టుల ఎన్ఈకౌంటర్ పై మాట్లాడుతూ.. వారు ఎందుకు ఆలా మారారో తెలుసుకుని చర్చలు జరపాలి తప్ప టెర్రరిస్ట్ ల మాదిరి కాల్చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు.. ఈ సమావేశం లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ నరసింగరావు, అధ్యక్షులు మాజీ ఎమ్ ఎల్ ఏ ఎమ్ ఏ గపూర్, అలిండియా సీఐటీయూ నాయకులు కందారపు మురళీ పాల్గొన్నారు.

విశాఖపట్నం

నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000రు వెంటనే చెల్లించాలి*

‎ *నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000రు వెంటనే చెల్లించాలి* ‎ ‎ *జనవరి 1 ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.* ‎ ‎ *అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ వద్ద భిక్షాటన కార్యక్రమం*. *‎విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * ‎ ‎ *ఈ సందర్భంగా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్చుత రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3 వేల రూపాయల చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటికీ నిరుద్యోగ భృతి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెల గడుస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. నిరుద్యోగులకు నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఆవకాయిక ఫెస్టివల్ కి 5 కోట్ల రూపాయలు, సోషల్ మీడియా పేరుతో వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని నిరుద్యోగులకు మాత్రం నిధులు లేవని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటమైన ప్రకటనలు ఇస్తున్న ఈ 19 లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీసీ ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసే ఉన్న నిరుద్యోగులకు నేటి వరకు రుణాలు మంజూరు చేయలేదని, 2025 -26 సంబంధించిన స్వయం ఉపాధి పథకం రుణాలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని బీసీ కార్పొరేషన్ అధికారులు నిలిపివేయడం జరిగిందని చెప్పారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి నెలలో పెద్ద ఎత్తున యువకులను సమీకరించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధు రెడ్డి, కెల్లా రమణ, రాజు, మురళి లక్ష్మణ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*

విశాఖపట్నం

క్లాప్ వాహనాలు నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాలు సేకరించాలి – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి

క్లాప్ వాహనాలు నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాలు సేకరించాలి – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి *: ప్రతి ఇంటి నుండి నిత్యం క్లాప్ వాహనాలు వ్యర్థాలను సేకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నార్త్ జోన్ 24వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సౌత్ జోన్ పరిధిలో కె.జి.హెచ్. వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను అయా జోనల్ కమీషనర్లు రాము, మల్లయ్య నాయుడు తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ క్లాప్ వాహనాల ద్వారా వ్యర్ధాలను ప్రతిరోజు ఇంటింటి నుండి సేకరించాలని జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం ప్రదర్శించరాదని, వార్డులలో పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వెను వెంటనే ఆ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కి తరలించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పనిముట్లు, యూనిఫామ్ లు అందించారా అని ఆరా తీశారు. క్లాప్ వాహనాలు రోజు ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలు సేకరించి తరలిస్తున్నారని, ఒక్కొక్క క్లాప్ వాహనం పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని క్లాప్ వాహనాల డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే వీధుల్లో ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు వ్యర్ధాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో డంపర్ బిన్నులు నిండి వ్యర్ధాలు అధికంగా కింద పడుతున్నాయని, వ్యర్ధాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాలుగవ జోన్ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఫలహారం భుజిస్తున్న వారిని ఆహార నాణ్యత ఎలా ఉందని ఆరా తీయగా, ఆహారం నాణ్యత చాలా బాగుందని వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని అదనపు కమిషనర్ తెలిపారు. అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ ను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించడంతోపాటు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి కృష్ణంరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి *విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్*: ప్రతి ఇంటి నుండి నిత్యం క్లాప్ వాహనాలు వ్యర్థాలను సేకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నార్త్ జోన్ 24వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సౌత్ జోన్ పరిధిలో కె.జి.హెచ్. వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను అయా జోనల్ కమీషనర్లు రాము, మల్లయ్య నాయుడు తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ క్లాప్ వాహనాల ద్వారా వ్యర్ధాలను ప్రతిరోజు ఇంటింటి నుండి సేకరించాలని జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం ప్రదర్శించరాదని, వార్డులలో పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వెను వెంటనే ఆ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కి తరలించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పనిముట్లు, యూనిఫామ్ లు అందించారా అని ఆరా తీశారు. క్లాప్ వాహనాలు రోజు ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలు సేకరించి తరలిస్తున్నారని, ఒక్కొక్క క్లాప్ వాహనం పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని క్లాప్ వాహనాల డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే వీధుల్లో ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు వ్యర్ధాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో డంపర్ బిన్నులు నిండి వ్యర్ధాలు అధికంగా కింద పడుతున్నాయని, వ్యర్ధాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాలుగవ జోన్ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఫలహారం భుజిస్తున్న వారిని ఆహార నాణ్యత ఎలా ఉందని ఆరా తీయగా, ఆహారం నాణ్యత చాలా బాగుందని వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని అదనపు కమిషనర్ తెలిపారు. అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ ను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించడంతోపాటు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి కృష్ణంరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి * నగరంలో పర్యాటకుల తాకిడి తో ఉదయం నుంచే మ్యూజియంలు తెరవాలి

పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి * నగరంలో పర్యాటకుల తాకిడి తో ఉదయం నుంచే మ్యూజియంలు తెరవాలి * ఆదేశాలు జారీ చేసిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ * **విశాఖపట్నం డిసెంబర్ 27 పున్నమి ప్రతినిధి * విశాఖకు పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో వి ఎం ఆర్ డి ఎ పరిధిలో పలు పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఆదేశించారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఎండలో బారులు తీరటాన్ని గమనించి, వారిని విశ్రాంతి గదిలో సేద తీరాలని సూచించారు. ఆదివారం మాత్రమే ఉదయం నుంచి తెరిచి ఉంచుతామని, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నుంచి తెరుస్తామని అధికారులు చెప్పటంతో పర్యాటక సీజన్ కావటంతో అధిక సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారని, అందువల్ల వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని మ్యూజియంలను ఉదయం 10 గంటలనుంచే తెరవాలని ఆదేశించారు. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం బయట బారులు తీరుతున్న నేపథ్యంలో క్యూ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు రోప్ లని ఉపయోగించాలని సూచించారు. అలానే మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, బీచ్ రోడ్ లో ఉన్న అన్ని మ్యూజియంల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో రక్షిత తాగు నీటిని అందుబాటులోకి ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి*

*సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి* *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి:- ఉత్తరాంధ్ర పేద ప్రజల సంజీవని కే జీ హెచ్,రోజుకి సుమారు 2500 మందికి పైగా ఓపి నమోదు అవుతారని, 20 పైగా పెద్ద ఆపరేషన్లు అవుతాయని, నేను గతంలో పలు మార్లు కే జీ హెచ్ కి వెళ్ళాను, అక్కడ పరిస్థితులు చూసి బాధకలిగి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ ద్వారా ” *సేవ్ కే జీ హెచ్* ” నినాదంతో సుమారు జేడీ ఫౌండేషన్ మరియు లిటిల్ హాండ్స్ ఆర్గనై్సేషన్ సంయుక్తంగా 10 లక్షల రూపాయలతో కే జీ హెచ్ లో పలు వార్డులలో మరమ్మత్తు పనులు చెప్పటామని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. పలువులు వ్యాపార ప్రముఖులు మా ద్వారా ఆసుపత్రికి ఫ్యాన్లు, లైట్లు, రోటరీ క్లబ్ సహకారంతో 70 వీల్ చైర్లు అందించామని ఆమె తెలిపారు, ఆర్ ఓ ప్లాంట్ మరమ్మతు చేసాము, పాత్ర ఇండియా వారు 5 లక్షల విలువ చేసే పరికరాలు ప్రసూతి విభాగానికి తమ సి ఎస్ ఆర్ నిధులతో అందించారు, అప్పటి కలెక్టర్ మల్లికార్జున స్పందించి,తమ నిధులు 50 లక్షలు కేటాయించి ఐసీయూ నవీకరించారు. కే జీ హెచ్ లో ఉన్న సమస్యలను అప్పటి ప్రభుత్వ సలహాదారుడు (నాడు-నేడు) కి, ప్రస్తుత తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అకునూరి మురళి దృష్టికి తీసుకువెళ్లగా మా సహకారంతో అప్పటి కే జీ హెచ్ సూపరింటెండెంట్ మైథిలితో మాట్లాడి కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేయగా ఆసుపత్రి పై నివేదిక తయారు చేసి పంపారు వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి 600 కోట్లు ఆమోదించారు, అమలు కావడంలో జాప్యం జరగడంతో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగిపోయిందని,అప్పటి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు కూడ మేము చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము చేసిన పని అభినందించి, నాకు కే జీ హెచ్ పై బాధ్యత ఉంది, మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కే జీ హెచ్ ని అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు, ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రమంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు మరియు ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ తీసుకొని నిధులు తీసుకువచ్చి కే జీ హెచ్ లో సిదిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే బాధ్యత తీసుకోవాలని ప్రియాంక ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.

విశాఖపట్నం

జనావాసాలపై రేడియేషన్ ముప్పు..! దువ్వాడలో సెల్‌ఫోన్ టవర్‌పై ప్రజల తిరుగుబాటు**

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) దువ్వాడలో జనసాంద్రత ఉన్న నివాస ప్రాంతం నడుమ సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా టవర్ నిర్మాణం సాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా, ముందస్తు ప్రజాభిప్రాయం లేకుండా టవర్ పనులు చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే విషయంపై అధికార యంత్రాంగం మౌనం వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే టవర్ పనులు నిలిపివేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్నం

అల్లూరి పార్కును సందర్శించిన జీవీఎంసీ సీఈ సత్యనారాయణ రాజు

పెద గంట్యాడ : డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న అల్లూరి సీతారామరాజు పార్కును జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు శనివారం సందర్శించారు. పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పార్కు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ప్రస్తుతం గార్డెన్ అభివృద్ధి పనులు మరియు బాక్స్ క్రికెట్ మైదానం ఏర్పాటు పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. త్వరలోనే అల్లూరి సీతారామరాజు పార్కును ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు తెలిపారు. ఈ పార్కు ప్రారంభంతో ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు వ్యాయామ సౌకర్యాలు లభించనున్నాయని ఆయన అన్నారు.

తిరుపతి

రెడ్డివారి గురవారెడ్డిని ఘంగా సన్మానించిన కూటమి నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డివారి గురవారెడ్డిని నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, బిజెపి నాయకులు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దశరధాచారి మాట్లాడుతూ.. నాటి వైసిపి ప్రభుత్వ అరాచక చర్యలను ఎదుర్కొని నిలబడి, జగన్ రెడ్డిని గద్దె దించడానికి ముందుండి పోరాటాలు చేసిన బిసి, యస్సీ, యస్టీ, మైనారిటీ వర్గాలకు అటు నామినేటెడ్ పదవులలో ఇటు తెలుగుదేశం పార్టీ యొక్క వివిధ కమిటీలలో ఇప్పుడు ఇస్తున్న దాని కన్నా మరింతగా వారి ప్రాతినిధ్యం పెంచి, వారి త్యాగాలకు తగిన గౌరవం దక్కేలా చూసే బాధ్యత ఎన్డీయే కూటమి లోని తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సన్మాన గ్రహీత రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల త్యాగాలే తెలుగుదేశం పార్టీకి మూలధనం అని, జగన్ రెడ్డి యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎదుర్కునే క్రమంలో తమ మాన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప కార్యకర్తలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని అటువంటి ఘనత వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైనందుకు తాను గర్వంగా భావిస్తున్నానని, తనకు వచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీ విజయం కొరకు కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తనపై ఎంతో నమ్మకంతో తనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారని వారి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా గ్రంథాలయ సంస్థ ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. కార్యకర్తల త్యాగాలను విస్మరించకుండా, వారి కష్టనష్టాలకు పరిష్కారంగా నిలిచి, వారిని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముక్త కంఠంతో సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు,బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి.నారాయణ, బిజెపి నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,యస్వీ రమణ,వజ్రం కిషోర్,మునిరాజా యాదవ్,కోట చంద్రశేఖర్,ప్రముఖ న్యాయవాదులు సురేంద్ర ముదిరాజ్,అంకయ్య, బిసి, యస్సీ విభాగం విభాగం నాయకులు జనార్థన్ రెడ్డి,మణి,కుమార్, కూలి సన్నీ, రామకృష్ణ, సంజాకుల మురళీకృష్ణ,సుజిత్, సాయి నాయుడు, రమేష్, కృష్ణమూర్తి, నాగరాజు, శేఖర్,శంకరయ్య,పూల శేఖర్,సులేమాన్,భాస్కర్,ఆనంద్,గాజుల భగత్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.