నామినేట్ పదవులు పొందిన వారికి ఘన సన్మానం చేసిన ముదిరాజ్ సంఘం
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: నామినేట్ పదవులు పొందిన తెదేపా నాయకులకు పట్టణంలోని స్థానిక సరోజినీదేవి కళ్యాణ మండపంలో ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో ఘనసత్కారం చేపట్టారు. ముదిరాజ్ సంఘం తరఫున గురుమూర్తి నేతృత్వంలో వారికి తరఫున పూలమాలాలు వేసి దుశ్యాలవులతో జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ… పదవులను పొందిన నాయకులు ప్రజలకు మంచి సేవలను అందించి వారి మన్ననలను పొంది భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ముదిరాజులను రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. వివిధ పదవులు పొందిన నాయకులు తిరుపతి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమణయ్య, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లారి.బత్తినయ్య, తంగేళ్ళపాలెం సింగిల్ విండో చైర్మన్ భీమాల.భాస్కర్, తొట్టంబేడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు.బాలసుబ్రమణ్యం, కట్టపుట్టాలమ్మ చైర్మన్ పాడి.రాజేంద్ర, రాష్ట్ర ముదిరాజ్ సంఘం కార్యదర్శి అల్లిపూడి.వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు సామ.అంకయ్య, డిసిసి బ్యాంక్ డైరెక్టర్ కూనాటి.నాగరాజు, అఖిల భారతీయ కూలీ ముదిరాజ్ తిరుపతి చైర్మన్ కుర్రకాల్వ వేణు, వడమాలపేట మండల వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ పి.చంద్రబాబు, ఏపీ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు స్టేట్ డైరెక్టర్ తేరని.జయరాం రెడ్డి, రేణిగుంట మండల టీఎన్టియుసి అధ్యక్షులు కుట్రపాక.శీను తదితరులు వారి యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.










