Thursday, 12 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాల అందజేత

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలంలోని బద్వేలు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య అధికారులు,ఎంపీడీవో జలజాక్షి, ఎమ్మార్వో రమాదేవి, పాల్గొన్నారు,అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు అందజేసి, భూ హక్కుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు పేర్కొన్నారు.

నిర్మల్

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పున్నమి ప్రతినిధి నిర్మల్ జనవరి 03: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం,96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడు,తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలసి ఆలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి,శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి,స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్,ఈవో టి.శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు టీటీడీ బోర్డు మెంబర్ బి.ఆనందసాయి,తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహదారు గోవింద్ హరే,జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి,ఆర్ కె సాగర్ తదితరులు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కషాయం జెండాలతో మునిగి పోయిన ఉదయగిరి

ఉదయగిలో హిందూ సమ్మేళనం ఘనంగా జరుగుతోంది ఈ నేపధ్యంలో పట్టణ ప్రధాన పురవీధులను కాశాయి రంగు జెండాలతో నింపేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ స్థాపించి వందేళ్లు పూర్తియిన సందర్భంగా హిందూ సమ్మేళన సమితి ఆధ్యర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు అలాగే రుక్మిణి కళ్యాణం సైతం జరిపించనున్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు

ఉదయగిరి హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ నుంచి శివాలయం మీదగా టీటీడీ కళ్యాణ మండపం వరకు హిందూ సమ్మేళన శోభాయాత్ర నిర్వహించారు చిన్నారులు పెద్దలు యువకులు జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు మహిళల కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి .

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీచర్స్ కు సావిత్రి భాయి పూలే ఆదర్శం

ఉదయగిరి మండలంలోని కృష్ణం పల్లి జడ్పీ హై స్కూల్లో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఆమె చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూల మాల వేసి నివాళురూపించారు Hm షేక్ సత్తార్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి టీచర్ సావిత్రి భాయి పూలే అన్నారు టీచర్ల అందరికీ ఆమె ఆదర్శం ప్రయమని కొనియాడారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎనబై ఇళ్ళ నిర్మాణాలు లోపాలను తేల్చినా క్వాలిటీ కంట్రోల్ అధికారులు

ఉదయగిరి హౌసింగ్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసులు శనివారం హౌసింగ్ , ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు గంగిరెడ్డి పల్లీ ప్రభుత్వ లే అవుట్లు గుత్తేదారుడు నిర్మించిన 141 ఇళ్ళల్లో 80 ఇళ్ళు నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తెలిచినట్లు ఎంపిడిఓ తెలిపారు గుత్తేదారుడు వారంలోగా 80 ఇళ్లకు సంబంధించిన నిర్మాణలు , నాణ్యత ప్రమాణాలు పాటించి సరి చేయాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ తెలుగు మహాసభల్లో డా పెరుగు రామకృష్ణ కు పురస్కారం

జనవరి (పున్నమి ప్రతినిధి) నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రం లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మూడు రోజులు జరుతున్నాయి.సభల్లో తొలి రోజు రెండవ సదస్సు తెలుగు అనువాద సాహిత్య సదస్సు కు అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ అధ్యక్షత వహించారు.భారతీయ ఇతిహాస సాహిత్యం అనుసృజన తోనే ఆరంభమైనదని, 78 ఏళ్ల స్వాతంత్ర్య అనంతరం కూడా మన గొప్ప సాహిత్యం ప్రపంచ భాషల్లో అనువదించు కోవడం లో మనం వెనకబడ్డామని, ప్రాంతీయ భాషలు గల ప్రభుత్వాలు అనువాద అకాడెమీ లు ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు సాహిత్యం ఇతర భారతీయ భాషల్లో ఇంకా ప్రపంచ వ్యాప్తం కావడం కు అవకాశం ఉంటుందని అన్నారు. ఇటువంటి సభలు అటువంటి తీర్మానాలు చేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలని కోరారు.అనంతరం డా పెరుగు అను వాద సాహిత్యంలో చేస్తున్న విశేష కృషిని ప్రశంసించి ఆంధ్ర సారస్వత పరిషత్ తరుపున సదస్సు సంచాలకులు పంతుల వెంకటేశ్వర రావు, ఇతర సాహితీ ప్రముఖులు కలిసి రామకృష్ణను ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం, పతకం, ప్రశంసాపత్రం లతో ఘనంగా సత్కరించారు . ఈ సందర్భంగా పలువురు డా పెరుగు రామకృష్ణ ను అభినందించారు..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజా ముద్రతో పట్టా దారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన చెంచాల బాబు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాజా ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేస్తున్నదని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పి, పెంచల బాబు యాదవ్ అన్నారు శనివారం ఆయన ఉదయగిరి మండలంలోని గుడి నర్వ గ్రామంలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం రూపొందించదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ తెలుగు మహాసభలకు డా పెరుగు రామకృష్ణకు ఆహ్వానం

పున్నమి ప్రతినిధి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు లో జనవరి 3-5 వరకు జరిగే 3 వ ప్రపంచ తెలుగు సభలకు నెల్లూరు నుంచి అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆహ్వానం అందుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం 12.00 నుండి 1.00 వరకు జరిగే అనువాద సాహిత్య సదస్సుకు సభాధ్యక్షులుగా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి, గౌరవ అతిథి గా వంశీ రామరాజు వక్తలుగా వెన్నా వల్లభరావు, అంబికా అనంత్, డా తుర్లపాటి రాజేశ్వరి, కొంపెల్ల బాల సుబ్రమణ్యం శర్మ అనువాద సాహిత్య వివిధ అంశాలపై ప్రసంగిస్తారు . ఈ సందర్భంగా డాక్టర్ పెరుగు రామకృష్ణను సారస్వత సేవా పురస్కారం కు ఆంధ్ర సారస్వత పరిషత్ ఎంపిక చేశారు..!

అమరావతి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సోమనాథ్ రాజీనామా ఆలోచన?

అమరావతి : (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతిక సలహాదారుగా నియమితులైన డా. ఎస్. శ్రీధర పణిక్కర్ సోమనాథ్ తన పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది నెలల క్రితం నియమితులైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు, కార్యాలయం కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్పేస్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన సోమనాథ్‌ను పట్టించుకోకపోవడం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.