Thursday, 12 March 2026

Blog

రాజన్న సిరిసిల్ల

యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విప్లమవుతుందని ఆయన పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోదండ రామపురంలో మహా రుద్ర యాగం .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం కోదండ రామపురంలో మహా రుద్ర యాగం – ప్రముఖుల పాల్గొనడం మనుబోలు మండలంలోని కోదండ రామపురం గ్రామంలో ఘనంగా నిర్వహించిన మహా రుద్ర యాగంలో ప్రముఖ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. శివభక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు యాగ మహిమను వివరించి, గ్రామ ప్రజలందరికీ శాంతి, శుభం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. మహా రుద్ర యాగం సందర్భంగా కోదండ రామపురం గ్రామం భక్తి పరవశంతో కళకళలాడింది.

చిత్తూరు

గంటావురు బీసీ కాలనీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో జ్వాలా దీపోత్సవం, ఉంజల్ సేవ

​పలమనేరు మున్సిపల్ పరిధిలోని గంటావురు బీసీ కాలనీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో జ్వాలా దీపోత్సవం, ఉంజల్ సేవ (ఊయల సేవ) మరియు అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.​శుక్రవారం సాయంత్రం ఆలయ ఆవరణలో భక్తులు భక్తి శ్రద్ధలతో జ్వాలా దీపాన్ని వెలిగించారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణ చేసి, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉంజల్ సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీపాల వెలుగులో గంగమ్మ తల్లి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో ఉంచి ఉంజల్ సేవను నిర్వహించారు. భక్తులు మంగళ హారతులు పాడుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మురుగన్ మాట్లాడుతూ…, కాలనీ ప్రజలందరి క్షేమం కోరి, గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి పౌర్ణమికి ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసిపి నేత శ్యామల ను కలిసిన వైసీపీ యువ నేత పీఎంకే

సీతారామపురం జనవరి(పున్నమి ప్రతినిధి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల రెడ్డి ని శనివారం హైదరాబాదులోని ఆమె నివాసంలో సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి యువ నాయకుడు పాలగిరి ముద్దుకృష్ణమరాజు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైసిపి నేత శ్యామల కు బొకే ఇచ్చి స్వీట్ బాక్స్ ను అందించారు. అనంతరం సీతారామపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్యామలను కోరినట్లు ఆయన తెలిపారు. రాబోయే 2029 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అహర్నిశలు పనిచేసి గ్రామస్థాయి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి వైసిపి జెండా ఎగురవేసేలా పనిచేయాలని, ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని శ్యామల రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం మండల వైసిపి యువ నాయకుడు కప్ప సురేంద్ర రాజు,వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

– జాగృతి కామారెడ్డి అధ్యక్షురాలు బి.వసంత కామారెడ్డి, 03 జనవరి ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా పట్టణంలోని మున్సిపల్ ఆవరణ లో సావిత్రిబాయి పూలే విగ్రహానికి జాగృతి సభ్యు ల ఆద్వార్యాంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షు రాలు బి.వసంత మాట్లాడుతూ,స్త్రీ విద్య,సామాజి క సమానత్వానికి అంకితం సావిత్రిబాయి అగ్ని వలె పోరాడిన మహనీయురాలు అని అన్నారు. సావిత్రిబాయి పూలే ఆమె ధైర్యం, త్యాగం నేటి తరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు.ఈ సందర్భం గా ఆమె సామాజిక సంస్కరణలు, మహిళా శిక్షణ పోరాటాల గురించి వివరించారు. జీవితం శాశ్వత ఆదర్శంగా నిలిచిందని నాయకులు అభిప్రాయ పడ్డారు. జాగృతి సంస్థ ఇలాంటి కార్యక్రమాలతో సామాజిక జాగృతిని పెంపొందిస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి కామారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శమంత, మైనార్టీ విభాగం అధ్యక్షుడు అల్తాఫ్, జైనాబ్ బేగం, ఆఫ్రిన్ బేగం, మానస్, క్రిస్టి యన్ విభాగం అధ్యక్షుడు దానియే లు, మైపాల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

తాటిపర్తి గ్రామంలో నేడు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహణ తాటిపర్తి గ్రామంలో నేడు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం రమేష్ ఝాన్సీ, ఉప్ప సర్పంచ్ ముప్పిడి రమేష్, ముప్పిడి మధుసూదన్ (సహాయ సమాచార పౌర సంబంధాల అధికారి, రంగారెడ్డి జిల్లా), వార్డు మెంబర్ ఏనుగొండ శివ, గ్రామ యువకులు తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, స్త్రీలకు చదువు అవసరం లేదన్న మూఢనమ్మకాలపై పోరాడి మహిళా సాధికారతకు దారి చూపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారని కొనియాడారు. విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని ఆమె జీవితం ఈ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

దశదినకర్మలో పాల్గొని నివాళులు అర్పించిన సెస్ డైరెక్టర్ సందు పట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు పొట్ల పెళ్లి కిషన్ గారి తండ్రి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు మాజీ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ షాడో శ్రీనివాస్ నామాపురం గ్రామ శాఖ అధ్యక్షులు తాడేపు అనిల్ అధ్యక్షులు అవునూరి నవీన్ కె టి ఆర్ సేన మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా ఏపీ హంస టేబుల్ క్యాలెండర్ ఘన ఆవిష్కరణ

పున్నమి ప్రతినిధి – నెల్లూరు 03.01.2026 నెల్లూరు, మినీ బైపాస్ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ టేబుల్ క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఏపీ హంస కోవూరు తాలూకా ప్రెసిడెంట్ సోలా ఉమా , తాలూకా సెక్రెటరీ షేక్ ఆసియా బేగం గార్లు మాట్లాడుతూ గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ, ఉద్యోగుల అభ్యున్నతికి సహకరిస్తున్నారు అని కొనియాడారు, వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం లకు యాప్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లి యాప్స్ సంఖ్య తగ్గించే విధంగా కృషి చేయాలని ఏఎన్ఎం లకు వెంటనే పదోన్నతులు వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమానికి ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు , జిల్లా పబ్లిసిటి సెక్రటరీ మజాహర్ , కోవూరు తాలూకా అసోసియేట్ ప్రసిడెంట్ టి. రాఘవేంద్ర , పబ్లిసిటీ సెక్రటరీ ఎస్కే. షబీనా, ట్రెజరర్ ఈ.రమణమ్మ మరియు వైస్ ప్రసిడెంట్ ఎస్.రాజేంద్ర ప్రసాద్ , జి.కామాక్షి ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.వేణు , మహిళా సెక్రటరీ సిహచ్.హైమవతి తో బాటుగా నెల్లూరు సిటీ ప్రసిడెంట్ సయ్యద్ .గౌస్ భాషా, సిటీ సెక్రటరీ బి. మంజరి తదితరులు టేబుల్ క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు .

విశాఖపట్నం

జాతీయ రహదారి భద్రతపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి) జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా 04-01-2026న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించబడింది. రహదారి మరియు భవనముల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, జీ.వి.ఎం.సి (GVMC), నేషనల్ హైవే విభాగం, ఏపీ ఎస్‌ఆర్‌టీసీ, రవాణా శాఖ, డీఎం & హెచ్‌వో అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో నేషనల్ హైవేలు మరియు ప్రధాన రహదారులపై రోడ్ ఇంజనీరింగ్ డిజైన్ మార్పులు, అవసరమైన ప్రదేశాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు, స్పష్టమైన రోడ్ మార్కింగ్స్, పాదాచారుల భద్రతకు హెచ్చరిక సూచికలు, వేగ పరిమితి బోర్డులు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల సమీపంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే రవాణా శాఖ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు నేషనల్ హైవేల్లో ప్రయాణించే ఆటో రిక్షా డ్రైవర్లు, లెర్నింగ్ లైసెన్స్ దారులు మరియు ప్రజలకు రహదారి నియమాలు, వేగ నియంత్రణ, ప్రయాణికుల భద్రతపై PPT ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.