Thursday, 12 March 2026

Blog

విశాఖపట్నం

భవిత స్కూల్‌లో దివ్యాంగ విద్యార్థులకు అండగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

విశాఖ గాజువాక , జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని భవిత స్కూల్‌లో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదురు గోవింద్‌తో పాటు బంధుమిత్రుల సహకారంతో భవిత స్కూల్‌లో చదువుతున్న మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు ఏడాదిలో ఒక రోజు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం, వారి తల్లిదండ్రులకు బట్టలు పంపిణీ చేయడం ప్రశంసనీయమైన సేవా కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. ఈ సేవల వల్ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడుపుట్ల శ్రీను, ఈ.అప్పలరాజు, బి.రవి, వై.కొండబాబు, గోవింద్, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మూడేళ్ల ఘట్టం ఎనిమిది నా నర్రవాడలో సముద్ర స్నానం

నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు అమ్మవారికి ఈ నెల 8 న సముద్రం స్త్నానం నిర్వహించనట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఈ నెల ఆరు న వెంగమాంబ దంపతుల రాదొస్తవం ఏడు నా నర్రవాడ నుంచి ఊరేగింపు బయలుదేరి సాయంత్రానికి కావాలి శివాలయానికి అమ్మవారు చేరుకుంటారని తెలిపారు ఈ నెల ఎనిమిది నా సముద్ర స్నానం నిర్వహించినట్లు తెలిపారు మూదేళ్ళకొకసారి నిర్వహించే అపూర్వ ఘట్టంలో భక్తులు పాల్గొనీ అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమవారం స్వచ్ఛ సంక్రాంతి పై ఉదయగిరిలో గ్రామ సభ

ఉదయగిరి లో మేజర్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం మధ్యానం రెండు గంటలకు సర్పంచ్ పాములూరి సామ్రాజ్యం అధ్యక్షతన స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామ సభ నిర్వహించనట్లు పంచాయతీ కార్యదర్శి షేక్ కరిముల్లా తెలిపారు స్పెషల్ అధికారిగా ఎంపీడీవో బి శ్రీనివాసులు వ్యవహరిస్త్రారన్నారు స్వచ్ఛ సంక్రాంతి వికసిత్ భారత్ జి రామ్ జి ఉపాధి హామీ పథకం పై జరుగు గ్రామ సభలకు ఉపాధి వెలుగు సిబ్బంది హాజరు కావాలని ఆయన కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రేమ పేరుతో మోసగించిన నిందితుడుకి రిమాండ్

ప్రేమ పేరుతో మోసగించిన యువకుడిని జైలుకు పంపినట్లు ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు సీతారామపురం మండలానికి చెందిన యువతిని ఉదయగిరి మండలం బోడు బండ ఎస్సీ కాలనీ కీ చెందిన అఖిల్ ప్రేమ పేరుతో మోసం చేశాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు న్యాయాదికారి అంజయ్య నిందితుడుకి రిమాండ్ విధించారు అనంతరం ఆత్మకూర్ సబ్ జైల్కు తరలించారు.

చిత్తూరు

శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం.

శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం…!)స్మశానo మరింత అభివృద్ధికి అక్కడే ఏర్పాటైన సమావేశాలు!!) విరివిరిగా విరాళాలు అందిస్తున్న గాండ్ల కులస్తులు స్మశానం..ఈ పదం వినగానే ఒక లాంటి నిర్లిప్తత…..ఏదో తెలియని భయం ఆవహిస్తుంది ఎవరికైనా ….. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించారు. ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉండే స్మశానాలకు తప్పనిసరి పరిస్థితులో వెళ్లాల్సివస్తే…… చనిపోయిన వారు కైలాసానికో.. వైకుంఠానికో… వెళుతారో లేదో కాని దహన సంస్కారాలకు వెళ్ళిన వారు మాత్రం కాస్తా వణకడం ఖాయం. అంత్య క్రియలకు ఆరు గజాల స్థలం సంపాదించడం దగ్గరి నుంచి…..మృత దేహాన్ని ఖననం చేసేదాకా..కాటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్మశాన వైరాగ్యం…..అంటే ఏమిటో అందరికీ తెలుస్తోంది. అందుకే అక్కడికి మహిళలని, పిల్లలని అనుమతించరు. నిజానికి చివరి మజిలీలు ఇంత భయంకరంగా వుండాలా? స్మశానం వల్లకాడులా…..కనీస సౌకర్యాల లేమితో స్మశానములు ఎందుకుండాలి? మన ఆప్తులను మురికి కూపంగా వున్న స్థలంలో ఖననం చేసే ఖర్మ మనకేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులుగా చెప్పాలనే… ఓ మంచి ఆలోచనలతో బృహత్తర ప్రణాళికలతో  పలమనేరు పట్టణ మందలి పాతపేట హిందూ స్మశాన వాటికగా వున్న స్థలంలో అత్యధ్బుతంగా అభివృద్ధి పరచాలనే పట్టణ పెద్దలు, ప్రధానoగా గాండ్ల కుల పెద్దలు నిర్ణయించి గత డిసెంబర్ నెలలో 14 వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ మూడు పర్యాయాలు స్మశాన వాటిక స్థలం లోనే ప్రత్యేక శ్రద్ధతో పట్టణ గాండ్ల కుల పెద్దలు చంద్ర అనే బాలకృష్ణ,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆద్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి ఒకటే.. చండాలుండేటి మరుభూమి ఒకటే.. అంటూ మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి చేరతాడో ? అన్నమయ్య తన కీర్తనలలో వినిపించారు. అయితే ఆ మరుభూమి అందమైన మొక్కలతో, పచ్చిక బయళ్లతో, రహదారులతో,చూడచక్కని కట్టడాలతో.. ఉంటే మన మనిషిని గౌరవంగా సాగనంపినట్టుగా ఉంటుందనే ఆలోచనలతో ఇటీవలి కాలంలో కొన్ని నగరాలు,పట్టణాలలో స్మశాన వాటికలు రూపుదిద్దుకుంటున్నాయి.అలాంటి కోవలోకి మార్చాలని వీరు భావిస్తున్నారు. *పట్టణ, గాండ్ల పెద్దల నిర్ణయం* పట్టణాల్లో స్మశానాలను బృందావనంలా తీర్చిదిద్దుతున్నారు. అలాంటి స్మశాన వాటికలను పోలినట్లుగా ఉండాలని, ఒక ఎకరo పైగా విస్తీర్ణంలో గల స్మశాన వాటికను ఆదర్శంగా ఏర్పాటు చేయడంలో భాగంగా అందులో హరిచంద్రుని ఆలయం,అంతిమ సంస్కారం చేసే బంధువులకు ఓ బృందావనo లాంటి అనుభూతి కలిగించేలా మార్చి పుష్కలమైన నీటి సౌకర్యములతో రెండు రూముల నిర్మాణం,ఫ్రీజర్ బాక్స్,వాహనంలో మృతదేహాన్ని తరలించేందుకు తక్కువ ఖర్చుతో ప్రత్యేక వాహనం ఏర్పాటు వంటి సౌకర్యాలు అందించి అక్కడి నిర్వహణ కోసం అభివృద్ధి కమిటీని వేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.ఇలా గత రెండు వారాలుగా స్మశాన వాటిక పునరుద్ధరణ పనులు కార్యరూపం దాల్చి వేగవంతంగా పారదర్శకతతో జరుగుతున్నాయి.ఇందుకోసం గాండ్ల కులస్తులు స్వచ్ఛందంగా దాతల రూపంలో ముందుకు వచ్చి ఆర్థికoగా ఆదుకుంటుండగా,కొన్ని నిర్మాణ పనులు దాతలే చేపడుతూ ఆనందిస్తున్నారు.మరింత మంది చందాలు ఇచ్చి ఆదుకోవాలని సంఘం పెద్దలు కోరారు. *సొంత ఇంటి పనులలా పర్యవేక్షణ* కాగా తమ సొంత ఇంటి నూతన నిర్మాణ పనులను చూస్తున్నట్లు నిత్యం స్మశాన వాటికలోనే కుర్చీలు వేసుకొని ఇక్కడి గాండ్ల కులస్తులు పర్యవేక్షణ చేయడం విశేషం. పెద్దలు చంద్ర,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆలోచనలకు అనుగుణంగా మునిసిపల్ కౌన్సిలర్ కోదండరామయ్య,ఏ.ఆర్.కుమార్, మూర్తి,టి.ప్రకాశ్ బాబు, కృష్ణమూర్తి,శ్రీధర్ బాబు, కేశవులు,జె.సి.రవి,ఆర్.కె.రమేష్ కుటుంబం,రాజేశ్, కె.వి.శ్రీనాథ్ తదితరులు కార్యనిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.

చిత్తూరు

*ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన అటవీ మరియు వైద్య అధికారులు*

*ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన అటవీ మరియు వైద్య అధికారులు* నూతన ఏడాది సందర్భంగా పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని పలమనేరు అటవీ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ మరియు పలమనేరు ఏరియా ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా ఆదివారం కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. ఎమ్మెల్యేను కలసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎఫ్ఆర్వో నారాయణ తో పాటు ఎఫ్ఎస్వోలు, ఎఫ్బీవోలు, ఎలిఫెంట్ ట్రాకర్స్, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిదంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతా రాణి, డైరెక్టర్ లు నాగరాజు, సుధాకర్ లతో పాటు వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు గుంటల కారణంగా అక్కంపేట వద్ద కారు ప్రమాదం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) అక్కంపేట–మితాత్మకూరు రోడ్డు వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంటల కారణంగా ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిన ఘటన చోటుచేసుకుంది. కారులో భార్యాభర్తలు, వారి పిల్లలు ప్రయాణిస్తున్నారు. వారు అలహాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారికి స్వల్ప గాయాలు కాగా, అక్కంపేట గ్రామ ప్రజలు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామ ప్రజలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విప్లమవుతుందని ఆయన పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోదండ రామపురంలో మహా రుద్ర యాగం .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం కోదండ రామపురంలో మహా రుద్ర యాగం – ప్రముఖుల పాల్గొనడం మనుబోలు మండలంలోని కోదండ రామపురం గ్రామంలో ఘనంగా నిర్వహించిన మహా రుద్ర యాగంలో ప్రముఖ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. శివభక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు యాగ మహిమను వివరించి, గ్రామ ప్రజలందరికీ శాంతి, శుభం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. మహా రుద్ర యాగం సందర్భంగా కోదండ రామపురం గ్రామం భక్తి పరవశంతో కళకళలాడింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.