E-పేపర్
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమహేంద్రవరం రూరల్ బుర్రి లంక తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి * పూజారులకు, ఇమామ్ లకు, పాస్టర్లకు ఇస్తున్నట్లే జర్నలిస్టులకు గౌరవ వేతనం ఇవ్వాలి * జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి * జే.డి.ఆర్.ఎఫ్. జోనల్ కార్యాలయం ప్రారంభోత్సవ సభలో వక్తలు పిలుపు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జే.డి.ఆర్.ఎఫ్. ( జర్నలిస్ట్ డెమెక్రటిక్ రైట్స్ ఫారం ) అధ్యక్షులు పూల తోట కృష్ణ, ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి రూరల్, బుర్రిలంక గ్రామం, గోకుల్ నర్సరీ ప్రాంగణంలో జే.డి.ఆర్.ఎఫ్. జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా బుర్లంక గ్రామంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జోనల్ కార్యాలయానికి చేరుకొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడిఆర్ఎఫ్ అధ్యక్షులు, ప్రజా కాంక్ష దినపత్రిక ఎండి పూల తోట కృష్ణ, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కేత శ్రీనివాసరావు, విశిష్ట అతిధిగా జెడిఆర్ఎఫ్ కార్యదర్శి బేతాళం సుదర్శనం, జెడిఎఫ్ ఉపాధ్యక్షులు, ప్రజాకాంక్ష చీఫ్ బ్యూరో జనపిరెడ్డి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపిశెట్టి రామచంద్రుడు, జోనల్ ఉపాధ్యక్షులు దండు బోయిన వీర వెంకట సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎక్విడేషన్లు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అంటూ వ్యత్యాసం చూపడం తగదని అన్నారు. కార్పొరేట్ శక్తులు జర్నలిస్టులను బలి పశువులుగా చేస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్టులకు జీతాలు లేవని, మిగిలిన మూడు రంగాలకు జీతభత్యాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులను పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించే చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇమామ్ లకు, పూజారులకు, పాస్టర్లకు ఇస్తున్నట్లే అర్హులైన జర్నలిస్టులకు రూ 18 వేల రూపాయలు గౌరవ వేతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికల మనుగడ కోసం సబ్సిడీపై రుణాలు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టి, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా సభ్యుల, భద్రత సంక్షేమమే ముఖ్యంగా జెడిఆర్ఎఫ్ ఏర్పడిందని అన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా జే డి ఆర్ ఎఫ్ ముందుండి ఆదుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా సభ లో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. * అర్హత గల విలేకరులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని. *జర్నలిస్ట్, వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రతకు రూ.10 లక్షలకు తక్కువకాని విధంగా కార్పొరేట్ వైద్య సేవలకై ఉచిత హెల్త్ కార్డులు జారీ చేయాలని. *విలేకరులు వారి కుటుంబ భద్రతకై ప్రత్యేక భద్రత చట్టాలు రూపొందించి అమలుపరచాలని. *విలేకరుల భద్రతకై వారి సంక్షేమం కొరకు జర్నలిస్ట్ కార్పొరేషన్ ను 100 కోట్ల తో ఏర్పాటు చేయాలి. 5. తగు విఖితపూర్వక, శాస్త్రీయపరమైన ఆధారాలతోనే విలేకరులపై చట్టపరమైన విచారణకు ఆదేశించాలని. * విలేకరులపై తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించే అధికారులపై కాలయాపన లేని చర్యలు చేపట్టాలని. * మూడేళ్లు అనుభవం గల విలేకరులను ప్రభుత్వం గుర్తించి రూ. 5 వేలు కు తక్కువకాని విధంగా సైఫండ్ చెల్లించాలని. * ఐదేళ్ల అనుభవం గల విలేకరులకు ఉచితంగా గృహాలు మంజూరు చేయాలని. * విలేకరుల పిల్లల చదువుల కోసం కార్పొరేట్ విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ ఇచ్చే విధంగా ప్రత్యేక జీవో విడుదల చేయాలని. *విలేకరుల కార్పొరేషన్ ద్వారా న్యూస్ ప్రింట్ ను ఉచిత సరఫరాతో పాటు ఉచిత విద్యుత్తును అమలు చేయాలని. * స్త్రీ విలేకరుల సంక్షేమం కోసం 100 కోట్లతో విలేకరుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని. * వార్తా సేకరణలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు భద్రతతో గల ప్రత్యేక సౌకర్యాలు అమలు చేసే విధంగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని. * ఉచితంగా టోల్ ప్లాజా రుసుం సౌకర్యం కల్పించాలని. * 55 ఏళ్లు దాటిన సీనియర్ జర్నలిస్టులకు రూ. 5 వేలు కు తక్కువ కాకుండా పెన్షన్ అమలు చేయాలని. * చిన్నపత్రికల యాజమాన్యం పైన, విలేకరుల పైన అధికార పక్షాలు ఇతర రాజకీయపక్షాలు దాడులు, దౌర్జన్యాలపై ప్రత్యేక రక్షణ కల్పించాలని. *విలేకరుల నిబద్ధతగల వృత్తి సేవలపై ప్రభుత్వం నుండి ప్రత్యేక గుర్తింపు తో పాటుగా ఆర్ధిక సహాయం అందించాలని. * ఇన్వెస్టిగేటెడ్ జర్నలిస్టు సేవలను ప్రభుత్వం ప్రోత్సాహంతో వారి సేవలను వినియోగించుకోవాలని. *పత్రిక యాజమాన్యం కోరిన వెంటనే కాలయాపన లేని విధంగా వివిపిల ఆపాయింట్మెంట్ కేటాయించాలని. *విలేకరుల కోసం ప్రతి జిల్లాకు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ను ఏర్పాటు చేయాలని. * అర్హత గల విలేకరులకు లక్షరూపాయలకు తక్కువ కాకుండా ఏ విధమైన గ్యారంటీ లేని రుణం 25పైసలకే వడ్డీకే అందించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జె.డి.ఆర్.ఎఫ్. జిల్లా అధ్యక్షుడు మారంపూడి సోమరాజు, ఉపాధ్యక్షులు గొర్రెల రాజు, యార్లగడ్డ నరేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కుడెల్లి రత్న కిషోర్, ప్రచార కార్యదర్శి గిరీష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సనమండ్ర లాజర్, సిర్రా చిట్టిబాబు, మీడియా కోఆర్డినేటర్ ఎం.వీ.ఎస్. రమేష్, ట్రెజరర్ పిచ్చుక మహేష్ తదితరులు పాల్గొన్నారు. END