Thursday, 5 March 2026

Blog

ఖమ్మం

ఖమ్మం అర్బన్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గా ఆచంటి కోటేశ్వరరావు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారతీయ జనతా పార్టీ ఖమ్మం అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి గా యువకుడు, ఉత్సాహ వంతుడు, మృదు స్వభావి అయినా ఆచంటి కోటేశ్వరరావు నియమితులు అయ్యారు. అర్బన్ మండల అధ్యక్షులు వంకదాని రామకృష్ణ నియామక పత్రం అందజేశారు. ఆచంటి కోటేశ్వరరావు నియామకం పట్ల పలువరు సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేసారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“*కుమ్మర మాన్యం కబ్జా*.

“*కుమ్మర మాన్యం కబ్జా*. *భూబకాసురుల రాక్షస హస్తాలలోకుమ్మరకుంట..* *ఈ బూర్జువా పార్టీల నాయకుల్లో* *పేదలకు న్యామెక్కడ* *వెల్లూరు సుమన్ ప్రజాపతి…ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.* *మర్రిపాడు. పున్నమి ప్రతినిది* మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో 293 గల సర్వే నంబర్ గల 3: 32 ఎకరాల కుమ్మర మాన్యాన్ని అదే గ్రామానికి చెందిన అగ్ర కుల నాయకులు కబ్జా చేసి తమ పేర్లు మీద ఆన్లైన్లో చేసుకున్నారని తమకు న్యాయం కావాలని కుమ్మరి మాన్యాన్ని తమకు ఇవ్వాలని స్థానిక రెవిన్యూ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.వెల్లూరు సుమన్ ప్రజాపతి అర్జీ సమర్పించారు. 70 సంవత్సరాలకు పైగా ఉన్న 3 ఎకరాల కుమ్మరకుంట, భూబకాసురుల రాక్షస హస్తాలలో చిక్కుకుందని,ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరగక పోతే పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన, ఈ సమస్యపై కూడా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మర్రిపాడు మండల రెవెన్యూ తహసీల్దార్ ఈ విషయం ఫై క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్నట్లు తెలియజేసారు. . Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“*కుమ్మర మాన్యం కబ్జా*.

*భూబకాసురుల రాక్షస హస్తాలలోకుమ్మరకుంట..* *ఈ బూర్జువా పార్టీల నాయకుల్లో* *పేదలకు న్యామెక్కడ* *వెల్లూరు సుమన్ ప్రజాపతి…ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.* *మర్రిపాడు. పున్నమి ప్రతినిది* మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో 293 గల సర్వే నంబర్ గల 3: 32 ఎకరాల కుమ్మర మాన్యాన్ని అదే గ్రామానికి చెందిన అగ్ర కుల నాయకులు కబ్జా చేసి తమ పేర్లు మీద ఆన్లైన్లో చేసుకున్నారని తమకు న్యాయం కావాలని కుమ్మరి మాన్యాన్ని తమకు ఇవ్వాలని స్థానిక రెవిన్యూ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు.వెల్లూరు సుమన్ ప్రజాపతి అర్జీ సమర్పించారు. 70 సంవత్సరాలకు పైగా ఉన్న 3 ఎకరాల కుమ్మరకుంట, భూబకాసురుల రాక్షస హస్తాలలో చిక్కుకుందని,ఆవేదన వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరగక పోతే పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన, ఈ సమస్యపై కూడా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మర్రిపాడు మండల రెవెన్యూ తహసీల్దార్ ఈ విషయం ఫై క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్నట్లు తెలియజేసారు. . Uploaded Video:

సాహితీ

అసహజం మాటున నిజం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

నేటి సామాజిక, ఆర్థిక పర్యావరణ కాలుష్య ప్రభావంతో మారిపోతున్న మనిషి మనోదృశ్యరూపకం … ఈ కవిత భౌతిక అకర్షణను ప్రేమ అంటున్నారు గాని కన్నవారి ప్రేమను అర్థం చేసుకోలేకున్నారు. సారం లేని సహజీవనాన్ని సంసారం అంటున్నారు గాని సర్వం అర్పించే కుటుంబ బంధాలు భారమంటున్నారు. ఆస్తుల పంపకాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు గాని ఉమ్మడికుటుంబ విలువలు మరచిపోతున్నారు. సంస్కార రహిత సరదాలను సంస్కృతి అంటున్నారు గాని సామాజిక ఆదర్శాలను అనగదొక్కుతున్నారు. గ్రాఫిక్ జిమ్మిక్కుల చిత్రాలకు జైకొడుతున్నారు గాని జీవన ఆరాటానికై పోరాటాలకు వెల కట్టలేకున్నారు. డ్రమ్ముల దరువులమ్యాజిక్తో చిందులేస్తున్నారు గాని సంగీత ప్రవాహమైన ప్రకృతిని ఆస్వాదించలేకున్నారు. ఆస్తులంతస్తులున్నవాన్నే గొప్పవాడంటున్నారు గాని ఆప్యాయతానురాగాలను గాలికొదిలేస్తున్నారు. మందు పార్టీలిచ్చే వాడినే స్నేహితుడంటున్నారు గాని ముందుతరాలకు మార్గం చూపేవాడిని పిచ్చోడంటున్నారు. నిజాయితీపరులను అసమర్ధులంటున్నారు గాని నటించి నమ్మించే వారిచే మోసపోతున్నారు. లాభం ఏదైనా ఎగబడుతున్నారు గాని నిజం పలికితే మాత్రం పగబడుతున్నారు. భుక్తి కోసం భవిష్య విద్య అంటున్నారు గాని స్వలాభ కాంక్షతో సంఘ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు ప్రశాంతతలేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. జనజీవన పరమార్ధం సుఖవంతం దైవం గా భావిస్తే ధర్మతత్వం వాస్తవిక దారిలో జీవితం అవని పై జనహితం. అసహజం మాటున నిజం నేటి జన జీవన సమాజం పరిశీలనే మనోనేత్ర తేజం

తిరుపతి

శ్రీవారిని దర్శించుకున్న గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

పున్నమిప్రతినిధి, 01 మార్చి 2026 తిరుమల తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ కి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఆలయ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అటు తరువాత టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గౌ,భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం గౌ, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరహస్వామి వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు లో జనసేన ఉద్యమి కార్యక్రమం పాల్గొన్న ఉదయగిరి ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు

​దుత్తలూరు 1-3-2026 స్థానిక నందిపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. : కొట్టె వెంకటేశ్వర్లు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ‘ఉద్యమి’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు,నియోజకవర్గ అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, మార్పు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ​”ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే జనసేన లక్ష్యం. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తాం.” – కొట్టె వెంకటేశ్వర్లు ​కార్యక్రమంలో పాల్గొన్న వారు: ​ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల కన్వీనర్స్థా దుంపలగడ్డ రవి గారూ, మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం

భూదాన్ బాధితులకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు పరామరర్శ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భూదాన్ నిర్వాసితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్ర రావు. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులను నారపరాజు రామచంద్ర రావు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల పరిస్థితిని స్వయంగా తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓర్పుతో విన్న ఆయన, వారి సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసిన ఆయన, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి, కిసాన్రా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ష్ రెడ్డి, రాష్ట్ర మహిళ నాయకురాలు ఉప్పల శారద కోశాధికారి దేవకీ వాసు దేవారావ్, నున్న రవికుమార్, అల్లిక అంజయ్య. గుత్త వెంకటేశ్వర్లు, శ్రీమతి పమ్మి అనిత, ఇవి రమేష్ల్, వల్లల రమేష్, తదితరులు పాల్గొన్నారు Uploaded Video:

ఖమ్మం

పెనుబల్లి మండలం నాయకులగూడెంలో ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి జాతర

ఖమ్మం ఫిబ్రవరి పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యాన్నగూడెం గ్రామ శివారు నాయకులగూడెంలో శ్రీ పెద్దమ్మ తల్లి జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత డాక్టర్ మట్టా దయానంద్, మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వర్లు, చీకటి రామారావు నాయకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దొంతు సత్యవతి, ఉప సర్పంచ్ కావిటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతరలో భాగంగా పెద్దమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమం భక్తి పరవశంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా జరిగినది

అనకాపల్లి

ముందస్తు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విజయవంతం

అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రాంతంలో ఆదివారం సెలవు నేపథ్యంలో ఫిబ్రవరి 28న ముందస్తుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. సమయానికి పెన్షన్ అందడంతో వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.

అనకాపల్లి

రేవు పోలవరం హై స్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవం

అనకాపల్లి జిల్లా రేవు పోలవరం జడ్‌పీహెచ్‌ఎస్‌లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్‌ఎం అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు వినూత్న సైన్స్ ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా C. V. రామన్ గారి రామన్ ఎఫెక్ట్‌ను వివరించి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.