Thursday, 12 March 2026

Blog

E-పేపర్

తెలంగాణలో మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ప్రభాస్ సినిమా రాజాసాబ్‌కు చివరి వరకూ వేధింపులు

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ప్రభాస్ సినిమా రాజాసాబ్‌కు చివరి వరకూ వేధింపులు చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాకు రెండు రోజుల ముందే అనుమతి మన శంకర వరప్రసాద్ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 గా, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హౌసింగ్ అధికారుల్లో తీవ్ర నిర్లక్ష్యం* *లబ్ధిదారుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు*

పున్నమి ప్రతినిధి నెల్లూరు రూరల్ రాఘవేంద్ర *హౌసింగ్ అధికారుల్లో తీవ్ర నిర్లక్ష్యం* *లబ్ధిదారుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు* *ఇళ్లను నాసిరకంగా కట్టడమే కాదు సిమెంట్, స్టీలు కూడా అమ్మేసుకున్నారు* *వైసీపీ పాలనలో వెలుగులోకి వచ్చిన తాత్కాలిక కాంట్రాక్టర్లు భారీగా దోచుకున్నారు* *బ్లాక్ లిస్టులో పెడతామని భయపెట్టేందుకు వారేమి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు కాదు* *హౌసింగ్ శాఖలో జరిగిన అవినీతిపై లోతైన విచారణ జరగాల్సిందే* నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలో శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ , ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు జిల్లా అధికారులు *ఈ సమావేశంలో బీద మాట్లాడుతూ* *నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా హౌసింగ్ డిపార్ట్మెంట్ మారింది, విచ్చలవిడిగా వ్యవహరించి లబ్ధిదారుల జీవితాలను చిద్రం చేస్తోంది.* *శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి ఆన్ లైన్ లో హౌసింగ్ నిర్మాణాల గురించి పరిశీలించాము . ప్రభుత్వ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది.* *బేస్ మెంట్ లెవెల్ ఇళ్ళకు శ్లాబులు వేసినట్టు కాంట్రాక్టర్లు చూపించారు. ఇళ్ళు ఇవ్వకుండానే బిల్లులు తీసుకున్నారు, థర్డ్ పార్టీ విచారణ లేకపోవడం వీరికి అనుకూలంగా మారింది.* *స్టీల్, సిమెంట్ ను కాంట్రాక్టర్లు ముందుగానే డ్రా చేసి అమ్మేశారు. ఇళ్లు మంజూరు అయిన విషయం కనీసం లబ్ధిదారులకు సైతం తెలీకపోవడం శోచనీయం.* *బ్లాక్ లిస్ట్ లో పెట్టి భయపెట్టేందుకు, సరి చేసేందుకు పనులు చేసిన కాంట్రాక్టర్లు ఏమీ రెగ్యులర్ కాదు, ఏ డిపార్ట్మెంట్ లో కూడా నమోదు కానివారు.* *ప్రభుత్వం ఏదైనా అధికారులలో మాత్రం నిర్లక్ష్యం తీవ్రస్థాయిలో ఉంది. దీనికితోడు చర్యలు తీసుకోకపోవడం వీరికి అలుసుగా మారింది.* *ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ.ఈ., డీ.ఈ. లు మారరు. సంబంధిత సమస్యలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్యుద్దాలు జరుగుతుంటే వీరు చోద్యం చూస్తుంటారు.* *నాణ్యత ఒక్కటే పరీక్షించి అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదు, మెటీరియల్(స్టీల్, సిమెంట్), ఫిజికల్ బెనిఫిషియర్ (లబ్ధిదారులు) వివరాలను సైతం పరిశీలించాలి.* *అల్లూరు మండలం హౌసింగ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై స్వయంగా విచారించి పి.డి. గారికి నేనే స్వయంగా ఫిర్యాదు చేశాను. లబ్ధిదారుల వివరాలతో పాటు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను.* *హౌసింగ్ నిర్మాణం, మంజూరైన ఇళ్ళు, లబ్ధిదారుల వివరాలపై విచారణ కమిటీ వేశానని పి.డి. గారు చెప్పారు… కానీ నేటికి వాటి గురించి రిపోర్ట్ నాకు అందలేదు.* *ఆన్ లైన్ లో ఇళ్లు మంజూరు అయ్యాయని చూపిస్తున్న కారణంగా ఏ పేదవాడు భవిష్యత్తులో ఇల్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, కేంద్రం ఎంత నిధులు ఇచ్చినా, కలెక్టర్లు కనికరించినా పేదవాడికి న్యాయం జరగదు.* *హౌసింగ్ నిర్మాణాలలో జరిగిన అవినీతి, నిర్లక్ష్యం పై, లబ్ధిదారులకు జరగాల్సిన న్యాయం పట్ల కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి లోతైన విచారణ చేపట్టాలి. లేనిపక్షంలో పేదవాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయి.

E-పేపర్

ఎస్సీ మహిళ రిజర్వేషన్ స్థానంలో బీసీ అభ్యర్థి గెలుపుపై అభ్యంతరం కుల ధ్రువీకరణ పత్రాలపై తీవ్ర ఆరోపణలు

పున్నమి ప్రతినిధి : రిజర్వేషన్ ఉన్నట్టా లేనట్టా? మేడిపల్లి సర్పంచ్ ఎన్నిక న్యాయస్థానం మెట్లెక్కింది ఎస్సీ మహిళ రిజర్వేషన్ స్థానంలో బీసీ అభ్యర్థి గెలుపుపై అభ్యంతరం కుల ధ్రువీకరణ పత్రాలపై తీవ్ర ఆరోపణలు పున్నమి న్యూస్ యాచారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదంగా మారి న్యాయస్థానం వరకు చేరింది. మేడిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించగా, ముచ్చర్ల సుగుణ సుమారు 300 ఓట్ల మెజారిటీతో ఆలంపల్లి లావణ్యపై విజయం సాధించారు. అయితే విజయం సాధించిన సుగుణ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో, ఎస్సీకి కేటాయించిన స్థానంలో ఆమె ఎన్నిక ఎలా చెల్లుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మేరకు ఆలంపల్లి లావణ్య భర్త నరసింహ యాచారం మండల తహసీల్దార్, ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందజేశారు. నామినేషన్ పత్రాల పరిశీలన సమయంలోనే తాము అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే కులం మారుతుందా? అని ప్రశ్నిం చారు. రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని ఆరోపించారు. సుగుణ కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసేటప్పుడు కుమారుడి కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేశారని, అదే ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేసినట్లు తహసీల్దార్ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. అయితే స్వలాభం కోసమే కుమారుడి కుల ధ్రువీకరణను ఉ పయోగించారని ఆరోపణలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని, అఫిడవిట్లను సరిగా పరిశీలించలేదని ఆరోపించారు. ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తక్షణమే విచారణ జరిపి, అక్రమంగా గెలిచిన సర్పంచ్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ స్థానంలో ఆలంపల్లి లావణ్యను అధికారికంగా ప్రకటించాలని కోరారు. అప్పటివరకు గ్రామపంచాయతీలో ఎలాంటి అధికారిక వ్యవహారాలు జరపకుండా ఆదేశాలు జారీ చేయాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టరు కోరారు

E-పేపర్

వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో కొన్నసాగుతున్న నిరసన మూడో రోజు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో కొన్నసాగుతున్న నిరసన మూడో రోజు చేరుకున్నాయి జర్నలిస్టులు న్యాయ సమ్మతమైన డిమాండ్లకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. END

E-పేపర్

ప్రవాసుల భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ శక్తి.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం గోపాలపురం మండలం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ప్రవాస భారతీయుల దినోత్సవం *(జనవరి 9)* సందర్భంగా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు *ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాస సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.* ప్రవాస భారతీయులు కేవలం విదేశాల్లో నివసించే వారు మాత్రమే కాక, *ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న శక్తి అని ఆయన అన్నారు.* పెట్టుబడులు, నైపుణ్యాల మార్పిడి, విద్య, వైద్యం, సాంకేతికత, పరిశ్రమల రంగాల్లో ప్రవాసుల అనుభవం రాష్ట్ర పురోగతికి బలమైన పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. *ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్ నేడు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు.* అదేవిధంగా, రాష్ట్ర పర్యాటక రంగం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతోందని మంత్రి గారు అన్నారు. సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వారసత్వ సంపదతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను *గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రవాసుల అంతర్జాతీయ అనుభవం కీలకమని పేర్కొన్నారు.* పెట్టుబడులతో పాటు, *పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెస్టినేషన్ ప్రమోషన్, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం ద్వారా ప్రవాసులు రాష్ట్రానికి విలువైన భాగస్వాములుగా నిలవగలరని తెలిపారు.* హోటల్స్, రిసార్ట్స్, ఈకో, మెడికల్ & వెల్నెస్ టూరిజం రంగాల్లో వారి భాగస్వామ్యం ఉపాధి సృష్టికి, స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. *“మీ మూలాలు ఇక్కడే – మీ భాగస్వామ్యం కూడా ఇక్కడే”* అనే భావనతో ప్రవాసులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి–పర్యాటకం – ఉపాధి రంగాల్లో ప్రభుత్వం–ప్రవాసులు కలిసి ఒక బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకుందామని మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు “గౌ.కందుల దుర్గేష్” గారి కార్యాలయం (నిడదవోలు) END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈ నెల 12 తేదీన మాజీ ఉప రాష్ట్ర పతి నెల్లూరుకు రాక

నెల్లూరు జిల్లాలో మాజీ ఉప రాష్ట్రపతి ఎ, వెంకయ్య నాయుడు పర్యటన ఖారరైoది ఈ నెల 12 తేదీ నుంచి 17 తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమన్ శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు జనవరి 12న స్వర్ల భారత్ ట్రస్ట్కు వస్తారు 17 వ తేదీ మధ్యాహ్నం 12:30 నిమిషాలకు స్వర్ణ భారత్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేటి నుంచి సంక్రాంతి సెలవులు

జిల్లా లోని అన్ని యాజమాన్యం పాఠశాలలు, జూనియర్ కళాశాలకు నేటి నుంచి ఈ నెల 18 తేదీ వరకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు డిఈ ఓ డా ఆర్ బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు సెలవులలో తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వం నిబంధనలు మేరకు సదర్ పాఠశాల పై చర్యలు చే పా డ తమని స్పష్టం చేశారు అన్ని యాజమాన్యం పాఠశాలలు, కళాశాల సిబ్బంది సహకరించగలరన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వర్షాలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేటి నుంచి అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిషే అవకాశం ఉందని ప్రజల సహాయార్థం కలెక్టరె ట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ హిమన్ శుక్ల ఓక ప్రకటనలో తెలిపారు నేటి నుంచి 12 తేదీ వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు అత్యావసరం లో సహాయం కావాలంటే ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్స్ 0861-2331261,7995576699,1077 కు సంప్రదించాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగి మంటల్లో ప్లాస్టిక్ లు వేస్తే ప్రమాదకరం

టైర్స్, ప్లాస్టిక్ వస్తువులతో బోగి మంటలలో వేయవద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయాబ్ అప్సర్ తెలిపారు ఆయన మాట్లాడుతూ రానున్న బోగి, సంక్రాంతి పండుగలలో భాగంగా టైర్స్, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్, టీబీ, చర్మ, కంటి జలుబు వచ్చే ప్రమాదం ఉందన్నారు సంప్రదాయబద్దంగా పండుగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన ఏంఈ ఓ

ఉదయగిరి మండలం గడ్డంవారి పల్లి హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏం ఈ ఓ తోట శ్రీనివాసులు తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తo చేశారు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతమైన భోజనాన్ని అందించాలన్నారు పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.