Sunday, 26 April 2026

Blog

కర్నూలు

ప్రయాణికుల దాహార్తి తీర్చిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్

కర్నూలు (పున్నమి ప్రతినిధి) వేసవి తాపం, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ అభినందనీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ బూర్లీ సతీష్ గారు మరియు స్టేట్ చైర్మన్ ఎం. సాయి గారి ఆదేశాల మేరకు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు, బాటసారులకు మరియు విధుల్లో ఉన్న సిబ్బందికి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ​ఈ సేవా కార్యక్రమం కర్నూల్ డిస్ట్రిక్ట్ డీఓసీ (DOC) లావణ్య గారి ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా విద్యార్థులే ప్రయాణికుల వద్దకు వెళ్లి మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను అందించడం అందరినీ ఆకర్షించింది. ​ఎండలో ప్రయాణిస్తూ అలసిపోయిన తమకు చల్లటి మజ్జిగ, నీరు అందించి దాహార్తిని తీర్చిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ప్రతినిధులను, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ప్రయాణికులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. Uploaded Video:

రాజన్న సిరిసిల్ల

బీసీ సాధికారిత సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా నరేంద్ర చారి నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి బీసీ సాధికారిత సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా నరేంద్ర చారిని నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షులు పొలాస నరేందర్ మరియు బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా నరేంద్ర చారి మాట్లాడుతూ, బీసీలను జాగృతం చేసే దిశగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షులు పొలాస నరేందర్, అలాగే రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ గారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతం కోసం, బీసీల హక్కులు మరియు సమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తూ పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

అన్నమయ్య

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నిర్వహణ

అమరజీవి 125వ జయంతి సందర్భంగా నందలూరులో లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీ బచ్చు జయ భాస్కరరావు అధ్యక్షత వహించారు. అరవపల్లి బచ్చు భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ జయ భాస్కరరావు శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు గారు చేసిన త్యాగం అపారమని తెలిపారు. ఆయన 53 రోజులపాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఈ త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆంధ్రులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్యవైశ్య ప్రతినిధి ఎంబలూరు ప్రదీప్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శ్రీరాములు కొంతకాలం రైల్వే శాఖలో ఉద్యోగం చేశారని తెలిపారు. అనంతరం గాంధేయవాదిగా మారి అస్పృశ్యత నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఆత్మార్పణను ఈ సందర్భంగా స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్ర మణి యాదవ్, ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, గంధం గంగాధర్, గురు ప్రసాద్, బూశెట్టి వెంకటసుబ్బయ్య (నీటి సంఘం అధ్యక్షులు), మంటి మారయ్య, సునీల్ రెడ్డి, త్యాగరాజు, విస్డం స్కూల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే ఘనసన్మానం

*రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే సన్మానం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 16/03/2026* *బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ మరియు మహబూబ్నగర్ జిల్లా శాఖ సంయుక్త నిర్వహణలో జరిగిన స్థానిక జె ఆర్ ఆర్ గార్డెన్ లో బిసి సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కోశాధికారి రమేష్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి రాఘవేందర్, మల్లేష్ ,ధనుంజయ్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిస్థితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రస్తుత మేయర్ మమత వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కార్పొరేటర్లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ని రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి కమిషన్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి చే ఘన సన్మానం చేయడం జరిగింది*

మహబూబ్ నగర్

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే ఘనసన్మానం

*రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే సన్మానం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 16/03/2026* *బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ మరియు మహబూబ్నగర్ జిల్లా శాఖ సంయుక్త నిర్వహణలో జరిగిన స్థానిక జె ఆర్ ఆర్ గార్డెన్ లో బిసి సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కోశాధికారి రమేష్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి రాఘవేందర్, మల్లేష్ ,ధనుంజయ్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిస్థితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రస్తుత మేయర్ మమత వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కార్పొరేటర్లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ని రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి కమిషన్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి చే ఘన సన్మానం చేయడం జరిగింది*

మహబూబ్ నగర్

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే ఘనసన్మానం

*రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే సన్మానం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 16/03/2026* *బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ మరియు మహబూబ్నగర్ జిల్లా శాఖ సంయుక్త నిర్వహణలో జరిగిన స్థానిక జె ఆర్ ఆర్ గార్డెన్ లో బిసి సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కోశాధికారి రమేష్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి రాఘవేందర్, మల్లేష్ ,ధనుంజయ్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిస్థితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రస్తుత మేయర్ మమత వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కార్పొరేటర్లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ని రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి కమిషన్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి చే ఘన సన్మానం చేయడం జరిగింది*

మహబూబ్ నగర్

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే ఘనసన్మానం

*రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే సన్మానం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 16/03/2026* *బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ మరియు మహబూబ్నగర్ జిల్లా శాఖ సంయుక్త నిర్వహణలో జరిగిన స్థానిక జె ఆర్ ఆర్ గార్డెన్ లో బిసి సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కోశాధికారి రమేష్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి రాఘవేందర్, మల్లేష్ ,ధనుంజయ్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిస్థితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రస్తుత మేయర్ మమత వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కార్పొరేటర్లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ని రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి కమిషన్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి చే ఘన సన్మానం చేయడం జరిగింది*

మహబూబ్ నగర్

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే ఘనసన్మానం

*రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిచే సన్మానం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 16/03/2026* *బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ మరియు మహబూబ్నగర్ జిల్లా శాఖ సంయుక్త నిర్వహణలో జరిగిన స్థానిక జె ఆర్ ఆర్ గార్డెన్ లో బిసి సర్పంచులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కోశాధికారి రమేష్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి రాఘవేందర్, మల్లేష్ ,ధనుంజయ్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిస్థితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రస్తుత మేయర్ మమత వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కార్పొరేటర్లు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్ ని రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి కమిషన్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి చే ఘన సన్మానం చేయడం జరిగింది*

తిరుపతి

చిన్న బాబు సేవలను గుర్తించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రశంస అవార్డుతో సత్కరించిన ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి

పేద ప్రజల ఆరోగ్య సేవలో చినబాబు.. పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం మండలం పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుంటూ….. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ ఎన్. మురళీమోహన్ నాయుడు ( చిన్న బాబు ) సేవలను ఎన్టీఆర్ ట్రస్ట్ గుర్తించి ప్రశంస అవార్డును ప్రకటించింది.. శనివారం హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ 30వ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా ఎన్. మురళీమోహన్ నాయుడు( చిన్న బాబు)కు ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, నగిరి, జీడీ నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాలలోని పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎన్ చిన్న బాబు విశేష సేవలు అందించారు. 2017లో తిరుపతి రుయా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా , రామచంద్రాపురం మండలంలోని కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న విద్యా, వైద్య,రక్తదాన శిబిరాలు, విపత్తుల సాయం వంటి కార్యక్రమాలలో పాల్గొని ఎన్ చిన్నబాబు అందించిన సేవలు అమోఘమని ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి అభినందించారు.. ఉత్తమ సేవ ప్రశంస అవార్డు గ్రహీత ఎన్ చిన్నబాబు మాట్లాడుతూ నందమూరి తారకరామారావు యువతకు చైతన్య మూర్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు, ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలకు ప్రేరేపితుడైన చినబాబు తిరుపతి ప్రాంతంలో పలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజలు ప్రాణాలను కాపాడడానికి తోడ్పాటును అందించానన్నారు. శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. చినబాబుకు ఎన్టీఆర్ ట్రస్ట్ అరుదైన అవార్డు అందించడంతో పలువురు ఆయనకి అభినందనలు తెలియజేశారు. .ఈ కార్యక్రమంలో ట్రష్ట్ సిఈఓ రాజేంద్ర కుమార్, చీఫ్ ఆపరేషన్ అధికారి గోపి, తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ రవికుమార్, దినేష్, నూతలపాటి చంద్రబాబు, జయప్రకాష్, భాను, మురళి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ. వి. అప్పారావు స్టేషన్‌కు వచ్చిన మహిళలను సత్కరించారు. మహిళల గౌరవార్థం వారికి చీరలు మరియు స్వీట్లు అందజేశారు. మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి భద్రత మరియు సంక్షేమం కోసం పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని సి.ఐ. అప్పారావు తెలిపారు. మహిళల పట్ల గౌరవం పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కూడా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించాలని వారు కోరారు. END……

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.