కామారెడ్డి
కామారెడ్డి,14జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : సంక్రాంతి సందర్భంగా ఇసన్నపల్లి గ్రామ సంఘాల ఆద్వార్యంలో వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, ఇస్సనపల్లి గ్రామంలో, అంబేద్కర్ ఫ్రెండ్స్ యూత్తో ఉప్పల్వాయిగ్రామ జట్టు తలపడింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఇస్సనపల్లి అంబేద్కర్ ఫ్రెండ్స్ యూత్ ఘన విజేతగా నిలిచిం ది. రన్నరప్గా ఉప్పల్వాయి జట్టు స్థానం సంపాదిం చుకుంది. స్థానిక యువకులు హాజరై మ్యాచ్ను ఆసక్తికరంగా చూశారు. టోర్నీలో పాల్గొన్న జట్లు అందరూ కఠిన పోటీ ప్రదర్శించాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ దోకి లచ్చయ్య మాట్లాడుతూ,ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామ యువతలో ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, పెంపొందిస్తాయని అన్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో క్రీడలు జరగడం వల్ల ఐక్యత, స్నేహం పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వం క్రీడల అభి వృద్ధికి ప్రోత్సాహం ఇస్తోందని అన్నారు. ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్, చెడు అలవాట్లకు దూరం గా ఉండటానికి క్రీడలు ఉత్తమ మార్గం. ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా యువతలో పోటి,తత్వం, మంచి స్నేహితుల కలయికకు ఇలాం టి కార్యక్రమాలు గొప్ప అవకాశమని అంబేద్కర్ ఫ్రెండ్స్ యూత్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్ర మం స్థానిక సమాజంలో ఉత్సాహాన్ని మరింత పెంచిందన్నారు.