Friday, 27 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

“సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామన్న జిల్లా అధికారులు”

నెల్లూరు,  (పున్నమి ప్రతినిధి, సి ఎస్ రావు)  నెల్లూరు ,జిల్లా పరిషత్ ఆఫీస్ నందు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గారి ఆదేశాల మేరకు ఉద్యోగులకు మరియు పోలీసులకు మధ్య ఏర్పడిన వివాదాలపై చర్చించేందుకు డి ఆర్ ఓ గారు మరియు ఎ. ఎస్. పి గారి సమక్షంలో ఉద్యోగ సంఘ నాయకులు ప్రధానంగా APGEA, APRSA, HAMSA ,APVRA రాష్ట్ర నాయకులు చొప్పా రవీంద్ర బాబు గారు, వరిగొండ. కృష్ణారావు, చేజర్ల సుధాకర్ రావు, పంటా. అశోక్ కుమార్ రెడ్డి ,ఇతర సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన చర్చను ఉద్దేశించి APGEA రాష్ట్ర నాయకులు చొప్పా. రవీంద్ర బాబు గారు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 విధుల్లో భాగంగా అత్యవసర సేవలను అందించే డిపార్ట్మెంట్ అధికారులు ,ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరోచితంగా సేవలు అందిస్తున్నారని, రెట్టింపు స్థాయిలో పోలీసు యంత్రాంగం కూడా సేవలు అందిస్తున్నారని , జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖల అధికారులతో కలుపుకొని పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం వంతంగా సేవలు అందించే విధంగా చేస్తున్నారని, కొంతమంది కిందిస్థాయి అధికారులు చేసే తప్పిదాల వల్ల, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని , ఉద్యోగులపై దాడులు చేస్తూ, మానసిక వేదనకు గురి చేయడం సరికాదని ,ఇతర శాఖల ఉద్యోగులను విధి నిర్వహణలో వస్తున్నప్పుడు మాట్లాడే విధానం సరిగా ఉండాలని అని, ఒకరిద్దరు పోలీసు అధికారులు ,ఉద్యోగులు చేసే చర్యల వల్ల , వ్యవస్థ మొత్తానికి ఆపేరు వస్తుందని , డివిజన్ స్థాయి అధికారులు ఆర్డిఓ ,డిఎస్పి గార్లు ఇచ్చిన పాస్ లను పట్టించుకోకుండా జరిమానాలు విధించడం ఎంతవరకు సమంజసమని, ప్రతి పోలీస్ పోస్ట్ దగ్గర ఉద్యోగులును ఎక్కువసేపు ఆపడం వల్ల ,సకాలంలో అత్యవసర సేవలు అందించలేక పోతున్నాం అని విధి నిర్వహణలో వెళ్తున్న వారిని దండించే హక్కు, తిట్టే హక్కు ఎవరిచ్చారని, ఒక ఉద్యోగి తోటి ఉద్యోగిని అకారణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి పరిస్థితులకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని, సమస్యలు పునరావృతం కాకుండా , ఉద్యోగులు అందరూ సృహత్బావ వాతావరణంలో మంచిగా ఉండేటట్లు చూడాలన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

దువా చేస్తున్న ట్రాఫిక్ పోలీసు

నెల్లూరు  (పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ) గుంటూరు రెడ్ జోన్ లో విధినిర్వహణలో ఉపవాసం వుంటూ ఉపవాస విరమణకు ముందు ప్రత్యేక దువా చేస్తున్న ట్రాఫిక్ పోలీసు లాలాపేట పొలిసు స్టేషన్ ఏ ఎస్ ఐ కరీముల్లా.

Featured ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయ నిధికి 36 లక్షల 50 వేలు

నెల్లూరు, ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ ) ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు కోవిడే 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు అందచేసిన 36 లక్షల 50 వేల రుాపాయల చెక్కులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ .జగన్మోహన్ రెడ్డి గారికి అందచేసిన రాష్ట్ర హోమ్ శాఖా మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచిరిత గారు అందజేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

“కష్టకాలంలో అండగా ఉంటాం అంటున్న ఉద్యోగ సంఘాలు “

నెల్లూరు, 26.04.2020, (పున్నమి ప్రతినిధి, సి.ఎస్.రావు) “కష్టకాలంలో అండగా ఉంటాం అంటున్న ఉద్యోగ సంఘాలు ” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాయకులు, అధికారులు ,ఉద్యోగులు సచివాలయ ఉద్యోగుల సహకారంతో నిర్వహిస్తున్న ఈసేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు డైరెక్టర్ తమ్మినేని .పాండు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతా మయి వృద్ధుల ఆశ్రమం ,బాలాజీ నగర్ నెల్లూరు నందు 100 మంది చిన్నారులకు ,వృద్ధులకు అన్నదానం నిర్వహించడంతోపాటు, మాస్కులు, బిస్కెట్స్ చేయడం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి చేజర్ల సుధాకర్ రావు ఏపీ జి ఈ ఏ జిల్లా నాయకులు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 లాక్ డౌన్ సందర్భంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయి సాధారణ జనం ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ,ఉద్యోగుల సమన్వయంతో ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు గీతామయి వృద్ధులు- చిన్నారుల ఆశ్రమంలో అన్నదానం, మాస్క్ లు పంపిణీ ,బిస్కెట్స్ అందజేసేందుకు శ్రీ పోలుపోగు. నరసింహారావు ,సూపరిండెంట్, పే మరియు అకౌంట్స్ ఆఫీస్, వర్క్స్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఒంగోలు వారు ముందుకు వచ్చి తమవంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు, ఆకలితో అలమటిస్తూ చెప్పుకోలేని దుస్థితి, దీన స్థితిలో అనేక మంది ఉన్నారని వారందరినీ కొంతమేరకు ఆదుకునేందుకు ఆకలి తీర్చేందుకు, అధికారులు ఉద్యోగులు తరలి ముందుకు రావాలని ఆయన అన్నారు ‌ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు ఏనుగు రమణారెడ్డి ,పులి సతీష్, లక్ష్మీనారాయణ, , ఏవి. సురేష్ , చేజర్ల.తేజ విఆర్ఓ,రంజిత్, నాగరాజు, ఎస్ వి సుబ్బారెడ్డి, కిరణ్, సుధాకర్ రెడ్డి ,ఎపిజి ఈ ఏ మహిళా విభాగం జిల్లా చైర్మన్ టి. సౌందర్య జిల్లా కన్వీనర్ జిఎస్ఎల్. సౌజన్య కో చైర్మన్ ఆర్. ఇందిర, వైస్ చైర్మన్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

ప్రసిద్ధ చారిత్రక క్షేత్రం అలఘమల్లారి దేవాలయం

వెలుగోటి వారి పాలనలో ప్రసిద్ధికెక్కిన మన్నారు పోలూరు శ్రీకృష్ణుని ఆలయం ( పున్నమి ప్రతినిధి. షేక్. రసూల్ అహమద్ ) :  బ్రహాండ పురాణకాలములో మణిమంటపక్షేత్రముగా, నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన  పుణ్యక్షేత్రం అలఘమల్లారి కృష్ణస్వామి దేవాలయం. ఈ దేవాలయం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు దగ్గరలో ఉన్న మన్నారుపోలూరు అనే గ్రామములో వెలసి వుంది. సంపదలకు నిలయంగా ఉండే ప్రతి గుడికి ఓ పురాణగాథ ఉన్నట్టే ఈ గుడికి కూడా ఓ పురాణం ఉంది. ద్వాపరయుగంలో సత్రాజిత్తుడనే రాజు తన తపోబలముచే సూర్యుని వలన శ్యమంతకమణిని సంపాదించెను. శ్రీకృష్ణుడు ఆ మణి  మహాత్యమును తెలిసుకొని దానిని తనకివ్వవలసినదిగా  సత్రాజిత్తు రాజును కోరగా , అందుకు ఆరాజు నిరాకరించెను. తరువాత ఒకనాడు సత్రాజిత్తుని తమ్ముడగు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లగా అడవిలో ఒక సింహము ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకొని వెళ్లుచుండగా, ఆ ప్రాంతంలో తపస్సు చేసుకొంటున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసికొనివచ్చి తన కుమార్తె ఐన జాంబవతికిచ్చెను. కానీ మోసముచే శ్రీకృష్ణుడే ప్రసేనుని వధించి శమంతక మణిని దొంగతనంగా తీసుకున్నాడని లోకములో అపవాదు కలిగేను.కొంత కాలము తరువాత ఒకనాడు దండకారుణ్యమునకు వేటకు వచ్చిన కృష్ణుడు జాంబవతి వద్దనున్న శమంతకమణి చూసి, తనపైఉన్న అపవాదును పోగొట్టుటకు , త్రేతాయుగములో శ్రీరామావతారములో జాంబవంతుడికిచ్చిన వరమును చెల్లించుటకు గాను శ్రీకృష్ణుడు జాంబవంతునితో 18 రోజులు మల్లయుద్దము చేసి జాంబవంతుడిని ఓడించి శ్యమంతకమణితో పాటు జాంబవతిని కూడా వివాహమాడెను. అందువలన ఇక్కడ వెలసివున్న కృష్ణస్వామికి అలఘమన్నారి  కృష్ణస్వామి అను పేరు కలిగినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రపాలకుడు జాంబవంతుడు. కృష్ణుడు మణిని సత్రాజిత్తునికిచ్చి తనపై ఉన్న అపవాదును పోగొట్టుకొనెను. అప్పుడు సత్రాజిత్తు శ్రీకృష్ణుని మెచ్చుకొని తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహము చేసి ఆ మణిని తిరిగి శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చెను. ఇక చారిత్రకంగా ఈ గ్రామము ఒకప్పుడు వడ్డెరాజులకు ముఖ్యపట్టణంగా ఉండింది. 12వ శతాబ్దములో మనుమసిద్ధి రాజుగారి బంధువు తిక్కరాజు ఉత్సవకాలములో ప్రత్యేక వసతులు కల్పించినట్లు ఈ ఆలయంలో శిలాశాసనము వుండింది. ప్రస్తుతం అది కనపడుటలేదు.కల్నల్ మేకంజి కైఫీయత్తులో ఈ దేవాలయ స్థల పురాణం రాయబడింది. దేవాలయం వెనక వైపు రాజుల కాలంనాటి  శిధిల కోట ఆనవాళ్లు ఉన్నాయి.  వెంకటగిరి రాజుల కాలంలో ఈ దేవాలయం  మహోన్నత స్థాయికి చేరింది. వెంకటగిరి రాజులు  ఈ దేవాలయ నిర్వహణకు 5 గ్రామాలతోపాటు వేల ఎకరాలు దానంగా ఇచ్చారు. వెలుగోటివారు మన్నారు పోలూరును తూర్పు దక్షిణ రాజ్యానికి  తమ ముఖ్య కేంద్రంగా వాడుకొన్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో దేవదాసీలు ఆలయానికి అనుబంధంగా పనిచేసేవారు. వెంకటగిరి రాజాల దర్బారులో, అలాగే సంస్థానానికి చెందిన  ప్రతి ఉత్సవాల్లో మన్నారు పోలూరు దేవాసీలు ఉండేవారు. అత్యంత ఆకర్షణీయంగా ఉండే  మన్నారుపోలూరు దేవదాసీల కోసం వెంకటగిరి రాజుల యొక్క అతిధులు అధికారులు ఆఖరికి పామర జనాలు కూడా ఎగబడేవారు. పెద్ద ఎత్తున రంగమంటపాలు వీరికోసం ఉండేవి. దేవదాసీలు దేవాలయంపై వచ్చే ఆదాయం పైన ఆధారపడి వీరు బతికేవారు. జమీందారి రద్దు తర్వాత దేవదాసీల జీవితం దుర్భర స్థితిలోకి నెట్టివేయబడింది. ఇక దేవాలయంలోని శిల్ప కళ ద్రావిడ శైలిలో కట్టబడింది . ప్రతి శిల్పం ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. నవరసాలకు ప్రతిబింబంగా ఇక్కడి శిల్పకళావైభవం వర్ధిల్లుతోంది. ఇందుకు ఉదాహరణగా గర్వభంగము అయిన గరుత్మంతుడు రోధిస్తున్నట్టు విగ్రహ కనులనుండి నీరుకారుతున్నట్టుగా గోచరిస్తుంది. ఇలా ప్రతి శిల్పం ప్రత్యేకలక్షణము కలిగి ఈ దేవాలయం భారతదేశములో ప్రసిద్ధ పుణ్యక్షేత్రములో ఒకటిగా విరాజిల్లుతోంది.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

కరోనా వైరస్ కంటే ముందే ఆకలి అనే వైరస్ ప్రజలను చంపేస్తుందా ?

( పున్నమి ప్రతినిధి ) : కరోనా దెబ్బకు ప్రపంచమంతా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది, తీవ్ర దుర్భిక్షంలోకి దేశాలు నెట్టివేయబడుతున్నాయి. కెన్యా రాజధానిలోని అతిపెద్ద మురికివాడలో ప్రజలు ఆహారంకోసం జరిగిన ఘర్షణలో కొందరు  గాయపడ్డారు మరియు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. భారతదేశంలో, వేలాది మంది కార్మికులు రోజుకు రెండుసార్లు రొట్టె మరియు వేయించిన కూరగాయల కోసం వరుసలో ఉన్నారు. కొలంబియా అంతటా ఆకలితో ఉంటున్నామని తెలియడానికి, పేద కుటుంబాలు వారి కిటికీలు మరియు బాల్కనీల నుండి ఎర్రటి దుస్తులు మరియు జెండాలను వేలాడదీసి తాము ఆకలితో ఉన్నామనడానికి సంకేతంగా వేలాడదీస్తున్నారు.  “మాకు డబ్బు లేదు, ఇప్పుడు మనం బ్రతకాలి” అని పౌలిన్ కరుషి అన్నారు ఆమెకు నైరోబిలోని ఒక ఆభరణాల వ్యాపారంలో ఉద్యోగం పోయింది, ఆమె బిడ్డ మరియు మరో నలుగురు బంధువులతో కలిసి ఇరుకైన  రెండు గదులలో నివసిస్తుంది. తినడానికి ఏమి లేదు అంటే కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఆకలిని తెచ్చిపెట్టింది. జాతీయ లాక్‌డౌన్లు మరియు సామాజిక-దూర చర్యలు, పని మరియు ఆదాయాలను ఎండబెట్టాయి,  వ్యవసాయ ఉత్పత్తి మరియు సరఫరా మార్గాలకు అంతరాయం కలిగించాయి. దీంతో లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ను ధనవంతులు మరియు పేదలు ఇద్దరిని అనారోగ్యానికి గురిచేసి కొన్నిసార్లు సమానత్వం చూపించింది. కానీ ఆహారం విషయానికి వస్తే సమరూపం చూపించలేదు.పేద, ధనిక దేశాల మధ్య అంతరం అలాగే ఉంది, ఆకలితో ఉన్న అవకాశాన్ని ఎదుర్కొంటున్నప్పుడు క్లాసిఫికేషన్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆశా జాఫర్ అనే  స్వచ్ఛంద సేవకుడు నైరోబి మురికివాడలోని కుటుంబాలకు ప్రాణాంతక తొక్కిసలాట తరువాత ఆహారాన్ని తీసుకువచ్చాడు. తరగతి విభజనపై ఉన్న అడ్డు తెరను వెనక్కి లాగడం ద్వారా  ఈ దేశంలో ఎంత లోతైన  అసమానంగా ఉందో బహిర్గతం చేస్తోంది. ఇలాంటి సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే, 135 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు, కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి దీన్ని రెట్టింపు చేయవచ్చని  ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చీఫ్ ఎకనామిస్ట్ ఆరిఫ్ హుస్సేన్ అన్నారు. మొత్తంగా, సంవత్సరాంతానికి 265 మిలియన్ల మంది ప్రజలు ఆకలి అంచుకు నెట్టబడతారని చెప్పారు. మేము ఇంతకు ముందెన్నడూ చూడని మహా ఆహార సంక్షోభం అని హుస్సేన్ అన్నారు. ప్రపంచం ఇంతకు ముందు తీవ్రమైన ఆకలి సంక్షోభాలను ఎదుర్కొంది, కానీ అవన్నీ ప్రాంతీయమైనవి మరియు ఒక కారకం లేదా మరొక కారణంతో సంభవించాయి.  తీవ్రమైన వాతావరణం, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలు లేదా రాజకీయ అస్థిరతతో  ఈ ఆకలి సంక్షోభం ప్రపంచవ్యాప్తమని, మరియు కరోనావైరస్ మహమ్మారితో  ముడిపడివున్న అనేక కారణాల వల్ల మరియు ఆర్ధిక క్రమం యొక్క అంతరాయం కారణంగా ఈ ఆహార సంక్షోభం సంభవిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే  లెక్కలేనన్ని మిలియన్ల మందికి ఆదాయంలో అకస్మాత్తుగా నష్టం, చమురు ధరల పతనం,  పర్యాటక రంగం నుండి కఠినమైన కరెన్సీ కొరత, విదేశీ కార్మికులు ఇంటికి పంపించడానికి ఆదాయాలు లేకపోవడం, వాతావరణ మార్పు, హింస, జనాభా తొలగింపులు మరియు మానవతా విపత్తులు వంటి కొనసాగుతున్న సమస్యలు  లేదా సామాజిక భద్రత లేకపోవడం, ఆహార ధరల పెరుగుదల, వంటి కారణాలతో ప్రపంచం ఆహార కొరతగా దిశగా అడుగులు వేస్తుంది.  ఇప్పటికే, హోండురాస్ నుండి ఆఫ్రికాకు  ఆఫ్రికానుండి భారతదేశానికి ఆహార సంక్షోభం పెద్దముప్పుగా పరిణమించే అవకాశముంది. వైరస్ వల్ల దోపిడీ విచ్ఛిన్నమైంది వేతనాలు ఎండిపోయినందున, ప్రపంచవ్యాప్తంగా సుడాన్ మరియు జింబాబ్వే వంటి నగరాలను ప్రజలు విడిచిపెట్టినందుకు మిగతా దేశాల ఆర్ధికవ్యవస్థలు మరింతగా క్షీణించాయి. మిలియన్ల ప్రజలు ఇంటికి నడవడం,ఇతర ప్రదేశాలకు బయలుదేరడం లేదా ఆగిపోవడం లాంటి బీభత్సమైన వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాలు పోషకమైన భోజనం కోసం ఎక్కువగా చమురును ఉపయోగించారు. ఇది కూడా సంక్షోభానికి కారణమైంది. దీనికి భిన్నంగా ఇండియా తమ విశిష్టతను ఆహారం మరియు మెడిసిన్ పదాల్లో చూపిస్తుంది. అయితే వాస్తవం ఇంకోలాఉంది దేశం మొత్తం వలస, సంచార జాతులు తీవ్ర ఆకలితో చిక్కుకు వున్నారని మాధ్యమాలు ఘోషిస్తున్నాయి, దేశరాజధాని ఐన ఢిల్లీలోవలసకార్మికులు ఆహార సంక్షోభంలో చిక్కుకున్నారనే ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే అలాంటిది ఏదినిజం కాదని ఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి. గణాంకాలు ఎలా ఉన్న “కరోనా వైరస్ కంటే ముందే ఆకలి అనే వైరస్ ప్రజలను చంపేస్తుందా,” అన్న సందేహాలు నేటి నాగరిక సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.

Featured ఆంధ్రప్రదేశ్ వీడియోలు

లక్ష్మణరేఖ షార్ట్ ఫిల్మ్ బిగ్ మెసేజే ఇచ్చింది..

ప్రముఖ సినీ మాటల రచయిత మరియు నెల్లూరీయుడు శ్రీ పి.రాజేంద్రకుమార్ సమర్పణలో,శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారి నేతృత్వంలో ,శ్రీ నందమూరి తారకరామారావు ఎడిటింగ్ తో ఈ కరోనా లాక్ డౌన్ లో మనం ఇళ్ళలోనే ఉండి లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాలన్న భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు ఉత్తేజితుడైన ఓ బాబు తన హోంవర్కు చేసుకుంటూ టీవీ లో మోదీ ఉపన్యాసం విని చాక్పీసు తీసుకొని తన అపార్ట్మెంట్ ప్రధాన గేటువద్ద గీతగీచి…ఇది మన మోడీతాతయ్య చెప్పిన లక్ష్మణరేఖ… మనం మన ఇళ్ళలోనే ఉందాం. మనమంతా క్షేమంగా ఉందాం…జైహింద్…అంటూ అనంతరం లక్ష్మణరేఖ టైటిల్ భారతదేశం…జాతీయ పతాకం…లక్ష్మణరేఖ భగ్గుమంటూంటే కరోనా ని అడ్డుకొంటున్నతీరు…రాజేంద్రకుమార్ అత్యధ్భుతంగా చిన్న నిడివిలోనే పెద్ద సందేశాన్ని ఇచ్చారు. చి.ప్రఖ్యాత్ శౌర్య ఐదేళ్ళ వయస్సులో చక్కగా అభినయం చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సు మణికొండలో చదువుతున్న ప్రఖ్యాత్ శౌర్య (ప్రత్యూష రవిచంద్ర ఏకైక కుమారుడు)(మన నెల్లూరీయుడు న్యాయవాది జీవి నాగరాజరావు సుధారాణి ల మనవడు) ఇంతటి చక్కని సందేశాన్ని ఇచ్చే షార్ట్ ఫిల్మ్ టైటిల్ డిజైను శ్రీ నితీష్ కళ్యాణ్ చేశాడు. మంచి సందేశం మిళితమైయుంది. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్వహించిన పీ.రాజేంద్రకుమార్ అభినందనీయుడు. ఈ షార్ట్ ఫిల్మ్ మంచి ఖ్యాతిపొందాలనీ..తదనుగుణంగా అవార్డు పొందాలని పున్నమి కోరుకుంటుంది.

Featured ఆంధ్రప్రదేశ్

జిల్లాకు 2వేల ట్రూనాట్ మిషన్సు : జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు

జిల్లాకు 2వేల ట్రూనాట్ మిషన్సు రావడం జరిగిందని , వీటిని హాట్ స్పొట్ లలో వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు తెలిపారు. గురువారం సాయంత్రం జడ్పీ ఆవరణలోని డిస్ట్రిక్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కు 2 వేల ట్రూనాట్ టెస్టింగ్ ఎక్యుప్మెంట్ రావడం జరిగిందని, వీటిని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వినియోగించి , రేపటి లోగా 2 వేల శాంప్లిల్స్ తీయాలని లక్ష్యం గా నిర్ణయించినట్లు తెలిపారు.ట్రూనాట్ మిషన్ ద్వారా రాపిడ్ టెస్ట్ నిర్వహించేందుకు గంట నుండి గంటన్నర సమయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, ఎన్.డి.ఆర్.ఎఫ్. నుండి శిక్షణ పొందిన 22 మంది సిబ్బంది నెల్లూరు కు రావడం జరిగిందని , వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కరోనా నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు డివిజన్ స్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారి , డిఎస్పీ, డిప్యూటి డి.ఎం. అండ్ హెచ్.ఓ మరియు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి లోని కంటైన్మైంట్ ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ పర్సన్స్ ను గుర్తించి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు లాక్ డౌన్ సమయంలో ప్రజలు సహకరించడం జరిగిందని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం (పున్నమి ప్రతినిధి ` డా॥ గంగిశెట్టి శివకుమార్‌) మహామంత్రి తిమ్మరుసు చిన్నతనంలో గురువు పలక మీద గీత గీసి, తుడపకుండా దాన్ని చిన్నది చేయమంటే దాని పక్కనే పెద్ద గీత గీశాడు. ఆటోమాటిగ్గా ముందున్న గీత చిన్నదై పోయింది. ప్రస్తుత ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ‘‘కరోనా’’ ఒక్కటే పెద్ద వ్యాధి అయింది. తదితర వ్యాధులన్నీ చిన్నవైపోయాయి. హాస్పిటల్స్‌, క్లీనిక్‌లు చాలా వరకు పనిచేయకపోయినా బాధపడేవారో, లేక ఇబ్బంది పడేవారో లేరు. డాక్టర్ల దగ్గరకు పోయే వారూ తగ్గిపోయారు. మందుల షాపు తెరచి వుండడంతో చాలా వరకు వారి చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్ని మందుకొని పరిష్కరించుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాధులకు టెన్షన్‌ పడడం తగ్గిపోయింది. తమ సహజ సిద్ధంగా  ఉన్న ‘రోగనిరోధక శక్తి’ మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. దేశంలో ప్రతి చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి దాకా చీటికి మాటికి కంగారెత్తిపోయి ఆసుపత్రులు చుట్టూ తిరిగే జనం లాక్‌డౌన్‌ సందర్భంగా బాగా ఇబ్బంది పడతారని విశ్లేషకులు అంచనావేశారు. అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ఆందోళన వెలిబుచ్చారు. కానీ లాక్‌డౌన్‌ మూడు వారాలు గడిచాక చూస్తే అలాంటి ఆందోళనకు అవకాశమే లేకుండా పోయింది. దేశంలో మరణాల రేటు ఏమీ పెరిగిన దాఖలాలు లేవు. మన దేశంలో మధ్యతరగతి వాళ్లు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడం మానేసి చాలా కామైంది. పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల మీద ఆధారపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ అనవసరంగా  పరీక్షలు, స్కానింగ్‌ పేరిట పెద్ద ఎత్తున జనాన్ని దోపిడీ చేయడం ప్రారంభించారు. అయినా ప్రాణ భయంతో ప్రతిచిన్న ఆరోగ్య సమస్యకు వైద్యులను సంప్రదించడం, రోగుల వేలకు వేలు దారపోసుకోవడం జరుగుతూ వుండేది. కరోనా దెబ్బతో ఆ దోపిడీ వ్యాపారం వెనక్కుపోయింది. ఇంటి పట్టునే వుండడం, ప్రశాంతంగా వుండటం, వత్తిడి లేకుండా వుండటం, సరదాగా కుటుంబ సభ్యులతో గడపటం, టి.వి.లో కార్యక్రమాలు చూస్తూ వినోదించడం, చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు డాక్టర్‌ దగ్గరకు పోకుండా ప్రత్యామ్నాయ, సాంప్రదాయ వైద్యవిధానాలతో సరిపెట్టుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా ప్రజల్లో ఈ చైతన్యం కొనసాగాలని నిపుణులు కోరుకుంటున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఇది.. ఓ కరోనా మిగిల్చిన విషాద కథ..

ఇది.. ఓ కరోనా మిగిల్చిన విషాద కథ..అన్నీ ఉన్నా అనాథను చేసిన విషాద ఘటన.. ప్రపంచాన్ని వణికిస్తున్న కా రోనా మహమ్మారి తెలుగురాష్ట్రాల్లో మిగిల్చిన కన్నీటి వ్యధ. ఆయనో… పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్.. ఆస్తిపరుడు.. ఆర్ధిక స్థితిమంతుడు… పెద్ద ఎత్తున బంధుత్వాలు ఉన్నాయి..అతని చేత్తో వైద్యం చేస్తే.. ఎలాంటి రోగమైనా.. కీళ్లనొప్పులు..కాళ్ళనొప్పులు.. ఇట్టే మాయమౌతాయి… ఆయన హస్తవాసికున్న ప్రత్యేకతది… అందుకే 50 నుంచి 60 ఏళ్ల వయస్కులకు ఆయన వైద్యమంటే అంత నమ్మకం.. అందుకే ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే కనీసం వారం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.. అలాంటి వైద్యుడు …ముఖ్యంగా ఓ వర్గానికి చెందినవారి కి ఆయన వైద్యం పట్ల అపారమైన నమ్మకం… వైద్యం కోసం వెళ్లినవారిని నఖశిఖలా తడుముతూ.. నొప్పులు తగ్గిస్తారు..బహుశా ఏ డాక్టర్ అతనిలా రోగిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా వైద్యం చేయరేమో.. చివరికి రోగిపట్ల ఆ ఆప్యాయత ఆయన ప్రాణాలు తీసింది.. కరోనా రూపంలో కాటేసింది..వారం క్రితం వరకు వైద్యం చేసిన ఆ చేతులను..ఆ డాక్టర్ ను తాకేందుకు.చివరికి చూసేందుకు అందరూ భయపడ్డారు..ఆఖరి దశలో అనాథలా కాలగర్భంలో కలిసిపోయారు..ఇదే మొన్న కరోనా తో కన్నుమూసిన డాక్టర్ పీ. లక్ష్మీనారాయణ రెడ్డి..కథ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మొహం మరి ఎంత కఠినంగా కఠోరంగా భయంకరంగా ఉంటుందో దానికి చేతుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారి దుస్థితిని చూస్తే ఎవరికైనా గగుర్పాటు కలగకమానదు కరోనా మహమ్మారి కాటేస్తే వారి జీవితం ఎంతటి దుర్భరంగా ఉంటుందో ఇప్పటివరకు మనం విన్నాం ప్రపంచవ్యాప్తంగా కన్నం నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం ఈ కరో నా మహమ్మారి బారినపడ్డ డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి జీవిత చరమాంకం పెద్ద తార్కాణం.. ఆయన మరణాంతర పరిస్థితి చూస్తే ఎవ్వరైనా గగుర్పాటుకు గురికాకతప్పుదు. ఈ వ్యాధి సోకితే ఎంతటి దుర్భర స్థితి ఉంటుందో మనిషిలో గుబులు పుట్టిస్తోంది.ఒక డాక్టర్ గా తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి చివరకు దిక్కులేని దహన సంస్కారాలకు గురయ్యారు. నెల్లూరు నగరంలో ఆర్థో వైద్య చికిత్సల్లో చేయి తిరిగిన డాక్టర్ లలో ఆయనొకరు. అంతకుమించి మంచి హస్త వ్యాధి కలిగిన వైద్యుడిగా పేరుంది.. డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డికి. ఎంతోమంది వైకల్యం కలిగిన వారికి దారి చూపారు. ప్రమాదాల్లోనో… పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన అనేకమందికి జీవితం మీద నమ్మకాన్ని ,భరోసాను కలిగించారు ఆయన.. అంతటి వైదుడిని కరోనా క్షబ్సలించినానంతరం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. ఎంతోమందిని వైద్యం కోసం స్ఫురించిన ఆయన్ను తాకేందుకు ఏ చేతులూ ముందుకు రాలేదు.. నిరంతరం వైద్యసేవల్లో మునిగి ఉండే ఆయనకు వారం క్రితం . అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్తితి విషమంగా ఉండటంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు.పరిస్థితి విషమించడంతో లక్ష్మీనారాయణ రెడ్డిని మెరుగైన వైద్య చికిత్సలు కోసం పక్కరాష్ట్రం చెన్నై లోని అపోలో హాస్పిటల్స్ కి తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. అరుదైన డాక్టర్ని పొట్టన పెట్టుకున్న కరోనా ఆయన కుటుంభం,తన వైద్యశాల పైనా పంజావిసిరింది.దురదృష్టవశాత్తూ ఆయన చనిపోవడానికి ముందే కరోనా వల్ల ఆయన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. అక్కడ వారికి పాజిటివ్ అని తేలడంతో వారు నెల్లూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత డాక్టరు చనిపోగా కేంద్ర నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు.బట్ కరోనా మరణం కావడం – ప్రత్యేక అనుమతులు అవసరం కావడం వల్ల బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.  సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంటే అదీ లేదు. ఆస్పత్రి సిబ్బంది ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ అక్కడ శవ దహనానికి నిరాకరించారు. మరో చోట కూడా అలాగే జరిగింది.  కారణమేంటో తెలుసా… ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో మరణాలకే చేయాలని వారికి నిబంధనలు ఉన్నాయట. ఏం  చేయాలో తోచని సిబ్బంది… అంబత్తూరు శ్మశాన వాటిక వద్దకు ఆ డాక్టరు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం తీసుకెళ్లారు. ఇది తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడి ధర్నాకు దిగారు.కరోనాతో మృతి చెందిన వారికి ఇక్కడ దహనం చేయడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. ఆస్పత్రి సిబ్బందిని దూషించారు.దాంతో చేసేది లేక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు…డాక్టర్ డెడ్ బాడీ ని మళ్ళీమార్చురీకి తరలించారు.తెల్లవారు ఝామున ఎవ్వరూ లేనిసమయంలో అంబత్తూర్ ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు తరలించి డాక్టర్ అంత్యక్రియలు పూర్తిచేశారు.. ఆస్తులు.. ఆర్థిక పరిస్థితులు.. బందుగణం.. ఉన్న ఒక పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్ కరోనా భారిన పడితే ఎలాంటి ఎదురైందో చూడండి.. చివరకు అంత్యక్రియలు కు నోచుకోని దుస్థితి.. ఎదురైందంటే.. ఈ మహమ్మారిపట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రతీ ఒక్కరూ ఆలోసించండి… బీ కేర్ ఫర్ కరోనా.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.