Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ వీడియోలు

లక్ష్మణరేఖ షార్ట్ ఫిల్మ్ బిగ్ మెసేజే ఇచ్చింది..

ప్రముఖ సినీ మాటల రచయిత మరియు నెల్లూరీయుడు శ్రీ పి.రాజేంద్రకుమార్ సమర్పణలో,శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారి నేతృత్వంలో ,శ్రీ నందమూరి తారకరామారావు ఎడిటింగ్ తో ఈ కరోనా లాక్ డౌన్ లో మనం ఇళ్ళలోనే ఉండి లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాలన్న భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు ఉత్తేజితుడైన ఓ బాబు తన హోంవర్కు చేసుకుంటూ టీవీ లో మోదీ ఉపన్యాసం విని చాక్పీసు తీసుకొని తన అపార్ట్మెంట్ ప్రధాన గేటువద్ద గీతగీచి…ఇది మన మోడీతాతయ్య చెప్పిన లక్ష్మణరేఖ… మనం మన ఇళ్ళలోనే ఉందాం. మనమంతా క్షేమంగా ఉందాం…జైహింద్…అంటూ అనంతరం లక్ష్మణరేఖ టైటిల్ భారతదేశం…జాతీయ పతాకం…లక్ష్మణరేఖ భగ్గుమంటూంటే కరోనా ని అడ్డుకొంటున్నతీరు…రాజేంద్రకుమార్ అత్యధ్భుతంగా చిన్న నిడివిలోనే పెద్ద సందేశాన్ని ఇచ్చారు. చి.ప్రఖ్యాత్ శౌర్య ఐదేళ్ళ వయస్సులో చక్కగా అభినయం చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సు మణికొండలో చదువుతున్న ప్రఖ్యాత్ శౌర్య (ప్రత్యూష రవిచంద్ర ఏకైక కుమారుడు)(మన నెల్లూరీయుడు న్యాయవాది జీవి నాగరాజరావు సుధారాణి ల మనవడు) ఇంతటి చక్కని సందేశాన్ని ఇచ్చే షార్ట్ ఫిల్మ్ టైటిల్ డిజైను శ్రీ నితీష్ కళ్యాణ్ చేశాడు. మంచి సందేశం మిళితమైయుంది. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్వహించిన పీ.రాజేంద్రకుమార్ అభినందనీయుడు. ఈ షార్ట్ ఫిల్మ్ మంచి ఖ్యాతిపొందాలనీ..తదనుగుణంగా అవార్డు పొందాలని పున్నమి కోరుకుంటుంది.

Featured ఆంధ్రప్రదేశ్

జిల్లాకు 2వేల ట్రూనాట్ మిషన్సు : జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు

జిల్లాకు 2వేల ట్రూనాట్ మిషన్సు రావడం జరిగిందని , వీటిని హాట్ స్పొట్ లలో వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు తెలిపారు. గురువారం సాయంత్రం జడ్పీ ఆవరణలోని డిస్ట్రిక్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కు 2 వేల ట్రూనాట్ టెస్టింగ్ ఎక్యుప్మెంట్ రావడం జరిగిందని, వీటిని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వినియోగించి , రేపటి లోగా 2 వేల శాంప్లిల్స్ తీయాలని లక్ష్యం గా నిర్ణయించినట్లు తెలిపారు.ట్రూనాట్ మిషన్ ద్వారా రాపిడ్ టెస్ట్ నిర్వహించేందుకు గంట నుండి గంటన్నర సమయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, ఎన్.డి.ఆర్.ఎఫ్. నుండి శిక్షణ పొందిన 22 మంది సిబ్బంది నెల్లూరు కు రావడం జరిగిందని , వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కరోనా నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు డివిజన్ స్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారి , డిఎస్పీ, డిప్యూటి డి.ఎం. అండ్ హెచ్.ఓ మరియు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి లోని కంటైన్మైంట్ ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ పర్సన్స్ ను గుర్తించి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు లాక్ డౌన్ సమయంలో ప్రజలు సహకరించడం జరిగిందని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం (పున్నమి ప్రతినిధి ` డా॥ గంగిశెట్టి శివకుమార్‌) మహామంత్రి తిమ్మరుసు చిన్నతనంలో గురువు పలక మీద గీత గీసి, తుడపకుండా దాన్ని చిన్నది చేయమంటే దాని పక్కనే పెద్ద గీత గీశాడు. ఆటోమాటిగ్గా ముందున్న గీత చిన్నదై పోయింది. ప్రస్తుత ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ‘‘కరోనా’’ ఒక్కటే పెద్ద వ్యాధి అయింది. తదితర వ్యాధులన్నీ చిన్నవైపోయాయి. హాస్పిటల్స్‌, క్లీనిక్‌లు చాలా వరకు పనిచేయకపోయినా బాధపడేవారో, లేక ఇబ్బంది పడేవారో లేరు. డాక్టర్ల దగ్గరకు పోయే వారూ తగ్గిపోయారు. మందుల షాపు తెరచి వుండడంతో చాలా వరకు వారి చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్ని మందుకొని పరిష్కరించుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాధులకు టెన్షన్‌ పడడం తగ్గిపోయింది. తమ సహజ సిద్ధంగా  ఉన్న ‘రోగనిరోధక శక్తి’ మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. దేశంలో ప్రతి చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి దాకా చీటికి మాటికి కంగారెత్తిపోయి ఆసుపత్రులు చుట్టూ తిరిగే జనం లాక్‌డౌన్‌ సందర్భంగా బాగా ఇబ్బంది పడతారని విశ్లేషకులు అంచనావేశారు. అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ఆందోళన వెలిబుచ్చారు. కానీ లాక్‌డౌన్‌ మూడు వారాలు గడిచాక చూస్తే అలాంటి ఆందోళనకు అవకాశమే లేకుండా పోయింది. దేశంలో మరణాల రేటు ఏమీ పెరిగిన దాఖలాలు లేవు. మన దేశంలో మధ్యతరగతి వాళ్లు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడం మానేసి చాలా కామైంది. పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల మీద ఆధారపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ అనవసరంగా  పరీక్షలు, స్కానింగ్‌ పేరిట పెద్ద ఎత్తున జనాన్ని దోపిడీ చేయడం ప్రారంభించారు. అయినా ప్రాణ భయంతో ప్రతిచిన్న ఆరోగ్య సమస్యకు వైద్యులను సంప్రదించడం, రోగుల వేలకు వేలు దారపోసుకోవడం జరుగుతూ వుండేది. కరోనా దెబ్బతో ఆ దోపిడీ వ్యాపారం వెనక్కుపోయింది. ఇంటి పట్టునే వుండడం, ప్రశాంతంగా వుండటం, వత్తిడి లేకుండా వుండటం, సరదాగా కుటుంబ సభ్యులతో గడపటం, టి.వి.లో కార్యక్రమాలు చూస్తూ వినోదించడం, చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు డాక్టర్‌ దగ్గరకు పోకుండా ప్రత్యామ్నాయ, సాంప్రదాయ వైద్యవిధానాలతో సరిపెట్టుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా ప్రజల్లో ఈ చైతన్యం కొనసాగాలని నిపుణులు కోరుకుంటున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఇది.. ఓ కరోనా మిగిల్చిన విషాద కథ..

ఇది.. ఓ కరోనా మిగిల్చిన విషాద కథ..అన్నీ ఉన్నా అనాథను చేసిన విషాద ఘటన.. ప్రపంచాన్ని వణికిస్తున్న కా రోనా మహమ్మారి తెలుగురాష్ట్రాల్లో మిగిల్చిన కన్నీటి వ్యధ. ఆయనో… పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్.. ఆస్తిపరుడు.. ఆర్ధిక స్థితిమంతుడు… పెద్ద ఎత్తున బంధుత్వాలు ఉన్నాయి..అతని చేత్తో వైద్యం చేస్తే.. ఎలాంటి రోగమైనా.. కీళ్లనొప్పులు..కాళ్ళనొప్పులు.. ఇట్టే మాయమౌతాయి… ఆయన హస్తవాసికున్న ప్రత్యేకతది… అందుకే 50 నుంచి 60 ఏళ్ల వయస్కులకు ఆయన వైద్యమంటే అంత నమ్మకం.. అందుకే ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే కనీసం వారం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.. అలాంటి వైద్యుడు …ముఖ్యంగా ఓ వర్గానికి చెందినవారి కి ఆయన వైద్యం పట్ల అపారమైన నమ్మకం… వైద్యం కోసం వెళ్లినవారిని నఖశిఖలా తడుముతూ.. నొప్పులు తగ్గిస్తారు..బహుశా ఏ డాక్టర్ అతనిలా రోగిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా వైద్యం చేయరేమో.. చివరికి రోగిపట్ల ఆ ఆప్యాయత ఆయన ప్రాణాలు తీసింది.. కరోనా రూపంలో కాటేసింది..వారం క్రితం వరకు వైద్యం చేసిన ఆ చేతులను..ఆ డాక్టర్ ను తాకేందుకు.చివరికి చూసేందుకు అందరూ భయపడ్డారు..ఆఖరి దశలో అనాథలా కాలగర్భంలో కలిసిపోయారు..ఇదే మొన్న కరోనా తో కన్నుమూసిన డాక్టర్ పీ. లక్ష్మీనారాయణ రెడ్డి..కథ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మొహం మరి ఎంత కఠినంగా కఠోరంగా భయంకరంగా ఉంటుందో దానికి చేతుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారి దుస్థితిని చూస్తే ఎవరికైనా గగుర్పాటు కలగకమానదు కరోనా మహమ్మారి కాటేస్తే వారి జీవితం ఎంతటి దుర్భరంగా ఉంటుందో ఇప్పటివరకు మనం విన్నాం ప్రపంచవ్యాప్తంగా కన్నం నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం ఈ కరో నా మహమ్మారి బారినపడ్డ డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి జీవిత చరమాంకం పెద్ద తార్కాణం.. ఆయన మరణాంతర పరిస్థితి చూస్తే ఎవ్వరైనా గగుర్పాటుకు గురికాకతప్పుదు. ఈ వ్యాధి సోకితే ఎంతటి దుర్భర స్థితి ఉంటుందో మనిషిలో గుబులు పుట్టిస్తోంది.ఒక డాక్టర్ గా తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి చివరకు దిక్కులేని దహన సంస్కారాలకు గురయ్యారు. నెల్లూరు నగరంలో ఆర్థో వైద్య చికిత్సల్లో చేయి తిరిగిన డాక్టర్ లలో ఆయనొకరు. అంతకుమించి మంచి హస్త వ్యాధి కలిగిన వైద్యుడిగా పేరుంది.. డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డికి. ఎంతోమంది వైకల్యం కలిగిన వారికి దారి చూపారు. ప్రమాదాల్లోనో… పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన అనేకమందికి జీవితం మీద నమ్మకాన్ని ,భరోసాను కలిగించారు ఆయన.. అంతటి వైదుడిని కరోనా క్షబ్సలించినానంతరం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. ఎంతోమందిని వైద్యం కోసం స్ఫురించిన ఆయన్ను తాకేందుకు ఏ చేతులూ ముందుకు రాలేదు.. నిరంతరం వైద్యసేవల్లో మునిగి ఉండే ఆయనకు వారం క్రితం . అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్తితి విషమంగా ఉండటంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు.పరిస్థితి విషమించడంతో లక్ష్మీనారాయణ రెడ్డిని మెరుగైన వైద్య చికిత్సలు కోసం పక్కరాష్ట్రం చెన్నై లోని అపోలో హాస్పిటల్స్ కి తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. అరుదైన డాక్టర్ని పొట్టన పెట్టుకున్న కరోనా ఆయన కుటుంభం,తన వైద్యశాల పైనా పంజావిసిరింది.దురదృష్టవశాత్తూ ఆయన చనిపోవడానికి ముందే కరోనా వల్ల ఆయన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. అక్కడ వారికి పాజిటివ్ అని తేలడంతో వారు నెల్లూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత డాక్టరు చనిపోగా కేంద్ర నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు.బట్ కరోనా మరణం కావడం – ప్రత్యేక అనుమతులు అవసరం కావడం వల్ల బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.  సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంటే అదీ లేదు. ఆస్పత్రి సిబ్బంది ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ అక్కడ శవ దహనానికి నిరాకరించారు. మరో చోట కూడా అలాగే జరిగింది.  కారణమేంటో తెలుసా… ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో మరణాలకే చేయాలని వారికి నిబంధనలు ఉన్నాయట. ఏం  చేయాలో తోచని సిబ్బంది… అంబత్తూరు శ్మశాన వాటిక వద్దకు ఆ డాక్టరు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం తీసుకెళ్లారు. ఇది తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడి ధర్నాకు దిగారు.కరోనాతో మృతి చెందిన వారికి ఇక్కడ దహనం చేయడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. ఆస్పత్రి సిబ్బందిని దూషించారు.దాంతో చేసేది లేక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు…డాక్టర్ డెడ్ బాడీ ని మళ్ళీమార్చురీకి తరలించారు.తెల్లవారు ఝామున ఎవ్వరూ లేనిసమయంలో అంబత్తూర్ ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు తరలించి డాక్టర్ అంత్యక్రియలు పూర్తిచేశారు.. ఆస్తులు.. ఆర్థిక పరిస్థితులు.. బందుగణం.. ఉన్న ఒక పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్ కరోనా భారిన పడితే ఎలాంటి ఎదురైందో చూడండి.. చివరకు అంత్యక్రియలు కు నోచుకోని దుస్థితి.. ఎదురైందంటే.. ఈ మహమ్మారిపట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రతీ ఒక్కరూ ఆలోసించండి… బీ కేర్ ఫర్ కరోనా.

Featured ఆంధ్రప్రదేశ్

లాక్‌డౌన్‌ క్రాప్‌

లాక్‌డౌన్‌ క్రాప్‌ కొంత మంది జుట్టు పెంచుకుని అదొక ఫాషన్‌గా సరదాగా గడుపుతుంటారు. కానీ ఎక్కువ మంది జుట్టు పెరిగితే సరదాగా వుండలేరు. వారికి చిరాగ్గా వుంటుంది. ఎప్పుడెప్పుడు క్రాప్‌ చేయిస్తామా? అని ఎదురుచూస్తుంటారు. కాస్త తీరిక దొరికితే సోన్‌కి వెళ్లి, క్రాప్‌ చేయించుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు, సెలూన్లు తెరిచి 20 రోజుల పైనే అయిపోయింది. మరో 20 రోజు సెలూన్లు తెరిచే పరిస్థితి లేదు. గ్రామాల్లో అయితే బార్బర్‌ ఇంటికి వచ్చి, క్రాప్‌ చేసే అవకాశం వుంటుంది. పట్టణాల్లో వీలు కాదు. అలా అని క్రాప్‌ పెంచుకుని లాక్‌డౌన్‌ అయ్యేదాకా వేచి వుండాంటే ఎక్కువ మంది జనానికి విసుగు, చిరాకూను. అందుకే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న నెల్లూరు నివాసి జి.వి.నాగరాజారావు ఇంట్లోనే తన భార్య సుధ సహకారంతో క్రాప్‌ శుద్ధంగా, సెలూన్లో లాగే చేయించుకుని, తల భారం తగ్గించుకున్నారు. గాంధీ చెప్పినట్లు మన పనులన్ని మనమే చేసుకునే రోజులు వచ్చాయి కరోనా వల్ల.  క్రాపుల్లో రకరకాల క్రాపులు ప్రాచుర్యంలో వున్న నేడు కొత్తగా ‘లాక్‌డౌన్‌క్రాప్‌’ కూడా చేరింది.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఇంటి నుంచే మొదలవ్వాలి లైఫ్​స్టైల్​ చేంజ్​ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్​ షాపు​లోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్​ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్​, వాష్​రూమ్​ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్​ చేసుకునే సింక్​ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్​. ఇంట్లోని ఫ్లోర్​ను ఈజీగా క్లీన్​ చేసుకునేలా స్పేస్​ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి. కిరాణా లిస్ట్​ మారాలి ఇప్పటిదాకా కిరాణా లిస్ట్​ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్​లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్​లో హ్యాండ్​వాష్, శానిటైజర్​ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్​వాష్​, బ్యాగ్​లో ఎప్పుడూ శానిటైజర్​ ఉంచుకోవాలి. ఫుడ్​ హ్యాబిట్స్ మారాలి కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్​లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్​ ఫుడ్​, కూల్​ డ్రింక్స్​ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్​ వంటివి రెగ్యులర్​గా తినాలి. నిజానికి జంక్​ఫుడ్​తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్​లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి. వర్కవుట్స్​ కంపల్సరీ శరీరానికి తగినంత ఇమ్యూనిటీ​ ఉంటే వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్​ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్​ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్​ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్​ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.  *పర్సనల్​  హైజీన్​* వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్​ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్​ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి. శుభ్రత ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్​లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్​గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్​ చేసుకోవాలి. ల్యాప్​టాప్​, ఫోన్​, వ్యాలెట్, హ్యాండ్​ బ్యాగ్​, కంప్యూటర్​, కీబోర్డ్, టీవీ రిమోట్​, రిస్ట్​ వాచ్​, బుక్స్​ వంటివి క్లీన్​ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది. పిల్లలు, పెద్దల పట్ల పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్​ షాపు​ నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్​ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. అవుట్​డోర్​ మీటింగ్స్​ టైంపాస్​ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్​చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన​ అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్​డోర్​ మీటింగ్స్​ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్​, ఆన్​లైన్​ చాటింగ్​ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు. సెల్ఫ్​ డిసిప్లిన్​ సెల్ఫ్​ డిసిప్లిన్​ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్​ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్​ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ​ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు……….

Featured ఆంధ్రప్రదేశ్

అత్యంత విషాదకరంగా చెన్నైలో నెల్లూరు డాక్టర్‌ అంత్యక్రియలు…

‘‘విధి ఒక విషవలయం, విషాద కథ కది నిలయం’’ ` అన్నాడు ఒక సినీ కవి. ఇది నిన్న చెన్నైలో మరణించిన డా.క్ష్మీనారాయణ రెడ్డి విషయంలో అక్షరాల నిజమైంది. కరోనాతో జీవితాన్ని చాలించిన డాక్టర్‌ అంత్యక్రియు నిన్న అత్యంత విషాదకరంగా చెన్నైలో ముగిశాయి. డాక్టర్‌ కరోనాకు బలైపోవడం ఒక ఎత్తయితే ఆయన భార్యకు కరోనా వైరస్‌ సోకడంతో నెల్లూరులో చికిత్స పొందుతుండడం, బిడ్డ మరో చోట వుండడం, గుండెల్ని పిండేసే సంఘటను. భర్తను కడసారి చూచుకునే అదృష్టానికి ఆ భార్యా, బిడ్డా నోచుకోకపోవడం మరింత విషాదకరం. అలానే ఆయన మిత్రుల0తా చివరి చూపుకు నోచుకోకపోయారు. డాక్టర్‌ అంత్యక్రియలుకు హాజరుకాలేక కడసారి చూపుకు దూరమయ్యారు. డాక్టరు ఎన్నో ఆశలు, ఆశయాలతో వైద్య వృత్తిని చేపట్టి ఉంటారు. తన జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలని, ఆరేళ్ల కుమారుడికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఎన్నో కలలు కనివుంటారు. చివరకు కరోనా కాలసర్పానికి బలైపోయారు. డాక్టరు అంత్యక్రియలకు చెన్నై కార్పొరేషన్‌ ముందు ససేమిరా అంది. ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు గనుక మేము చేయలేమని చెప్పిన స్మశాన సిబ్బంది, పార్థివ దేహాన్ని వదిలి వెళ్లిపోయిన సిబ్బంది హృదయవిదారకంగా మారిన పరిస్థితి. చివరకు రాష్ట్ర ఉన్నతాధికారుల జోక్యంతో పోరూరు స్మశాన వాటికలో అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కార్పొరేషన్‌ సిబ్బంది పూర్తి చేశారు. పగవాడికి కూడా ఇంత కష్టం వద్దురా బాబూ అనుకుంటున్నారు నెల్లూరు ప్రజలు.

Featured ఆంధ్రప్రదేశ్

” ఉచిత అంబులెన్స్ సర్వీసులు పెంచాలి”. – ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి.

 ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా మన దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. దాన్ని కట్టడి చేసే ప్రణాళికలో భాగంగా కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా “లాక్ డౌన్” ప్రకటించి పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి నిర్బంధ సందర్భాల్లో ఎవరికైనా అనారోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేవలం ఒక్క 108 అంబులెన్స్ సేవలు తప్ప ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేవు. గుండెనొప్పితో అల్లాడిపోతున్నా , కాన్పు నొప్పులతో గిలగిలా కొట్టుకుంటున్నా దగ్గరలో ఆసుపత్రిలో అందుబాటులో లేక, దూరంగా పోవడానికి రవాణా సౌకర్యం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.          మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. సుమారు 5.3 కోట్ల జనాభా కలిగి ఉన్నాం. ఇందులో 10 లక్షల జనాభా దాటిన మహా నగరాలు-2,    5 లక్షలు దాటిన నగరాలు-2,   3 లక్షలు దాటిన నగరాలు-4,   2 లక్షలు దాటిన పట్టణాలు-8,  1 లక్ష జనాభా దాటిన పట్టణాలు-17  ఉన్నాయి. కానీ వీటన్నింటికీ కలిపి మొత్తంగా చూస్తే 5 కోట్ల పైగా జనాభా గల మన రాష్ట్రంలో కేవలం 439 అత్యవసర సర్వీసు అంబులెన్సులు మాత్రమే  ఉన్నాయి. అంటే సగటున 1లక్షా 20 వేల మందికి  ఒకే ఒక్క అంబులెన్స్ సేవలందిస్తోంది. సాధారణ పరిస్థితుల్లో నైతే ఈ సంఖ్యతో ఏదో ఒక విధంగా నెట్టుకు  పోతున్నాం కానీ ప్రస్తుతం ఉన్న నిర్బంధ పరిస్థితుల దృష్ట్యా అవి రాష్ట్ర ప్రజల అవసరాలకు ఏమాత్రం  సరిపోవడం లేదు. 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో మరియు ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో సమయానికి చేరుకోలేక పోవడం వల్ల   కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.          కావున ప్రభుత్వం  ఎపిడమిక్ వ్యాధుల చట్టం ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో  ఉన్న అంబులెన్స్ లను కూడా స్వాధీనం చేసుకుని రాష్ట్రం లోని ప్రతి మండలానికి కనీసం ఒక్క అంబులెన్స్ నైనా ఏర్పాటు చేయాలి. అలాగే 10 లక్షల జనాభా దాటిన 2 మహా నగరాలకు 10 అంబులెన్సులు,  3 నుంచి5 లక్షల  జనాభా కలిగిన 6 నగరాలకు 5 అంబులెన్స్లు , 1 నుంచి 3 లక్షల జనాభా గల పట్టణాలకు కనీసం 3 అంబులెన్సులు ఏర్పాటు చేయాలి.          అలాగే అత్యవసర పరిస్థితుల్లో సర్వీసు ఇవ్వడానికి ప్రభుత్వం కేవలం ఓలా క్యాబ్స్ కు  ఒక్క విశాఖ నగరంలో మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాకాకుండా  లక్ష జనాభా దాటిన అన్ని పట్టణాల్లోనూ అలాంటి సర్వీసులను అనుమతిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.    కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. డాక్టర్ యం.వి రమణయ్య రాష్ట్రఅధ్యక్షులు ప్రజా ఆరోగ్య వేదిక

Featured ఆంధ్రప్రదేశ్

డాక్టర్ లక్ష్మి నారాయణకు ఐ ఎం ఏ సంతాపం

గత వారంలో కరోనా వ్యాధి సోకి అస్వస్థకు గురైన నెల్లూరు నగరానికి చెందిన ఎముకలు కీళ్ల వైద్యులు డాక్టర్ పెనుకొండ లక్ష్మి నారాయణ రెడ్డి సోమవారం మరణించారు. రాష్ట్రములో కరోనాకు బలైన మొదటి వైద్యులు.  కరోనా సోకినప్పటికీ తన వృత్తి ఐన వైద్యాన్ని నిర్వహిస్తూ కరోనా సోకి మరణించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో వున్నా అయన ఆరోగ్య పరిస్థితి మొన్న రాత్రి అకస్మాత్తుగా క్షీణించడంతో కృత్రిమ శ్వాస అందిస్తుండగా సోమవారం ఉదయం మృతి చెందారు. ఐ.ఎం.ఏ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ శోకతప్త హృదయంతో శ్రద్ధాంజలి ఘటిస్తుంది. వారి సేవలను ముఖ్యముగా ఇటువంటి ప్రతికూల సమయములో వారిని స్లాఘిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తుందని  ఐ.ఎం.ఏ. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్. వి.కె. ప్రసాద్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోలవరపు ఫణిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  వైదులు, ప్రజలు జాగర్తలు పాటిస్తూ కరోనా నియంత్రణకు కృషి చెయ్యాలని ఐ.ఎం.ఏ కోరుకుంటుంది.

Featured ఆంధ్రప్రదేశ్

జగనన్నా ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లను వీడియొ కాల్స్కు స్పందించమని సలహా చెప్పండి

ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో డాక్టర్ల ఓపీలన్నీ బందయ్యాయి. దాదాపు అన్నీ ప్రయివేటు ఆసుపత్రులు మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికే తొమ్మిది నెలల గర్భిణులు డెలివరి సమయం వచ్చినవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు భయాందోళనలో ఉన్నారు. దాదాపు మత్తు డాక్టర్లందరినీ ప్రభుత్వం హాండ్ ఓవర్ చేసుకోవడం సిజేరియన్లు చేయాలంటే ఓ ప్రక్క కరోనా కారణంతో లాక్ డౌన్ స్టాప్ రాలేకపోవడం ఇబ్బందులూ వినిపిస్తున్నాయి. చాలామంది రెగ్యులర్ పేషెంట్లకు డాక్టర్ల సలహా పొందే అవకాశం తక్కువైంది. కొందరి డాక్టర్ల ఫోనులు స్పందించడం కష్టంగా ఉంది అంటున్నారు. ఎమర్జన్సీ డెలివరీ లు సిజేరియన్లు కు ఆయా డాక్టర్లూ సరైన ఏర్పాట్లు చేసుకొని ఉండేలా చర్యలు తీసుకుంటూనే…చాలామంది కి డాక్టరు తో మాట్లాడితే అదో ఉపశమనం. ఈ రోజుల్లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పేషెంట్లకు రోజూలో ఏదో కొంత సమయం కేటాయించి వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉంటే చాలమంచిది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారూ తమసభ్యులకు ఇలా ఆదేశాలిస్తే మేలు అని ఈ విషయం ను నెల్లూరు వాసి నాగరాజరావు లాయరు సీఎం మరియు జిల్లా యంత్రాంగంకు ట్వీట్ చేయడం జరిగింది. డాక్టర్లు ఈ వీడియో కాల్ కన్సల్టేషన్ ఏర్పాటుకు సన్నధ్ధం అవడం ఎంతో లాభదాయకం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.