Friday, 6 March 2026

Blog

Featured

రాపూరు మండలంలోని ముస్లింలకు బండి వేణుగోపాల్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు కరోనా రక్కసి వల్ల బ్రతుకు జీవనం సాగించేందుకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజుల్లో రంజాన్ పండుగ పురస్కరించుకుని మండలంలోని ప్రతి ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రాపూరు మాజీ ఎంపీపీ మండల వైకాపా కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణా రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో మండలంలోని ముస్లిం కుటుంబలన్నింటికి 5 వస్తవులతో కూడిన కిట్లను మండలంలోని మసీదులోని మౌజన్లు,ఇమామ్ లకు దుస్తులు పంపిణీ కార్యక్రమం మండలంలోని పెనుబర్తి నుంచి మండల వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని పెనుబర్త గ్రామం నుంచి ప్రారంభిచిన బండి వేణుగోపాల్ రెడ్డి పెనుబర్తి , గోనుపల్లి, ఓబులంపల్లి,లో ఉన్న ముస్లింలకు వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు,రాపూరు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ముస్లిం కుటుంబాలకు అండగా నిలవడం ముస్లింలకు ఈరోజు రంజాన్ తోఫా అందజేస్తుండడం చాలా ఆనందంగా ఉంది అని బండి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు

Featured

స్నేహహస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 51 వ రోజు అన్నదానం

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు తూర్పు అగర్తకట్ట వద్ద కరోనా సందర్భంగా జరుగుతున్న అన్నదానానికి బండి కృష్ణా రెడ్డి మాజీ MPP రాపూరు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డిగారి సహాయ సహకారాలతో 500 మంది పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది వారికి మరియుగత 50 రోజులుగా స్నేహ హస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ గత 50 రోజులుగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తలియజేశారు

Featured

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిక్కవరపుపాడు గ్రామంలో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడి పోకుండా తిరిగి ముందుకు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సమర్థవంతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది. నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం ఉప ఆరోగ్య కేంద్రాలతో గ్రామస్థులకు, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడకుండా సిమెంటు రోడ్లు, డ్రైన్లు మొదలగు నిర్మాణాలను చేపడుతున్నాం. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్ని ఇంటి ముంగిటకే చేర్చే ప్రక్రియను తీసుకొని వచ్చాము.వాలంటీర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించి, వాలంటీర్ల వ్యవస్థ పై విమర్శలు చేసిన వారి నోళ్లకు తాళం వేశారు.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా గత 5 సంవత్సరాలలో చేయలేకపోయిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారంలోని 5 సంవత్సరాలతో కలిపి 10 సంవత్సరాల అభివృద్ధిని అందిస్తా.2 సార్లు శాసన సభ్యునిగా అవకాశం ఇచ్చి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Featured ఆంధ్రప్రదేశ్

రేపు, ఎల్లుండి ఏపీలో జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉన్నప్పటికీ, రేపటి(21 మే 2020) నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి మే 24వ తేదీ వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వచ్చే 48 గంటలు తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డి) స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా రెంట చింతలలో మూడు రోజులుగా తన ప్రభావం చూపిస్తున్నాడు సూర్యుడు.. ఈ ప్రాంతంలో ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా చెప్పారు. రాబోయే రెండు రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. తుని, బాపట్ల, కావలి, కాకినాడ, మాచిలిపట్నం, నర్సాపూర్ మరియు జంగమహేశ్వరపురం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5- 6 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అదేవిధంగా, నెల్లూరు, కడప, అనంతపురం, ఒంగోల్, విజయవాడ, కర్నూలు మరియు తిరుపతిలలో మిడిల్ హీట్ వేవ్ పరిస్థితులు కనిపిస్తాయి.

Featured

కంటైన్మెంట్ జోన్స్ మినహా తీసేందుకు అనుమతి

  పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నెల్లూరు జిల్లా కేంద్రంతో ఇతర ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్స్ దుకాణాలు తీసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి జారీ చేస్తునట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మాత్రం 6 నుంచి 9 వరకు మాత్రమే అనుమతి జారీ చేస్తున్నామన్నారు.

Featured Others

పది

దేవుడు ఒక్కడే – మానవుడే మాధవుడు మానవునికి లోకంలో మంచి-చెడు రెండే మంచి, చెడులను నిర్దేశించే మనసు, వాక్కు, చూపులే త్రిమూర్తులు ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలే నల్దిక్కులు జీవనానికి అవసరమైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు మానవ జీవితంలోని ప్రేమ, సంతోషం, దుఃఖం, బాధ, ఓదార్పు, స్నేహమే షడ్రుచులు మానవ జీవితం రంగులమయం అవే సప్తవర్ణాలు నల్దిక్కుల ఆధారాలు-అష్టదిక్పాలకులు మానవుని జీవితదశను నిర్దేశించే గ్రహాలు-నవగ్రహాలు ఈ తొమ్మిదింటిని తనలో ఇముడ్చుకున్న దశవతారమూర్తే భగవంతుడు మానవుడే మాధవుడుమానవసేవే మాధవసేవనావూరు. హరి,ఉపాధ్యాయులు వెంకటగిరి.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 45 కరోనా కేసులు

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు.గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ..41 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.నిన్న ఒకరు మృతి చెందగా..మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది.కొత్తగా వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2452కి చేరింది. ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉండగా..1680 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల నుంచి పూర్తి వేతనం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ ఏపీ ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతమే చెల్లించారు.గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.కాగా అటు ఉద్యోగులకు జీతాలు కట్ చేయడంపై హైకోర్టులో ఒక ఉద్యోగి పిటిషన్ వేయగా..దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

Featured జాతీయ అంతర్జాతీయ

పట్టు తప్పుతోంది, సామాన్యుల నడ్డి విరగబోతుంది 

పున్నమి ప్రతినిధి. షేక్ రసూల్ అహమద్ : భారతదేశంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 21 నాటికి దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా, మే 20 నాటికి 1,06,750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతదేశం కరోనా సంక్రమణ దశలో అడుగుపెట్టి  కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారిపోయింది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ తేదీ నుంచి ఇది సుమారు  3,500 కు పెరగగా, గత నాలుగు రోజుల్లో ( మే 17 నుంచి 20 వరకు ) రోజుకు 4,950 కేసులకు పెరిగింది. ఇక నిన్న ఒక్క  రోజే కొత్తగా 5,611 కేసులు నమోదయ్యాయి. ఇంతటి మహా సంక్షోభం నుంచి ఎలా బయటపడాలని గాని, కరోనాను ఎలా కట్టడి చేద్దామని గానీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ ప్రయత్నం రెండూ లేవు. గతంలో రోజూ సమీక్షలు నిర్వహించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత 8 రోజులు నుంచి  వీటికి స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. భారమంతా రాష్ట్రాలపై వేసి చేతులు దులుపుకొంటుంది. చివరిసారి ఈ నెల 11 న హెల్త్ మినిస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. తర్వాత  మీడియాతో ఏ విధమైన కాంటాక్ట్ పెట్టుకోలేదు. దీనిపై అన్నివైపులా  విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్  మాట క్రమేపీ పాతబడిపోతోంది, బహుశా కరోనా వైరస్ తో  సహజీవనం చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచనలాగా కన్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో సమన్వయము లేకుండా అంతర్జాతీయ మెప్పు కోసమంటూ విశ్లేషకులకు సైతం అర్ధంకాని ఉద్దీపన చర్యలు చేపట్టి ప్రజా రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలగించివేసింది. రైళ్లు, బస్సులు, విమాన రాకపోకలపై నిషేధం ఎత్తి వేస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెంది వివిధ సమస్యలు తలెత్తే పరిస్థితులను అందరూ ఎదుర్కోవలసి వస్తుంది. ఆహార సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉండి హావ్స్, హావనాట్స్ అంతరం మరింతగా పెరిగి భవిష్యతులో తీవ్ర అంతర్యుద్దాలకు దారి తీస్తోందా అన్న అనుమానాలు బీజం పోసుకొంటున్నాయి. పోనీ ఏదోరకంగా కేంద్ర ఆదుకొంటుంది అనుకుంటే, భారీ ప్యాకేజి అంటూ ఊరించి చివరికి వలస కార్మికుల, సామాన్యుల చేతిలో చిప్పలు పెట్టారని ప్రజలు వాపోతున్నారు. ఇంతటి లాక్ డౌన్ లోనే కరోనా విజృంభిస్తూ వుంటే  ఇక ముందు ముందు ఎలావుంటుందో ఊహించడానికే భయమేస్తుంది. కాని ప్రభుత్వం మాత్రం దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెపుతూ  ఏ విధంగానైనా లాభాలు గడించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటిలాగే మరొక్కసారి సామాన్య ప్రజలే సమిధలవుతారని చరిత్ర చెప్పకనే చెపుతుంది.

Featured

మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ వారి నిరంతర సేవలు 

గూడూరు మే 21, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : లాక్ డౌన్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు వుండే 150 ముస్లిం కుటుంబాలకు ఒక్కో ఇంటికి 5 కిలోల బియ్యం, ఒక చీర చొప్పున మొహమ్మద్  ఫక్రుద్దీన్ చారిటబుల్  ట్రస్ట్ వారు పంపిణి చేశారు. గురువారం నాడు గూడూరు పట్టణంలోని నమాజ్ కట్ట, బనిగి సాహెబ్ పేట, సాధుపేట, చిన్న చేపల మార్కెట్ వీధి నందు, ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా ఇంటింటికీ వెళ్లి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రభుత్వ సూచనలను అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అందించడం జరిగిందని అన్నారు. అలాగే ట్రస్టుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు. సంస్థ గౌరవ సలహాదారులు షేక్.గౌస్ బాషా మాట్లాడుతూ మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, రంజాన్ పండుగ సందర్భంగా  కరోనా మహమ్మారి దూరమై అందరూ సుభిక్షంగా ఉండాలని అల్లాను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ మగ్ధుమ్, సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ సర్తాజుద్దీన్, గౌరవ అధ్యక్షురాలు సఫ్నాజ్, ఫరీనా, గౌరవ సలహాదారులు గౌస్ బాషా, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి యాసీన్, కోశాధికారి అమృద్దిన్, సభ్యులు అయాజ్, సమద్, అలీం తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.