Saturday, 19 July 2025

Blog

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మగవారి సెక్స్‌ సామర్థ్యానికి విరోధులు

మగవారి సెక్స్‌ సామర్థ్యానికి విరోధులు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అది తెలుసుకోవటానికి ఆకలి నిద్ర, లైంగిక సామా ర్థ్యాలను అంచనా వేయటం ద్వారా తెలుసు కోవచ్చు. వీటిలో ఏ ఇబ్బంది లేకుండా బాగుంటే వారి ఆరోగ్యం ఇంకా చెడిపోనట్టే. దీని అర్థం మొత్తం బాగుందని కాదు. చెడి పోతూ ఉండవచ్చు. లైంగిక సామర్థ్యం చెడిపోకుండా నాలుగు కాలాల పాటు ఉంచుకోవాలంటే దానికి శత్రువులుగా ఉండే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వయసు పెరిగే కొద్ది లైంగిక సామర్థ్యం ముందు కంటే కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ మన చేతిలో ఉన్న అంశా లలో అప్రమత్తంగా ఉంటే ముందు ముందు తలలు బోడులైనా తలపులు బోడులు కాకుండా చూసుకోవచ్చు. బరువు : ప్రతి వారికి వారి వారసత్వ లక్షణాన్ని బట్టి, వారి ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. ఇది ఇతరత్రా కూడా ఆరోగ్యకరం. జీవన విధానాన్ని బట్టి కొంత అటూ ఇటూ ఉండవచ్చు కానీ అతిగా బరువు పెరిగి ఊబకాయం తెచ్చుకుంటే లైంగిక సామర్థ్యం పడిపోతుంది. పరిధి దాటి పెరిగే ప్రతి కేజీకి బరువుకి కొంత సెక్సు సామర్థ్యం తగ్గు తుంది. లడ్డుగా ఉన్న వారిలో నలబై దాటాక లేపన సమస్య వస్తే బరువు తగ్గటం మొదలు పెట్టాలి. తిండి మీద అదుపు, ఒంటికి వ్యాయామం లేకుం డా మరి ఏ ఇతర పద్ధతిలో కూడా బరువు తగ్గటం సాధ్యంకాని పని. కొలెస్టరాలు : సాధరాణంగా మన శరీరంలో ఉండాల్సినంత కొలెస్టరాలు ఉంటుంది. అయితే కొంత మందికి అవసరానికి మించి ఉంటుంది. కోలెస్టరాలులో మంచి కొలెస్టరాలు, చెడు కొలెస్ట రాలు అని రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట రాలు తగ్గే కొద్ది లైంగిక సామర్థ్యం తగ్గుతూ వుం టుంది. కాబట్టి ఎవరికైయినా అధిక కొలెస్టరాలు ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవటానికి జాగ్ర త్తలు తీసుకోవాలి. దీన్ని మందులు వాడి తగ్గించు కోవటం కంటే జీవన సరళిని మార్చు కోవటం ద్వారా తగ్గిం చుకోవటమే మంచి పద్ధతి. వీలుకానప్పుడు మాత్రమే మం దులు వాడుకోవాలి. సోమరితనం : శరీరం కదలకుండా పనులు చేసే వారు లైంగికంగా బాగా ఉం డాలని ఆశించటం దురాశే అనుకోవాలి. హుషారుగా, చలాకీగా ఉన్న వారికి లైంగిక సామర్థ్యం బాగా ఉంటుంది. పైగా ఇలాంటి వారు కనీసం తిండిని అదుపులో ఉంచుకోక పోతే బరువు పెరగటం ఖాయం. పెరిగే బరువు మళ్ళీ సెక్సును తగ్గిస్తుంది. పొగాకు వాడకం : పొగాకు ఏ రూపంలో వాడినా లేపన శక్తి దాదాపు 20 పాళ్ళు తగ్గు తుంది. అయితే ఇందులో ఓ గమ్మత్తు వుంది. వయసులో వున్నప్పుడు పొగకు వాడినా దాని వల్ల తగ్గిన లైంగిక సామర్థ్యం పెద్దగా పట్టింపుకు రాదు. కారణం ఏమి టంటే వయసులో వున్నప్పుడు మనలో అవస రానికి మించి చాలా నిలువ లైంగిక సామర్థ్యం ఉంటుం ది. ఏ కారణం వల్ల లేపన శక్తి తగ్గినా అదనంగా ఉన్న నిలువ శక్తి దాన్ని భర్తీ చేస్తుంది. కాబట్టి వయసులో ఉన్నప్పుడు పొగాకు వాడకం వల్ల తగ్గిన సామర్థ్యాన్ని గుర్తించలేరు. వయసు మీరే కొద్ది నిలువ శక్తితో పాటు ఉన్న సామర్థ్యం కూడా తగ్గి లేపన సమస్య వస్తుంది. దీనికి తోడు పొగాకు కూడా వాడితే లేపన శక్తి మరీ దారుణంగా పడిపోతుంది. పొగాకు వాడే వారు తెలుసు కోవాల్సిన సత్యం ఏమిటంటే, లేపన సమస్య రానంత వరకూ పొగాకుతో ఎన్ని ఆటలు దాని ప్రభావం తెలియదు. కానీ ఒక సారి సమస్య వచ్చాక దాన్నుండి బయట పడాలంటే పొగాకు మానాల్సిందే. మానేసిన వారాని కల్లా దాని వల్ల తగ్గిన 20 పాళ్ళ లైంగిక సామర్థ్యం తిరిగి వస్తుంది. ఆల్కహాలు : అప్పుడప్పుడూ మందు కొట్టే వారికి మందు వల్ల సెక్సుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ అదే పనిగా తాగే వారి లో నరాలు చీకిపోయి చచ్చుగా తయార వుతాయి. దాంతో మెదడు నుండి కోరిక కరెంటును అంగానికి తీసుకు పోవటంలో తేడా వస్తుంది. నరాలు ఏ మేరకు చీకిపోతే ఆ మేరకు లేపుడు శక్తి తగ్గు తుంది.   ఇదీ నా సమస్య ప్రశ్న : నాకు 30 సంవ త్సరాలు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నేను పదో తరగతి చదివేటప్పుడు నేను హాస్టల్లో ఉండే వాడిని. హాస్టలు వార్డను నా చేత ¬మోసెక్స్‌ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా తన ఫ్రెండ్సుని కూడా నాతో చేయిం చాడు. రాను రాను నాకు కూడా బాగా అలవాటు అయింది. భార్యతో కూడా సెక్సు చేయగలను కానీ మగ వారిని చేస్తున్నంత కిక్కు రాదు. ఆ మధ్య మా ఆవిడకు సంగతి తెలిసి పెద్ద గొడవ అయిం ది. ఆ వెధవ అలవాటు మానితేకానీ కాపురం చేయనంటుంది. ప్రస్తుతానికి దానికి దూరంగా ఉంటున్నాను కానీ పాత పరిచయం ఉన్న వారు అప్పుడప్పుడు ఫోను చేసి రమ్మన్నప్పుడు వెళ్ళాలని మనసు తహతహలాడుతుంది. వారు గట్టిగా పిలిస్తే మళ్ళీ పోతానేమో అని అనిపిస్తుంది. నాకు ఆ యావలేకుండా ఉండాలంటే ఏమి చేయాలి? – వి.వి.ఎస్‌., వేదాయపాళెం జవాబు : స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన వారు దాన్ని మానటానికి చాలా నిగ్రహ శక్తి కావాలి. ఎక్కువ మందికి దీని నుండి బయట పడాలని ఉన్నా ఆ సమయం వచ్చే సరికి అదుపు చేసుకోలేరు. ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. స్వ లింగ సంపర్కంలో ఉన్న బలహీనతే అది. ఈ పద్ధతి నుండి బయట పడాలన్న గట్టి సంకల్పం మీకు ఉంటే సైకో ధెరపీ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అనుభవజ్ఞులయిన సైకియాట్రిస్టులు, క్లినికల్‌ సైకాలజిస్టులు ఆ చికిత్సను చేస్తారు. డాక్టర్‌ పి. శ్రీనివాసతేజ, నెల్లూరు

Featured ఆంధ్రప్రదేశ్

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : నెల్లూరులో జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహనీయులు మహాత్మాగాంధీ అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య . అందె ప్రసాద్‌ గారు విచ్చేసి గాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించారు. రిజిస్ట్రార్‌ గారు మాటా ్లడుతూ గాంధీగారి ఆశయసాధనలో మనం అందరం పాలు పంచుకోవలని సూచించారు ,అదే విధంగా సత్యం, అహింస మార్గాలను ఈ తరం విద్యా ర్థిని, విద్యార్థులు ఆచరించాలని కోరారు. మన భారత ప్రభుత్వం గాంధీగారి 150 వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత -స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టారు . ఈ కార్య క్రమంలో విద్యార్థులందరూ విరివిగా పాల్గొ నాలని మరియు మన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ప్లాస్టిక్‌ రహిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ జయంతి ఉత్స వాలను పురస్కరించుకుని గాంధీ యన్‌ స్టడీ సెంటర్‌ వివిధ సాహిత్య పోటీలను నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను అందజేసింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఆచార్య కె . వి. యస్‌ జవహర్‌ బాబు గారు, సి డి సి డీన్‌ ఆచార్య విజయనంద్‌ బాబు గారు, గాంధీయన్‌ స్టడీ సెంటర్‌ సమ న్వయకర్త డా. నీలమణికంఠ గారు, విద్యార్థి, విద్యార్థినులు, భోదన , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు .

Featured ఆంధ్రప్రదేశ్

వాకర్స్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

వాకర్స్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : 150వ గాంధీ జయంతి వేడుకలను చిల్డ్రన్స్‌ పార్కులో వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వహణ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిట్రపటానికి వాకర్స్‌ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటీస్‌సెంటర్‌ వారి చే ఉచిత షుగర్‌..బి.పి.పరీక్ష లను 250మందికి నిర్వహించారు.పినాకినీ లయన్స్‌ క్లబ్‌ వారి సహకారం తో 15మందిపార్క్‌ ఉద్యోగస్తులకు వస్త్రాలు పంపిణీ చేసారు. ఈకార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి సింగంసెట్టి మురళీ మొహాన రావు మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని స్వతంత్రం సాధించిన మహనీయుడు గాంధీ గారని వారి ఆసయాలకు ఊపిరి పొయవలసిన భాద్యత మన అందరిది అని అన్నారు. ఈ కార్యక్రమం లో సింగంసెట్టి మురళీ మోహన్‌ రావు..కొట్టే రామమూర్తి..పాముల రమనయ్య ..లయన్‌ కిషోర్‌ కుమార్‌..గవర్నర్‌ కిషోర్‌ కుమార్‌..లీలారెద్ది..సగిలి జయరాం రెడ్డీ. కె. పెంచల నాయుడు. ఎల్‌. బాబు మరియు వాకర్స్‌ పాల్గొన్నారు.

Featured Uncategorized

కొంప కాలి ఒకడు ఏడుస్తుంటే .చుట్టూ కాల్చు కున్నాడు ఒకడు. ఈ అమ్మాయి యవ్వారం అట్టా ఉంది

కుండపోతగా కురుస్తున్న వానలవల్ల బీహార్ రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల పలు జిల్లాల్లో దాదాపు 20 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. పాట్నాలో ఆస్పత్రులు, మెడికల్ స్టోర్లు, ఆస్పత్రులు నడుం లోతు నీళ్లలో మునిగిపోయాయి.నగరంలో అన్ని వైద్య సదుపాయాలున్న అతిపెద్ద నలందా మెడికల్ కాలేజి ఆస్పత్రి కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన ఫోటోషూట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిట్) స్టూడెంట్ అదితి సింగ్.. వరదల్లోనే ఫొటోషూట్ చేయించుకుంది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మెర్మైడ్ ఇన్ డిజాస్టర్-పాట్నాలో వరద సమయంలో పరిస్థితి’ అనే టైటిల్ తో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆ యువతిని ఆడేసుకుంటున్నారు. ఈ ఫొటోషూట్ కాస్త క్రియేటివ్‌గా ఉందని… వర్షం, వరదలు వస్తే ఆమె తప్పేముంది? ఆమె నిట్ స్టూడెంట్ కాబట్టి తన క్రియేటివిటీని చూపించిందని కొందరు ఆ యువతికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు ప్రజలు సమస్యల్ని చెప్పే విధానం ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Featured

SBI మెనేజర్ ఆత్మహత్య?????

SBI మెనేజర్ ఆత్మహత్య????? గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం తెనాలి బ్రాంచ్ కు డిప్యూటీ మేనేజర్ గా అంకిరెడ్డి వచ్చాడు. పై అధికారుల వేధింపులే తన భర్త ఆత్మహత్యకు కారణమని భార్య ఆరోపిస్తోంది. పోలీస్ విచారణలో మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది        

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

షుగర్‌ జబ్బు ఉన్నవాళ్లు భార్యకు భర్త, భర్తకు భార్య పాదపూజ చేసుకోవాలి

షుగర్‌ జబ్బుకి పాదపూజకు సంబంధం ఏమిటి? భార్యకు భర్త పాదపూజ చేయడమేమిటి? నేను చదవడం తప్పా అని అనిపిస్తుంది కదూ! తప్పేమీ లేదు మీరు చదివింది వాస్తవమే. పూజ అంటే కాళ్లు కడిగి ఆ నీళ్లను తల మీద చల్లుకుని దండం పెట్టు కోవడం కాదు. వాళ్ల కేమైనా దెబ్బలు తగిలాయా అని చూసుకోవడమే దీని అర్థం. పది సంవత్సరాలు పైబడి షుగరు ఉన్నటువంటి వాళ్లలో చాలామందిలో అరికాళ్ళలో స్పర్శ తగ్గిపోతుంది. కాళ్ళకు తగిలిన చిన్న చిన్న దెబ్బలు తెలియవు. కాళ్లలో ముల్లు గుచ్చుకున్నా, రాళ్లు వత్తుకున్నా ,చెప్పులు కరిచినా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆ గాయాలే కాళ్ళు తీసి వేయాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు .అందుకే షుగర్‌ వుండి కాళ్లకు స్పర్శ తగ్గినటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాళ్లకు ఇలాంటి దెబ్బలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుని ,నిర్ధారించుకుని  ఉండడం మంచిది. గాయాలు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవడం అవసరం. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటి పరిస్థితి ఉంటే వాళ్లు వంగి వాళ్ళ కాళ్ళను చూసుకోవడం చాలామందిలో సాధ్యం కాదు అందుకే వారి జీవిత భాగస్వామి ఆ పని చేయడం మంచిది అలా రోజూ కాళ్లను రోగి బంధువులు కానీ జీవిత భాగస్వామి కానీ ఎవరో ఒకరు కాళ్ల పరిశీలన కార్యక్రమం చేయడం అవసరం. జీవిత భాగస్వామి తోనే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి తప్పక భార్యకు భర్త ,భర్తకు భార్య రోజూ కాళ్ళను పరిశుభ్రం గా ఉంచే ప్రయత్నం చేస్తే మోకాలు కిందకి కాళ్లను తీసి వేసే పరిస్థితిని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్‌ యం.వి.రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌) డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

గుండెను పదిలంగా ఉంచుకుందాం

గుండెను పదిలంగా ఉంచుకుందాం గత 20 సంవత్సరాలుగా గుండె జబ్బుల నివారణ దినోత్సవాల పేరుతో ప్రపంచమంతా కార్యక్రమాలు జరుగుతున్నా గుండె పోటు బాధితుల సంఖ్య తగ్గకపోగా నిత్యం పెరుగుతూనే ఉంది. గతంలో 60 సంవత్సరాల వయసు పైబడిన వారిలో గుండెపోటు ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం 20 సంవత్సరాల వయసు వారికి కూడా గుండెపోటు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.71 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు.వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే.మన దేశంలో చిన్నవయసులోనే ముఖ్యంగా 30, 40 సంవత్సరాల వయసులోనే ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు.   ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజులలో ఎందుకిలా జరుగుతుందంటే నివారణ కొరకు మనం తీసుకునే జాగ్రత్తలు కంటే గుండెపోటుకు ప్రధాన కారణమైన మన జీవనశైలి ప్రభావం మనమీద అఎక్కువగా ఉండటం.   ప్రతిరోజు లక్షసార్లు లబ్‌డబ్‌ అని స్పందిస్తూ.. రెండు వేల గ్యాలన్ల రక్తాన్ని శుద్ధిచేసి, అరవైవేల మైళ్ల దూరం వరకు ప్రవహించేలా పంపింగ్‌ చేసే పిడికెడు గుండె ఆధునిక మనిషి పరుగు వేగాన్ని అందుకోలేకపోతుంది. జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా గుండెపై ఒత్తిడి పెరిగింది. ప్రతిఏటా గుండె జబ్బుల మరణాల రేటు పెరుగుతుంది. జీవనశైలిలో వచ్చిన మార్పులను ఇలాగే కొనసాగిస్తే.. ప్రపంచంలోనే అత్యధిక హృదయరోగులున్న దేశంగా భారత్‌ మారుతోంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .  ఇటీవల కాలంలో తలనొప్పి, జ్వరం ఎంత సాధారణంగా వస్తున్నాయో గుండెజబ్బులు కూడా అంతే సాధారణంగా మారిపోయాయి.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం అంటే ఈనెల 29వ తేదీన ప్రపంచమంతా జరుపుకోబోయే ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా గుండెపోటుకు కారణాలు, నివారించుకోవడానికి మార్గాలు, ప్రాథమిక వైద్యం గురించి మరియు వైద్యం గురించి కొన్ని విషయాలు ……… గుండెపోటుకు కారణాలు గుండెపోటు కలిగించే కారణాలను రెండు రకాగాలుగా విభజించవచ్చు . మనం అదుపులో పెట్ట గలిగినవి ఒక రకం. మన అదుపులో పెట్ట లేనివి రెండవ రకం. అదుపులో పెట్టలేని కారణాలు  : వంశచరిత్ర…..తల్లిదండ్రులకు కానీ తోబుట్టువులకు గాని గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే ఆ కుటుంబంలోని సభ్యులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కుటుంబంలో పుట్టిన వాళ్లు ఈ సమస్య నుంచి బయట పడలేరు. ప్రాంతీయం…….కొన్ని ప్రాంతాలలోని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రాంతాల జాబితాలో మన దేశం కూడా ఉంది. ఈ సమస్యని మనమేం చేయలేం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటికీ పుట్టేసాం. వయస్సు….. వయస్సు పెరిగే కొద్దీ గుండెపోటు వచ్చేఅవకాశం పెరుగుతుంది. వయసు పెరగడాన్ని మనమేం చేయలేం కదా. లింగత్వం…..గుండె పోటు వచ్చే అవకాశం మగవారిలో ఎక్కువ. నెలవారి వస్తున్నంత కాలం స్త్రీలకు గుండె పోటు నుంచి చాలా వరకు రక్షణ ఉంటుంది.నెలవారి ఆగిపోయిన తరువాత స్త్రీలలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం దరిదాపుగా మగవారితో సమానంగా ఉంటుంది. మనం అదుపులో పెట్టగల కారణాలు  :  బరువు…..ఎత్తుకు తగిన బరువు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ .ఊబకాయం వుంటే గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఎత్తుని సెంటీమీటర్లలో కొలుసుకొని అందులోంచి 100 తీసివేస్తే వచ్చేటటువంటి విలువ ఎంతో అన్ని కేజీలు మాత్రమే మన బరువు ఉండాలి. ఎత్తుకు సరిపడా ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉన్నవారు ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలి. ఇందుకోసం తిండి తగ్గించుకుని పని పెంచుకోవాలి. బిపి……. బిపి ఎక్కువగా ఉన్నవారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ . బీపీ జబ్బ రావడానికి చాలా సందర్భాల్లో కారణం తెలియకపోయినా బిపి జబ్బును అదుపులో పెట్టుకోవడం మన చేతిలోని పనే .సరైన వైద్యం చేసి బీపీని అదుపులో ఉంచుకుంటే గుండెపోటు వచ్చేఅవకాశం తగ్గుతుంది. బిపి నిశ్శబ్ద హంతకి. ఎటువంటి ఇబ్బంది పెట్టకనే మనిషి ప్రాణం తీయగలదు.బీపీ జబ్బు ఉన్నవారిలో సగం మందికి ఇది ఉన్నట్టుగా కూడా తెలియదు. బిపి జబ్బును గుర్తించిన వారిలో సగం మంది మాత్రమే వైద్యం చేయించుకుంటారు. వైద్యం మొదలు పెట్టిన వాళ్ళలో సగం మంది మాత్రమే వైద్యాన్ని కొనసాగిస్తారు. బిపి ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలంటే మంచి ఒకసారి బిపి చూపించుకొని మధు మేహం…. షుగరు జబ్బు ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. షుగర్ను అదుపులో పెట్టుకో గలిగితే గుండెపోటు అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. షుగరు జబ్బు శరీరంలోని ఏ భాగాన్నైనా దెబ్బతీస్తుంది. షుగర్ జబ్బు ని కుక్క తో పోలుస్తారు. షుగర్ జబ్బు అదుపులో ఉంటే బొచ్చుకుక్క. అదుపు లేకపోతే పిచ్చికుక్క. బొచ్చు కుక్క మనం చెప్పినట్టు మన చుట్టూ తిరుగుతుంది .పిచ్చికుక్క దాని ఇష్టం వచ్చినట్లు కొరికి పారేస్తుంది ది. బొచ్చు కుక్క గా పెంచుకోవడమా లేదా పిచ్చికుక్కగా పెంచుకోవడమా అన్నది మన చేతుల్లో పని. అందుకే కే షుగర్ వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని శివరంజని అదుపులో పెట్టుకుని గుండెపోటుని నివారించుకోవచ్చు. షుగరు జబ్బు వచ్చిన తర్వాత అదుపులో పెట్టుకోవడం ఒక భాగమైతే మన జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకుని షుగర్ జబ్బు ని కొంతకాలం దూరంగా నెట్ అవ్వచ్చు. 40 సంవత్సరాలు వయసు కలిగిన వారందరూ సంవత్సరానికి ఒక పర్యాయం రక్త పరీక్ష చేయించుకోండి షుగరు ఉందో లేదో చూసుకుంటే షుగర్ జబ్బు మూడేళ్ల ముందుగానే గుర్తించవచ్చు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని షుగరు జబ్బు ముందుగానే గుర్తించడం, రాకుండా చూసుకోవడం ,వచ్చిన తర్వాత అదుపులో పెట్టుకోవడం ఇలాంటివి చేయగలిగితే షుగరు జబ్బు వల్ల గుండెపోటు వచ్చే అవకాశం లేకుండా చేసుకోవచ్చు. జీవనశైలి…… గుండెపోటుకు మనం జీవనశైలి ఒక ప్రధానమైన కారణం.ఉప్పు ఎక్కువగా తినడం.మానసిక వత్తిడికి ఎక్కువగా గురి కావడం. సరిపోయినంత నిద్ర లేకపోవడం. తక్కువ పనిచేయడం. అవసరానికి మించి తినడం లాంటిఅనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఉప్పు మన జీవితానికి పెద్ద ముప్పుగా మారింది. రోజుకు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. అంటే నెలకు 100 గ్రాములు ఉప్పు వరకు తినవచ్చు. కానీ మనం సుమారు అరకిలో ఉప్పు తింటున్నాం. ఉప్పును ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం మంచిది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటలనిద్ర అవసరం. శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధి చెందే కొద్దీ మనిషికి నిద్ర కరువైపోతుంది .నిద్ర తగ్గితే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ధూమపానం….. పొగతాగేవారిలో గుండె పోటు వచ్చే అవకాశం మామూలు వాళ్ళ తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ పొగాకుకు సంబంధించిన ప్రతి అలవాటు గుండెకు ప్రమాదకరమే. గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే టూకీగా మనం పాటించవలసిన జాగ్రత్తలు * పొగ తాగ కూడదు. ఇప్పటికే అలవాటు ఉంటే వెంటనే మానెయ్యాలి. పొగాకును ఏ రూపంలో కూడా వాడకూడదు. *సమతులాహారం తీసుకోవాలి. ◆కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి ◆ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి ◆ బరువు పెరగకుండా చూసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. ◆ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ◆ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి*. ◆ తగినంత నిద్ర పోవాలి. ◆ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ◆ ఉప్పు వినియోగాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. గుండెపోటుకు ప్రాథమిక వైద్యం గుండె నొప్పి ప్రారంభమైన తరువాత మొదటి గంట చాలా విలువైనది. ఈ గంట సమయంలో వైద్యం చేయగలిగితే చాలా వరకు గుండెపోటు మరణాలను నివారించవచ్చు. ఈ గంట సేపు జరిగే వైద్యాన్ని గుండెపోటు ప్రాథమిక వైద్యం అంటారు. గుండె నొప్పి వచ్చిన వారికి ధైర్యం చెప్పాలి.నడిపించ కూడదు. వీలైతే కదలకుండా పడుకోబెట్టాలి. నడిపించినా,భయపడ్డా గుండె వేగం మరింత పెరిగి గుండెపోటు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.వీలైనంత త్వరగా నాలుక కింద 325 మిల్లీగ్రాముల యాస్ప్రిన్ మాత్రను చప్పరించాలి.సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద పెట్టుకోవాలి. ఈ మాత్రలు గుండెకు రక్తప్రసరణను పెంచే ప్రయత్నం చేస్తాయి. తద్వారా గుండెపోటు తీవ్రతను తగ్గిస్తాయి. ● ఆస్పిరిన్ మాత్రను అందుబాటులో వుంచుకోవడం ఎలా?● గుండె నొప్పి మొదలైన గంటలోపు ఆస్పిరిన్ మాత్ర మాత్రను చప్పరించాలి అన్న విషయం తెలుసుకోవడం ఒక భాగమైతే ,గుండె నొప్పి వచ్చిన ఆ గంటలో వాడడానికి అను కూలంగా ఆ మాత్రలను అందుబాటులో ఉంచుకోవడం మరో ముఖ్యమైన విషయం. గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న వారందరూ ఈ మాత్రను ఎప్పుడూ వెంట ఉండే విదంగా చూసుకోవాలి. ఒక మాత్రను జేబులోని పర్స్ లో ఉంచుకోవచ్చు, ఒక మాత్రను తను ప్రయాణం చేసే వ్యక్తిగత వాహనంలో ఉంచుకోవచ్చు, ఒక మాత్రను తను పనిచేసే ఆఫీసులో ఉంచుకోవచ్చు ,ఒక మాత్రను తను పడుకొనే మంచం మీద పరుపుకింద ఉంచుకోవచ్చు .ఇలా వారి వారి అనుకూలాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఆ మాత్రను వెంటనే వినియోగించుకునే విధంగా అందు బాటులో ఉంచుకోవాలి. ఆస్పిరిన్ మాత్రతో పాటు క్లొపిడోగ్రిల్ 75 మిల్లీగ్రాముల మాత్రలు 4 మరియు ఒక్క అటార్వాస్టాటిన్ 80 మిల్లీగ్రాముల మాత్రను కూడా అందుబాటులో ఉంచుకో గల్గితే ఇంకా మంచిది. గుండెనొప్పి వచ్చిన వెంటనే ఈ మాత్రలన్నిటిని వేసుకో గలిగితే మరీ మంచిది . ఈ మాత్రలన్నీ కలిసి గుండెపోటు తీవ్రతను చాలా వరకు తగ్గించగలవు .ఈ విధంగా ఈ మూడు మాత్రలను సామూహికంగా వాడే విధానాన్ని గుండెపోటు లోడింగ్ డోస్ విధానం అంటారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఈ మాత్రలను వేసుకుని వీలైనంత త్వరగా డాక్టర్ గారిని సంప్రదించాలి. గుండె నొప్పి తదుపరి వైద్యాన్ని డాక్టర్ గారు చూసుకుంటారు. ఈ సందర్భములో చాలామందికి ఒక అనుమానం రావచ్చు. మనకి వచ్చిన నొప్పి గుండెపోటు కాదేమో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమో, గుండె నొప్పని భావించి ఈ మాత్రలు వాడితే ప్రమాదమేమన్నా జరుగుతుందేమో అన్న అనుమానం కూడా రావచ్చు. గుండెపోటు కాకపోయినా ఈ మాత్రలు వాడితే ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమీ

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మనల్ని కరిచిన కుక్కను ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి.

మనల్ని కరిచిన కుక్కను ఏమి చేయాలి? చేసేది ఏముంది, కొట్టి చంపి పారేయాలి అన్నది ఎక్కువమంది చెప్పే సమాధానం.ఇది తప్పు. ఆ కుక్కను కొట్టకూడదు. చంపకూడదు. బ్రతికించు కోవాలి. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క పది రోజులు బ్రతికుంటే మనకు దానివలన రేబీస్‌ వ్యాధి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి .ఎంత జాగ్రత్తగా అంటే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి చూసుకున్నంత జాగ్రత్తగా. రేబిస్‌ వ్యాధి మనకు రావాలంటే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ వ్యాధి ఉండి దాని లాలాజలంలో వైరస్‌ ఉండాలి. అలా లాలాజలంలో వైరస్‌ ఉన్న కుక్క వారం లోపల చనిపోవలసిందే. రేబిస్‌ వ్యాధి వచ్చి వారానికి మించి బ్రతికిన జంతువు ఇంతవరకు లేదు. మనల్ని కరిచిన కుక్క వారానికి మించి బతికింది అంటే దానికి రేబీస్‌ లేదు .మరి దానికే లేనప్పుడు అది కరవడం ద్వారా మనకు రేబీస్‌ వచ్చే అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికే మనల్ని కరిచిన కుక్కని పదిరోజులపాటు గమనించుకోవాలి. కుక్క కాటు గాయాన్ని ఏం చేయాలి? వీలైనంత త్వరగా గాయాన్ని నీళ్ళతో కడగాలి.వీలైతే సబ్బుతో కడగడం మంచిది. గాయాన్ని పైపైన కడగడం కాదు లోతుగా కడగాలి. అందుకే కుళాయి కింద గాయ మైన భాగాన్ని ఉంచి గాయం లోపలకు నీరు పోయే విధంగా కడగాలి. అప్పుడే గాయం లోపల ఉన్న రేబిస్‌ కారక వైరస్‌ పూర్తిగా తొలగి పోతుంది. కరచిన వెంటనే కుళాయి అందుబాటులో లేనప్పుడు మగ్గులో నీరు తీసుకుని ఎత్తులో నుంచి గాయం మీద పడేటట్టుగా కడగడం మంచిది. ఇలా కనీసం పది సార్లు కడగాలి.ఇలా వెంటనే గాయాన్ని కడగ గలిగితే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ ఉన్నా దానివలన మనకు వచ్చే అవకాశం దరిదాపుగా లేనట్టే. రేబిస్‌ వ్యాధి సోకి, బ్రతికిన జీవి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వ్యాధికి ఇంతవరకు వైద్యం కనుగొనబడలేదు. ఈ వ్యాధి సోకితే వారంరోజుల్లో చనిపోవలసిందే . ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు 1885 సంవత్సరంలోనే లూయిస్‌ పాశ్చర్‌ అనే మహనీయుడు కుక్క కాటుకు టీకాను కనుగొన్నాడు. అంటే 134 సంవత్సరాల క్రితం ఈ రేబిస్‌ వ్యాధి కి టీకా అనుకొన్నపటికీ వ్యాధి నివారణ మాత్రం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 వేల మంది రేబీస్‌ వ్యాధితో చనిపోతున్నారు ఇందులో 20 వేల మంది మన దేశంలోని వారే చనిపోతున్నారు. ఈ రేబిస్‌ వ్యాధి సంక్రమించేది కుక్క కాటు ద్వారా మాత్రమే కాదు.నక్క ,పిల్లి,కోతి, గబ్బిలం లాంటి జంతువులు కరవడం ద్వారా కూడా సంక్రమించ వచ్ఛు.భారత దేశములో 98% మంది లో రేబీస్‌ వ్యాధికి కారణం కుక్క కాటే. రేబిస్‌ వ్యాక్సిన్‌ ఎలా వేయించుకోవాలి? కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారని గతంలో ఉన్నటువంటి వైద్య సూత్రం. ఇప్పుడు బొడ్డుచుట్టూ వేసే టీకా అనేక దేశాల్లో రద్దు చేయ బడింది. 2004నుంచి మన దేశంలో కూడా రద్దు చేయబడింది. ఇప్పుడు కండలోకి వేసే టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ఐదు విడతలుగా వేయించుకోవాలి. మొదటి డోసు కరిచిన వెంటనే, రెండవ డోసు మూడవరోజు, మూడవ డోసు ఏడవ రోజు, నాలుగవ డోసు 28వ రోజు. (0-3-7-14-28). ఈ 5 విడుదల టీకా ఖర్చు సుమారు 2000 రూపాయలు అవుతుంది.ఈ ఖర్చును పేదలు భరించడం కష్టం. ఖర్చును తగ్గించడానికి పరిశోధనలు జరిపి ప్రస్తుతం చర్మంలోకి వేసే టీకాను కనుగొన్నారు. ఈ టీకాను నాలుగు విడతలుగా వేయించుకోవాలి (0-3-7-28) దీని మొత్తం ఖర్చు సుమారు 400 రూపాయలు.. ఈ టీకాను ఎప్పుడు వేయించుకోవాలి? కరిచిన వెంటనే వీలైనంత త్వరగా టీకా వేయించుకోవడం మంచిది. మనలను కరిచిన కుక్క మంచిదో, పిచ్చిదో మనం గుర్తించడం కష్టం. మొదటి మరియు రెండవ డోసును వేయించుకుని, మనల్ని కరిచిన కుక్కను గమనించడం సాధ్యం కాకపోయినా, కుక్క చనిపోయినా ఏడవ రోజు వేయించుకోవాల్సిన మూడవ డోసును తప్పక వేయించుకోవాలి. కుక్క బ్రతికుంటే మిగిలిన డోసులను వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ జాగ్రత్తలు కుక్క కరిచినప్పుడే కాదు, పిల్లి, కోతి, నక్క, గబ్బిలం, గాడిద, గుర్రం ఇలాంటి జంతువులు కరిచినప్పుడు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి.   డాక్టర్‌ యం.వి.రమణయ్య, రామచంద్రారెడ్డి హాస్సిటల్‌, నెల్లూరు రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక

Featured ఆంధ్రప్రదేశ్

సూళ్ళూరుపేట, తడ, పెళ్లకూరులకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?

సూళ్లూరుపేట : సూళ్లూరుపేట అనగానే గుర్తొచ్చేవి కాళంగినది, ఆ నదీ తీరాన వెలసివున్న పరమ పావని శ్రీ చెంగాళమ్మ అమ్మవారు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాకెట్‌ కేంద్రం శ్రీహరికోట, అతి ప్రాచీనమైన మన్నారుపోలూరులోని రాజగోపాలస్వామి ఆలయం. తెలుగు, తమిళ సాంప్రదాయాల మేలుకలయిక సూళ్లూరుపేట.  సుళ్ళూరుపేటకు చెంగాళమ్మ ఆలయం వల్ల ఈ పేరు వచ్చింది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతున్నది. ఈ విధంగా తిప్పడాన్ని ”సుళ్ళు ఉత్సవం” అంటారు. ఆ విధంగా ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు రోజూ 2 వేల మంది వస్తుంటారు. తడ : మనజిల్లాకు సరిహద్దు మండలం ‘తడ’. తడ వృక్షాలు ఎక్కువగా వున్న ప్రాంతం ‘తడ’గా పిలవబడింది. తడ అంటే ధన్వమనెడు చెట్టు. ధనుర్వుక్షం అని కూడా అంటారు. దీని కట్టెలు ఇండ్లకు, ఆకులు విస్తళ్లకు ఉపయోగిస్తారు. పెళ్ళకూరు : యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన ఒక వీరుని పేరు మీద ఏర్పడిన గ్రామం తాళ్వాయిపాడు. బండ్లమాంబ వారి చండికా పరమేశ్వరి ఆలయం, పాఠశాల ఈ మండలం ప్రత్యేకతలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.