Thursday, 5 March 2026

Blog

Featured

వైకాపా ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేక గుర్తింపు

పలమనేరు, జూన్23,2020 (పున్నమి విలేకరి): వైకాపా ప్రభుత్వం హయాంలోనే కాపులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక గుర్తింపు అందుతుందని రాష్ట్ర కాపు నాయకులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ రాష్ట్ర బడ్జెట్లో రూ2847 కోట్లును కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరులో బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ , చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపులకు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే సత్తా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం రూ15000వేల చొప్పున ఐదేళ్ళు లబ్దిదారులకు అందజేయడం జరుగుతున్న దన్నారు . వైయస్సార్ కాపు నేస్తం పథకం 45-60 ఏళ్ళు మధ్య వయసున్న మహిళల కాపు, బలిజ, తెలగ ఉప కులాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సుదర్శన్ రాయల్,ఆకులు గజేంద్ర, జింక చలపతి,పలమనేరు బలిజ సంఘం అధ్యక్షుడు పి జె సి బాబు, ఏ సి బాబు, దైవ ప్రసాద్, కిరణ్, బాల గురునాథ్, నరేష్,హరీష్,రవి తదితరులు పాల్గొన్నారు.

Featured

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుండి గాంధీనగర్ వరకు నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ… సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డును 14వ ఆర్ధిక సంఘం నిధులు ద్వారా వేయడం జరిగిందన్నారు.అనంతరం గాంధీ నగర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, నాయజ్,హైదర్ తదితరులు పాల్గొన్నారు.

Featured

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం జగన్న చేదోడు పథకం క్రింద ఆర్థిక లబ్ధి చేకూర్చన సందర్భంగా మంగళవారం పలమనేరు పట్టణంలోని జిలాని కూడలిలో వైఎస్సార్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి చేసిన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ప్రజా సంకల్ప యాత్ర సమయంలో టైలర్ లు, రజకులు, నాయిబ్రాహ్మణులను ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారుల ఖాతాలో రూ 10 వేలు జమచేయడం జరిగిందన్నారు. ఈ పథకానికి కొందరు అర్హులు కాలేకపోయారు.అర్హులు మరల దరఖాస్తు చేసుకోవడానికి 10 రోజులు సమయం పొడిగించారని తద్వార అందరూ ధరఖాస్తు చెసుకోవలన్నారు. నాయి బ్రాహ్మణలు మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో చేదోడు పథకం ద్వారా 10వేల ఆర్థిక సహాయం అందించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Featured

రైతుల ఆత్మహత్యా యత్నం

*రైతుల ఆత్మహత్యా యత్నం* *జగనన్న న్యాయం చేయక పోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు* తడ మండలం తడ హరిజన వాడలో రైతులు చిన్నపిల్లలు సైతం పెట్రోల్ బాటిల్ చేతపట్టుకొని మేము పండించే భూములు జోలికి వస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేపడుతున్నారు రైతులను కాపాడాల్సిన ప్రభుత్వమే రైతుల కడుపు కొట్టడం న్యాయమేనా అని ఆందోళన చేస్తున్న రైతు కుటుంబాలు 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమిని ఇంటి పట్టాల కొరకు ఇవ్వాలి అని అనుకుంటే మా గ్రామం చుట్టూ ప్రభుత్వ భూములు ఎందుకు పనికి రాకుండా ఉన్న భూమిని ఇవ్వచ్చు కదా మేము సాగు చేసుకుంటూ ఆ భూమిపై బ్రతుకుతున్న మా దగ్గర నుంచి లాక్కోవడం ఎంతవరకు న్యాయమంటున్న రైతులు వెంటనే రైతుల ఇబ్బందులను తెలుసుకొని కలెక్టర్ గారూ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మండల తాసిల్దారు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వవలసింది గా కలెక్టర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని గ్రామస్థులు కోరడంమైనది.

Featured తూర్పు గోదావరి

అమలాపురం డివిజన్ లో తొలి కరోనా మరణం

అమలాపురం డివిజన్ లో కరోనా బారిన పడి తొలిసారిగా ఒక వ్యక్తి మరణించడం జరిగిందని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ తెలిపారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ నుండి అమలాపురం వచ్చి స్థానికంగా ఒక లాడ్జి లో వుండటం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. అయితే అతనికి విపరీతమైన కరోనా లక్షణాలు వుండటంతో అతన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారని అయితే తరలించే క్రమంలో నిన్న సాయంత్రం ఆ వ్యక్తి మరణించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మరణించిన వ్యక్తికి ట్రు నాట్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని దీనితో అతని కుటుంబ సభ్యులకు కూడా ఆర్.టీ.పి.సి.ఆర్. పరీక్షకు శాంపిల్స్ తీసుకుని వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. డివిజన్ లో సంభవించిన కరోనా తొలి మరణాన్ని అతి పెద్ద హెచ్చరిక గా భావించి ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ విచక్షణతో మెలగాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రజలకు కరోనా పై వినూత్నమైన రీతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారని ఆర్.డి. ఓ అన్నారు. అధికారులు ఏమిచేసినా ఎంత చెప్పినా ప్రజల ఆరోగ్యం కొరకే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని, కొన్ని రోజులపాటు సరదాలకు,సంతోషాలకు దూరంగా వుండి క్రమశిక్షణ తో మెలగాలని ఆర్.డి. ఓ. విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మనం కరోనా అత్యున్నత స్థాయికి చేరువలో వున్నామనే విషయాన్ని గుర్తించి కరోనా నుండి బయట పడేందుకు అన్ని జాగర్తలు తీసుకోవాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.అత్యవసరం అయితే గాని బయట తిరగవద్దని,మాస్క్ లు లేకుండా అసలే తిరగవద్దని, సామాజిక దూరం పాటించాలని,అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.

Featured

అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేబినార్ ద్వారా ఇంటి వద్దదే కుంటుంబం తో యోగ అనే కార్యక్రమం✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️✍️ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భముగా విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఇంటివద్ద యోగా , కుటుంబం తో యోగా అనే అంశంపై ఆన్ లైన్ వెబినార్ ను నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శనరావు గారు ముఖ్యఅతిధిగా పాల్గొని వెబినార్ ను ప్రారంభించారు. యోగ మరియు ఆయుర్వేదం అనే రెండు ముఖ్యమైన అంశాలు మన దేశ సాంప్రదాయకంగా ఎంతో ప్రాముఖ్యమైనవి అని అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం యోగాను దైనందిన జీవితంలో ఒక భాగం గా అలవాటు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం నెల కొని వున్న పరిస్థితులలో మన సంప్రదాయ పద్ధతులు అయిన యోగ అలాగే ఆయుర్వేదమును అందరు ఆచరించాలని కోరారు. మినిస్ట్రీ అఫ్ ఆయుష్ వారు యోగ మరియు ఆయుర్వేదమును శాస్త్రీయ పద్దతిలో వాటి ప్రాముఖ్యతను తెలియచేయటానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నెలకొనివున్న కోవిద్-19 విపత్కర పరిస్థితులలో ఇలా ఆన్ లైన్ లో కలుసుకోవలసి వచ్చిందని, ఇది ఒకరకంగా బాధాకరమైన అంశమైనా, ఇప్పుడు అందరు నూతనముగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీ ను వినియోగించుకొని సరికొత్త పద్దతిలో కాన్ఫెరెన్సెస్ మరియు వర్కుషాప్స్ నిర్వహించగలుగుతున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరము నుంచి విశ్వవిద్యాలయం యోగ మీద ఒక ప్రత్యేకమైన 3 నెలల సర్టిఫిఫికేట్ కోర్స్ ను ప్రారంబించామని అన్నారు. లాక్ డౌన్ సమయం లో VSU NSS సెల్ వారు చేసిన సేవలను అయన కొనియాడారు. తదనంతరం రాష్ట్ర NSS అధికారి డా. కె. రమేష్ రెడ్డి గారు యోగ యొక్క ప్రాముఖ్యతను విపులంగా వివరించారు. తదనంతరం స్థానిక సర్టిఫైడ్ యోగ ప్రక్షనేర్ శ్రీమతి స్వప్న గారి అంతర్జాతీయ యోగ దిన ప్రోటోకాల్లో వున్న వివిధ రకాల యోగాఆసనాలను ఆన్లైన్లో చేసిచూపించారు. అలాగే నేచర్ థెరపిస్ట్ శ్రీ ఎం వి. ప్రసన్న కుమార్ గారు కోవిద్-19 నిరోదించటంలో నేచురోపతి మరియు యోగ యొక్క ప్రాముఖ్యతను అర్థవంతంగా అందరికి తెలియ పరచారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు మరియు రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి గారు యోగ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ వెబినార్ కు NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం నిర్వాకునిగా , NSS ప్రోగ్రాం అధికారి డా. వై. విజయ, మోడరేటర్ గా మరియు NSS ప్రోగ్రాం అధికారి డా. సుశీల, ముగింపు కార్యక్రమాన్నీ సమన్వయము చేశారు. ఈ వెబినార్ లో విశ్వవిద్యాలయానికి సంబందించిన NSS ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు పిన్సిపల్స్ మరియు NSS వాలంటీర్లు మరియు విద్యార్థులు సుమారు 200ల మంది పాల్గొన్నారు.  

Featured

తడ మండలం లో విషాదం

తడ మండల చేనిగుంట గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు AMC మాజీ చైర్మన్  వేనాటి పరందామరెడ్డి గారు అనారోగ్యం కారణంగా ఈరోజు స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు హాజరు కానున్నారు.

Featured గూడూరు

నీళ్ల కష్టాలు తీరేది ఎప్పుడు?

ఒక పక్క కరోనా భయంతో ,ఇళ్ళ నుండి బయటకు రావద్దు అని చెప్తుంటే మరో పక్క గ్రామాలలో నీళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు … ప్రభుత్వలు ఎన్ని మారిన కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటున్న గ్రామ ప్రజలు… వివరాలలోకెలితే నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో గత 20 సంవత్సరల నుంచి ప్రభుత్వలు ఎన్ని మారిన నీళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు … గతవారం రోజులుగా మంచినీళ్లు లేక గ్రామంలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇక్కడ నీళ్లట్యాంకర్లు తొలి కొంతమంది డబ్బులు సంపదించుకుంటున్నారు, ఈ గ్రామంలో ఒక ప్రజా ప్రతినిధి ఉండడం గమనార్హం,కాని అధికారులు పట్టించుకోనేవాళ్లు ఎవరు లేరు.ఇకనైన ఎవరైన అధికారులు స్పందిస్తారని వాళ్లు వేడుకుంటున్నారు

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

న్యాయశాస్త్రానికే వన్నె తెచ్చిన గూడూరు వాసి పునుగు సిరి ‘కంఠం’

                                                గూడూరు కోర్టుహాలు ముందు జనం గుమిగూడి ఆత్రుతతో ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు. అక్కడున్న అందరిలో గుసగుసలు ఒకవైపు వెంకటగిరి జమీందార్లు, ఇంకొకవైపు సామాన్య రైతులు. పొలం పుట్ర పనులు చేసుకోకుండా ఎందుకయ్యా ఈ కేసులు జమిందార్లకు ఎదురొడ్డి గెలుస్తారా ? అంటూ కొంతమంది హితబోధలు. పాపం రైతుల ముఖాల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళ లాయరు ఇంకా రాలేదు వస్తాడో రాడో అంటూ రైతులకు దెప్పిపొడుపులు. ఇంతలో ఎదురుగా డొక్కు సైకిల్లో పాత సాంప్రదాయానికి గుర్తుగా లాయర్ రానే వచ్చాడు. నేరుగా రైతుల దగ్గరికివచ్చి చిన్నపాటి పలకరింపు, ఏమి కాదు నేనున్నానంటూ అభయ మిచ్చి అందరికి అభివాదం చేశారు. అక్కడున్న చిన్నా చితక న్యాయవాదులందరు లేచి నిలబడి ఆయనకు సలాములు చేశారు. భక్తి భావంతో స్వాగతం చెప్పారు. సదరు రైతుల న్యాయవాది సామాన్యవ్యక్తిలా ఒక్కడే నడుచుకొంటూ కోర్టు హాల్లోకి వెళ్ళాడు. చేతిలో కాగితాలు లేవు, జూనియర్ల హడావుడి లేదు, చుట్టూ మంది మార్బలం లేదు, ఆయనొచ్చిన విషయం జడ్జి గారికి తెలిసినట్లుంది. ఆయన కూడా వచ్చారు. వాదోపవాదనలు అంతకుముందే జరిగిపోయాయి కనుక జడ్జిమెంట్ సమయం రానేవచ్చింది. ఆఖరికి కేసు రైతుల పక్షం నిలిచింది. జమీందార్లు ఓడిపోయారు. బయట జయ జయధ్వానాలు పెక్కుటిల్లాయి. రైతులు గెలవరు అనుకొన్న వారు కూడా ఆయనకు అభివాదం చేశారు. రైతుల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసిన వ్యక్తి మరెవరో కాదు ఎస్టేట్ లాండ్ ఆక్ట్, హిందూ లా లో అపార ప్రజ్ఞావంతుడుగా పేరుపొందిన శ్రీ పునుగు శ్రీకంఠం. ఇప్పటి తరానికి తెలియని ఈయన గూడూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా, ప్రభుత్వ న్యాయవాదిగా, రైతుల పక్షపాతిగా అనేక కేసులను విజయవంతంగా గెలిచి, నిస్పక్షపాతంగా సేవచేసిన వ్యక్తిగా చరిత్రపుటల్లో ఎక్కడో మరుగున పడిపోయారు.                                     పునుగు శ్రీకంఠం వావిళ్ళ వారి త్రిలిజ్ఞ పత్రికా సంపాదకులు అయిన పునుగు సీతారామ శాస్త్రి గారి కుమారులు, మద్రాసు ప్రెసిడెన్సీకాలేజీ పండితులైన చదలవాడ సీతారామశాస్త్రి దౌహిత్రులు. తన చిన్నతనం నుంచి అల్లాడి మహాదేవశాస్త్రి, వేదం వెంకటరాయశాస్త్రులతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. దీంతో సహజంగానే శ్రీకంఠం పాండిత్యప్రతిభకు గురువుల చనువు నగిషీలు దిద్దినట్టయింది. మద్రాసులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి మెళకువలను వంటబట్టించుకొన్నారు.న్యాయవాదిగా శ్రీకంఠంకు ఎదురులేకుండా పోయింది. శ్రీకంఠం వాదిస్తుంటే న్యాయశాస్త్రంలో తలపండిన వారు, మద్రాస్ అడ్వకేట్ జనరల్, భారత రాజ్యాంగ రూపకర్తలలో ఒకరైన అల్లాడి కృష్ణస్వామయ్య లాంటి మహామహులు, కొమ్ములు తిరిగిన న్యాయవాదులు సైతం భయపడేవారు. న్యాయశాస్త్రంపై పూర్తి పట్టుండటంతో శ్రీకంఠంగారు తాను అనుకున్నదే, జరుగుతుండటంతో జడ్జీలు సైతం ఆయనతో ఏకీభవించేవారు. ఎలాగైనా శ్రీకంఠాన్ని కోర్టుకు రానీయకుండా ఖర్చులకు డబ్బులిచ్చి ఎక్కడికైనా పంపించి వాయిదా తీసుకోండని ఇతర లాయర్లు జూనియర్లకు చెప్పేవారు. శ్రీకంఠం వాయిదాకు రాలేదంటే గండం గడిచినట్టు భావించేవారు. అంతటి ప్రజ్ఞాశాలి వీరు. అందరిలాగా వీరికి ప్రిపరేషన్ ఉండేది కాదు. అంతా బుర్రలో ఉండేది. కేసు డైరీలు రాసేవారు కాదు. ఒకసారి ఫైలు చూశారంటే అన్నివిషయాలు పిన్ టు పిన్ గుర్తుపెట్టుకునేవారు. అంతటి జ్ఞాపకశక్తి వారిది. వీరు గెలిచిన కేసులకు వేరే న్యాయవాదులు అయితే వేలల్లో తీసుకొనేవారు. వీరు మాత్రం 1 రూపాయనుంచి 5 లేదా పది రూపాయలు తీసుకొనేవారు. మహా అయితే వంద అంతకంటే ఎక్కువ తీసుకొనేవారు కాదు. అందుకే మిగతా లాయర్లు వట్టి వెర్రివాడు శ్రీకంఠం అనేవారు. భారత న్యాయ శాస్త్రాన్ని తన తల్లిలా భావించే గొప్ప గుణం వీరిది. నేను వ్యాపారం చేయడానికి కోర్టుకు రావడంలేదని చెప్పేవారు. ఇలా న్యాయశాస్త్రాన్ని మనసా, వాచా, కర్మణా తల్లిలాగ భావించే వారు అత్యంత అరుదుగా ఉంటారు.శ్రీకంఠం పేదల పక్షం వైపు, అందులోను రైతుల పట్ల సానుభూతి కలిగి ఉండేవారు. రైతులకు వ్యతిరేకంగా, జమిందార్లచే బనాయించబడ్డ కేసులే ఎక్కువగా వచ్చేయి. అన్నికేసులను ఒక్కరే చాలా సునాయాసంగా నిర్వహించేవారు. జమీందార్లు, శ్రీకంఠం దగ్గరకు రైతులు వెళ్లకుండా భయపెట్టడమో, ఆశ చూపించి రాజీ చేసుకోవడమో చేసేవారట. ఇంతలా జమీందారులు భయపడేవారు. శ్రీకంఠం గురించి ఒక జమీందారు ‘మహాసముద్రం చెరువు మీదపడితే చెరువు కొట్టుకొని పోతుంది. అలా శ్రీకంఠంగారు సంస్థానాల మీద పడితే అవి కూడా చెరువులమాదిరి కొట్టుకుపోయేటివి’ అని అన్నాడు. అంతటి ప్రతిభ పాటవం శ్రీకంఠం గారిది.                                       నెల్లూరు జిల్లా జమీన్ రైతు ఉద్యమాన్నిసమర్ధించి ఒక లాయర్గా చాలా సేవచేశారు. న్యాయవాదిగా కాకుండా సాహిత్యంలోనూ వీరికి ప్రవేశముంది. సంస్కృతాంగ్లములో మంచి పట్టుకలవారు కావడంతో సూటిగా అనర్గళంగా, మనసుకు హత్తుకొనే విధంగా మాట్లాడేవారు. రామాయణ మహాభారత ఉపన్యాసాలలో అందెవేసిన చేయి వీరిది. విక్రమసింహపురి మండల సర్వస్వమున నెల్లూరు జిల్లా సంస్థానాలు అనే వ్యాసం రాశారు. వివిధ పత్రికల్లో జమీందారీ పాలనలో రైతుల సమస్యలు, చట్టాల తీరుపై అనేక వ్యాసాలు రాశారు. భావవ్యక్తీకరణ సజీవంగా, భాషశైలి సరళంగా ఉంటూ పామరులకు సైతం అర్ధమయ్యే రీతిలో ఉండేది. ఉత్తముడుగా, ఉదాత్తుడుగా, అమాయకుడుగా, మనసున్నవ్యక్తిగా పేరు గడించినా, సంపాదనలో మాత్రం వెనుకబడిపోయారు. 1963 లో వ్యాధిగ్రస్తులై తాను ఎంతగానో ప్రేమించే గూడూరులో మరణించారు. వీరి ఇద్దరి కుమారుల్లో ఒకరైన అనంతరామన్ వైజాగ్ లో ఉంటున్నారు. రెండవ కుమారుడు రాయలు గూడూరు ఎస్కెఆర్ ప్రభుత్వ కాలేజీలో టైపిస్టుగా పనిచేస్తూ అవివాహితులుగా మరణించారు.ప్రతిభావంతులందరూ ప్రయోజకులు కాలేరు. ప్రయోజకులందరూ ప్రతిభావంతులు కాలేరు. ప్రయోజకుడుగా రాణించలేకపోయిన ప్రతిభాసంపన్నులైన లాయరు శ్రీకంఠం. శ్రీకంఠంగారి వంటినిండా మెదడే. మెదడు నిండా ‘లా’ యే అని రాసిన జమీన్ రైతు పత్రిక మాటలు అతిశయోక్తికాదనడంలో ఎలాంటి సందేహంలేదు.

ఆంధ్రప్రదేశ్

చెవిరెడ్డి కి సీఎం అభినందనలు * రాజ్యసభ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర

  తిరుపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విప్,చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని అభినందించారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రణాళిక బద్దంగా వ్యవహరించి అభ్యర్థుల విజయానికి చెవిరెడ్డి కృషి చేశారని, కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 గా ఉన్న సంఖ్యా బలాన్ని చెవిరెడ్డి సమన్వయం చేశారు. కరోనా నేపధ్యంలో పటిష్ట ప్రణాళికతో ఎమ్మెల్యే లందరిని పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు వృధా కాకుండా చెవిరెడ్డి చర్యలు చేపట్టారు. అంతే కాకుండా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను సమన్వయ పరచడం, నలుగురు అభ్యర్థులకు సమకాలీన ఓట్లు రావడం, వారి ఘన విజయానికి చెవిరెడ్డి కృషి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి చెవిరెడ్డిని అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.