Friday, 6 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

లావు తగ్గాలా?

లావు తగ్గాలా? ‘‘పీత పాట్లు పీతవి’’ అనేది తెలుగు నానుడి. పీతకు పాట్లు ఉన్నాయో లేవో తెలి యదు కానీ ఉన్న పాట్లు అన్నీ మనిషికే. కాకుంటే మనుషులుగా మనం ఆ సంగతిని నేరుగా ఒప్పుకోము. పిల్లి మీదా, కుక్క మీదా పెట్టి అదేదో తెగ ఇక్కట్లు పడుతూ ఉన్నట్టు జాలి చూపెట్టి ‘తుత్తి’ పడుతాం. ఆ కోవ లోనిదే కా ఒచ్చు ఈ పీత కష్టాలు కూడా. నిజానికి ప్లాట్లు, ఫ్లాట్లు కొని వెనుక వేసుకుందాము అనే పాట్లూ, ఫీట్లు తిన్న దాన్ని తినకుండా ఎప్పుడూ వెరయిటీగా తినాలి అను కొనే తిప్పలూ, కష్టాలు ఉండేది మనకే. మనం అంటే ఎవరూ? నేనూ, మీరూ, మన ఇంట్లో వారు, చుట్టు పక్కల జనం, ఊరు, పక్క ఊరు, ఆ పక్క ఊరు… వీరిలో తిప్పలు పడే వారు. తిప్పలు పడే వారు అంటే ఎవరికి ఏది కావాలో అది అందని వారూ, ఎవరు ఏది అనుకుంటారో అది జరగని వారు. ఈ రెంటికీ కారణం ‘కోరిక’లే అని బోది చెట్టు తోడుగా బుద్ధ భగవానుడు నెత్తీ నోరు మొత్తుకున్నా అది మన నెత్తికి ఎక్క లేదు. కావాలసినవి దొరక బుచ్చు కోనూ, అనుకున్నవి తీర్చుకోనూ దారులు దొరక్క, ‘‘దేవుడా! ఎక్కడ ఉన్నావయ్యా నువ్వూ..?’’ అంటూ దొరికిన చెట్లకూ చెట్లకూ రాళ్ళకూ రప్పలకూ మొక్కుకుంటూ, కనపడ్డ గుళ్ళకూ గోపురాలకు తిరిగే జనానికి కొదవ లేదు కదా!, చెట్టులు, పుట్టలు, దేవుడి విగ్రహాలు మన మాటలు వినటమే తప్ప గోడు వెళ్ళ పోసుకున్న వారికి నేరుగా ఏదయినా పరిష్కారాన్ని చూపు తాయా అంటే అదీ లేదు. మొక్కుకున్నాక మంచి జరిగితే అంతా ఆ పయి వాడి దయ అనుకోవటం, జరగక పోతే దేవుడు నా మొర ఆలకించ లేదనో, ఆలకించక పోవటానికి ఏదో గట్టి కారణమే ఉంటుందని సర్దుకొని మళ్ళీ మన తిప్పలు ఏవో మనం పడక తప్పదు. బహుశా స్పందించని దేవుడి చోటును భర్తీ చేసేందుకే కాబోలు కానుకలు తీసుకొని స్పం దించే స్వాములు, బాబాలు, అమ్మలు అవ తారం ఎత్తారు. దేవుడిని నిలువెల్లా తమలో నింపుకున్నాము అనేది వీరి అనిపింపు. సాధా రణ జనానికి నమ్మింపు. ఏ మాటకు ఆ మాటే మాటాడు కోవాలి. నిష్టూరంగా ఉన్నా నిజాలు మాట్లాడుకో వద్దూ? అసలు పాట్లు లేని జనం ఎక్కడ ఉంటారు చెప్పండీ? అమెరిక అధ్యక్షుడు ఒబామా అయినా, ఆముదాలవలసలో అంగడి నడిపే అంజయ్య అయినా వారి పుట్టుక మనిషి గానే కదా! మనిషి అన్నాక పాట్లు తప్పవు. ఎలాంటి పాట్లు ఉండ వచ్చూ? ఎలాంటివి అయినా ఉండ వచ్చు. తిండి కోసం సత్యనారాయణ పాటు పడ తాడు. తిన్నది అరగ లేదని కొండల రావు ఏడుపు. అరుగుతుంది కానీ ఆ అరిగింది ఒంటికి పట్టటం లేదు అనేది నారాయణ అను మానం. అసలు ఏమి తినాలి అనేది గంగా రాం అడక. ‘సల్పేటు’ కూటిలో సత్తానే లేదు కాబట్టి ‘ఆర్గానిక్కు’ పుడ్డు లోనే అయిదో తనం ఉందనే సంగతిని బలరాం బల్ల గుద్ది మరీ చెబుతుండే! చూడండీ! ఎన్ని తిప్పలో! ఎన్ని ఇక్కట్లో!! ఎన్ని సమస్యలో!!!. ఒక్క తిండి సంగతి లోనే. చెప్పే వాడికి వినే వాడు లోకువ. వినే వాళ్ళు అంటే తెలియని వారు అని ఇక్కడ తెల్లము. తెలియని వారు ఉన్నంత వరకూ తెలియ చెప్పే వారు పుట్టుకు రావటం సహజం. అంటే తెలియని వారికి దారి చూపటం కోసం తెలిసిన వారు వెలుస్తారు అన్న మాట. చెప్పే వాళ్ళూ రెండు రకాలుగా ఉంటారు. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే వారు తొలి రకం. సమస్యకు పరిష్కారం చూపండయ్యా అంటే కష్టం అయినా ఇదే మంచి దారి అని చెప్పే రకం. అంటే గులక రాళ్ళ దారి వయిపు చూపించే రకం. భారత జాతి బానిస బతుకు నుంచి బయట పడటానికి గాందీ తాత చూపిన దారి ఇది.నడిచే దారి కష్టం అయినా గెలుపు తధ్యం. కానీ షరా మామూలే! ఇది ఎక్కువ మందికి నచ్చదు. ‘‘అబ్బే ఈ దారిలో నడవటం కష్టం!’’ అని అనుకున్నారు అనుకోండి దాని అర్థం ‘‘దగ్గరి దారులు ఏమయినా ఉన్నాయా అని అడగకనే అడిగినట్టు కదా! ఇక్కడ దగ్గరి దారులు అంటే అడ్డదారులూ అని చదువు కోమని మనవి. ‘అడ్డ దారులు’ అనే మాటను నేరుగా బయటకు ఒప్పుకోక పో ఒచ్చు. కానీ ముమ్మాటికి ఎక్కువ మంది జనంలో ఉండే ఆలోచనా తీరు అదే. అనుకున్న వెంటనే పని అయిపోవాలి, కష్ట పడకుండా పని జరగాలి, సులువుగా జరిగి పోవాలి… అని అనుకొనే వారి కోరికలను నెర వేర్చటానికి అంటే తెలియని వారికి తెలియ చెప్పటానికి పుట్టుకు ఒచ్చిన కారణ జన్ములు మలి రకం. నిజం చదువును చదివారో లేదో తెలియదు కానీ జనం ఫేసు ఫీలింగు చదివే ‘ఉత్త’ములు ఈ మలి రకం కోవలో వారే. ఇదిగో!! మీకు కావాల్సి వాటిని సులువు దారుల్లో ప్రసాధిస్తాం’’ అనే అవతార పురుషులు వీరు. ‘‘భార్యా భర్తలు పార్వతీ పరమేశ్వరుల్లా అన్యోన్యంగా ఉండాలి’’ అంటాడు పెళ్ళాం పోరు పడలేక కషాయం కట్టి స్వామి అవ తారం ఎత్తిన రాఘవరావు వురఫ్‌ శ్రీశ్రీశ్రీ ‌రావు రాఘవేంద్ర స్వామీ కంత్రీజి. ‘‘ఆ..హా.. స్వామీజీ ఎంత బాగా సెల విచ్చారూ.. విన్నావుటే వెధవ ముండా! నువ్వు ఎప్పుడయినా నాతో అన్యోన్యంగా ఉన్నావా? ఆ.. స్వామి వారు చెప్పింది అయినా తలకు ఎక్కించుకొని అన్యోన్యంగా ఉండి చావు’’ మంచి బతుకు ఎలా బతకాలో జనానికి చెప్పటానికి ఏర్పాటు చేసిన ప్రబోధ సభలకు నాలుగు వందల కిలో మీటర్ల నుండి పెళ్ళాంతో ఒచ్చిన కనకారావు విసుగు అది. ‘‘ఇదుగో రోజూ ఈ వేప పుల్ల నమలండి! ఆ కషాయం తాగండి ఇలా ఆసనాలు వేయండి!! ఇక మీ జీవితం స్వర్గానికి బెత్తడు అంటే బెత్తెడు దూరంలో’’ కాళ్ళూ చేతులు మెలెసుకొని టీవిలలో దూరిన కార్పోరేటు యోగా గురువు దేకు బాబా పిలుపు. మా ఆశ్రమంలో తయారు చేసిన కషాయం మాత్త రమే సుమా! ఇది కొస మెరుపు. ‘‘ఉప్పు తినకు ఊరి పోతావు, నిప్పులోది తినకు కాలిపోతావు – మీ కోసం పెసలూ పప్పులు స్పెషలుగా పండించి తెచ్చా. అంగట్లో కొంటే అసలు దనం ఉండదు. నా విత్తనాలలో జీవం ఉంది. నాన పెట్టి మొలక ఎత్తాక తినండి’’ రెండు గంటలు ప్రబోధించి వెనుక వెంట తెచ్చుకున్న లారీ గింజలను అమ్ముకునే మాటు అజెండా.‘‘లావుగా ఉన్నారా? మా ప్రోటీను పొడిని వాడండి. గాలి తీసిన బెలూనులా బక్క పడి పోతారు. దీని అసలు ధర పది వేలు. మీ కోసం రెండు వేలకే ఇస్తున్నాము’’ మద్దినేళ అన్నీ టీవీలలో ఒకే సారి ఊదరగొట్టే ప్రకటనలు. ‘‘బనూసు ఒబేసిటీ రిడక్షను పోగ్రాంలో చేరండి నెల రోజుల్లో మీ షేపులు మారుస్తాం’’ ఒక పక్క అడ్డంగా సాగబీకిన పోటో మరో పక్క కుదించిన ఫోటోతో అట్టహాసంగా పత్రి కల అట్టల మీద రంగు రంగుల యాడులు. ‘‘ఇదుగో బోనా బెల్టు. దీన్ని పొట్టకు కట్టు కుంటే మీరు ఎంత తిన్నా ఆ కొవ్వు అట్టే కరిగిపోతుంది’’ ‘‘మీరు తిండి మానక్కర్లా! పని చెయ్యనక్కర లేదు. మీ ఇంటి దగ్గరే ఉండి లావు తగ్గటానికి ఈ ఫోను నంబరును సంప్రదించండి. బీడీ బంకుల దగ్గరా, ఏటీఎంల వద్ద, అపార్టు మెంట్ల ముందు అంటించిన డీటీపీ కాగితాలు లావు తగ్గటానికి మార్కెట్టులో ఉన్న వస్తు వులు, తిండ్లు, పద్ధతులు, జీవన విధానాల గురించి రాసుకుంటూ పోవాలే కానీ ఈ పేపరు అంతా వాటి తోనే నిండి పోతుంది. ఇంతకీ చెప్చొచ్చేది ఏమిటంటే అందరికీ తెలిసిన సంగతే మళ్ళీ మళ్ళీ చెబుతున్న సంగతే ‘‘లావు తగ్గటానికి మంచి దారి లావు పెరగ కుండా ఉండటం’’. ఎంత పని చేస్తారో అంతే తినటం దీనికి పాటింపు. డాక్టర్‌ ‌పి. శ్రీనివాస తేజ

Featured ఆంధ్రప్రదేశ్

అమరజీవి కి ఘన నివాళి

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ ఏ పద్మావతి గారు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ఏ పద్మావతి గారు మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని ఆయన 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా చేశారని రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని,ఆయన త్యాగనిరతి మరువలేనిదని ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జహీర్ , సాయి ఇంకా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

‌మధుమేహాన్ని అదుపు చేసే కాకర

‌మధుమేహాన్ని అదుపు చేసే కాకర కాకరకాయ పేరు వినగానే మనకు చేదు గుర్తుకొస్తుంది. కాకరకాయ, కాకర ఆకు రసం, కాకర కాయ రసం ఇలా కాకరకాయకు సంబంధించిన అన్నిటిలోనూ ఔషధగుణాలున్నాయి. కాకరకాయ రసంలో హైపోగ్లసమిన్‌ ‌పదార్ధం ఇన్సులిన్‌ ‌స్థాయిలలో తేడాలు రాకుండా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజలలో రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గించే చారంటిన్‌ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్ధం ఉంటుంది. కాకరలో ఫాస్పరస్‌ ‌హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది. కాకరను తరచూ తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. కాకర ఆకు రసాన్ని గాయలపై రాస్తే పుండ్లు త్వరగా తగ్గుతాయి. చర్మవ్యాధులకు, క్రిమి రోగాలకూ కాకర రసం బాగా పని చేస్తుంది. కాకరలో అధికంగా ఉండే పీచు జీర్ణ పక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, ‌మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ ‌కూడా లభిస్తాయి. కాకరలోని మొమొకార్డిసిన్‌ ‌యాంటీ వైరస్‌గా పనిచేస్తుంది. కాకరలో థయామిన్‌, ‌రెబోఫ్లావిన్‌, ‌విటమిన్‌ ‌బి6, పాంథోనిక్‌ ‌యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు పుష్కలంగా లభిస్తాయి. కాకరలో సోడియం, శాతం తక్కువగా ఉంటాయి. కనీసం 15 రోజులకొకమారైనా స్పూను కాకర రసం తాగితే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ పిల్లలకు

‌తెలివైన పనివాడు

‌తెలివైన పనివాడు అమరావతి నగరంలో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతనికి పండ్లతోటలు,వ్యవసాయ భూములు, పశువులు ఉండేవి. అతని వద్ద చాలా మంది పని వాళ్లు ఉన్నా,తన పనులన్ని చూడగలిగిన నమ్మకమై వ్యక్తి కోసం ప్రయత్నిస్తూ,సాటి రైతులవద్ద ఈవిషయం చెప్పాడు.ఆరైతులు పంపగా, ముగ్గురు యువకులువచ్చారు.వారిని రోజుకు ఒకరి వంతున రమ్మని చెప్పి,మొదటిరోజున వచ్చినయువకుడిని ‘నాయనా పొరుగున ఉన్న ‘తాడేపల్లి’గ్రామంలో చొక్కరాతి రంగయ్య గారి వద్ద నేను కొన్ని ఆవులు కొన్నాను.ఇవిగో డబ్బులు బస్‌ ‌లోవెళ్లి వారి ఇంట్లో ఉన్న ఒక ఆవును తొలుకురా,మార్గంలో భోజనంచేయి ‘అన్నాడు రామయ్య.డబ్బుల అందుకున్నఆయువకుడు బయలుదేరివెళ్లి ,తిరిగి ఆవుతో రాత్రికి అమరావతి చేరాడు.’ఏంనాయనా ఇంత ఆలస్యం అయిందేం?’అన్నాడు రామయ్య.’అయ్య ఈ ఆవు నాకు కొత్త,నేను ఆఊరి మార్గానికి కొత్త,ఆవు దారి పొడవునా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది’అన్నాడు.’సరే ఇవిగో ఈరోజు పనిచేసిన డబ్బులు, నేను కబురు పెట్టినపుడు పనికి వద్దువుగాని వెళ్లిరా!’అనిసాగనంపాడు.మరుదినం వచ్చిన యువకుడిని కూడా మోదటి రోజు యువకునికి చెప్పినట్లే చెప్పి,డబ్బు ఇచ్చి పంపించాడు.ఆయువకుడు తాడేపల్లినుండి ఆవును తోలుకుని అమరావతికి రాత్రికి వచ్చాడు.ఆవు శరీరంపై విపరీతమైన దెబ్బల వలన ఏర్పడిన వాతలు కనిపించాయి రామయ్యకు.’నాయనా ఆవును ఇంతగా ఎందుకు కొట్టావు?’అన్నాడు రామయ్య.’కొట్టక పోతేమాట వినే రకంకాదు ఈఆవు ఎంత ఏడిపించిందో దారిపొడవునా ,మీకేంతెలుసు’ అన్నాడు ఆయువకుడు.’సరే ఇదిగో ఈరోజు పనిచేసిన డబ్బులు,నేను నీకు కబురుపెడతాను అప్పుడు వచ్చి పనిలో చేరుదువుగాని వెళ్లిరా!,అని ఆయువకుని సాగనంపాడు రామయ్య.మూడవరొజు వచ్చిన యువకుడికి రామయ్య డబ్బులు అందిస్తూ,గతంలో ఆఇద్దరి యువకులకు చెప్పినట్లే చెప్పి,నీపేరేమిటి నాయనా అన్నాడు.’అయ్య నాపేరు శివయ్య, ఈవేసవి ఎండలో ప్రయాణమంటే ఆవు ఇబ్బంది పడుతుంది.నేను రాత్రికి తాడేపల్లి చేరి, వేకువనే బయలుదేరి ఎండ ముదరక ముందే మన ఊరు చేరుకుంటాను’అన్నాడు మూడవరోజు యువకుడు.అతనిమాటలు నచ్చిన రామయ్య ‘నీయిష్టం అలాగే వెళ్లిరా’అన్నడు.మరదినం ఉదయం తెల్లవారిన కొద్ది సేపటికే శివయ్య ఆవును తొలుకు వచ్చిపశువుల పాకలో కట్టివేస్తు’తలపై ఉన్న పచ్చిగడ్డి మూట ఆవు ముందువేసి, అక్కడి పనివారితో’ నాలుగు బానల వేడినీళ్లతో ఆవును రుద్దితూ పోయండి అప్పుడు కాని దానికి ప్రయాణ బడలిక పోదు’ అన్నాడు. ఇదంతా గమనిస్తున్నరామయ్య’ఆవుకు వేడినీళ్లస్నానమా? అయినా నువ్వు ఇంత ఉదయాన్నే ఎలారాగలిగావు’అన్నాడు.’అయ్యా ఆవు కూడా ప్రాణం ఉంటుంది దాని శరీరం ఇన్ని మైళ్లు నడచి అలసి పోయి ఉంటుంది. వేడినీళ్లుతో కడిగితే చాలావరకు శరీర నొప్పులు తగ్గుతాయి. ఇంత ఉదయాన్నే ఎలా రాగలిగాను అంటే,నిన్న సాయంత్రమే, పచ్చిగడ్డికోసి మోపుకట్టి పెట్టుకున్నాను.తొలికోడికూతకే మన ఊరు బయలుదేరి,కొద్ది కొద్దిగా ఆవుకు తలపై ఉన్న పచ్చగడ్డి అందించసాగాను, నేను అందించిన పచ్చగడ్డి పరకలు తింటూ నావేనుక రాసాగింది,నేను వేగంగా నడవడంతో ఆవువేగంగానన్నుఅనుసరించింది’అన్నాడు.శివయ్య తెలివైన పనివాడే,పశువులు కూడా ప్రాణులే అన్న శివయ్యలాంటి పనివాడే తనకు కావలసింది అనుకున్న రామయ్య’ మన ఇంట్లోకి వెళ్లు,అమ్మభోజనం పెడుతుంది తిని,మీఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొ ఈరోజుకు,రేపటినుండి పనిలొనిరా!ఇదిగోనీ పిల్లలకు ఏదైనా తీసుకువెళ్లు, అని డబ్బులు అందించాడు రామయ్య. వినయంగా తలఊపాడు శివయ్య. డా.బెల్లంకొండ నాగేశ్వరరావు, చెన్నై

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు నగరంలో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరు, శానిటరి ఇంజనీరింగ్‌ ‌చదివి, ముంబై రైల్వేలో ఉద్యోగం చేశారు. భార్య, తల్లి చనిపోగా విరక్తితో ఉద్యోగం వదిలి, దేశసేవలో మునిగారు. గాంధీజీ అభిమానిగా ఆశ్రమ జీవితం కొన్నాళ్ళు గడిపారు. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్‌ ఇం‌డియా ఉద్యమాల్లో జైలు కెళ్ళారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఆలుపెరగని పోరాటం చేశారు. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలుగు ప్రాంతాలను విడదీసి, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ప్రజలు కోరుతుండే వారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి కోర్కెను పట్టించుకోలేదు. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్‌ 19‌న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 58 రోజుల దీక్ష ఆనంతరం 1952 డిసెంబర్‌ 15‌న పొట్టి శ్రీరాములు కన్నుమూశారు. తదనంతరం పరిణామాలతో 1953 నవంబర్‌ 1‌న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత హైదరాబాద్‌తో కలిసిన తెలంగాణ ప్రాంతాన్ని కలిసి ఆంధప్రదేశ్‌గా ఏర్పడింది. తెలుగు వారికి పొట్టి శ్రీరాములు త్యాగం గుర్తుండి పోతుంది.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

‌నేడు ‌ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

‌నేడు ‌ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించేంత వరకు మనం ఎన్నో రకాల వస్తువులు, సేవలు ఉపయోగిస్తుంటాం. తమనం వాటికి వినియోగదారులం. తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్నప్పటి నుంచి సమాధిలో నిదురించే జీవిత కాలమంతా ప్రతి మనిషి వినియోగదారుడే! గతంలో ‘కొనుగోలు దారుడా జాగ్రత్త!’ అనే హెచ్చరిక ఉండేది. అమ్మేవారు ఏమిచ్చినా జాగ్రత్తగా కొనవలసిన బాధ్యత వినియోగదారునిపై బాధ్యతగా ఏకపక్షంగా ఉండేది. 1962 మార్చి 15న ఆనాటి అమెరికా అధ్యక్షుడైన జాన్‌ ఎఫ్‌.‌కెనడీ ఆ దేశ పార్లమెంట్‌లో వినియోగ దారుల హక్కులను ప్రకటించారు. తదనంతరం వినియోగదారుల చట్టం అమెరికాలో తయారైంది. ఆ మార్చి 15వ తేదిని ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’గా 1983 నుంచి పాటిస్తున్నారు. ‘కన్సూమర్‌ ఇన్టర్నేషనల్‌’ ‌పేరిట ఉన్న వినియోగదారుల సంఘాల ప్రపంచ స్థాయి ఫెడరేషన్‌ ‌వారు వినియోగదారుల హక్కుల ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం, 1986 అమలులో వుంది. ఈ చట్టం క్రింద జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో జిల్లా ఫోరముల, రాష్ట్ర, జాతీయ కమిషను ఏర్పాటు చేయబడి వినియోగదారుల ఫిర్యాదుల్ని విచారించి పరిష్కరిస్తున్నాయి.

Featured

మంచాల పల్లి గ్రామంలో వైసిపి శ్రేణుల సంబరాలు

అనంతసాగరం మండలం: మంచాల పల్లి గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన చెందిన నాయకులు రాజా రెడ్డి, కొమ్మూరి ఈశ్వరమ్మ, ఎస్ రాజారెడ్డి,కె. లక్ష్మయ్య, డి. వెంకటేశ్వర్లు,డి. మేజర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో, అభిమానులతో కలిసి రాష్ట్ర పంచాయతీ ఎలక్షన్లలో మున్సిపల్ ‌ఎలక్షన్లలో వైయస్సార్ సిపి పార్టీ విజయదుందుభి మోగించడం తో ఆనందంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా వై ఎస్ ఆర్ సి పి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ పార్టీ గెలిచిన చరిత్ర లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ప్రవేశపెట్టిన పథకాలే ఇంతటి ఘన విజయానికి కారణమని గతంలో నాయకులు మాటలకే పరిమితం అయ్యే వారని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రజలకు సక్రమంగా అందేవి కాదని ప్రస్తుత ముఖ్యమంత్రి మాట తప్పని మడమ తిప్పని మహా నాయకుడని ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకు వచ్చాడని, ఇంకా మరెన్నో పథకాలు తీసుకువస్తానని ప్రజలు నమ్మరు కాబట్టే ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చారని, వాలంటీర్ వ్యవస్థ సచివాలయం ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేస్తున్నారని కొనియాడారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

ఇల్లు చల్లగా ఉండాలంటే..

ఇల్లు చల్లగా ఉండాలంటే.. (‌పున్నమి ప్రతినిధి) : చూస్తుండగానే ఎండలు మొదలయ్యాయి. శివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో ఎండలు మండిపోయే అవకాశం ఉంది. సమ్మర్‌ ‌లో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే దానికోసం ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవాలి. అదెలాగంటే.. వేసవిలో ఇంటి కూలింగ్‌ ‌కోసం ఏసీ, కూలర్ల వాడకం ఎలాగూ ఉంటుంది. వాటితో పాటు మరికొన్ని టిప్స్ ‌ద్వారా సహజంగానే ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. మొక్కలతో.. మొక్కలు, చెట్లు ఉన్న ఇంటి వాతావరణం ఆటోమేటిక్‌ ‌గా చల్లగా మారిపోతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల వేడి తగ్గించుకోవచ్చు. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అదంతా చెట్లతో నింపడం మంచిది. అలాగే ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం. దీనినే రూఫ్‌ ‌టాప్‌ ‌గార్డెన్‌ అం‌టారు. అపార్టుమెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలోనూ మొక్కలు పెంచొచ్చు. పరదాల చల్లగా.. కిటికీలు, తలుపులకు నారతో చేసిన చాపలను వాడటం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా చూసుకోవచ్చు. వాటిని తరచూ నీటితో తడుపుతూ ఉంటే ఇంకా చల్లగా ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే గడ్డి చాపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. ఇంట్లో చల్లదనాన్ని కలిగించే కొత్త తరహా పాలిమర్‌ ‌లు కూడా ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. ఇవి సూర్యరశ్మిని చాలా వరకు తగ్గిస్తాయి మరికొన్ని.. వేసవిలో పగటిపూట ఓవర్‌ ‌హెడ్‌ ‌ట్యాంకులో నీరు లేకుండా చూసుకోవాలి. తగినంత నీరు టబ్బుల్లో, బక్కెట్లలో నీళ్లు నిల్వ చేసుకుని బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం లాంటి పనులకు వాడుకోవాలి. లేదంటే వేడెక్కిన నీటివల్ల కప్పు, గోడల్లోని పైపుల ద్వారా గదులన్నీ వేడెక్కుతాయి. వేసవిలో టీవీ, కంప్యూటర్‌, ‌ఫ్రిజ్‌, ‌వాషింగ్‌మెషిన్‌, ‌వ్యాక్యూమ్‌ ‌క్లీనర్‌, ‌హీటర్ల వినియోగాన్ని వీలున్న మేరకు పరిమితం చేసుకోవాలి. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇంట్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వెంటిలేటర్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఈ వెంటిలేటర్ల కు ఎగ్జాస్టింగ్‌ ‌ఫ్యాన్లు అమర్చుకోవాలి. ఒక -ట్రేలో ఐస్‌ ‌ముక్కలు వేసి, ఫ్యాన్‌ ‌కింద పెడితే గదిలో చల్లదనం పరచుకుంటుంది. లేదా టబ్బులో చల్లని నీరుపోసి, గది మూలల్లో పెట్టినా గది చల్లబడుతుంది. ఇంటి గోడల పక్కన పెద్ద పెద్ద రాళ్లు , సిమెంట్‌ ‌నిర్మాణాల వంటివి అనవసరంగా ఉంటే వాటిని తొలగించాలి. ఎందుకంటే అవి ఎండను రిఫ్లెక్ట్ ‌చేసి, వేడిని పెంచుతాయి.

Featured ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు మంచాలు, బియ్యం అందజేత

గత కొద్ది రోజుల క్రితం గంగపట్నం గిరిజన కాలనీలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈరోజు ఉదయం పులి చెంచయ్య ITDA (APO) మరియు సింగపూర్ కమ్యూనిటి అసిస్టిన్సి గ్రూపు మరియు రమణ USA పోచరెడ్డి సంపత్ రెడ్డి మరియు వారి కుమారుడు సురేష్ ( సింగపూర్) H.ఎజ్జు మల్లికార్జున గారు రామకృష్ణ. పి.శ్రీకాంత్ పరుచూరు స్వర్ణలత మరియు శ్రీధర్ వారి ఆర్ధిక సహయం తో బాధిత కుటుంబాలకు మంచాలు . బియ్యం మరియు దుప్పట్లు. బట్టలు అందజేయాడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు జనార్దన్ రెడ్డి సర్పంచ్ నిరంజన్ వేణుగోపాల్ రెడ్డి . ఫణీంద్ర నాయుడు. వాలంటీర్ భాస్కర్ గిరిజన నాయకులు శేషయ్య. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.