Friday, 6 March 2026

Blog

Featured

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుచ్చి పట్టణ అభివృద్ధికి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ సుప్రజ తోపాటు వార్డు కౌన్సిలర్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చి మండలం తో తనకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు బుచ్చి పట్టణ అభివృద్ధికి నిధులను సైతం అందజేస్తామన్నారు. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు వారి వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎంపీ ఆదాలను గజమాలతో సత్కరించారు. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట సుబ్రమణ్యం నాయుడు, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, సయ్యద్ ఫయాజుద్దీన్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Featured

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు సూచించారు. గురువారం నగరంలోని బీవీఎస్‌ గర్ల్స్‌ హైస్కూల్లో విద్యార్థినులకు మహిళా రక్షణ చట్టాలపై శ్రీరామరాజు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యకమ్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు ఆపద సమయంలో ఈ చట్టాల ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ సెల్‌ఫోన్‌లో ఈ చట్టాలకు సంబంధించిన యాప్‌ల అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యార్థినులకు బ్యాడ్‌ టచ్‌, గుడ్‌టచ్‌, ఈవ్‌టీజింగ్‌, దిశ యాప్‌ తదితరాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. అనంతరం దిశ యాప్‌ గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

Featured

వేదగిరి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి

(పున్నమి ప్రతినిధి,నెల్లూరు) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మినరసింహస్వామి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి సురేంద్రరెడ్డి నియమితులైనట్లు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయం నేడొక ప్రకటనలో పేర్కొంది. సభ్యులుగా అల్లూరు దినేష్‌కుమార్‌, పామూరు మల్లిఖార్జున్‌రెడ్డి, నెట్టెం రఘురామయ్య, రాపూరు అంజయ్య, వినుకోటి ప్రసన్న లక్ష్మి, జయమ్మ, సుంకర మస్తానమ్మ, లక్ష్మమ్మను నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Featured

అధిక మోతాదులో పురుగు మందులు వాడొద్దు

(పున్నమి ప్రతినిధి, విడవలూరు ) రబీ సాగులో అధిక మోతాదులో ఎరువులు,పురుగు మందులు వినియోగించవద్దని, అధికారుల సూచనల మేరకు వాడాలని ఏఓ వెంకటకృష్ణయ్య సూచించారు. గురువారం మండలంలోని వావిళ్ల గ్రామంలో పోలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు అధికారుల సూచనల మేరకు పురుగు మందులు, ఎరువులను వాడడం ద్వారా పంట దిగుబడి బాగుటుందన్నారు. అంతేకాకుండా పెట్టుబడులను కూడా తగ్గించుకోవచ్చన్నారు. తగిన మోతాదుల్లో ఎరువులను, పురుగు మందులను వాడినట్లతే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

Featured

37వ డివిజన్‌లో జగనన్న మాట -` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట

(పున్నమి ప్రతినిధి) కార్యకర్తల నివాసాలకు వెళ్ల వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట ` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట గురువారం 37వ డివిజన్‌లో 59వ రోజు సాగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డివిజన్‌లోని క్రాంతినగర్‌, రాంనగర్‌, మిలటరీ కాలనీ ప్రాంతాల్లో స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలకు అండగా తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. కార్యకర్తల ఇళ్లకి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకు రావాలన్నారు.

Featured

పాత వాహనాలు వేలం

(పున్నమి పత్రినిధి, బుచ్చి) వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 23వ తేదిన వేలం పాట నిర్వహించనున్నట్లు ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ తెలిపారు. వాహనాల వేలంకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్‌ పరిధిలో పట్టుబడిన 14 వాహనాలు, ఆత్మకూరులో పట్టుబడిన 15 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కృష్ణకిషోర్‌ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదిన బుచ్చి ఎస్‌ఈబీ కార్యాలయంలో ఈ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు పది శాతం రుసుమును చెల్లించడంతో పాటు ఆధార్‌, పాన్‌కార్డు దృవీకరణ పత్రాలు అందచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే పద్ధతిని జిల్లా అంతా ఆచరిస్తే బాగుంటుందని జిల్లా పజ్రలు కోరుకుంటున్నారు.

Featured

ముస్లింలంతా కోటంరెడ్డికి రుణపడి ఉంటాం

నెల్లూరు జిల్లా ముస్లింలంతా రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని ముస్లిం నాయకులు సయ్యద్‌ సమీ అన్నారు. ఆధునిక భారత దేశంలో ఎక్కడా కట్టనటువంటి విధంగా ఈ ఈద్గా నిర్మాణం చేపడుతున్నామన్నారు.నగరంలోని బారాషాహీద్‌ దర్గాలో నిర్మాణంలో ఉన్న ఈద్గా పనులను మార్చి 25 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఆరోజు రూరల్‌ శాశసన సబ్యలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి చేతుల మీదుగా ముస్లిం జాతికి అంకితమిచ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఆధునిక భారత దేశంలో ఇలాంటి ఈద్గాని ఎక్కడా కట్టలేదన్నారు. ఈ ఘనత కేవలం రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ ఈద్గాని ముస్లిం జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులను పిలుస్తామని తెలిపారు. ఈ ఈద్గా నిర్మాణానికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రసంశించారు.

Featured

సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి ఖండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కరించండి*

*సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి ఖండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కరించండి .సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిక లో తాగునీటి సమస్య వెంటాడుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలకు అక్టోబర్ మాసంలో గ్రామానికి తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి తాగునీటి సౌకర్యం లేక పుట్టంరాజువారి కండ్రిక వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదు . దీంతో కొమ్మనేటూరు ఎంపిటిసి గడ్డం సహదేవ్ సమస్యను ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు. కొమ్మనేటూరు పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ ప్రారంభానికి వచ్చిన ఎంపీ గురుమూర్తి సమస్యను వివరించారు. సుమారు 130 గడప ఉన్న గ్రామంలో ఆరు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని చెప్పారు. దీంతో ఎంపీ గురుమూర్తి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి తాగునీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి ఈ సందర్భంగా ఆదేశించారు. దీంతో క్కొమ్మనేటూరు ఎమ్ పి టి సి గడ్డం సహదేవ తో సహా గ్రామస్తులు ఎంపీ గురుమూర్తి కి కృతజ్ఞతలు చెప్పారు.

Featured

అర్థనగ్నం తో 10వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించిన వీఆర్ఏలు..  

అర్థనగ్నం తో 10వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించిన వీఆర్ఏలు.. మర్రిపాడు ఫిబ్రవరి 17 (పున్నమి విలేకరి ) మర్రిపాడు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట తమ సమస్యలను తీర్చాలని గత 10 రోజుల నుండి దీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం వారి యొక్క దీక్షని వినూత్నంగా నిర్వహించడం జరిగింది. గురువారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట అర్ధనగ్నం రిలే నిరాహార దీక్షలో మర్రిపాడు మండల గ్రామ రెవిన్యూ సహాయకులు పాల్గొన్నారు. మండల రెవెన్యూ వీఆర్ఏ లకు కనీస వేతనం 21000 గా ఇవ్వాలని, నామిని లను వీఆర్ఏలు గా నియమించాలని, దశలవారీగా వీఆర్ఏల ఆందోళనలను జయప్రదం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మూలి వెంగయ్య మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21000ఇవ్వాలని, డిఎ తో కలిపి వేతనం చెల్లించాలని నామినీలను విఆర్ఏలు గా నియమించాలని , అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని, 65 సంవత్సరాలు దాటిన చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కంపాస్నెట్ గ్రౌండ్ కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రధాన డిమాండ్స్ తో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లో మండల వీఆర్ఏల అధ్యక్షులు ఓబులేసు ఉపాధ్యక్షులు నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Featured

*మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వాలని నియోజకవర్గం ప్రజల విజ్ఞప్తి మర్రిపాడు :పీబ్రవరి 17(పున్నమి విలేకరి ) వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి . ఆయన అప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ తో ఎవరు వెళ్లకుండా కట్టడిచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటు రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తో నేను సైతం అని ముందడుగు వేశారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాక్ట్ బిల్లులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే తడవుగా ఎంపీ పదవికి రాజీనామా చేసి నెల్లూరు ఎంపీగా వైసిపిఅభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి నెల్లూరు ఎంపీగాగెలిచారు .రాజమోహన్ రెడ్డిని ఆ ఉప ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత సంపన్నుడైన మాజీ కేంద్రమంత్రి టి.సుబ్బిరామి రెడ్డిని మేకపాటి పై పోటీకి దించింది. తెలుగుదేశం పార్టీ మరో ప్రముఖ వ్యాపారవేత్త ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ని పోటీ చేయించింది. కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల జన ప్రవాహాన్ని తట్టుకొని మేకపాటి ఎంపీ గా నెల్లూరు నుండి ఘన విజయం సాధించారు. అనంతరం 2014లో మరోసారి నెల్లూరు ఎంపీ అప్పటి టిడిపి అభ్యర్థి ఆదాల పై పోటీ చేసి మేకపాటి నెల్లూరు నుండి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు . జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేనిసమయాలలో పార్టీకి పెద్దదిక్కుగా రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారు.మేకపాటి వర్గం జగన్మోహన్ రెడ్డి ని నమ్ముకుని ఆయన వెంటనడిచిన సీనియర్ రాజకీయ నేతకు 2019 లో జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన ఆదాలకు ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చినారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా మేకపాటి ఈరోజు కూడా ఎక్కడా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేదు వైఎస్ఆర్ కుటుంబానికి వైసీపీకి విధేయుడు అని ప్రకటించారు.రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్ర శేఖర్రెడ్డికి ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ తనయుడు అప్పటి ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి కి టికెట్ ఇచ్చిన వైసిపి ఒకే ఇంట్లో మూడు టికెట్లు అని అందుకే మేకపాటి ని పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. ఎన్నికల అనంతరం మేకపాటికి రాజ్యసభ సీటు ఇస్తారని రాజకీయ వర్గాలు భావించాయి వచ్చే జూన్ లో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి నాలుగు సీ ట్లలో వైసిపి ఏ విజయం సాధిస్తుందో,అయితే సీనియర్ రాజకీయవేత్తగా ఆయన మేకపాటి రాజ్యసభకు తీసుకువస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని ప్రస్తుత రాజ్యసభ విజయసాయిరెడ్డి మేకపాటికి సీటు రాకుండా చేసేందుకు బీదా మస్తాన్ రావు అనే టిడిపి నాయకుడిని వైసీపీలో చేర్పించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రజమోహన్ రెడ్డి కుటుంబం ఆప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జగన్తో ఎవరిని వెళ్లకుండా కట్టడిచేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ధిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తోచేరారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాస్ట్ బిల్లులు కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే బీద కు రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీ మార్చినట్లు ఒప్పందం కుదిరిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరుజిల్లా నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే రెండు సీట్లు రెడ్డిసామాజిక వర్గానికి ఇచ్చారని నానుడి ఉంటుందని అందువల్ల బీసీలు అయిన భీదకు అవకాశం ఇవ్వాలని విజయసాయిరెడ్డి జగన్మోహనెడ్డిని ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత మాత్రానరాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడైనా ఉన్నదా అనే నిన్న మొన్న పార్టీలో చేరిన టిడిపి నాయకుడికి రాజమోహన్ రెడ్డికి అంటి పెట్టడం ఏమిటని జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మేకపాటి తనయుడికి మంత్రి పదవి ఇచ్చి ఉన్నదని వారి తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యే గా ఉన్నారని రాజమోహన్ రెడ్డికి పదవి ఎందుకని కొందరు చేస్తున్న వాదానిలోఎంత మాత్రం సమంజసం అని పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.రాజమోహన్ రెడ్డి 1985లో ని ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో ఒంగోలు ఎంపీ గాగెలిచారు 2004లోనరసరావుపేట ఎంపీ గా గెలిచారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపధ్యం పాలన అనుభవం కలిగిన రాజమోహన్ రెడ్డి మర్రిపాడుమండలం ఆయన స్వగ్రామం మండలంలోని బ్రాహ్మణపల్లి మేకపాటి వెంకీ రెడ్డి ప్రధమ సంతానమైన రాజమోహరెడ్డి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఆర్ ఈ సి లో ఎంటెక్ చేశారు. కాంట్రాక్టు రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపుమేరకురాజకీయాలలోప్రవేశించి 1985లో ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. సౌమ్యుడు వివాద రహితుడు. తానుఅభిమానించే వారి పట్లవిధేయత చూపే మంచి లక్షణాలు కలిగి ఉన్న మేకపాటికి రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన సేవలను వైసీపీ వినియోగించుకోవాలని జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తలు,ఆత్మకూరు నియోజక వర్గ ప్రజలు సొంతమండల మర్రిపాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిఅభిమానులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.