Wednesday, 11 March 2026

Blog

విశాఖపట్నం

సమీక్ష సమావేశంలోనే ప్రాణం పోయిందా?

గాజువాక జోన్–6లో ఎస్‌ఈ గోవిందరావు మృతి – ఒత్తిడే కారణమా? లోడర్లపై ప్రశ్నలతో వేడెక్కిన సమావేశం… కుప్పకూలిన అధికారి విశాఖ గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి): గాజువాక జీవీఎంసీ జోన్–6 కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర విషాదంగా మారింది. జోన్–6 సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) గోవిందరావు సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురై కుప్పకూలి అనంతరం మృతి చెందడం నగరవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన వెనుక సమావేశంలో జరిగిన పరిణామాలే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సమక్షంలో సమీక్ష జోన్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో పారిశుధ్య నిర్వహణ, లోడర్ల పని తీరుపై చర్చ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఎస్‌ఈ గోవిందరావును నేరుగా ప్రశ్నిస్తూ గాజువాకలో ఎన్ని లోడర్లు పనిచేస్తున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. లోడర్ల అంశంపైనే తీవ్ర వాగ్వాదం గాజువాక పరిధిలో మొత్తం ఐదు లోడర్లు ఉండగా నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని గోవిందరావు సమాధానం ఇచ్చారు. అయితే పనిచేయని ఒక్క లోడర్‌ను కేంద్రంగా చేసుకుని పట్టాభి తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. గాజువాక స్వచ్ఛాంధ్రలో దుర్గంధానికి కారణం ఎస్‌ఈ వైఫల్యమేనని వ్యాఖ్యానించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చినట్లు సమాచారం. సమావేశంలోనే అస్వస్థత… కుప్పకూలిన ఎస్‌ఈ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన గోవిందరావు సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించే క్రమంలో గోవిందరావు మృతి చెందారు. మానసిక ఒత్తిడే కారణమా? అనుమానాలు ఈ ఘటనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సమావేశంలో ఎదురైన ఒత్తిడి, అవమానకర వ్యాఖ్యలే ఆయన మృతికి కారణమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై పెరుగుతున్న రాజకీయ, పరిపాలనా ఒత్తిళ్లపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. స్వతంత్ర విచారణకు డిమాండ్ గోవిందరావు మృతిపై స్వతంత్ర విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమావేశంలో పాల్గొన్న వారి పాత్రను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు

ఖమ్మం, జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ప్రతినిధి) చందువుల తల్లి సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి, మధిర, పాలేరు, వైరా, ఖమ్మం నియోజకవర్గ కేంద్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఖమ్మం నగరంలోని గుట్టల బజార్‌లో ఉన్న శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర నుంచి తీసుకొచ్చిన సరస్వతి దేవి ఫోటోలను, అక్షితలను కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు పంపిణీ చేశారు. విద్య, జ్ఞానం, విజ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి మాత ఆశీస్సులతో విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తు సాధించాలని భక్తులు ప్రార్థించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో సాగునీరు విడుదల.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని మనుబోలు, పిడూరు, ఎల్‌.వై.ఎన్‌పురం, కాగితాలపూరు తదితర గ్రామాల రైతులు సాగునీరు అందడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే స్పందించి కండలేరు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయించారు. సమస్య పరిష్కారంకావడంతో రైతులు, నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, సొసైటీ అధ్యక్షుడు పి. రామకృష్ణయ్య, యువనేతలు, మనుబోలు నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

E-పేపర్

కుక్కలను విషం పెట్టి చంపడంపై మంత్రి సీతక్క సీరియస్

కుక్కలను విషం పెట్టి చంపడంపై మంత్రి సీతక్క సీరియస్ కుక్కలను చంపకుండా గ్రామ పంచాయతీలకు మార్గదర్శకాలు జారీ కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలను విషప్రయోగంతో చంపిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిపిన మంత్రి సీతక్క వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్దం ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సూపరీడెంట్ పదోన్నతి పొందిన కోవూరు కళాశాల సీనియర్ సహాయకులు

ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు, నెల్లూరు *ప్రిన్సిపాల్ శ్రీ S.A.సికిందర్ గారి* సారథ్యం లో …. *శ్రీ J.అశోక్ గారు* ఇటీవల పల్నాడు జిల్లా DIEO ఆఫీసు సూపరిండెంట్ గా పదోన్నతి పొందిన సందర్భమున హార్దిక శుభాకాంక్షలతో ఘనంగా సన్మానించి వీడుకోలు తెలుపుతున్న కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది.💐💐💐🎉🎊 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖

E-పేపర్

ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

*ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య* *ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది* పున్నమి న్యూస్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 22 జనవరి 2026 ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం, వెంకటరమణ కాలనీకి చెందిన మాదరి శివకుమార్ (35) అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతను గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవ పడేవాడు. అయితే ఈ నెల 21 రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్ వెళ్లే దారిలో నల్ల కంచ అటవీప్రాంతంలో ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడాడు. దీంతో సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

E-పేపర్

*ఈ కాంగ్రెస్ పాలనలో* *రైతులకు తిప్పలు తప్పవా … !* ( మంచాలలో ఈరోజు యూరియా కోసం ఎగబడిన మహిళా రైతులు )

*ప్రజా పాలనలో రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ!!* *వందల్ల సంఖ్యలో రైతులు పదుల సంఖ్యలో బస్తాలు -* ఈ రోజు మంచాల మండల కేంద్రంలో సహకార బ్యాంకు వద్దా యూరియా కోసం గత నాలుగు రోజులుగా బడిగాపులు కాస్తున్న మంచాల మండల రైతులు మహిళలు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో BRS పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్ మాట్లాడుతూ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.

ఖమ్మం

నిబద్ధతతో ప్రజాసేవకు జనసేన సిద్ధం – మధిర మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో పోటీ: జనసేన జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ

ఖమ్మం, జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి) మధిర మున్సిపాలిటీలో నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జనసేన జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ తెలిపారు. మధిర ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా చైతన్యవంతమైన మధిర ప్రాంతంలో ప్రస్తుతం రౌడీయిజం రాజ్యమేలుతోందని, శాంతిభద్రతలు సరిగా లేక గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే బలమైన స్థానిక నాయకత్వం మధిరలో ఇప్పటివరకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. గత 20 సంవత్సరాలుగా మధిర పారిశ్రామిక అభివృద్ధికి పూర్తిగా దూరంగా ఉందని, వందల కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపనలు జరిగాయే తప్ప ప్రారంభోత్సవాలు లేవని విమర్శించారు. అలాగే మధిర కేంద్రానికి విజయవాడ, ఖమ్మం నుంచి సరైన రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం ప్రాంత అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. యువత, విద్యావేత్తలు, సామాజిక సేవలో ఆసక్తి ఉన్న వారికి జనసేన పార్టీ రాజకీయాల్లోకి రావడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను జనసేన పార్టీకి 50 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. అన్ని వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మధిర జనసేన పార్టీ నాయకులు మోదుగు రమ్య, అనంత శివరామకృష్ణ, తాళ్లూరి డేవిడ్, అనుమొల నరేష్, మందడపు రామకృష్ణ, దీపకళ, సాయితేజ, పవన్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

లంకపల్లిలో ఘనంగా ‘సీయం కప్’ క్రీడలు ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్

ఖమ్మం, జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ప్రతినిధి) పెనుబల్లి మండలంలోని లంకపల్లి క్లస్టర్ పరిధిలో గురువారం ‘సీయం కప్’ గ్రామ స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. లంకపల్లి క్లస్టర్ పరిధిలోని లంకపల్లి, క్రొత్త లంకపల్లి, మండాలపాడు, ఎరుగట్ల, రామచంద్రాపురం గ్రామ పంచాయతీలకు చెందిన క్రీడాకారుల మధ్య ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే గారు వాలీబాల్ క్రీడను ప్రారంభించి, స్వయంగా క్రీడాకారులతో కలిసి ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, జీవితంలో గెలుపు–ఓటములు సహజమని, ఓటమిని పాఠంగా తీసుకుని గెలుపును ప్రేరణగా మలుచుకోవాలని క్రీడాకారులకు సూచించారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న యువతకు, క్రీడాకారులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ పరిధిలోని నూతన సర్పంచ్‌లు పాల్గొనగా, ఎమ్మెల్యే గారు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. స్థానిక పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తూ తక్షణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడా విభాగం అధికారులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

ఉద్యమకారుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది – మాజీ ఎంపీ నామ

ఖమ్మం జనవరి ( పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి ) వైరా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం నాడు వైరా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. అందులో భాగంగా ముందుగా కారేపల్లి వాస్తవ్యులు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జడల వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయం తెలిసిందే, ఈ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి వారి సతీమణి మాజీ ఎంపీటీసీ జడల వసంత, కుమారుడు జడల కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు, అధైర్యపడొద్దు అండగా ఉంటామన్నారు. ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారు మన మధ్య లేకపోవటం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీ నామ పేర్కొన్నారు. అనంతరం కారేపల్లి మండలం గాదపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచెపల్లి కృష్ణారెడ్డి బుధవారం నాడు మరణించిన విషయం తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్లి వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు అలానే రఘునాథపాలెం మండలం, చింతగుర్తి గ్రామంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్, దిశా కమిటి మాజీ సభ్యులు మెంటెం రామారావు మాతృమూర్తి శకుంతుల దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం అక్కడ నుండి ఖమ్మం చేరుకొని వీడియోస్ కాలనీ నందు ఇటీవల మరణించిన మోతుకూరి పుల్లయ్య నివాసానికి వెళ్లి వారి కుమారుడు గోపాలరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీ నామ వెంట రఘునాథపాలెం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వీరు నాయక్, కార్పొరేటర్ జ్యోతిరెడ్డి, నాయకులు తాతా వెంకటేశ్వర్లు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, పిన్ని కోటేశ్వరరావు, కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్ రావు, గొడ్డేటి మాధవరావు, ముత్యాల సత్యనారాయణ, వున్నం వీరేందర్, రమేష్, రావూరి శ్రీను, బత్తుల శ్రీను, డి రవీందర్, మోతుకూరి పాపారావు, సిరిపురపు సంపత్, కనకమేడల గోపాల కృష్ణమూర్తి, వెంగళం శ్రీను, వాకదాని కోటేశ్వరరావు, అన్వేష్, కనగళ్ళ శ్రీకాంత్, రామకృష్ణ, నునావత్ రవి, లక్ పతి, రేగళ్ల కృష్ణప్రసాద్ లతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.