Wednesday, 11 March 2026

Blog

సాహితీ

బాలిక జీవిత కథానాయిక (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

జాతీయ బాలిక దినోత్సవం (జనవరి24) సందర్భంగా… బాలిక జననం దైవాంశ పూరితం కుటుంబ పుష్టికి ఆనంద భరితం గృహిణిగా చేయూత పరిపూర్ణ చరితం అమ్మాయి నుండి అమ్మ వరకు అమ్మ నుండి అవ్వ వరకు చెల్లి నుండి అక్క వరకు భార్య నుండి బామ్మ వరకు రూపాంతర పరిమళ మాలిక వనితగ మహిళగ జీవితవేదిక *వ* – వయస్సు ఆధారంగా తన ఉనికిని ఉన్నతంగా ఉంచుకుంటూ *ని* – నిరంతరం తరంతరం కొనసాగిస్తూ… *త* – తను లేనిదే జీవనం నిర్జీవం అని మానవజాతి తలచే దేవత వనిత. *మ* – మనిషి పుట్టుటకు మనుగడకు మూలం *హి* – హితోక్తుల భావజాలానికి బలం *ళ* – కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం అసలు సృష్టికే మూలం ఆప్యాయతలు పంచే సంసార సారిక అమ్మకు అమ్మయ్యే జీవన గమన దీపిక మహిళా సాధికారతకు దివ్యౌషధ మూలిక బాలిక జీవిత మధుర జ్ఞాపిక తరతరాల సుసంపన్న మాతృక బాలిక నుండి బాంధవ్య ఏలిక దాక విధి క్రీడలో అనుసరణీయ భాగ్యరేఖ స్మరణీయ కమనీయ కాలచక్ర కథానాయిక

వనపర్తి

జిల్లా తనిఖీ విభాగం సభ్యులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని

* *ప్రభుత్వ పాఠశాలల తనిఖీ విభాగంతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24/01/2026* *గత పది రోజులుగా వనపర్తి జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాలల జిల్లా తనిఖీ విభాగం సభ్యులతో వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని గారు ఈరోజు సాయంత్రం తమ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది, ఇందులో టీం లీడర్ మరియు సభ్యులు తమ తమ తనిఖీల్లో చూసిన అంశాలు వివిధ పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న వినూత్న బోధనా పద్ధతులను మధ్యాహ్న భోజన పథకాలు డిజిటల్ మరియు ఎఫ్ ఎల్ ఎన్ పానెల్ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విద్యా సంబంధమైన యాప్ లతో సరళతరంగా సులభతరంగా విద్యార్థులకు బోధిస్తున్నారని, ఈ ప్రక్రియ ఇలాగే భవిష్యత్తులో కొనసాగించాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలల పై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా బోధనల్లో తమతమ శైలిలో బోధన అభ్యసన ప్రక్రియలను తరగతి గదిలో బోధించాలని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తో ఆకట్టుకునే విధంగా వివిధ ఆక్టివిటీస్ బేస్ పద్ధతుల్లో బోధించాలని వారు తనిఖీ విభాగ టీం లీడర్ మరియు సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గణేష్, చంద్రశేఖర్, ఆనంద్, అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ మహానంది, ప్రతాపరెడ్డి, వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు టీం సభ్యులు శ్రీనివాసులు, వేణుగోపాల్ రెడ్డి, ఎంఎన్ విజయకుమార్, కబీర్, రవి, లక్ష్మీదేవి, నరసింహ, కే మధుసూదన్, కృష్ణ ,కురుమూర్తి, తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు*

కామారెడ్డి

అటవీలో ఎలుగుబంటుల గుంపు భయం!

రామారెడ్డి గ్రామ కూలీలు ఆందోళనరాజమ్మ తండా ప్రాంతంలో ఉపాధి హామీ పనులు ఆపాలి.. జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలి కామారెడ్డి, 23జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం శివారు ప్రాంతంలోని రాజమ్మ తండా అటవీ ఎత్తైన ప్రదేశం మృత్యువు తప్పడం గురించే పోరాటం. ఉపాధి హామీ కార్మికులు ఇక్కడ పని చేస్తుంటే, ఎలుగు బంటులు గుంపులుగా కనిపించడంతో భయభ్రాం తులు చెందారు.వెంటనే పనులు ఆపి, సురక్షిత ప్రదేశానికి మార్చాలని కూలీలు డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పంచాయ తీ అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని స్థాని కులు కోరారు.రామారెడ్డి గ్రామం నుంచి వచ్చిన 40 మంది కూలీలు రాజమ్మ తండా అటవీ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధి శ్రామికుల సంఘం (NREGA) పనులు చేస్తున్నారు. నేడు మధ్యాహ్నం పని సమయంలో ఎలుగుబంటులు దగ్గరలో గుంపుగా కనిపించాయి. “మేం పని చేస్తుంటే ఆ జంతువులు మా వైపు వస్తున్నాయని ఆరోపించారు.గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ మాట్లాడుతూ,ఈ ప్రాంతం అటవీ శివారు. ఎలుగుబంటులు, మొండెలు తరచూ కనిపిస్తాయని చెప్పారు.ఉపాధి హామీ పనులకు ఇక్కడ ఎందుకు ఎంపిక చేశారు? ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ వెంటనే సైట్ ఇన్‌స్పెక్షన్ చేసి, పనులు షిఫ్ట్ చేయాలని కోరారు. సంబంధిత అధికారులు మాట్లాడుతూ, సమాచారం తెలిసిన వెంటనే ఫీల్డ్ స్టాఫ్‌ను పంపాము. సురక్షితత కోసం పనులు తాత్కాలికంగా ఆపేస్తాం ఐని చెప్పారు. జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి అటవీ ప్రాంతం లో జంతువుల కదలికలు సహజం. కానీ మానవు ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తాము.పట్రోలింగ్ పెంచు తామని చెప్పారు.గ్రామంలో ఆందోళన రామారెడ్డి గ్రామంలో ఈ సంఘటనతో టెన్షన్ నెలకొంది. ఒక్క రికి ఏమైతే ఊరంతా దెబ్బతింటుంది. అన్ని డిపార్ట్‌ మెంట్లు కలిసి పనులు వేరెక్కడికి మార్చాలని అంటూ కూలీలు, ప్రజలు ఐక్యంగా కోరారు. గ్రామ ప్రజలు, అధికారుల సహకారంతో ఈ సమస్యకు సత్వర పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు.జిల్లా కలెక్టర్, డీఎస్పీలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగ ణించి, వెంటనే చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కూలీల జీవనోపాధి, భద్రతలు రక్షించబడాలని అన్నారు.

E-పేపర్

భక్తులకు కనబడిన ఎలకలతొ ప్రసాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాత్రి పూట 11 గంటలకు అన్నవరం ప్రసాదం ( హైవే అన్నవరం వైజాగ్) కొనడానికి వెళ్ళిన బాటసారిలకు ( భక్తులు )కనిపించిన దృశ్యం ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు. ప్రసాదం అమ్మినవాడిని అడిగితే అవును అలాగే ఉంటాయి మీకు ఇష్టమైతే కొనుక్కుంటే లేకపోతే పోండి అనీ వాడి సమాధానం…. END. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి లోకేష్ గారి జన్మదిన వేడుకలు

దుత్తలూరు Date:23-1-2026 దుత్తలూరు మండలం దుత్తలూరు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి ఈ సందర్భంగా,ఉండేలా గురువారెడ్డి దుత్తలూరు మండలటీడీపీ కన్వీనర్, మరియు,మల్లంపాటి గురవయ్య నాయుడు నర్రవాడ మాజీ సర్పంచ్రి వారి ఆధ్వర్యంలో దుత్తలూరు మండలంలో 350 ST మహిళలకు చీరల పంపిణీ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారికి మరియు మాజీ శాసనసభ్యులు కంభం విజయరామ్ రెడ్డి గారికి దుత్తలూరు మండలంలోని టిడిపి నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు

కామారెడ్డి

కుటుంబ సమస్యలతో మంగలి లింబయ్య గడ్డి మందు తాగి మరణం..

కామారెడ్డి,23 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కుటుంబ సమస్యలతో మంగలి లింబయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని గడ్డి మందు తాగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుందని ఎస్సై రాజ శేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరా లు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గడ్డి మందు మరణాలు దారు ణంగా కనిపిస్తున్నాయి. మొదట రామారెడ్డి గ్రామానికి చెందిన 43 ఏండ్ల మంగళి లింబాద్రీ కుటుంబ సమస్యలతో గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయారు.మంగలి కులానికి చెందినవారు. కులవృత్తి చేస్తూ జీవణం కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుప త్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయారు.కుటుంబ సమస్యలు పరిణా మాలుగా ఈ ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు.రెండు మరణాలూ రామారెడ్డి మండలం లోనే జరగడంతో ప్రజల్లో భయం వాతావరణం నెలకొంది.పోలీసులు కేసుల్లో విచారణ చేపడుతు న్నట్లు ఎస్ఐ వివరించారు.

E-పేపర్

దేవాదాయ భూముల జోలికి వెళ్లినవారు చరిత్రలో భాగుపడ్డ దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి

దేవాదాయ భూముల జోలికి వెళ్లినవారు చరిత్రలో భాగుపడ్డ దాఖలాలు లేవు మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 23 జనవరి 2026 యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని “శ్రీ ఓంకారేశ్వరాలయానికి చెందిన దేవాదాయ భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు” చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* అన్నారు. ఈ దేవాదాయ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కౌలు రైతుల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయా గ్రామాలకు చెందిన రైతు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేవాదాయ భూములను ముట్టుకుంటే చరిత్ర క్షమించదు. దేవుడి భూముల జోలికి వెళ్లినవారికి చరిత్రలో ఎప్పుడూ భాగుపడ్డ దాఖలాలు లేవు” అని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో రానున్న రోజుల్లో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. దేవాలయాల ఆస్తులను, రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని ఆయన తెలిపారు.

E-పేపర్

జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ* పున్నమి న్యూస్ ప్రతినిధి : 23 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : పరిధిలోని టిసిఎస్ పక్కన నిర్వాకులు నిఖిల్ రెడ్డి, మార్టిన్ లాతర్ రాజు ఆహ్వానం మేరకు one7 Revibe జిమ్ ఫిట్నెస్ సెంటర్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన అదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ *మర్రి నిరంజన్ రెడ్డి* , ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె రజినీకాంత్ గౌడ్, కోరే జంగయ్య, భూపతి గళ్ళ రాజు, మర్రి నవీన్ రెడ్డి, జమ్మ రాజు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఇసన్నపల్లి శివాలయంపై దారుణ దొంగతనం!

– రెండు తులాల బంగారం దొంగిలించుకుని పారిపోయారు! కామారెడ్డి, 23 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, ఇసన్నపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శివాలయ గుడి తాళం పగులగొట్టి, గుర్తు తెలియని అంటి దొంగలు రెండు తులం బంగారాన్ని దొంగిలిం చుకుని పారిపోయారు.భక్తుల భక్తి బిందు, గ్రామ వాసుల మనస్సును దెగ్గర చేసుకున్న ఈ పవిత్ర ఆలయంపై జరిగిన ఈ కుంఠీతనం అందరినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. రాత్రి సమయంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఆలయ పూజారి అబిలేష్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసు లు వెంటనే కేసు నమోదు చేసుకుని, దొంగలను పట్టుకోవడానికి తీవ్ర దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీ వీ ఫుటేజీలు, స్థానికుల సమాచారం, ఫింగర్ ప్రింట్ నమూనాలతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలు త్వరగా పట్టుబడి, దోచుకున్న బంగారు బంగారుగా తిరిగి ఆలయానికి చేర్చాలని గ్రామవాసులు, భక్తు లు కోరుకుంటున్నారు.ఈ ఘటన గ్రామంలో భయ భ్రాంతులు సృష్టించింది. ఆలయాలు, మహిళలు, పిల్లల భద్రతకు ఇది తీవ్ర ఆపనింద నిచ్చే సంకే తంగా మారింది. పోలీసులు త్వరలోనే దొంగలను పట్టుకుంటారని, న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.

E-పేపర్

యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి

సహకార సంఘం – మంచాల నందు యూరియా లారీ లేటుగా రావడం వల్ల యూరియా కోసం రైతులు ఒకేసారి గుమి కూడి ఇబ్బంది పడడం జరిగింది, మీరు దానికి సంబంధించిన వార్తను రాయడం జరిగింది,దానికి సంబంధించిన ప్రతిస్పందన తెలియజేయదలుచుకున్నాను, నిన్నటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కావాల్సిన యూరియాను తెప్పించడం జరిగింది, ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడం జరిగింది, అదనపు కౌంటర్ మహిళలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇకనుండి రైతుల అవసరానికి తగ్గట్టు గా యూరియా బస్తాలను తెప్పించడం జరుగుతుంది. కావున రైతులు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వారు తమ అవసరాల తగ్గట్టుగా సెంటర్ కు వచ్చి తీసుకెళ్లవచ్చునని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇట్లు జి వెంకటేష్ మండల వ్యవసాయ అధికారి మంచాల మండలం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.