కామారెడ్డి
రామారెడ్డి గ్రామ కూలీలు ఆందోళనరాజమ్మ తండా ప్రాంతంలో ఉపాధి హామీ పనులు ఆపాలి.. జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలి కామారెడ్డి, 23జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం శివారు ప్రాంతంలోని రాజమ్మ తండా అటవీ ఎత్తైన ప్రదేశం మృత్యువు తప్పడం గురించే పోరాటం. ఉపాధి హామీ కార్మికులు ఇక్కడ పని చేస్తుంటే, ఎలుగు బంటులు గుంపులుగా కనిపించడంతో భయభ్రాం తులు చెందారు.వెంటనే పనులు ఆపి, సురక్షిత ప్రదేశానికి మార్చాలని కూలీలు డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పంచాయ తీ అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని స్థాని కులు కోరారు.రామారెడ్డి గ్రామం నుంచి వచ్చిన 40 మంది కూలీలు రాజమ్మ తండా అటవీ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధి శ్రామికుల సంఘం (NREGA) పనులు చేస్తున్నారు. నేడు మధ్యాహ్నం పని సమయంలో ఎలుగుబంటులు దగ్గరలో గుంపుగా కనిపించాయి. “మేం పని చేస్తుంటే ఆ జంతువులు మా వైపు వస్తున్నాయని ఆరోపించారు.గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ మాట్లాడుతూ,ఈ ప్రాంతం అటవీ శివారు. ఎలుగుబంటులు, మొండెలు తరచూ కనిపిస్తాయని చెప్పారు.ఉపాధి హామీ పనులకు ఇక్కడ ఎందుకు ఎంపిక చేశారు? ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ వెంటనే సైట్ ఇన్స్పెక్షన్ చేసి, పనులు షిఫ్ట్ చేయాలని కోరారు. సంబంధిత అధికారులు మాట్లాడుతూ, సమాచారం తెలిసిన వెంటనే ఫీల్డ్ స్టాఫ్ను పంపాము. సురక్షితత కోసం పనులు తాత్కాలికంగా ఆపేస్తాం ఐని చెప్పారు. జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి అటవీ ప్రాంతం లో జంతువుల కదలికలు సహజం. కానీ మానవు ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తాము.పట్రోలింగ్ పెంచు తామని చెప్పారు.గ్రామంలో ఆందోళన రామారెడ్డి గ్రామంలో ఈ సంఘటనతో టెన్షన్ నెలకొంది. ఒక్క రికి ఏమైతే ఊరంతా దెబ్బతింటుంది. అన్ని డిపార్ట్ మెంట్లు కలిసి పనులు వేరెక్కడికి మార్చాలని అంటూ కూలీలు, ప్రజలు ఐక్యంగా కోరారు. గ్రామ ప్రజలు, అధికారుల సహకారంతో ఈ సమస్యకు సత్వర పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు.జిల్లా కలెక్టర్, డీఎస్పీలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగ ణించి, వెంటనే చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కూలీల జీవనోపాధి, భద్రతలు రక్షించబడాలని అన్నారు.