ఎడ్ బిడ్ తాండ లో కొనసాగుతున్న సమ్మక్క -సారలమ్మ జాతర
ముధోల్,జనవరి 29 (పున్నమి ప్రతినిధి నిర్మల్ ): ముధోల్ ఎడ్ బిడ్ తాండలో గ్రామం లో సమ్మక్క- సారలమ్మల జాతర గురువారం రెండో రోజు సమ్మక్క అమ్మవారు గద్దె పై చేరుకుంది. దీంతో సమ్మక్క వనం నుండి గద్దెపైకి చేరుకోని భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా సమ్మక్క – సారలమ్మ మొక్కులను తీర్చుకొని నిలు వెత్తు బంగారం (బెల్లం) ఓడి బియ్యం, మేకలు, కోళ్లతో భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. సందర్భంగా పోతరాజు మేకను గావ్ పట్టారు.సమ్మక్క సారలమ్మను భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. జాతర ప్రారంభమై రెండు రోజులు కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా దేవాదాయ స్థా పకులు రేణుకమ్మబోనాలను సమర్పించి దేవాలయ ధర్మకర్త జాదవ్ సతీష్ కుమార్ అమ్మవార్లకు పూజలు నిర్వ హించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమ్మక్క సారల మ్మ జాతర కు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. భక్తులు , కోరుకున్న కోరికలను అమ్మవారు తీరుస్తారన్నారు.











