Tuesday, 10 March 2026

Blog

ఖమ్మం

రాష్ట్రవ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ నిరసనలు

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు హైదరాబాద్/తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నిరసనల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని పార్టీ నేతలు సూచించారు.

E-పేపర్

కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశానుసారాం* *రేపు ఉదయం 10:00 గంటలకు* *ఇబ్రహీంపట్నం చౌరస్తా* *ఇబ్రహీంపట్నం పట్టణంలో మన యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం లో పాల్గొంట్టారు_* *యాచారం మండలం పలు గ్రామాల నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసన, ధర్నా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను* *యాచారం మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్* *కార్యదర్శి పాచ భాష*

తెలంగాణ

నకిరేకల్ లో చైన్ స్నాచర్స్ హల్ చల్

నకిరేకల్ :జనవరి (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్. మూసి రోడ్డులో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ వద్ద మహిళపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసుతో పరారైన నిందితుడు. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని సీసీ పుటేజిని పరిశీలిస్తున్న పోలీసులు.

హెల్త్ టిప్స్

🌱 బెండకాయను నానబెట్టిన నీరు తాగితే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 🌿

🍀బెండకాయ కేవలం కూరగాయ మాత్రమే కాదు… ఇది ఒక ప్రకృతి ఇచ్చిన ఔషధం. ముఖ్యంగా బెండకాయను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.☘️ ✅ బెండకాయ నీటి ఆరోగ్య ప్రయోజనాలు: • మధుమేహాన్ని (షుగర్) నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది • ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది • చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది • ఎముకలను బలంగా మారుస్తుంది • జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది • గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది • శరీరంలోని వాపు (Inflammation) తగ్గించడంలో సహాయపడుతుంది • బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది • చర్మం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతుంది • జుట్టు రాలడం తగ్గించి జుట్టు బలంగా పెరగడానికి తోడ్పడుతుంది • గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలేట్ అందిస్తుంది 🥤 బెండకాయ నీరు ఎలా తయారు చేయాలి? • రాత్రి 2–3 తాజా బెండకాయలను కడిగి, చివరలు తీసేయాలి • వాటిని మధ్యలో చీల్చి ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి • ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని వడకట్టి తాగాలి 👉 రోజూ ఇలా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ⚠️ గమనిక: తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహాతో తీసుకోవడం మంచిది

హెల్త్ టిప్స్

🥜 వేరుశనగ (గ్రౌండ్‌నట్స్) ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు 🌿

వేరుశనగ తక్కువ ఖర్చులో లభించే పౌష్టికాహార భండారం. రోజూ పరిమితంగా తీసుకుంటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. 👌 వేరుశనగ ఆరోగ్య ప్రయోజనాలు: • శరీరానికి మంచి ప్రోటీన్ అందిస్తుంది • గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది • చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడుతుంది • మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది • ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి • ఆకలి నియంత్రణలో ఉండి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది • రోగనిరోధక శక్తిని పెంచుతుంది 🍽 ఎలా తినాలి ? • ఉడికించిన వేరుశనగ • కాల్చిన (roasted) వేరుశనగ • వేరుశనగ చట్నీ • వేరుశనగ పొడి • వేరుశనగ నూనె (పరిమితంగా) 👉 రోజుకు ఒక పిడికెడు (20–30 గింజలు) సరిపోతాయి. ⚠️ గమనిక: గ్యాస్, అలర్జీ ఉన్నవారు లేదా బీపీ/కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవాలి.

తిరుపతి

నో బ్యాగ్ డే తో పిల్లలో ఒత్తిడి దూరం.. ఉపాధ్యాయులు బాలు

తొట్టంబేడు జనవరి 31, పున్నమి న్యూస్ : దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహ కారంతో వివిధ కృత్యాలను చేసారు. అంకెలతో ఇల్లు,తెలుగు అక్షరాలతో చెట్టు, ఆంగ్ల అక్షరరాతో నెమలి, మొదలగు చిత్రాలను తయారు చేసారు. పద్యాలతో పాటలు, కుర్చీలతో ఆటలు ఆడి రోజంతా ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే ఉండటం వలన వారం అంతా అభ్యసన ఒత్తిడి లేకుండా ఆ రోజంతా వారి అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యాలను వెలికితీయవచ్చునని, విద్యార్థులకు మానసిక, శారీరక ఆనందానికి ఈ కార్యక్రమం బాగా ఉపయుక్తంగా ఉంటుం దన్నారు.

తిరుపతి

శివయ్య సన్నిధిలో సినీ దర్శకులు

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్ధం సినీ దర్శకులు గోపాల్ రెడ్డి, వారితో పాటు కనిగిరి తెలుగుదేశం పార్టీ నేత నరసారెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి రాహు కేతు పూజలు, శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, అనంతరం శ్రీ మేధా గురు దక్షణమూర్తి సన్నిధిలో వేద ఆశీర్వచనం చేయించి ముక్కంటి తీర్ధ ప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఎన్టీఆర్ భరోసా పించను పంపిణీ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుప్రజ

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అదేశాల మేరకు శనివారం నాడు పురపాలక సంఘం పరిధిలోని 9 వార్డ్ మాజీ కౌన్సిలర్ ఉన్నం సుప్రజ అధ్వర్యంలో లబ్ది దారులకు వేకువ జామునే పురపాలక సంఘం అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పించను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ .. ఒకడవ తారిఖ సెలవు రోజు వస్తే ముందు రోజే లబ్ధి దారులకు పించను డబ్బులు అందించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని గత పాలకులు నిర్లక్ష్య పాలనతో అభివృద్ధిలో అట్టడుగు స్తాయికి పడిపోయిందని రాష్ట్ర అప్పులు ఊబిలో కురుకు పోవడంతో చంద్రబాబునాయుడు పాలన పగ్గాలు చేపట్టిన తరువాత సూపర్ సిక్స్ హామీలు ఆమలు చేస్తు ముందుకు పోవడం జరుగుతొందన్నారు. ఎన్ని కష్టాలు ఉన్న పించన్ లబ్ధిదారులకు ఇంటి పెద్దగా ప్రతినేల క్రమం తప్పకుండా పించన్ అందించడం జరుగుతోందని ఆమె తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పించను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

తిరుపతి

ఫిబ్రవరి 4న శ్రీకాళహస్తి విక్రమ్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెల 04వ తేదీన బుధవారం నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని లోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్, సీడప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం, విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టాభిలు సంయుక్తంగా ప్రకటద్వార తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో తిరుపతి జిల్లాలోని చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం, శ్రీ సిటీ, మేనకూరు సెజ్ , ఈఎంసి క్లస్టర్, తిరుపతి, చెన్నైలోని 12 బహుళ జాతీయ కంపెనీలలో 700 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు చేపట్టననున్నారు. ఈ మేళాలో ఐదవ తరగతి పైన పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళా కు అర్హులన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరని రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 3-2-2026, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదని ఇతర వివరములు కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 8919889609,7989509540,9988853335. (కాల్ సెంటర్) గమనిక: జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో బిల్డ్ యువర్ రెస్యూమ్(Build Your Resume) పైన క్లిక్ చేసి ఆధార్ ఓటిపి తో ( Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని, సిటిజెన్ లాగిన్ ద్వారా మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి ప్రస్తుతం జరిగే జాబ్ మేళా పైన క్లిక్ చేసి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తెలిపారు.

తిరుపతి

ఎంబీఏ ద్వితీయ సెమిస్టర్ లో 92 శాతం ఉత్తీర్ణత సాధించిన SKIIMS కళాశాల

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరి గ్రామ సమీపంలోవున్న శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ( SKIIMS) కళాశాలలో 31-01-2026 న MBA రెండవ సెమిస్టర్ (2024-26 బ్యాచ్) ఫలితాలు విడుదల అయిన సందర్భంగా విజయోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి ప్రసంగిస్తూ… జూలై మాసంలో జరిగిన రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు 31 జనవరి 2026 న విడుదల అయ్యాయి, ఇందులో SKIIMS కళాశాల విద్యార్థులు 92% ఉత్తీర్ణత సాధించి, విశ్వవిద్యాలయం స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిలో ప్రథమ స్థానం మెరుం మమత, ద్వితీయ స్థానం, బొడుగు రజినీ, తృతీయ స్థానంలో జలదంకి లిఖితలు నిలిచారన్నారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని, విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, హెచ్ ఓ డి లు, అధ్యాపక బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.