Tuesday, 10 March 2026

Blog

తిరుపతి

ఆంధ్రప్రదేశ్‌కు బాసటగ రూపొందిన కేంద్ర బడ్జెట్ విధానంపై తెదేపా నాయకుల హర్షం

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు, అభివృద్ధికి సహకరించేలా నిన్నటి రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి బాసటగా నిలుస్తుందని వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ కొనియాడారు. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీ ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అటు శ్రీకాకుళం నుండి ఇటు కృష్ణా జిల్లా వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి 200 మిలియన్ టన్నుల అతి విలువైన బీచ్ శాండ్ ఖనిజ నిల్వలు ఉన్నాయని తెలిపారు. హైస్పీడ్ రైల్ కారిడార్ హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరబోతున్నాయని, దేశంలో మొత్తం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్ లు ఏర్పాటు చేస్తుండగా… అందులో మూడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయని తెలిపారు. దీని ద్వారా హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలన్నీ కూడా అనుసంధానం అవుతాయని హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక భరోసా నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా వృధాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే ఉద్దేశంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న జాతీయ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఇదివరకటి లాగానే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కూడా సుమారు 3,300 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డేటా సెంటర్‌కు పన్నుల నుండి ఉపశమనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే వివిధ కంపెనీల డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ ఇస్తూ కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టడం ద్వారా విశాఖపట్నంలో నెలకొల్పే గూగుల్ సహా వివిధ డేటా సెంటర్ లకు భారీ ప్రోత్సాహకంగా ఉంటుందని,ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయని సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటకానికి ఊతం పర్యాటకానికి ఊతమిచ్చేలా అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్ర బడ్జెట్లో పెట్టి ‘మౌంటైన్ ట్రైల్స్’ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి, అక్కడకు వచ్చే వివిధ జాతుల పక్షులను వీక్షించడం కోసం ‘బర్డ్ వాచింగ్ ట్రైల్స్’ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం శుభపరిణామం అని కొనియాడారు. అమరావతి అభివృద్ధికి అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ అభివృద్ధి కొరకు కేంద్ర బడ్జెట్ లో 1,561 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు ఎంతో ఉపయుక్తంగా ఉండే విధంగా నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మనకు నిధులు కేటాయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి,ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ…. కేంద్రం నుండి మన రాష్ట్రానికి పెద్దయెత్తున నిధులు రాబట్టడానికి విశేషంగా కృషి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ బాబు కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,మురళీ నాయుడు,గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఆండ్రాయిడ్ రోబోటిక్స్ క్విజ్ పోటీలు నిర్వహించిన ఎంజీఎం పాఠశాల యాజమాన్యం

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో ఆండ్రాయిడ్ రోబోటిక్స్ లో నేషనల్ లెవెల్ లో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంజిఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. తమ స్కూల్ నుండి 30 మంది విద్యార్థులు ఆండ్రాయిడ్ రోబోటిక్ లో సెలెక్ట్ అయ్యి చెన్నైలో నేషనల్ లెవెల్ లో జరుగు దాదాపు ఇండియా వైడ్ 300 స్కూల్స్ పాల్గొనబోయే విద్యార్థులతో పోటీ పడుతున్నందుకు సంతోషంగా ఉందని విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా తమ పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చి దిద్దుతున్నందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు మరయు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్

పున్నమి న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జి : ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన… బిజెపి నాయకులు మహేందర్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు *పి మహేందర్ ,* సుమారు వందమంది కార్యకర్తలతో, ఈ రోజు *మార్కెట్ కమిటీ చైర్మన్ తంబాలపల్లి గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం *ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి *మహేందర్ ని,* సాదరంగా ఆహ్వానించిన *ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి భూపతిగల్లా మహిపాల్, మున్సిపాలిటీ పదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నాలుగు పతకాలు సాధించిన లక్ష్మీకి ఎస్సై శివ రాకేష్ అభినందనలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) .నెల్లూరులో జిల్లా ఎస్పీ గౌరవనీయులు డాక్టర్ అజిత వేజెండ్ల గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నాలుగు మెడల్స్ సాధించి మనుబోలు పోలీస్ స్టేషన్‌కు జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన లక్ష్మీని ఎస్సై శ్రీ శివ రాకేష్ గారు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె కృషి, పట్టుదల ఇతర పోలీస్ సిబ్బందికి ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రూప్–2లో సత్తా చాటిన విద్యానికేతన్ విద్యార్థి మనోజ్ కుమార్‌కు ఘన సన్మానం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). గ్రూప్–2 పరీక్షల్లో విజయం సాధించిన శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ పూర్వ విద్యార్థి తొండమనాటి మనోజ్ కుమార్‌ను సోమవారం మనుబోలులో ఘనంగా సన్మానించారు. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, విజయవాడ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపిక కావడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జగదీష్ బాబు, పూర్వ విద్యార్థులు కావేటి భార్గవ్, ఆన్‌లైన్ యోగా ట్రైనర్ కొలను భరత్ కుమార్ రెడ్డి, వీడియో జర్నలిస్ట్ కుడమల శ్రీనివాస్ గౌడ్, వంశీ, నవదీప్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

తూర్పుగోదావరి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై ఘోరప్రమాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై ఘోరప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు ఘటనాస్థలంలో మృతి చెందారు ఇరువైపులా రెండు రెండు కిలోమీటర్లు 4 కిలోమీటర్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది END

రాజన్న సిరిసిల్ల

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ మండల నాయకులు

ముస్తాబాద్ /పున్నమి/ ప్రతినిధి ఫిబ్రవరి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేపడుతున్న విచారణలను అనవసర ఆరోపణలతో అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం తగదని అన్నారు. ఫోన్ టాపింగ్, వ్యాపారులపై ఒత్తిళ్లు వంటి ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయని గుర్తుచేశారు. ఇలాంటి గత చర్యలను మరిచి ప్రస్తుత ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం సమంజసం కాదని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు మానుకొని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా నాయకులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మడమానూరులో శేషమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మడమానూరు గ్రామంలో సీనియర్ నాయకులు చమిడిబోయిన సుబ్బయ్య గారి తల్లి చమిడిబోయిన శేషమ్మ గారి మృతిపై పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వర్ధినేని మస్తాన్ నాయుడు, నూనె లక్ష్మయ్య (నీటి సంఘం అధ్యక్షులు), ఉడతా విజయకుమార్ (పీఏసీఎస్ డైరెక్టర్), చెమిర్తి సుదీర్ (వైస్ ప్రెసిడెంట్)తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తురక తిరుపయ్య, షేక్ మాసంసాహెబ్, గుమ్మా సురేష్, ఇరగరాజు శ్రీను, అన్నింగి శరత్, పాముజుల నాగరాజు, తారకేశ్వర్ రెడ్డి, ఉడతా మధు, తురక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి

శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి . ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 02 ఫిబ్రవరి 2026 ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చీరాల రమేష్, ఉపసర్పంచ్ నూకం రాజు, వార్డు మెంబర్ సాథిరి సత్యం, వార్డు మెంబర్ శ్రవణ్, కొల్లోజు చంద్రశేఖర్ చారి, బీఆర్ఎస్ నాయకుడు దాసరిమొని ప్రవీణ్ ముదిరాజ్, కోరె ఐలయ్య, జానీ, ఆర్ల యాదయ్య, రాఘవ కురుమ, ఆర్ల కృష్ణ, రావుల ఐలయ్య మరియు కందుకూరి మల్లారెడ్డి , మొగుళ్ళ రాంరెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

కామారెడ్డి

లంకె బిందెలు” భయంతో లక్షల దోపిడీ..

కామారెడ్డిలో మాయాజాల దొంగల గారడి పోలీసు పంజాలో! కామారెడ్డి, ఫిబ్రవరి 2, ( పున్నమి ప్రతినిధి ) : ప్రాణాలు పోతాయి.. లంకె బిందెలు తీసేయకపో తే కుటుంబం మొత్తం మరణిస్తుంది!”ఈ భయ భ్రమలతో అమాయకులను మోసం చేసి లక్షలు దోచుకున్న మాయాగాడిని కామారెడ్డి పోలీసులకు పట్టుబట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపిఎస్‌ల పర్యవేక్షణలో, అంతర్జిల్లా మోసగాడు కడమంచి నర్సింలు @ నర్సారెడ్డి చేతిలో రూ.7 లక్షల నగదు, విలాసవంతమైన కార్లు స్వాధీనం, ఇది కేవలం ఒక కేసు కాదు.. మూఢనమ్మకాల ఆయుధంతో పలు కుటుంబాలను బెదిరించిన ‘దొంగ బాబా’ గుట్టు రట్టు అయింది. ఇది ఓన్నాజిపేట్‌లో మొదటి ఎపిసోడ్…. దుమ్మల్ల బీరవ్వ కుటుంబానికి బెదిరింపులు జన వరి 26న, నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ఓన్నాజిపేట్ గ్రామంలో జరిగిన ఈ ‘బిగ్ మ్యాటర్ ట్విస్ట్.. దుమ్మల్ల బీరవ్వల ఇంటికి వచ్చిన ఈ మాయాగాడు, “వాస్తు దోషాలు, క్షుద్ర పూజలు, అతీంద్రియ శక్తులు” అని నటిస్తూ లంకె బిందెలు ఇంట్లో ఉన్నాయంటు భయం చూపించాడు. “ఇవి తీసేయకపోతే కుటుంబంలో మరణం ఖాయం!” అంటూ భయపెట్టి, పూజల పేరుతో మొత్తం రూ. 8,20,000 తీసుకుని ఫోన్లు కట్ చేసి పరార్ అయ్యాడు. బీరవ్వల ఫిర్యాదితో కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. సాంకేతిక టూల్స్‌ తో విచారణలో, సిరిసిల్ల జిల్లా వేములవాడ మండ లం చిర్లవంచకు చెందిన నర్సారెడ్డి ముఖ్య నింది తుడిగా తేలాడు. చిన్న మల్లారెడ్డి ఫ్లాష్‌బ్యాక్.. భిక్షాటన నుంచి దోపిడీకి షిఫ్ట్! గతేడాది అక్టోబర్‌లో చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఈ ‘సీరియల్ మోసగాడు’ స్పాట్ హీరో అయ్యాడు. భిక్షాటన పేరుతో వచ్చి, లాస్య కుటుంబంలో ఆరో గ్య సమస్యలు ఉన్నాయని ముందుగానే తెలిసి, సోదరుడు సురేష్‌కు కిడ్నీ, తల్లికి అనారోగ్యాలు వస్తాయని ‘అంచనా’ వేశాడు. నమ్మకం సంపాదిం చాడు. “లంకె బిందెలు కారణమే.. పూజలు చేయకపోతే ఎవరో చనిపోతారు!” అని భయపెట్టి రూ.14 లక్షల పూజా ఖర్చు చెప్పి, రూ.2,93,000 డబ్బులు బ్లాక్ మెయిల్ చేశాడు. మరో ఇద్దరు సహచరులతో కలిసి సదాశివనగర్, జనగామ జిల్లా కోడకండ్ల పోలీస్ పరిధిలోనూ ఇలాంటి నేరాలు చేసినట్లు ఆరోపణలు, నిందితుడి బ్యాక్‌గ్రౌండ్.. భిక్షాటన నుంచి మాయా బాబా! 30 ఏళ్ల కడమంచి నర్సింలు (నర్సారెడ్డి), తండ్రి దుర్గయ్య, బుడగ జంగం (ఎస్సీ) కులం. వృత్తి భిక్షాటన అని చెప్పుకుని, బంగారం, నగదు, ఆన్‌ లైన్ ట్రాన్సాక్షన్లతో దోపిడీ చేస్తున్నాడు. పోలీసుల స్వాధీనం: రూ.7 లక్షల క్యాష్, మారుతి స్విఫ్ట్ డిజైర్ (TS02FL0625), హ్యుండాయ్ క్రెటా (TG23 9853), ఒక మొబైల్. మిగిలిన ఇద్దరు పరారీలో.. త్వరలో పట్టుకుంటామని ఎస్పీ హామీ.. “మూఢనమ్మకాలు ఆయుధం కాకూడదు!” అమాయకత్వాన్ని ప్రయోజనం చేసుకుని మూఢన మ్మకాలతో దోపిడీ చేస్తున్నారని ఎస్పీ రాజేష్ చంద్ర ఘాటుగా హెచ్చరించారు. “ఇలాంటి మోసాలు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సంప్రదించండి. జిల్లాలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని అన్నారు.కామారెడ్డి పోలీసు లు మొత్తం జిల్లాను కవర్ చేసి, ఇలాంటి మాయా గాల్లను ట్రాక్ చేస్తు న్నారు. అమాయకులు భయప డకండి.. పోలీసు లే మీ బలం!

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.