ఆంధ్రప్రదేశ్కు బాసటగ రూపొందిన కేంద్ర బడ్జెట్ విధానంపై తెదేపా నాయకుల హర్షం
శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు, అభివృద్ధికి సహకరించేలా నిన్నటి రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి బాసటగా నిలుస్తుందని వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ కొనియాడారు. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీ ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అటు శ్రీకాకుళం నుండి ఇటు కృష్ణా జిల్లా వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి 200 మిలియన్ టన్నుల అతి విలువైన బీచ్ శాండ్ ఖనిజ నిల్వలు ఉన్నాయని తెలిపారు. హైస్పీడ్ రైల్ కారిడార్ హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరబోతున్నాయని, దేశంలో మొత్తం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్ లు ఏర్పాటు చేస్తుండగా… అందులో మూడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయని తెలిపారు. దీని ద్వారా హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలన్నీ కూడా అనుసంధానం అవుతాయని హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక భరోసా నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా వృధాగా సముద్రంలో కలిసే గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే ఉద్దేశంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న జాతీయ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఇదివరకటి లాగానే వచ్చే ఆర్ధిక సంవత్సరానికి కూడా సుమారు 3,300 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డేటా సెంటర్కు పన్నుల నుండి ఉపశమనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే వివిధ కంపెనీల డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ ఇస్తూ కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టడం ద్వారా విశాఖపట్నంలో నెలకొల్పే గూగుల్ సహా వివిధ డేటా సెంటర్ లకు భారీ ప్రోత్సాహకంగా ఉంటుందని,ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయని సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటకానికి ఊతం పర్యాటకానికి ఊతమిచ్చేలా అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్ర బడ్జెట్లో పెట్టి ‘మౌంటైన్ ట్రైల్స్’ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి, అక్కడకు వచ్చే వివిధ జాతుల పక్షులను వీక్షించడం కోసం ‘బర్డ్ వాచింగ్ ట్రైల్స్’ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం శుభపరిణామం అని కొనియాడారు. అమరావతి అభివృద్ధికి అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ అభివృద్ధి కొరకు కేంద్ర బడ్జెట్ లో 1,561 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు ఎంతో ఉపయుక్తంగా ఉండే విధంగా నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మనకు నిధులు కేటాయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి,ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ…. కేంద్రం నుండి మన రాష్ట్రానికి పెద్దయెత్తున నిధులు రాబట్టడానికి విశేషంగా కృషి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ బాబు కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,మురళీ నాయుడు,గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.











