Thursday, 23 April 2026

Blog

హైదరాబాద్

కావేరి బస్ ప్రమాదం లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన మంత్రి పొంగులేటి

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఈరోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురవడం అత్యంత దురదృష్టకరం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

భక్తి

అభిషేకం టికెట్లపై ఆంక్షలు వెనక్కి తీసుకోవాలి దేవస్థానం మాజీ చైర్మన్

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం లో అభిషేక టికెట్లను ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు తీసు కున్న నిర్ణయం బాధాకరమని శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.పవిత్ర కార్తీక మాసంలో భక్తులందరూ అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో అభిషేక టికెట్లు తీసుకునే విధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

అమరావతి

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత*

*అమరావతి* అక్టోబర్ పున్నమి ప్రతినిధి *కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత* *బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హోం మంత్రి* *క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశం.* *ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న హోంమంత్రి అనిత* *ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకుంటున్న మంత్రి* *ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం* *మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మంత్రి* *మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది*…*హోం మంత్రి వంగలపూడి అనిత*.

ఆంధ్రప్రదేశ్

రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి ఏటిగట్టు రోడ్డు*

*రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి ఏటిగట్టు రోడ్డు* పున్నమి ప్రతినిధి: • నిధులు మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి అభ్యర్ధనకు తక్షణ స్పందన • భక్తుల సౌకర్యార్ధం 7 కిలోమీటర్ల మేర ఏటిగట్టు రహదారి నిర్మాణం కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. రూ.6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరతాయి. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాడపల్లి ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరున్న వాడపల్లి ఏడు వారాల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోందని, రావులపాలెం మీదుగా ఉన్న ప్రస్తుత రహదారి ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీతో భక్తులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. 216 జాతీయ రహదారి నుంచి ఏటిగట్టు మీదుగా 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి తక్షణం నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తే భక్తులు గోదావరి తీరాన ప్రయాణించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు చెప్పారు.

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా కోలా విశాలాక్షి ప్రమాణస్వీకారం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలాక్షి శుక్రవారం ఉదయం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

ఖమ్మం

ఖమ్మం అన్న క్యాంటిన్ కి ఏడాది పూర్తి -సేవా స్ఫూర్తి తో ముందుకు వెళ్తున్న నల్ల మల్ల రంజిత్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి జిల్లా ప్రతి నిధి) ఖమ్మం నగరంలో ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రారంభమైన అన్న క్యాంటిన్‌కు ఒక సంవత్సరం పూర్తి అయింది. ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకులు, నందమూరి బాలకృష్ణ వీరాభిమాని నల్లమల్ల రంజిత్ తన స్వంత ఖర్చుతో పాటు దాతల సహకారంతో కాల్వా ఒడ్డు ప్రాంతంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ, “స్వర్గీయ నందమూరి తారక రామరావు గారి ఆశీస్సులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నందమూరి బాలయ్య మీద అభిమానం తో పేద ప్రజల కోసం ఈ అన్న క్యాంటిన్‌ను ప్రారంభించాను. నామమాత్రపు రుసుముతో ఆహారం అందించడం ద్వారా ఆకలితో ఉన్న వారికి తోడ్పాటు అందించడం నాకు గౌరవంగా ఉంది” అని తెలిపారు. ఏడాది పాటు నిరంతరంగా క్యాంటిన్‌ నిర్వహణలో సహకరించిన దాతలు, సేవకులు, ప్రజలకు రంజిత్ కృతజ్ఞతలు తెలిపారు. “అన్నదానం మహాదానం — ఈ సేవా యజ్ఞంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు తమ సహాయం అందించాలని కోరుతున్నాను” అని నల్లమల్ల రంజిత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రజలు కూడా రంజిత్ సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.

తూర్పు గోదావరి

ఆరు కోట్ల రూపాయలతో వాడపల్లి క్షేత్రానికి ఎటుకట్టు రోడ్డు

రూ.6 కోట్లతో వాడపల్లి క్షేత్రానికి ఏటిగట్టు రోడ్డు • నిధులు మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి అభ్యర్ధనకు తక్షణ స్పందన •భక్తుల సౌకర్యార్ధం 7 కిలోమీటర్ల మేర ఏటిగట్టు రహదారి నిర్మాణం కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. రూ.6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరతాయి. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాడపల్లి ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరున్న వాడపల్లి ఏడు వారాల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోందని, రావులపాలెం మీదుగా ఉన్న ప్రస్తుత రహదారి ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీతో భక్తులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. 216 జాతీయ రహదారి నుంచి ఏటిగట్టు మీదుగా 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే.. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి తక్షణం నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తే భక్తులు గోదావరి తీరాన ప్రయాణించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు చెప్పారు.

తెలంగాణ

మున్సిపాలిటీలకు నిధులు మంజూరు

మున్సిపాలిటీలకు నిధులు మంజూరు తెలంగాణ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా వడ్డీలేని రుణాల కోసం రూ.41.20కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే.శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీటికి సంబంధించి సీడీఎంఏ తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఆరు మున్సిపాలిటీలకు అభివృద్ది పనుల నిమిత్తం మున్సిపల్ శాఖ రూ.90 (ఒక్కో మున్సిపాలిటీకి రూ.15కోట్లు) కోట్లు కేటాయిచింది. కేటాయించింది~£

రంగారెడ్డి

గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

పున్నమి అక్టోబర్ 24 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: ఘట్కేసర్ పరిధిలోని పోచారం పోలీస్‌స్టేషన్ సమీపంలో గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీజీపీ కార్యాలయాన్ని గురువారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ముట్టడించడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించి, ముట్టడిని అడ్డుకోవడంతో కార్పొరేటర్ గారితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బేగంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గోరక్షకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గోమాత రక్షణ కోసం కృషి చేస్తున్న ప్రశాంత్‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిపై కాకుండా ఆ విలువలపై దాడి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. అదేవిధంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

పున్నమి అక్టోబర్ 24 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: ఘట్కేసర్ పరిధిలోని పోచారం పోలీస్‌స్టేషన్ సమీపంలో గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీజీపీ కార్యాలయాన్ని గురువారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ముట్టడించడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించి, ముట్టడిని అడ్డుకోవడంతో కార్పొరేటర్ గారితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బేగంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గోరక్షకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గోమాత రక్షణ కోసం కృషి చేస్తున్న ప్రశాంత్‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిపై కాకుండా ఆ విలువలపై దాడి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. అదేవిధంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.