Monday, 9 March 2026

Blog

E-పేపర్

మీధాని కాలనీలో రూ.1 కోటి 36 లక్షల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి 09ఫిబ్రవరి 2026 9640204826 మీధాని కాలనీలో రూ.1 కోటి 36 లక్షల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మీధాని కాలనీలో సుమారు రూ.1 కోటి 36 లక్షల వ్యయంతో చేపట్టిన సమగ్ర అభివృద్ధి పనులు పూర్తికాగా, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి గారు, డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ అభివృద్ధి పనులలో భాగంగా భూగర్భ డ్రైనేజ్ సీసీ రోడ్లు పార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, మీధాని కాలనీ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్, రోడ్లు మరియు పార్క్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను ప్రత్యేకంగా మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మరియు కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా హయత్ నగర్ డివిజన్‌లో ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, వరద నీటి కాలువలు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి శాశ్వత పరిష్కారాలు అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని, భవిష్యత్తులో కూడా డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కృష్ణ, ముస్తఫా, రమేష్ రెడ్డి, మల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జె. అంజయ్య గౌడ్, గోపాల్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, జంగారెడ్డి, జగన్నాథ్, నలేష్ ఏ., వెంకట్ రెడ్డి, ఎం. మహేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, బాల శివ రెడ్డి, యుగేందర్ రెడ్డి, కె. వెంకట్ రెడ్డి, నెహ్రూ నాయక్, రవీందర్ రెడ్డి, సోమి రెడ్డి, బాలరాజ్ గౌడ్, సరిత, శోభ, సంద్య, చంద్ర మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు హయత్ నగర్ డివిజన్

E-పేపర్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు.. మరియు ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన వైన్స్, బార్లు బంద్

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా : తెలంగాణ ఇంచార్జ్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు.. మరియు ఫలితాల నేపథ్యంలో 13వ తేదీన వైన్స్, బార్లు బంద్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి సీఐ వెంకట్రావు వేదిస్తున్నాడు అంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపణలు

ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు పై జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్ తీవ్ర ఆరోపణలు చేశారు గతంలో సీతరామాపురం SI శివ క్రిష్ణరెడ్డి సస్పెండ్ వెనుక సీఐ వెంకట్రావు హస్తం ఉందని సీఐ వెంకట్రావు సీతరామాపురం SI కి శివ క్రిష్ణరెడ్డి కీ పాత కక్షలు ఉన్నాయని ఈ నేపథ్యంలో SI ను సస్పెండ్ చేసెందుకు తనకు si కు అక్రమ సంబంధం ఉందని దుష్పచారం చేశారని తాను ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తన వద్ద అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నారని తనను ఐదు నెలలుగా ఉదయగిరి సీఐ వెంకట్రావు తీవ్రంగా వేడిస్తున్నాడని దళిత మహిళా అని తెలిసి కూడా తాను అవమానపడేలా మాట్లాడుతున్నరని సీఐ వేధింపులు తట్టుకోలేక నిద్ర మాత్రలు వేసుకుని మీడియా కు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గెలుపుకోసం జోరుగా ప్రచారం

సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారికి అప్పగించిన బాధ్యతలో భాగంగా 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారిని గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అభ్యర్థి బొద్దుల శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గజ్జల రాజు ఇతర ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య అతిథులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది నిదర్శనమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల 28వ వార్డులో జోరుగా BRS అభ్యర్థి అడిచేర్ల రూప సాయికృష్ణ ఇంటింటి ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా/ పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డు BRS పార్టీ అభ్యర్థి అడిచేర్ల రూప సాయికృష్ణ గారి తరఫున ఈరోజు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. BRS పార్టీ సీనియర్ నాయకులు, ఇంచార్జ్ అక్కరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది. ప్రచారం సందర్భంగా నాయకులు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థి రూప సాయికృష్ణ గారికి మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్, ఆవునూర్ గ్రామ BRS పార్టీ నాయకులు బైరి శ్రీనివాస్ గౌడ్, కనమెని శ్రీనివాస్ రెడ్డి, నేరళ్ళ స్వామి, నక్క దాసరి దేవరాజ్, మంత్రి బాబు, నక్కల రాంరెడ్డి, MD నజీర్, శ్యాగ ఎల్లయ్య, తాలూకా దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు.

వనపర్తి

సోలిపూర్ ఉన్నత పాఠశాలలో సందర్శించిన హిందీ రిసోర్స్ పర్సన్

*సోలిపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 09/ 02/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోలిపూర్ ఈరోజు పాఠశాలను జిల్లా ఇన్స్పెక్షన్ టీం సందర్శించడం జరిగింది అందులో ఆరవ తరగతి హిందీ పండితులు కే. వెంకటేష్ గారి బోధన అభ్యసన ప్రక్రియలను సందర్శించడం రికార్డులను తనిఖీ చేయడం పిల్లల్లో ద్విత్వాక్షర, సంయుక్తాక్షరముల పరిచయం, పిల్లలు హిందీ భాషలో ఆత్మ పరిచయం మొదలగు అభ్యసన ప్రక్రియ ద్వారా యాక్టివిటీస్ బోధన పద్ధతి ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవచ్చని హిందీ రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయ కుమార్ తెలియజేశారు. అలాగే రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి కష్టపడి హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.*

వనపర్తి

సోలిపూర్ ఉన్నత పాఠశాలలో సందర్శించిన హిందీ రిసోర్స్ పర్సన్

*సోలిపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 09/ 02/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోలిపూర్ ఈరోజు పాఠశాలను జిల్లా ఇన్స్పెక్షన్ టీం సందర్శించడం జరిగింది అందులో ఆరవ తరగతి హిందీ పండితులు కే. వెంకటేష్ గారి బోధన అభ్యసన ప్రక్రియలను సందర్శించడం రికార్డులను తనిఖీ చేయడం పిల్లల్లో ద్విత్వాక్షర, సంయుక్తాక్షరముల పరిచయం, పిల్లలు హిందీ భాషలో ఆత్మ పరిచయం మొదలగు అభ్యసన ప్రక్రియ ద్వారా యాక్టివిటీస్ బోధన పద్ధతి ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవచ్చని హిందీ రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయ కుమార్ తెలియజేశారు. అలాగే రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి కష్టపడి హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.*

తిరుపతి

ముక్కంటి సన్నిధిలో సినీ సంగీత దర్శకుడు తమన్

శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్ల దర్శనార్ధం ఆదివారం నాడు ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్, గాయకులు శ్రీకృష్ణ విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం శ్రీ మేధా గురుదక్షణమూర్తి స్వామి సన్నిధిలో ఆలయ వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలతో శరవేగంగ స్వర్ణముఖి నది ప్రక్షాళన పనులు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గతంలో చెత్తాచెదారంతో నిండిపోయి, దుర్వాసనతో అపరిశుభ్రంగా మారిన స్వర్ణముఖి నది పరిసరాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించిన అనంతరం వేను వెంటనే నది ప్రక్షాళన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ప్రతి నిమిషం సమన్వయం చేస్తూ, పనులు వేగవంతం చేసి అద్భుతంగా నదిని ప్రక్షాళన చేయించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో (“శివం టు శివం రోడ్డు”) పనులను కూడా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, నిర్ణీత కాలానికి ముందే పూర్తి చేస్తున్నారు. పనుల సమయంలో పట్టణ ప్రజలకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సూచనల మేరకు స్వర్ణముఖి నూతన నది ఘాట్లు, పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రపరచబడటంతో పాటు, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించబడింది. ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన స్వర్ణముఖి, ఇప్పుడు సుందరంగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇబ్బంది పడకుండా అభివృద్ధి పనులు పూర్తి కావడంపై ఎమ్మెల్యే బొజ్జల నాయకత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా ద స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ద స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రావు పవర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా, శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహ మూర్తి, సినీ నటులు కె. వి. ప్రదీప్, సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్బంగా వ్యక్తలు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో ఏమి చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వ్యక్తిత్వం, క్రమశిక్షణతో గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తూ సంస్కారవంతంగా ఎదిగితే ప్రతి వ్యక్తి ఉన్నత శిఖరాలు అందుకుంటారని బిడ్డలకు తల్లిదండ్రులు ఉన్నత విలువ లతో కూడిన విద్యను అందించడమే ఆస్తులు కన్నా మిన్న అని సినీ యాక్టర్ ప్రముఖ మోటివెటర్ ప్రదీప్ కుమార్, కె.వి. సరస్వతి అన్నారు. అనంతరం డిఎస్పీ నరసింహ మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచి సంస్కారవంతగా, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. డాక్టర్ అర్చన పవర్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.