Wednesday, 22 April 2026

Blog

విశాఖపట్నం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్*

*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్* *విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌ర్ పున్నమి ప్రతినిధి: మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో 27, 28 ,29 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు, పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు ప్రయాణాలు రద్దు చేసు కోవాలని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని ఇంటి వద్ద సురక్షితంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద హోర్డింగ్ ల సమీపంలో ప్రజలు నిలబడరాదని కలెక్టర్ సూచించారు. మత్స్యకారులు సముద్రం లోకి వేటకు వెళ్ల వద్దని, వేటకు వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని కోరారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పల్లపు ప్రాంతాల్లో, కొండ వాలు ప్రాంతాలలో, నది ఒడ్డున నివసించేవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్ లలో స్నానాలకు దిగవద్దని కోరారు.* *పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మం తాత్కాలికంగా ర‌ద్దు…..* *మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో 27వ తేదీ (సోమ‌వారం) క‌లెక్ట‌రేట్లో జ‌ర‌గాల్సిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ (పీజీఆర్ఎస్) కార్య‌క్ర‌మాన్ని తాత్కాలికంగా ర‌ద్దు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంధిర ప్ర‌సాద్ తెలిపారు.* *విద్యా సంస్థలకు శెలవు……* *మొంథా (Montha) తుఫాను హెచ్చరికల నేపధ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు 27 మరియు 28 తేదీలలో సెలవులుగా జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ప్రకటించారు.* *కంట్రోల్ రూమ్ నెంబర్లు……* *తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో జిల్లాలో వర్షాలు, గాలులు ఇతర ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0891- 2590102 నకు గాని, 0891- 2590100 నకు గాని ఫోన్ చేసి తెలియ జేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.*

పల్నాడు

దుర్గి “మండల బూత్ కమిటీల విభాగ అధ్యక్షులుగా

పార్టీ అధ్యక్షులు శ్రీ YS Jagan Mohan Reddy గారి ఆదేశాల మేరకు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు మాచర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి మరియు పిన్నెల్లి వెంకటరామి రెడ్డి గారి ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గం నుంచి వైస్సార్సీపీ దుర్గి “మండల బూత్ కమిటీల విభాగ అధ్యక్షులుగా” ఎన్నికైన అయినా బొబ్బా సీతారామిరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐

విశాఖపట్నం

బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు .

బీచ్ లో వ్యర్ధాలు , మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు . • పరిష్కార మార్గం దిశగా ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో కలిసి బీచ్ ప్రాంతంలో పరిశీలన. • వై .ఎం. సి. ఎ . బీచ్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం ,అక్టోబర్ పున్నమి ప్రతినిధి: విశాఖ నగర సముద్ర తీరంలో పలు కాలువలు ద్వారా వ్యర్ధాలు, మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారానికి జీవీఎంసీ పటిష్ట చర్యలు చేపడుతుందని, ఆ దిశగా అనుభవజ్ఞులైన ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులతో బీచ్ ప్రాంతంలో పర్యటించి పరిశీలనలు జరిపామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జీవీఎంసీ అధికారులతో , ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో అనుభవజ్ఞులైన విశ్రాంత ప్రొఫెసర్ ఎస్. రామకృష్ణారావు, ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఎస్. బాలా ప్రసాద్ లతో కలిసి బీచ్ లో కలుస్తున్న పలు కాలువలను ఆదివారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ముందుగా ఆల్ ఇండియా రేడియో సమీపంలో జగన్నాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న వంతెన కింద కాలువను పరిశీలించిన అనంతరం బీచ్ రోడ్ లో వై ఎం సి ఎ వద్ద ,బీచ్ వైపు ఉన్న కాలువ ప్రాంతాన్ని పరిశీలించి మురుగునీరు బీచ్ లో కలవకుండా చేపట్టవలసిన చర్యలపై ప్రొఫెసర్లతో కమిషనర్ చర్చించారు. ముందుగా వై.ఎం.సి.ఏ బీచ్ మురుగు నీరు చేరిన ప్రాంతంలో ఒక పైలెట్ ప్రాజెక్టుగా కన్స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్ ఏర్పాటు చేసినట్లయితే సమస్యకు కొంత పరిష్కారం ఏర్పడుతుందని , అందువలన కలిగే ప్రయోజనం దృష్ట్యా బీచ్ లో కలుస్తున్న మిగిలిన కాలువల వద్ద కూడా వాటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్లు పలు సలహాలను అందించి కమిషనర్ కు సూచించగా .., దానివలన కలిగే ప్రయోజనాలపై కమిషనర్ ప్రొఫెసర్లతో సుదీర్ఘ చర్చ జరిపి అందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కార్యనిర్వాహక ఇంజనీరు ఏడుకొండలకు కమిషనర్ ఆదేశించారు. అనంతరం వై ఎం సి ఎ కాలువ వద్ద స్క్రీన్ లను , మురుగునీరు పారుతున్న ప్రక్రియను పరిశీలించి సంబంధిత సహాయక ఇంజనీర్లు నిత్యం కాలువలను పరిశీలించి, అడ్డంకులు లేకుండా తగిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ ఏడుకొండలు కు కమిషనర్ ఆదేశించారు. * ” బీచ్ తీరంలో వ్యాపారస్తులు వ్యర్ధాల నిర్వహణపై పరిశుభ్రత పాటించనందుకు జరిమానాన్ని విధించిన కమిషనర్ ” బీచ్ లో వై ఎం సి ఎ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఒక దుకాణం ముందు అధికంగా పేరుకుపోయి ఉన్న వ్యర్ధాలను గమనించిన కమిషనర్ దుకాణదారుడు వ్యర్ధాలు నిర్వహణపై పరిశుభ్రత పాటించడం లేదని ఐదు వేల రూపాయలను ఆ దుకాణానికి జరిమానాలను విధించి వెంటనే వారిచే చెల్లింప చేశారు. విశాఖ నగరంలో నిత్యం బీచ్ తీర ప్రాంతాలకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నందున వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు విచ్చలవిడిగా దుకాణాల ముందు వ్యర్ధాలను పడవేస్తూ బీచ్ పరిసర ప్రాంతాలను, ఆహ్లాద వాతావరణాన్ని అపరిశుభ్రపరుస్తున్నారని, అటువంటి వారిపై జరిమానాలను విధించాలని అవసరమైనట్లయితే సంబంధిత షాపులను తొలగించాలని అందుకు జీవీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే బీచ్ తీర ప్రాంతంలో సందర్శకులు ,వ్యాపారస్తులు వ్యర్ధాలను పడవేయకుండా వారికి అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టాలని , బీచ్ తీర ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్ కు, జోనల్ కమిషనర్ శివప్రసాద్ కు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్లు శాంతిరాజు మురళీకృష్ణ సహాయక వైద్యాధికారులు బి.ప్రసాదరావు, కృష్ణంరాజు, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్లు,శానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు, వార్డ్ శానిటరీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

పెద జాలారిపేటలో మెందా తుఫాన్ హెచ్చరిక వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ఈ రోజు 19వ వార్డు పేదజాలరిపేట పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ MLA వెలగపూడి రామకృష్ణ బాబు గారు *మోందా తుఫాను* హేచ్చరికల నేపథ్యంలో లో పేదజాలరిపేట గ్రామ ప్రజలను మరియు గ్రామ పెద్దలతో ముందస్తు తుఫాను చర్యల్లో భాగంగా సముద్రం తీర ప్రాంతాల్లో ఉన్నవారు మైదాన ప్రాంతాల్లోకి వెళ్లాలని, సహాయ శిబిరలను, సహాయ చర్యలు వినియోగించుకొవాలని తెలియజేసారు. సదరు కార్యక్రమంలో పేదజాలరిపేట గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి, తెడ్డు రాజు, బాపిరాజు, పోలారావు, మాణిరెడ్డి, తెడ్డు సతీష్, నూకన్నా మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు

అమరావతి

సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం*

* సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం* *గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాం* *ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశాం* *రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత* అమరావతి,పున్నమి ప్రతినిధి: అత్యాధునిక సమాచార సాంకేతికత సాయంతో ‘మొంథా’ తుపాను నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరము ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం హై అలెర్ట్ గా ఉందన్నారు. గతంలో సంభవించిన తుఫాన్ల సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పతిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్ర అధికారులతో పలుమార్లు కాన్ఫరెన్స్ లు నిర్వహించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇదే అంశంపై గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర ప్రజలను పలు మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని జిల్లాలకు నోడల్ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. 6 ఎన్ డి ఆర్ ఎఫ్, 13 ఎస్డీ ఆర్ఎఫ్ టీమ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హెలికాప్టర్ లతో నావెల్ అధికారులను సిద్ధం చేయడం జరిగిందని, అన్నిచోట్ల హెలీపాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అవసరం అయితే బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ నుంచి కూడా హెలికాప్టర్ లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తీరా ప్రాంతాల్లో 14 బోట్లను కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ తుఫాను సందర్భంగా గంటకు 100 కిలోమీటర్ల పైబడి భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల హార్డింగ్లను తొలగించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. తుఫాను కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ల టోల్ నెంబర్ కు ఫోన్ చేసి స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చని, తక్షణ సహాయం కూడా పొందవచ్చు అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తక్షణ సహాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె విజ్ఞప్తి చేశారు. స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పల్నాడు

గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు మాచర్ల 27/10/2025

వివాహ రిసెప్షన్ వేడుకల్లో నూతన వధువరులు జూలకంటి గౌతమ్ రెడ్డి, తేజస్విని రెడ్డిలను మంచి మనస్సుతో ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న ఏపీ గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ, విద్యాశాఖమాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం.. సుస్వాగతం ..!

E-పేపర్

వైసిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి

వైసిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్యజిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మందల పవన్ సాయి నీ నియమించినందుకు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మరియు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కి , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గార్కి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల. శ్రీనివాసులుకి మరియు రైల్వేకోడూరు నియోజకవర్గ వైసిపి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్న మం దల పవన్ సాయి.

ఆంధ్రప్రదేశ్

బైక్ నలుపు రంగులో ఉండటం వల్ల గుర్తించలేకపోయా: డ్రైవర్

బైక్ నలుపు రంగులో ఉండటం వల్ల గుర్తించలేకపోయా: డ్రైవర్ ఆంధ్రప్రదేశ్పున్నమి ప్రతినిధి : కర్నూలు బస్సు ప్రమాదం గురించి డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు సంచలన విషయాలు చెప్పాడు. రోడ్డుపై పడిన బైక్ నల్లరంగులో ఉండటంతో దాన్ని దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని అతను తెలిపాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో, బైకుపై నుంచి కూడా బస్సును ఆపకుండా పోనిచ్చినట్లు చెప్పాడు. అయితే, ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.

విశాఖపట్నం

ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం -దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతం అయ్యింది అని గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలోని ఆ హబ్ లో ప్రకృతి ఆధారిత పంటల సంత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారిత పంటలను మాత్రమే ఆహారం గా తీసుకోవడం మంచిదని అన్నారు. ఈ ప్రకృతి ఆధారిత పంటల సంత ప్రతి ఆదివారం ఇక్కడే జరుగుతుందని వివరించారు. ప్రకృతి ఆధారత పంటలను కోరుకునే వారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతులకు, నగరం లోని వినియోగదారులకు ఇది ఒక వేదికగా అవకాశం కల్పించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం బెంగళూరు వంకాయ మొక్కలు పంపిణీ చేయడం ఆనందదాయకం అన్నారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు వినియోగించకుండా పండిన పంటలను ప్రోత్సాహం విధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పాలేం నేచురల్స్ అశోక్, రైతులు రిషీ, తులసీ నేచురల్స్ సత్యన్నారాయణ, సంకల్ప ఆర్ట్ విలేజ్ నుంచి చలపతి రావు, అవని ఆర్గానిక్స్ నుంచి ఉషాగజపతి రాజు, శ్రీకాకుళం జిల్లా నుంచి దార్లపూడి రవి, వనమాలి, సిటిజి, మన కూరగాయల తోట సంస్థల ప్రతినిధులు, విభిన్న జిల్లాల రైతులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు… * ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం!

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు… * ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం! * వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ… * హాజరైన సౌత్ ఇన్చార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొత్తు అని, వాటిని పిపిపి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ ఎమ్మెల్యే సౌత్ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్ ఆధ్వర్యంలో 34 వార్డులో ఆదివారం మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసుపల్లి హాజరై కరపత్రాలు అందజేసి ప్రజల నుండి సంతకాలు సేకరించారు. రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి వరకు 45 రోజులు పాటు కోటి సంతకాల సేకరణ విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు ఈ ఉద్యమం జోరుగా కొనసాగుతుందన్నారు. ఈ సేకరణ లో నలుగు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతోపాటు విద్యార్థులు అధిక సంఖ్యలో భాగస్వాముల అవ్వాలని కోరారు. విద్యార్థి విభాగం వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడు గరికన వెంకటేష్ చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు సీనియర్ నాయకులు లండ రమణ, లింగం శ్రీను, దూడ అప్పారావు, కారి దానియమ్మ, సిహెచ్. జ్యోతి, పిల్లి సత్తిబాబు, గాలి పార్వతి, కేబుల్ చిన్న, నర్సింగరావు, దుర్గారావు, యు. రాజేష్, దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.