Wednesday, 22 April 2026

Blog

వరంగల్

దయనీయ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 దయనీయ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగిస్తున్న వైద్యులు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో, పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలిస్తున్న కుటుంబ సభ్యులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొంత కారణం గా రేపు సెలవు

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 26: *పత్రికా ప్రకటన* *నేడు పాఠశాలలకు, జానియర్ కళాశాలకు సెలవు* : *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* నెల్లూరు, అక్టోబర్ 26 : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘మోంతా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున *ఈ నెల 27న (సోమవారం)* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, *జానియర్ కళాశాలకు* సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

తిరుపతి

నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యం లో ఆదివారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్,సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.ఈ సందర్భంగా నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసీ.ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.అదేవిధంగా భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలన్నారు.

హైదరాబాద్

“డిజిటల్ టెక్నాలజీ అన్ని సమస్యలకు పరిష్కారం కాదు” – కేర‌ళా డీజీపీ

– ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని Veeravasaram వూరుని, చెరిపించక్కని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. – ప్రభుత్వ పాఠశాలలలో ప్రాథమిక విద్య, తరువాత ఇంటర్మీడియేట్ అభ్యసించారు. – ఆ తర్వాత బాపట్లలోని వ్యవసాయ కళాశాల్-లో బి.ఎస్‌సి కొనసాగించారు, అనంతరం హైదరాబాద్‌లో ఎమ్‌.ఎస్‌సి చేశారు; ఇది ఆయనకు “గేమ్-చేంజర్” అని ఆయన్ పేర్కొన్నారు. – 1991లో Indian Police Serviceలో (IPS) ఎంపికయ్యారు. ఆసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా Thalasseryలో మొదలు పెట్టి, తరువాత Wayanad, Malappuram, Ernakulam, Palakkad లాంటి జిల్లాల్లో SPగా పనిచేశారు. – తరువాత DIGగా Thrissur, Kochi ప్రాంతాల్లో విధులు చేపట్టారు, అలాగే Thiruvananthapuram పోలీస్ కమిషనరుగా కూడా పనిచేశారు. – ఆయనకు “ప్రెసిడెంట్ అవార్డ్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్” లాంటి గౌరవాలు లభించాయి. – 2025లో ఆయనకు Kerala దర్శనం ఇచ్చి ఆయన అక్కడ డీజీపీ (DGP)గా నియమితుడయ్యారు. – యువతకు ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు: “డిజిటల్ టెక్నాలజీ అన్ని సమస్యలకు పరిష్కారం కాదు” – అని, సమాజంతో కనెక్ట్ అవుతారా, పుస్తకాలు చదవాలి, వాస్తవ అనుభవాలపై దృష్టి పెట్టాలి అని అన్నారు. – ఆయన చెప్పడం ప్రకారం, కేర‌ళా ప్రజల హక్కులపై అవగాహన గలవారు, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో రాష్ట్రం ముందుంది. శరత్ చంద్ర (జర్నలిస్ట్)

E-పేపర్

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ :– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అందరు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం సాలైగూడ(74), రాం గూడ (56), ధర్మాజీపేట (31), కొలాం గూడాలను (36), పర్యటించారు. ఆయా గ్రామాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పెద్దలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,75,000 కేంద్ర ప్రభుత్వం లక్ష 25వేలు రూపాయలు నిధులు మాత్రమే మంజూరు చేసిందని మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇండ్లు నిర్మించిన వారికి దశలవారీగా నిధులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. పనులు నిర్మాణాలు నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ,జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

త్వరలో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి అక్టోబర్ 26 రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి వెల్లడించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ పనులపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే హైదరాబాద్లోని ఆర్ &బీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట రూపు రేకలు మారుతాయని ఎమ్మెల్యే తెలిపారు. చెరువు కట్టపై జరిగే ప్రమాదాల నివారణకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.

జోగులాంబ గద్వాల

మహిళకు న్యూడ్ కాల్స్ వేధింపులు.

జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడి ఇటిక్యాల మండలంలో ఘటన. మహిళా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఘటనలో అలంపూర్ మండలానికి చెందిన ముగ్గురు యువకుల పాత్ర, యువకులు ఓ ప్రధాన పార్టీకి చెందినట్టు సమాచారం. విషయాన్ని గుట్టుగా ఉంచి విచారణ చేపట్టిన పోలీసులు…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జోగులాంబ గద్వాల

100 పడక ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించండి.

అలంపూర్ (పున్నమి ప్రతినిధి) :- హైదరాబాదులోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ని శనివారం కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తా వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిచాలని సిబ్బందిని నియమించాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ఆస్పత్రిలో సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిబ్బందిని వసతులు కల్పించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

కాకినాడ

కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న తహశీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తాసిల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ పరిశీలించి వరద ఉధృతి ఏ మేరకు ఉందో ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. గంట గంటకు నీటి ప్రవాహం పెరగడంతో కాండ్రకోట గ్రామం నుంచి కట్టమూరు , జె.తిమ్మాపురం తో పాటు రైతులు పొలాల కెళ్లే పాత రన్ వే పై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు తీసుకున్నామని చెప్పారు, రైతులు పశువుల విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వెల్లడించారు.తహాశీల్దార్ వెంట ఇరిగేషన్ ఏఈ నిమ్మకాయల శ్రీనివాసరావు ఉన్నారు.

కాకినాడ

మొంథా తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన పెద్దాపురం తహాశీల్దార్ వెంకటలక్ష్మి.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 మొంథా తుపాను నేపథ్యంలో పెద్దాపురం పట్టణ, మండలం పరిధిలోని రెవెన్యూ శాఖ ముందస్తు చర్యలు చేపట్టినట్లు తహాశీల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల భద్రతే ద్యేయంగా రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మొంథా తుపాను కారణంగా ఏర్పడే ప్రమాదాలు, నష్టాలపై టాంటాం వేయించడం జరిగిందని తెలిపారు.ముందస్తుగా ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో పాఠశాల భవనాలను ఆధీనం లోనికి తీసుకున్నట్లు తహాశీల్దార్ వెంకట లక్ష్మీ చెప్పారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.