Sunday, 22 March 2026

Blog

తిరుపతి

చేనేత కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 11, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలోని భాస్కరపేట ప్రాంతంలో మెంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న చేనేత కార్మిక కుటుంబాలకు 181 మందికి నష్టపరిహారం, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్ధికాభివృద్దికి పెద్దపీట వేసిందని ఏ ఆపద వచ్చిన అన్ని రకాలుగా వారికి అండగా నిలుస్తుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

గుణదల అంబిటస్ వరల్డ్ స్కూలులో *షేడ్స్ వార్షికోత్సవ వేడుక – 2025*

విజయవాడ(నవంబర్ 11) పున్నమి ప్రతినిధి ఉమ్మడి కృష్ణాజిల్లా,విజయవాడ :- గుణదలలో అంబిటస్ వరల్డ్ స్కూలులో షేడ్స్ వార్షికోత్సవ వేడుక 2025 కార్యక్రమాన్ని నవంబర్ 22 వ తేదీ సాయంత్రం పాఠశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డి సి పి కె.జి.వి. సరిత పాల్గొంటున్నారని, వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.శ్రీప్రియ ప్రత్యేకంగా ఆహ్వానించామని, తప్పకుండా పాల్గొంటానని డి సి పి సరిత హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. కావున విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, అతిరథ మహారధులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ శ్రీప్రియ కోరారు.

కామారెడ్డి

శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో వైభవంగా సింధూర పూజలు

భక్తుల రద్దీ – ప్రత్యేక దర్శనంతో ఆధ్యాత్మిక వాతావరణం కామారెడ్డి, 11 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ). : రామారెడ్డి మండలం, ఇసనపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగ ళవారం సింధూర పూజలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున నలుమూలల నుండి వివిధ మార్గాలగుండా ఆలయానికి చేరుకున్నారు.స్వామివారిని దర్శించు కున్నారు. ఆలయ ప్రాంగణం భక్తిజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. గంటల నాదం, మంత్రోచ్చారణలతో ఆలయ పరిస రాలు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. కుటుంబ శాంతి, ఆరోగ్యం, రోగ నివారణ కోసం భక్తులు సింధూర పూజల్లో పాల్గొని సంకల్పాలు చేశారు. స్థానిక ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు నిర్వాహణలో ముందుండి కార్యక్రమాలను పర్యవే క్షించారు. స్వచ్ఛంద సేవకులు రద్దీని సమర్థంగా నియంత్రించారు. భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, ప్రసాదాల పంపిణీకి అధికారులు సహకరించారు.కార్తీక మాసం సంద ర్భంగా ఆలయంలో ప్రతిరోజూ నిత్యపూజలు, ప్రత్యేక ఉత్సవాలు, తీర్థప్రదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమీప గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి ఆలయ మహాత్మ్యాన్ని అనుభవించారు. అనంత రం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

విశాఖపట్నం లో మనవెలమ ముద్దుబిడ్డ సీనియర్ న్యాయవాది పి. ఎస్. నాయుడు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి బాధ్యతాలు స్వీకరిస్తున్న సందర్బంగా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ద్వారా మరియు రాష్ట్రం లో ఉన్న వెలమ కుటుంబ సభ్యులందరి తరుపున వారిని కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయుడం జరిగింది,ఈయొక్క కార్యక్రమం లో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెదిరెడ్ల సత్యం, రాష్ట్ర వెలమ నాయకులు బర్ల పైడం నాయుడు, రెడ్డి ఈశ్వరరావు, పెంట భానుప్రకాష్, వరుదు రాజకుమార్, పి. శ్రీనివాసరావు, చల్ల సురేష్,ముర్రు రాము, మాకిరెడ్డి సత్యనారాయణ తదితరులు హాజరైనారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ :167/20

నిర్మల్

“వృద్ధుల పింఛన్ హక్కు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం”

నిర్మల్, నవంబర్ 11 (పున్నమి ప్రతినిధి) వృద్ధాప్య పింఛన్ పెంపు హామీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న అలసత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, మంగళవారం నిర్మల్ ఆర్డీఓ (RDO) కార్యాలయం ఎదుట పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దిద్ది సుధాకర్ గారు మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, వృద్ధాప్య పింఛన్‌ను ₹4,000కి పెంచుతామన్న ప్రధాన హామీ నేటికీ అమలు కాలేదు. అంతేకాకుండా, కొత్త లబ్ధిదారుల దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉండిపోయాయి. దీని వల్ల వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,” అని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 📌 ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన డిమాండ్లు: * వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని తక్షణమే ₹4,000కి పెంచాలి. * కొత్త లబ్ధిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి. * కొత్తగా పెన్షన్లు చేర్చడం కోసం దరఖాస్తుల పోర్టల్‌ను తక్షణమే తెరవాలి. * పింఛన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, ఆలస్యాలకు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలి. డాక్టర్ దిద్ది సుధాకర్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, వెంటనే స్పందించకపోతే రాబోయే 10 నుంచి 15 రోజుల్లో దీక్ష లేదా ఆర్డీఓ కార్యాలయం ముందు బహిరంగ సభ వంటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. “వృద్ధుల హక్కుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చేవరకు ఆప్ కార్యకర్తలు మౌనంగా ఉండరు,” అని ఆయన స్పష్టం చేశారు. ఆప్ తెలంగాణ రాష్ట్ర ఎక్స్ కన్వీనర్ రామ గౌడ్ ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్, నిర్మల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సిహెచ్ వినోద్ కుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బి. శ్రీనివాస్, జిల్లా ట్రెజరర్ అబ్దుల్ సాదిక్, షారుక్, మరియు ఇతర పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జై హింద్! అధ్యక్షులు సయ్యద్ హైదర్, ఆమ్ ఆద్మీ పార్టీ, నిర్మల్ జిల్లా.

అన్నమయ్య

రాజంపేట నియోజకవర్గ సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన మేడ విజయ శేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ను మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా మేడ విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల దుస్థితి, నీటి పారుదల వ్యవస్థల లోపం, విద్యుత్ సదుపాయాల సమస్యలు,అలాగే యువతకు ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలను వివరించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులను కోరారు. రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.ఈ అంశాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల సమస్యలను సీరియస్‌గా పరిగణించి,సంబంధిత శాఖల ద్వారా అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు.మేడ విజయ శేఖర్ రెడ్డి ఈ సమావేశం రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేస్తుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు హైవేలో లారీ బిబస్తం ముగురు మృతి

Nellore nh16 hiway ntr nagar హైవేలో లారీ అదుపూ థాపి రోడ్డులో పాకన కంకులు ఆముకుంటూ వునవారి పైకి దూసుకెళ్లింది.ఆముకుంటూ వునావాలు బైక్ లో వెల్తు అగి కొనగోలు చేస్తున్నవాలు అందరు ప్రమాదంలో పాడారు. ముగురు స్పాట్లోనే మరనిచగా మిగిలిన వాలనీ ధగరా లోనీ మెడికోవర్ హాస్పిటల్ కి తరలించారు. పోలీస్ లు సంగటన స్థలానికి చేరుకోనీ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

రంగారెడ్డి

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీలంకల దీపక్ రెడ్డి తో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీలంకల దీపక్ రెడ్డి తో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి బూత్ వద్ద పోలింగ్ శాంతియుతంగా జరుగుతున్న విధానాన్ని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించడం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని తెలిపారు.ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగినప్పటికీ, ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిస్పాక్షికంగా ఓటు వేయాలని, ఇది ప్రజాస్వామ్య బలాన్ని పెంచుతుందని అన్నారు.పోలింగ్ కేంద్రాలలో వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను, పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి పౌరుడి గౌరవ చిహ్నమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించాలని కార్పొరేటర్ గారు తెలిపారు.మొత్తానికి ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అందరూ చురుకుగా పాల్గొని అధిక శాతంలో పోలింగ్ నమోదు చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ రంగా రెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, నాయకులు జక్కిడి ప్రభాకర్, షకీల్ మిర్జా, బొంగు రఘు, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు…

E-పేపర్

కోటిసంతకాల సేకరణలో అంకమ్మనగర్ లో దుకాణాల దగ్గర సంతకాల సేకరణ

కోటిసంతకాల సేకరణలో అంకమ్మనగర్ లో దుకాణాల దగ్గర సంతకాల సేకరణ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు స్థానిక అంకమ్మ నగర్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 17 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నందుకు కూటమి సర్కారుపై నిరసనగా కోటి సంతకాల కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని అంకమ్మ నగర్ లో షాాపుు యజమానుల దగ్గర సంతకాలు సేకరిస్తున్న కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్థానిక ఎంపిటిసి యు పుష్పలత, యనమాల చైతన్య మొదలగు వైసిపి నాయకులు పాల్గొనడం జరిగినది.

హైదరాబాద్

గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సామాజిక భద్రత అష్టవ్యస్తం

పున్నమి హైదరాబాదు ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకొస్తున్న గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సామాజిక భద్రత ముసయిదా అస్తవ్యస్తంగా ఉందని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ and గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ ఫోరమ్ కమిటీ సభ్యులు తెలుపుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలో కార్మికులకు సంక్షేమ పథకాలు ఏవిదంగా అందుతాయో స్పష్టత లేదని, నిధుల విషయంలో అవకతవకలు ఉన్నాయని మరిన్ని విషయాలు కంపెనీలకు అనుగుణంగా మార్చారని, ఇందులో మార్పులు చేర్పులు చేయాలని వర్కర్స్ యొక్క సంక్షేమము మరియు భద్రతకు సంబంధించిన విషయాలు ఇందులో లేవని మాట్లాడుతూ, అన్ని సంఘాలతో, కార్మికులతో మరొకసారి చర్చించాలని డిమాండ్ చేస్తూ 13/11/25 గురువారం రోజున కార్మికశాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేస్తామని సమావేశంలో పాల్గొన్న సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు ఈ సమావేశంలో బిజ్జుల రామకృష్ణారెడ్డి Tరాజశేఖర్ రెడ్డి , సతీష్ కుమార్ , అబ్దుల్ రావొఫ్ ,కిరణ్ కుమార్, వినయ్ భూషణ్, md ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.