Thursday, 23 April 2026

Blog

E-పేపర్

“బోర్డులు మాత్రమే… అమలు ఎక్కడ? చెత్తతో ముంచెత్తిన బంజర కాలనీ రోడ్

“అధికారుల హెచ్చరికలకు గౌరవం లేదు… చెత్తలో మునిగిపోయిన ప్రాంతం!” “తెలంగాణ రైజింగ్ మాటల్లోనే… నేలపై చెత్తే నిజం!” పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బంజర కాలనీ లోని GHMC పరిధి లో పరిశుభ్రత కోసం చెత్త వేయొద్దని అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, అవి కేవలం నవమాత్రంగా మారిపోయాయి. బోర్డు ఉన్న ప్రదేశంలోనే పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోవడం స్థానిక ప్రజల నిర్లక్ష్యాన్ని, అధికారుల వైఫల్యాన్ని బయటపెడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసనతో పాటు అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. పర్యావరణానికి హాని కలిగించే ఈ పరిస్థితిని తక్షణమే నియంత్రించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చెత్త సేకరణకు సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

E-పేపర్

“బోర్డులు మాత్రమే… అమలు ఎక్కడ? చెత్తతో ముంచెత్తిన బంజర కాలనీ రోడ్

“అధికారుల హెచ్చరికలకు గౌరవం లేదు… చెత్తలో మునిగిపోయిన ప్రాంతం!” “తెలంగాణ రైజింగ్ మాటల్లోనే… నేలపై చెత్తే నిజం!” పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బంజర కాలనీ లోని GHMC పరిధి లో పరిశుభ్రత కోసం చెత్త వేయొద్దని అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, అవి కేవలం నవమాత్రంగా మారిపోయాయి. బోర్డు ఉన్న ప్రదేశంలోనే పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోవడం స్థానిక ప్రజల నిర్లక్ష్యాన్ని, అధికారుల వైఫల్యాన్ని బయటపెడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసనతో పాటు అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. పర్యావరణానికి హాని కలిగించే ఈ పరిస్థితిని తక్షణమే నియంత్రించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చెత్త సేకరణకు సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి

అనకాపల్లి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు కొత్త ఊపు గణేష్ అధ్యక్షుడు – భావాని కార్యదర్శిగా బాధ్యతలు

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 10 : ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షుడిగా గణేష్, కార్యదర్శిగా భావాని బాధ్యతలు స్వీకరించారు. స్థానిక క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త కమిటీ సభ్యులు తెలిపారు. యువతలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంపొందించి జిల్లా స్థాయిలో ప్రతిభావంతులను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, సంఘ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

E-పేపర్

బల్బ్ వెలగదు… మోటార్ నడవదు… నక్కర్త మేడిపల్లిలో కరెంటు కష్టాలు!”

“లో వోల్టేజ్‌తో గ్రామం చీకట్లో… అధికారుల నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు … పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 తెలంగాణ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా బల్బ్ వెలగదు… మోటార్ నడవదు… నక్కర్త మేడిపల్లిలో కరెంటు కష్టాలు!” పేరు కు మాత్రమే విద్యుత్… వోల్టేజ్ తో ప్రజల జీవితం అస్తవ్యస్తం” నక్కర్త మేడిపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. గ్రామంలో సరైన వోల్టేజ్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్బులు వెలగకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడం, మోటార్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. ప్రత్యేకంగా రాత్రి సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పిల్లలు చదువుకోలేకపోవడం, వృద్ధులు ఇబ్బందులు పడటం వంటి సమస్యలు అధికమయ్యాయి. గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. పాత విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ లోపాలు ఈ సమస్యకు కారణమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే చర్యలు తీసుకుని గ్రామానికి సరైన వోల్టేజ్ సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం

మనసున్న మా రాజు …. గల్లా సత్య నారాయణ

ఖమ్మం ఏప్రిల్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) మనసున్న మా రాజు గల్లా సత్య నారాయణ యొక్క సేవా దృక్పథం మరో సారి వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ. పరిధిలో గల వేంసూర్ మండలానికి చెందిన వినయ్‌కు దగ్గరి బంధువు ఒక్కసారిగా ఆపస్మారక స్థితి లోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం స్తంబాద్రి హాస్పిటల్‌కు తరలించారు. సాధారణ కుటుంబం… ఆర్థిక పరిస్థితి కూడా అంతగా లేనందున వారికి చికిత్స ఖర్చులు పెద్ద భారమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ విషయం మొత్తం చరవాణి ద్వారా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరం రాజు బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ కి తెలియజేశారు. గల్లా సత్య నారాయణ సమాచారం అందుకున్న వెంటనే నేరుగా స్థంభాద్రి హాస్పిటల్‌కు వెళ్లి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల బాధ ని విని వారికి ధైర్యం చెప్పారు. హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి సుమారు 1 లక్ష యాభై వేలు వరకు బిల్లు అయితే అందులో 1 లక్ష రూపాయిలు తగ్గేలా ప్రత్యేకంగా సిఫార్సు చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడంలో “వెనుక అడుగు వేయని నాయకుడు అని పలువురు చెప్పుకునే గల్లా సత్య నారాయణ ఈ సందర్భంలో మరొకసారి సేవే అభిమానం… సేవే తన ధర్మం అని నిరూపించారు. ఎటువంటి హంగులు లేకుండా… ప్రచారం అవసరం లేకుండా… అపదలో ఉన్నవారికి అండగా నిలబడే గల్లా సత్య నారాయణ లాంటి నాయకులు ప్రజల హృదయాల్లో ఎల్లప్పటికి ప్రత్యేకస్థానం కలిగి ఉంటారు..

పిల్లలకు

“స్నేహానికి పట్టిన దయ్యం-స్వార్థం”

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు నేస్తాపురం. ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారి పేర్లు అశోక్, అర్జున్. వీరిద్దరూ చిన్నప్పటినుండి మంచి స్నేహితులు కానీ అశోక్ కి అర్జున్ అంటే ఏదో తెలియని అసూయ ఉండేది కానీ దాన్ని ఎన్నడూ ఎవరి దగ్గర వ్యక్తపరచలేదు. అర్జున్ బాగా చదివి మార్కులు సంపాదించిన అప్పుడు అశోక్ కి అర్జున్ మీద అసూయ వస్తుంది. అర్జున్ అశోక్ చాలా మంచి మిత్రులు. వారి మధ్య ఎన్నడూ వైర్యం అనేది రాలేదు. అశోక్ కి అర్జున్ తో పాటు ఇంకా కొంత మంది మిత్రులు ఉన్నారు అర్జున్ కి కూడా కొంతమంది స్నేహితులు ఉన్నారు. అశోక్ కి స్నేహితులైన వారందరూ అర్జున్ కి స్నేహితులు కానీ అర్జున్ కి స్నేహితులైన వారు అశోక్ కి నచ్చేవారు కాదు అశోక్ స్నేహితులకు కూడా వారు నచ్చేవారు కాదు కానీ అర్జున్ స్నేహితులని ఎప్పుడు చిన్నచూపు చూడలేదు. అశోక్ స్నేహితులు అందరితో అర్జున్ బాగా ఉండేవాడు. అర్జున్ పట్ల అశోక్ కి ఉన్న అసూయని అంతటిని ఒకరోజు అశోక్ తన మిత్రులకి చెప్పాడు. వాళ్ళు ఎందుకు అని ప్రశ్నిస్తే అశోక్ అర్జున్ మీద వాళ్ళకి అబద్దాలు చెప్పాడు. అది విన్న వాళ్లంతా అశోక్ ని తిట్టి నీలాంటి వాడితో మేము స్నేహం చేయము మనిషి ముందు ఒకలా మనిషి వెళ్ళిన తర్వాత ఒకలా మాట్లాడే మనస్తత్వం నీది నీతో మాకు స్నేహం ఇంతటితో తెగిపోయింది అని కఠినంగా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కాసేపటికి అర్జున్ అక్కడికి వచ్చి ఏమైంది అశోక్ మన మిత్రులు అందరూ ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు.వాళ్ళు మళ్ళీ ఏదో పని ఉందని అబద్ధం చెప్పి నీతో మాట్లాడటం ఇష్టం లేక వెళ్ళిపోయారు లే నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదని నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని చెప్పారు. నేను దానికి మీరు ఎవరు నాకు అవసరం లేదు నాకు అర్జున్ మాత్రమే స్నేహితుడు మీరు నిజమైన వాళ్ళు కాదు నాకు నా మిత్రుడు మీద అబద్ధాలు చెప్పి నన్ను నా మిత్రుడిని విడదీయాలని అనుకుంటున్నారా అని నేనే వాళ్ళని తిట్టి పంపించాను అని అశోక్ అర్జున్ కి అబద్దం చెప్పాడు. దానికి అర్జున్ అశోక్ తో మన మిత్రులే కదా వదిలే. అయినా మన వాళ్ళని మనం తిట్టకూడదు సరే వాళ్ళ గురించి వదిలే మనకి ఇంక కొన్ని రోజుల్లో పరీక్షలు ఉన్నాయి కద వెళ్లి చదువుదాం పద అని అర్జున్ అశోక్ ని తీసుకొని వెళ్ళిపోయాడు. పరీక్షలు రానే వచ్చాయి ఎప్పుడు అశోక్ కి మొదటి స్థానం లభించేది కానీ ఈసారి అర్జున్ కి మొదటి స్థానం వచ్చింది ఉపాధ్యాయులందరూ అర్జున్ ని పొగిడారు అశోక్ స్నేహితులు అర్జున్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. అశోక్ తో జాగ్రత్తా ఉండమని హెచ్చరించి వెళ్లిపోయారు. అర్జున్ దానిని పట్టించుకోలేదు వారి మాటలను పెడచెవిన పెట్టాడు. ఉపాధ్యాయుడు ఒకరోజు అందరి ముందు అర్జున్ ని తరగతి గది పర్యవేక్షకుడిగా నియమించాడు అది చూసి అశోక్ తట్టుకోలేకపోయాడు. అప్పటినుండి అర్జునుని దూరం పెట్టడం మొదలుపెట్టాడు అర్జున్ ఎందుకు నన్ను దూరం పెడుతున్నావ్ అని అశోక్ ని అడిగాడు దానికి అశోక్ ఏమీ లేదు ఊరికనే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. అర్జున్ అశోక్ స్నేహితుల దగ్గరికి వెళ్లి అశోక్ కి ఏమైంది అని అడిగాడు అశోక్ స్నేహితులు అర్జున్తో అశోక్ కి తన పట్ల ఉన్న అనసూయ ద్వేషాల గురించి చెప్పి తనతో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అర్జున్ దానికి వాళ్ళతో తన మిత్రుడు అలాంటివాడు కాదు అని చెప్పాడు .మళ్ళీ పరీక్షలు వస్తున్నాయి అనగా ఉపాధ్యాయులు తరగతిలో ఉన్న పిల్లలందరితో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అర్జున్ ని అడిగి తెలుసుకోమన్నారు. దానికి తోటి విద్యార్థులు అందరూ ఆనందపడ్డారు ఒక్క అశోక్ తప్ప. విద్యార్థులు అర్జున్ దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగి సందేహాలు తీర్చుకొని వెళ్లారు. అశోక్ ఇదంతా దూరంగా కూర్చుని చూస్తున్నాడు తనకు దక్కాల్సిన గౌరవం అర్జున్ కి దక్కిందని ఎంతగానో కుమిలిపోయాడు. ఈసారి పరీక్షల్లో ఎలాగైనా మొదటి స్థానంలో రావాలని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకున్నాడు. చివరికి పరీక్షలు వచ్చే సమయానికి అశోక్ ఏమీ చదవలేదు పరీక్షలు ఎలా రాయాలో అర్థం కాక చిట్టా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అది గమనించిన అర్జున్ అశోక్ అలా చేయడం తప్పు అని చెప్పినా వినకుండా తిరిగి అర్జున్ నీ దుర్భాషలాడి , తన స్థానంలో వెళ్లి కూర్చున్నాడు. అది గమనించిన తోటి విద్యార్థులు అర్జున్ దగ్గరకు వెళ్లి అశోక్ గురించి ఉపాధ్యాయుడికి చెప్పమని అడిగారు. అశోక్ వాళ్ళ మాటలు వినకుండా తిరస్కరించి ఉపాధ్యాయుడికి చెప్పలేదు. సరే నువ్వు చెప్పకపోతే మేమే వెళ్లి చెప్తామని తోటి విద్యార్థులు చెప్తే దానికి అర్జున్ ఇది అశోక్ మొదటి తప్పుగా భావించి వదిలేయండి అని చెప్పాడు. అందుకు వాళ్లు అర్జున్తో అసలు నీకు బుద్ధుందా అని అడిగారు నీ గురించి వాడు మాకు చెడుగా చెప్పి నిన్ను మా దృష్టిలో వెదవని చేద్దామని చూస్తున్నాడు. కానీ నువ్వు వాడే నాకు ప్రాణ స్నేహితుడు అన్నట్లు భావిస్తున్నావ్ అని అర్జునుని కాస్త గట్టిగా తిట్టారు. అందుకు అర్జున్ మీరు తన గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మను కాక నమ్మను అని వాళ్ళతో చెప్పాడు. వాళ్లు అర్జున్ ని నీకు అసలు బుద్ధుందా మేము నీ గురించి ఆలోచించి చెప్తుంటే నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు అని అంటారు. ఇంతలో ఉపాధ్యాయులు గారు రావటంతో అందరూ తమ స్థానాలు వెళ్లడానికి గబగబా పరిగెడతారు. అలా వాళ్ళు వెళ్లే లోపల ఉపాధ్యాయులు గారు వారిని చూసి ఎందుకు అంత హడావిడి అయినా మీకు అర్జున్తో ఏం పని ఉంది పరీక్ష సమయంలో ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని గట్టిగా అడిగే సరికి అశోక్ గురించి చెప్పబోతాడు ఒక విద్యార్థి ఇంతలో అర్జున్ జోక్యం చేసుకొని అది ఏమి లేదు సార్ పరీక్ష పత్రం గురించి చర్చిస్తున్నామని అబద్ధం చెప్తాడు. కానీ ఉపాధ్యాయుడు ఏదో తప్పు జరుగుతోంది అని అర్థం చేసుకొని కృష్ణ అనే విద్యార్థిని అడగగా అతను నిజం చెప్తాడు. అది విని ఉపాధ్యాయుడు అశోక్ ని పరిశీలించగా అతని దగ్గర కొన్ని చిట్టాలు బయటపడ్డాయి ఉపాధ్యాయుడు అశోక్ ని పరీక్ష రాయనీకుండా చేసి బయట నిలబెట్టాడు. మిగతా పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొట్టారు కానీ అర్జున్ మాత్రం తన మిత్రుడు పరీక్ష రాయలేదన్న బాధతో ఉన్నాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి ఎప్పటిలానే అర్జున్ మొదటి స్థానంలో వచ్చాడు అది చూసి అశోక్ మరింత అసూయతో ఊగిపోయాడు. అర్జున్ మాత్రం తన మిత్రుడు బాధగా ఉండటం చూడలేక వెళ్లి అతని బాధకు గల కారణాన్ని చెప్పమని అడిగాడు అశోక్ తన మనసులో ఉన్న బాధని, ఆక్రోశాన్ని, అసూయని అర్జున్ ముందు పెట్టాడు. అర్జున్ దానికి నామీద నీవు ఇంత ద్వేషాన్ని పెంచుకోవడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. అశోక్ నీ వల్ల నేను తరగతిలో ఉత్తీర్ణుడిని కాలేకపోతున్నాను నువ్వు వచ్చినప్పటి నుండి నాకు మంచి మార్కులు రావట్లేదు. నీతో స్నేహం చేసి నిన్ను తప్పుదారి పట్టిద్దామని అనుకున్నాను అలానే స్నేహం చేశాను కానీ నేను ఊహించిన దానికి విరుద్ధంగా నీవు రోజురోజుకీ అందరి మనస్సులో గొప్ప స్థానం సంపాదించుకుంటున్నావు అది చూసి తట్టుకోలేక నేను నీ గురించి చెడుగా చెప్పాను. కానీ ఎవరు నా మాట వినలేదు .నిన్నే నెత్తి మీద పెట్టుకున్నారు నిన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నా ‘స్వార్థం’ కోసం నిన్ను దూషిస్తూ పరీక్షల్లో చిట్టాలు పెట్టాను కానీ నువ్వు నీ మిత్రులు నన్ను ఇరికించారు .అప్పుడు అర్థమైంది నువ్వు నీ స్వార్థం కోసం నన్ను వాడుకున్నావు అని. అది వింటూనే అర్జున్ అశోక్ చంప పగలగొట్టాడు. అశోక్ తిరిగి కొట్టబోతుంటే అతని చెయ్యి పట్టుకుని ఇంకో చెంప వాయించాడు నీవు చేసిన పనులు నాకు తెలియదు అనుకుంటున్నావా. నువ్వు నన్ను ఎన్ని విధాలుగా మార్చాలనుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ప్రతి విషయంలో నన్ను తప్పుదారి లో నడిపిస్తున్నావు అని నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా నీ తప్పును నువ్వు తెలుసుకొని మారతావు అని మాత్రమే. నేను నిన్ను ఇరికించానా. నేను నిజంగా నిన్ను ఇరికించాలి అని అనుకొని ఉంటే అప్పుడే ప్రధానోపాధ్యాయుల వారి దగ్గరికి వెళ్లి నీ గురించి చెప్పి ఉండేవాడిని. నా స్నేహితుడివి అని మాత్రమే ఆగాను. కానీ నువ్వు మారలేదు అందుకే నీతో ఇంక మాట్లాడదలచలేదు నీ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా పట్టించుకోలేదు నువ్వు నీ గురించి ఆలోచించి చదువు మీద శ్రద్ధ చూపి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నీ ఈ దయనీయ స్థితికి అంతటికి నీవే కారణం నీ స్వార్థమే కారణం. నమ్మిన స్నేహితుడిని మోసం చేయాలని చూసావు దానికి ప్రతి క్రియగా నీవే మోసపోయావు. కనుక ఇక్కడ నుండైనా మారి నీమీద నీ మనసు మీద అన్నిటికంటే ముఖ్యంగా నీ చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువు. నన్ను ఎలా నాశనం చేయాలి అని కాదు ఎంత శ్రద్ధగా చదవాలి అని ఆలోచించు అని చెప్పి అక్కడ నుంచి అర్జున్ వెళ్లిపోయాడు. అశోక్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు మొదలయ్యాయి. అందులో ఈసారి అశోక్ మొదటి స్థానంలో వచ్చాడు. అది చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు మళ్ళీ ఒకసారి అశోక్ ని పిలిచి ప్రశ్నలు అడిగారు అశోక్ తట పటాయించకుండా సమాధానాలు చెప్పాడు. ఉపాధ్యాయులు

E-పేపర్

ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్

ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్ పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం విషయం లో అప్రమత్తంగా ఉండాలి: మాదాపూర్ సర్పంచ్ భూర మాధురి దిలీప్ గౌడ్* మాదాపూర్ గ్రామం లో సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ బూర మాధురి దిలీప్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిబిరం నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలు ఆరోగ్యo విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. డాక్టర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ మాదాపూర్ గ్రామంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం మంచి స్పందన రావడం జరిగిందని మునుముందు కూడా ఇలాంటి శిబిరాలు మాదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండు అశోక్, గ్రామ కార్యదర్శి సురేష్,వార్డు సభ్యులు దండు కవిత నాగరాజు,ప్రభుత్వ డాక్టర్లు వెంకటరమణ , సత్యనారాయణ,వెంకటేష్,అలివేలు, ఆశవర్కర్ జ్యోతి కారోబార్ దండు శ్రీధర్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భక్తి శ్రద్ధల మధ్య సూలప్ప పయనం… సంగమేశ్వర బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 10 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి) మనుబోలులో గురువారం రాత్రి సూలప్ప పయనంతో శ్రీ కామాక్షితాయిసమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు సాయి కుమార్ శర్మ, ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు సూలప్పను భుజాలపై మోసుకొని బద్దెవోలు క్రాస్ రోడ్‌లోని ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ధ్వజారోహణ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం ఉగాది అనంతరం పాడి పంటలు చేతికి వచ్చిన సమయంలో ఏప్రిల్ 9 నుంచి 17 వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన KCR కప్ క్రికెట్ టోర్నమెంట్

ముస్తాబాద్ /ఏప్రిల్/పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో KCR కప్-2026 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలోని క్రికెట్ మైదానంలో ట్రాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. జిల్లా BRS పార్టీ అధ్యక్షులు తోట అగన్న, TSPSC సభ్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి శీలం జానా బాయ్ కుర్ర సావిత్రి. మెంగని మనోహర్ శీలం స్వామి వంగూరి దిలీప్ టిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు మరియు యువకులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కడప

కడప జిల్లా ఖాజీపేటలో విద్యార్థిని దారుణ హత్య.

ఖాజీపేట టౌన్ అగ్రహారం లో కీర్తన అనే విద్యార్థిని గొంతు కోసి చంపిన మరొక వ్యక్తి.. చికిత్స నిమిత్తం కడపకు తీసి వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. హత్య చేయడానికి కారకుడైన ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.