Friday, 20 March 2026

Blog

విశాఖపట్నం

మా భాష మీద..మీ పెత్తనమేంటి..?

మాతృభాష రక్షణ కోసం సాగుతున్న “టిట్టిభ సత్యాగ్రహం” 10వ రోజుకు చేరుకొంది. తెలుగుదండు పిలుపు మేరకు.. పలువురు కవులు, కళాకారులు, భాషాభిమానులు దీక్షలో పాల్గొని “మాతృభాషా ప్రతిజ్ఞ” చేశారు. పది రోజులుగా.. దీక్షా నియమాలు పాటిస్తున్న తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. మన మాతృభాష మీద, ఈ దేశవాళీ పాలకుల పెత్తనమేంటి ? ప్రవేటు పాఠశాలల సంక్షేమం కోసం ఇంకెంత కాలం.. తెలుగు భాషను, తెలుగు జాతిని పణంగా పెడతారు ? ఈ దిక్కుమాలిన పాలకుల కుళ్లు రాజకీయాలకు అంతం లేదా ? అంటూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం దీక్షా వేదికకు మద్దతుగా..విశాఖ గాయనీ గాయకుల సంఘ సభ్యులు విచ్చేసి తెలుగు పాట‌లతో ‘తెలుగుతల్లి’కి నీరాజనాలు సమర్పించారు. కార్యక్రమంలో.. తిరుపతి రాజమన్నార్, డా.కొచ్చెర్లకోట, ఆచార్య సూరప్పడు, అడపా రామకృష్ణ, చేబియ్యం రవిమోహన్,ఏలూరి లక్ష్మీ, బాదం మణికుమారి, అల్లు వెంకట రమణ,విశాఖ గాయనీ గాయకుల సాంస్కృతిక సంఘ సభ్యులు.. బయ్యా శ్రీనివాసరావు, భూపతిరావు,ఎం.వి.ఆర్.నాగేశ్వరరావు, ఫణిస్వామి,కృష్ణంరాజు..తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పదవీ విరమణ చేసిన హోంగార్డు కైసర్ల కృష్ణారావుకు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ పొందిన కైసర్ల కృష్ణారావుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆర్థిక సహాయం అందజేశారు. ఉమ్మడి అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందించగా, ఆ నిధితో కూడిన రూ.4,03,670/- విలువైన చెక్కును జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో కైసర్ల కృష్ణారావుకి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ కైసర్ల కృష్ణారావు సేవలను ప్రశంసిస్తూ, “విధి నిర్వహణలో ఆయన నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయత అత్యంత శ్లాఘనీయాలు” అని పేర్కొన్నారు. అలాగే హోంగార్డుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహోద్యోగులకు ఆర్థిక సహాయం అందించే హోంగార్డుల స్ఫూర్తి అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి సి.హెచ్.తిలక్ బాబు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.

ఆదిలాబాదు

ఖాతాకు కేవైసీ తప్పనిసరి చేసుకోవాలి

ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా రీజినల్ మేనేజర్ రామచందర్ రావు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, ఖాతాకు కేవైసీ చేసుకోవాలని, నామినీలను పెట్టాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ మోసాలపై అప్రపత్తంగా ఉండాలని, ఇలాంటి అనుమానం ఉన్న1930కు ఫిర్యాదు చేయాలన్నారు. డబ్బు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఎంఎస్ఎంఈ లోన్స్ ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు అన్నారు. వినియోగదారులు మరణిస్తే వారి కుటుంబీకులు బ్యాంకు ను సంప్రదించి నిబంధనల ప్రకారం వచ్చే లబ్ధి పొందాలని తెలిపారు. బీమా, పెన్షన్ పథకాలతో కుటుంబాలకు ధీమా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్బిఐ ఎఫ్ఐ మేనేజర్ విజయ్, ఎంఎస్ఎంఈ డిఎం పృథ్వి, సిఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ, కార్యదర్శి వినోద్, శ్రీనివాస్, దత్తు, అరుణ్, రాజశేఖర్ పాల్గొన్నారు.

విశాఖపట్నం

49వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాంల పంపిణీ

విశాఖపట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 49వ వార్డులో పారిశుద్ధ్య విభాగానికి చెందిన కార్మికులకు మూడు జతల యూనిఫాం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ త్రిమూర్తులు, సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాసరావు సమన్వయంతో, వార్డు కార్పొరేటర్ & జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాంలు అందజేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, శుభ్రత, పనితీరును దృష్టిలో ఉంచుకుని జీవీఎంసీ తరఫున ఈ యూనిఫాంలు పంపిణీ చేయబడినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మూడు జతల యూనిఫాంలు ప్రతీ కార్మికునికి అందజేసి, వారు తమ విధులు మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు ఈ సందర్భంగా అల్లు శంకర్రావు మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి యోగక్షేమాల కోసం అవసరమైన యూనిఫాంలతో పాటు హ్యాండ్ గ్లోవ్స్, ఫేస్ మాస్క్స్, గమ్ బూట్లు, సేఫ్టీ సామగ్రి, వర్క్ కిట్లు వంటి ఉపకరణాలు కూడా జీవీఎంసీ నిరంతరం అందిస్తున్నదన్నారు. అలాగే, కార్మికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తనవంతు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. సానిటరీ ఇన్స్పెక్టర్ త్రిమూర్తులు మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు రోజువారీగా ఎక్కువ శ్రమ మరియు రిస్క్‌తో కూడుకున్నవని, కార్మికుల భద్రతను ముందుంచుకుని అవసరమైన సామగ్రిని సమయానికి అందించడం జీవీఎంసీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సూపర్వైజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డులో పారిశుద్ధ్య సేవలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని, కార్మికుల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుతున్నామని పేర్కొన్నారు. యూనిఫాంలు అందుకున్న పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ, వార్డు కార్పొరేటర్, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పనిసమయంలో యూనిఫాంలు చాలా సహాయపడతాయని, ఇది తమకు కలిగిన గౌరవానికి నిదర్శనమని భావించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల అప్పనపల్లి – స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో : మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ ప్రాథమిక పాఠశాల, అప్పనపల్లిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం చైర్మెన్ శ్రీమతి కడలి శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నైనాల రఘురామయ్య గారు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అనేక ముఖ్య అంశాలపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చ జరిగింది. ముందుగా విద్యార్థులు విద్యారంగంలో సాధించిన ప్రగతిని ఉపాధ్యాయులు వివరించారు. తరగతి వారీగా విద్యార్థుల పనితీరు, హాజరు, నైపుణ్యాల్లో వచ్చిన మెరుగుదలపై తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. తరువాత మధ్యాహ్న భోజన పథక అమలు విధానం, భోజన నాణ్యత, పంపిణీ తీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరమైన సమీక్ష జరిగింది. పాఠశాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఉపాధ్యాయులు పెద్దిరాజు గారు, రామకృష్ణ గారు, షబ్బీర్ హుస్సేన్ గారు, అనంతలక్ష్మిదేవి గారు పాఠశాలలో డైనింగ్ హాల్ కొరత ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ అత్యవసరమని, దాతలు ముందుకు వచ్చి నిర్మాణానికి సహకరిస్తే పాఠశాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ గెడ్డం చంద్రశేఖర్ గారు, మందపాటి రామకృష్ణ గారు, గెడ్డం లెనిన్ గారు పాల్గొన్నారు ఈ సమావేశం విజయవంతంగా ముగిసింది.

నాగర్‌కర్నూల్

ఘనంగా స్త్రీ శక్తి దివస్*

*ఘనంగా స్త్రీ శక్తి దివస్* *జాన్సీ రాణి – నేటి తరానికి శాశ్వత ప్రేరణ -నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్* అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో వీర వనిత శ్రీ ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి కల్వకుర్తి నగరంలోని న్యూ ఎరా జూనియర్ కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ధైర్యం, దేశభక్తి, త్యాగం అనే విలువలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహానుభావులలో జాన్సీ రాణి లక్ష్మీబాయి స్థానం అగ్రగణ్యంగా నిలుస్తుంది. ఆమె జీవితం ఒక మహిళ ఏ స్థాయికి ఎదగగలదో, ఏ విధంగా తన దేశం కోసం పోరాడగలదో చెప్పే మహోన్నత గాథ. నేటి తరానికి ఆమె కేవలం చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు; ఆమె ఒక ఆత్మవిశ్వాసానికి, నిబద్ధతకు, నిస్వార్థ సేవకు ప్రతీక 1828 నవంబర్ 19న జన్మించిన మణికర్ణికా (మణు) చిన్న వయసులోనే గుర్రపు స్వారీ, విలువిద్య, ఖడ్గ విద్య, కుస్తీ వంటి సైనిక శిక్షణ పొందింది. అప్పుడు మహిళలు ఇలాంటి శిక్షణలు తక్కువగా తీసుకునే కాలం. కానీ ఆమె ధైర్య స్వభావం బాల్యంలోనే బయటపడింది. సరికొత్త ఆలోచనలు, దృఢసంకల్పం ఆమెను ఇతరుల కంటే ప్రత్యేకురాలిగా నిలబెట్టాయి.మణికర్ణికా ఝాన్సీ రాజు గంగాధర్ రావును వివాహం చేసుకుని “లక్ష్మీబాయి”గా మారింది. రాజ్యపాలనలో ప్రజల పట్ల మమకారం, న్యాయాన్ని కాపాడే ధోరణి ఆమెను ఒక ఆదర్శ రాణిగా తీర్చిదిద్దాయి. రాజకుమారుడు మరణించడంతో దత్తపుత్రుడిని వారసుడిగా నిర్ణయించినా, బ్రిటిష్ వారి “ల్యాప్‌సు సిద్ధాంతం” పేరుతో ఝాన్సీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఝాన్సీ రాణి బ్రిటిష్‌ల అన్యాయాన్ని అంగీకరించలేదు. “నేను నా ఝాన్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను” అన్న ఆమె మాట అప్పటి నుంచి నేటివరకు భారతీయుల హృదయాల్లో శక్తి నింపుతుంది. ఝాన్సీని రక్షించడానికి ఆమె సైన్యాన్ని సన్నద్ధం చేసి స్త్రీలతో కూడిన ప్రత్యేక దళాలను కూడా ఏర్పాటు చేసింది. 1857లో మొదలైన భారత తొలి స్వాతంత్ర్య సమరంలో జాన్సీ రాణి ప్రధాన పాత్ర పోషించింది. యుద్ధరంగంలో ఆమె గుర్రం మీద రెండు కత్తులు పట్టుకొని శత్రువులపై దాడి చేయడం, తన సైన్యానికి ధైర్యం చెప్పడం కఠిన యుద్ధ పరిస్థితుల్లో కూడా ఆమె ధైర్యం తగ్గలేదు. చివరి వరకూ పోరాడి 1858 జూన్ 18న వీరోచితంగా వీడ్కోలు పలికింది.జాన్సీ రాణి జీవితం అనేక విలువలను నేర్పుతుంది ధైర్యం జీవితానికి పునాది తరతరాలుగా మహిళలకు ధైర్యం, సాహసాన్ని సూచించే పేరు జాన్సీ రాణిది. ఆధునిక ప్రపంచంలో కూడా ఆత్మవిశ్వాసమే విజయపు మార్గం అని ఆమె చూపించింది. న్యాయం కోసం నిలబడాలి అన్యాయం ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడటం అవసరం. రాణి చేసిన పోరాటం నేటి సమాజానికి ఒక పెద్ద సందేశం. స్త్రీ సాధికారతకు ప్రతీక పురుషాధిక్య సమాజంలో కూడా స్త్రీలు ఏ రంగంలోనైనా ముందుకు రావచ్చని ఆమె నిరూపించింది. నేటి అమ్మాయిలకు ఇది గొప్ప ప్రేరణ. దేశభక్తి – అత్యున్నత విలువ తన జీవితం, రాజ్యం, సుఖం అన్నింటికంటే దేశం ముఖ్యమని ఆమె మనకు చూపించింది. యువతలో దేశసేవాభావాన్ని పెంపొందించేందుకు ఆమె ఉదాహరణ శాశ్వతం. నాయకత్వం ఎలా ఉండాలో చూపిన మహానుభావురాలు ఆమె నాయకత్వంలో సైన్యం ఆమెను దేవతల్లా గౌరవించింది. నేటి యూత్‌కు నాయకత్వ గుణాలు ఆమె నుంచి నేర్చుకోదగినవి. జాన్సీ రాణి లక్ష్మీబాయి ఒక వ్యక్తి కాదు, ఒక యుగం. ధైర్యం, నిబద్ధత, దేశభక్తి, న్యాయం—ఈ విలువలు ఉన్నంతకాలం ఆమె పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. తరం మారినా, కాలం మారినా, జాన్సీ రాణి ఇచ్చే ప్రేరణ ఎప్పటికీ మారదు. ఆమె గాథ ప్రతి భారతీయ హృదయంలో జ్వాలలు రగిలించే అజరామరమైన శక్తి. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకుంటే, దేశం భవిష్యత్తు మరింత మెరుగ్గా మారడం ఖాయం అన్ని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ యాదవ్ ,పాఠశాల యాజమాన్యం, కార్యకర్తలు విద్యార్థినిలు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*వీధి దీపాలు మరమ్మత్తు … దగ్గరుండి చేయించిన టీడీపీ నాయకులు*

*వీధి దీపాలు మరమ్మత్తు … దగ్గరుండి చేయించిన టీడీపీ నాయకులు* హర్షం వ్యక్తం చేసిన స్థానికులు.. పొదలకూరు పట్టణంలో వినాయక మాన్యం లో వీధి దీపాలు వెలగక పాదచారులు,వాహన దారులకు ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని మండల నాయకులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు గార్లకు తెలియ జేయగా పంచాయతీ సిబ్బందికి తెలియ పరిచి వారి సమక్షంలో నాయకులు కలగట్ల సందీప్,డేగ హరి నారాయణ లు పంచాయతీ టెక్నీషియన్ ల సహాయంతో మరమ్మత్తులు చేయించారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీని పుట్టపర్తికి స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నాను: చంద్రబాబు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీని పుట్టపర్తికి స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ పవిత్ర స్థలం యొక్క దైవత్వంలో మునిగిపోవడానికి మరియు ఈ ప్రాంతానికి మరియు మానవాళికి భగవాన్ చేసిన అపారమైన సహకారాన్ని గుర్తుచేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,అధికారులు పాల్గొన్నారు

విశాఖపట్నం

సింహాచలం దేవస్థానంలో పోలిపాడ్యమి ఏర్పాట్లు భద్రతా చర్యలతో శక్తివంతం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలంలో వచ్చే శుక్రవారం జరిగే “పోలిపాడ్యమి” ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం అధికారులు పుష్కరిణి పరిసరాల్లో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్నారు. పోలిపాడ్యమి సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు వరాహ పుష్కరిణి వద్ద దీపప్రదానం చేసే సంప్రదాయం ఉండడంతో, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కార్యనిర్వాహణాధికారి తెలిపారు. భద్రతా ఏర్పాట్లు ఇలా… పుష్కరిణి చెరువు లోపల, చెరువు గట్టుపై విస్తృతంగా బారికేడింగ్ ఏర్పాటు పుష్కరిణి వద్ద, దారి మధ్య మార్గాల్లో దేవస్థానం కమ్యూనిటీ గార్డులు & పోలీసులు బందోబస్తు 20 నవంబర్ గురువారం రాత్రి నుండి ప్రత్యేకంగా దేవస్థానం సిబ్బందికి డ్యూటీలు పుష్కరిణికి వెళ్లే మార్గాల్లో వాహన రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు నియమించాలని కోరింపు అధికారులు మాట్లాడుతూ, “భక్తులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు భద్రతా నిబంధనలు పాటిస్తూ వరాహ పుష్కరిణి వద్ద దీపాలను వదలవలసినదిగా” విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వివరాలన్ని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకు చేరేలా ప్రచారం చేయాలని తెలిపారు.

విశాఖపట్నం

విశాఖ ఉత్తర నియోజకవర్గం 50 వవార్డులో కోటి సంతకాలు సేకరణ ( రచ్చబండ ) కార్యక్రమంలో పాల్గొన్న – శ్రీకె.కె రాజు

బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వార్డు మాధవధార 48a బస్ స్టాప్ దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ( రచ్చబండ) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 50 వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈసందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దొంగ దెబ్బ కొట్టే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజిలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే విధంగా ప్రజాభిప్రాయం లేకుండా ఒక కుట్రపూరిత నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అని అన్నారు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మహా ఉదృతంగా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 50వార్డు అధ్యక్షులు లాలంవేణు గోపాలస్వామి,అంబటి శైలేష్, వార్డు నాయకులు శివరాం, సనపల నారాయణస్వామి, పాతపట్నం రామ్మోహన్, పైడి శ్రీనివాసరావు, బగాది విజయ్ కుమార్, బగాది శ్రీరామ్ మూర్తి, దవళ నారాయణరావు,పైడి ప్రతాప్, పొన్నాడ అప్పారావు మాస్టర్, సబ్బవరపు శ్రీనివాస్, రేవతి, భవాని, చైతన్య, ప్రకాష్,వెంకటరావు, వెంకట్రావు సనపల రమేష్, పప్పల లక్ష్మణరావు, సీనియర్ నాయకులు అమర్ రెడ్డి, రత్నం,కె.చిన్న, బొట్ట రాజు, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.