ఆంధ్రప్రదేశ్
సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం పచ్చగా ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వేనిగండ్ల రాము* *నియోజకవర్గ పరిధిలోనీ రైతాంగానికి మంజూరైన… అన్నదాత సుఖీభవ చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే* *రైతే రాజన్నది మొదటి నుంచి టిడిపి సిద్ధాంతం…* *మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు….చెడు చేస్తే పాతాళానికి తొక్కేస్తారు* గుడివాడ నవంబర్ 19: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం పచ్చగా ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా చినదాసరిపల్లిలో సీఎం చంద్రబాబు పాల్గొన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులు మరియు కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. అనంతరం గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 11వేల 168 మంది రైతులకు మంజూరైన రూ.7.44 కోట్ల జంబో చెక్కును రైతులు మరియు కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు…రైతే రాజన్నది మొదటి నుండి టిడిపి సిద్ధాంతమన్నారు.విజన్ ఉన్న చంద్రబాబు నాయకత్వంలో, ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందనడానికి మరో నిదర్శనమే రైతాంగానికి రెండో విడత అన్నదాత సుఖీభవ – పీ.ఎం కిసాన్ నిధులు విడుదల చేయడమేనన్నారు. గత ప్రభుత్వంలో రైతాంగ అనుబంధ వ్యవస్థలను సర్వ నాశనం చేశారని, కనీసం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడేవారని, కొద్దిపాటి వర్షాలకే కాలువలు పొంగి రైతాంగం ఎంతో నష్టపోయారని నాటి రోజులను ఎమ్మెల్యే రాము గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాలువలను ఆధునికరించడం, రైతాంగ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా, అనుబంధ వ్యవస్థలన్నిటిని గాడిలో పెట్టిన సీఎం చంద్రబాబు తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు. తుఫాన్ సమయంలో స్పూర్తి దాయకంగా పనిచేసిన కూటమి నాయకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అభినందించారు. మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని…. చెడు చేస్తే పాతాళానికి తొక్కేస్తారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ – సీఎం చంద్రబాబు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే రాము గుడివాడ అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అబ్జర్వర్ నూకాలమ్మ యాదవ్, గుడివాడ ,గుడ్లవల్లేరు మార్కెట్ యార్డుల చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ బిజెపి కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు,గుడివాడ,రూరల్ నందివాడ మండలాల టిడిపి అధ్యక్షులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబయ్య, కళింగా కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరిపర్తి సుబ్బారావు,కొండలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఈడే మోహన్,గోకవరపు సునీల్, వ్యవసాయ శాఖ ఏడిఏ కరుణ, డి.సిలు కుటుంబరావు, ఆంజనేయులు, బొమ్మనబోయిన ఏసుబాబు, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని రైతు సంఘ నాయకులు, నీటి సంఘాల కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.