Friday, 20 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానం

జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించారు.కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పెండ్లిమర్రి సభ ప్రాంగణంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, కడప ముస్లిం పెద్దలతో కలిసి 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రం నలుమూలల నుండి, దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మరియు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా సూచించారు. కడప జిల్లాలో దీనీ ఇస్తిమా నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, భద్రత, రవాణా, వసతి, పారిశుద్ధ్యం వంటి అన్ని కీలక అంశాలను సమన్వయంతో పర్యవేక్షిస్తూ ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు.

విద్య విజ్ఞానం

సత్యసాయి స్వామి వారు నిత్య స్మరణీయులు.

సత్యసాయి వారు దేవుడా కాదా అనేది కాసేపు పక్కన పెడదాం 35 వేల మందికి పైగా గుండె ఆపరేషన్ లు లక్షలాది మందికి ఉచిత వైద్యం.. మెడికల్ క్యాంప్స్ 1500 గిరిజన గ్రామాల్లో సురక్షిత మంచి నీటి సరఫరా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీ ల ద్వారా లక్షలాది మందికి ఉచిత విద్య.. నిత్యావసర వస్తువుల పంపిణి అన్నదానం, స్వయం ఉపాధి ప్రాజెక్టు లు.. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు.. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రభుత్వానికి సమాంతర సేవలు ప్రజలకు అందించారు.. కాషాయం అంటే ఏడ్చి చచ్చిపోయి సన్నాసులు కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా సేవలు పొందిన వారే ఉంటారు.. ఇన్ని సేవలు చేసినా ఎక్కడా కూడా మతం దేవుడి ప్రస్తావన తీసుకు రాలేదు.. కేవలం బియ్యం బస్తా ఇచ్చి మతం మార్చేసే వారికి అదే పెద్ద సేవ గా చూపించుకుంటారు.. జీవితాలను ఇచ్చినా కూడా అది కేవలం మా ధర్మం మాత్రమే అని చెప్పుకునే సత్యసాయి సేవకులు ఆదర్శప్రాయులు.. అలాంటి ఉన్నతమైన వ్యక్తులను తయారుచేసిన స్వామి వారు నిత్య స్మరణీయులు..

ఆంధ్రప్రదేశ్

కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తనిఖీలు

ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం పోలీసులు డాగ్ స్క్వాడ్ తో కలిసి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగినట్లు కనిగిరి పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో సాయిజయంతి వేడుకలు ఘనంగా – 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలోని గీతా మందిరం శ్రీ భగవాన్ సత్యసాయి మందిరంలో బుధవారం భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జయంతి ఉత్సవాలలో భాగంగా చిన్నారులు సమర్పించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభలోని భక్తులను ఆకట్టు కున్నాయి. సత్యసాయి సందేశాలు, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబిం చేలా పిల్లలు ప్రదర్శించిన నృత్యకళలను ఎమ్మెల్యే సౌమ్య మహిళా మణులతో కలిసి వీక్షించారు. తరువాత భగవాన్ శ్రీ సత్యసాయి సేవ కమిటీకి ఎమ్మెల్యే రూ. 2 లక్షల విరాళాన్ని స్వయంగా అందజేశారు. ఆమె చేసిన ఈ సహాయానికి సభలో హర్షధ్వా నాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య “భగవాన్ శ్రీ సత్యసాయి జీవితం ప్రేమ, శాంతి, సేవలకు ప్రతీక. సమాజ హితానికి ఆయన చేసిన సేవలు యుగయుగాల పాటు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి విలువలను ప్రజల్లో నాటడంలో సత్యసాయి చేసిన సేవలను స్మరించారు. జయంతి వేడుకల సందర్భంగా దేవాలయ ప్రాంగణం భక్తులు, మహిళా బృందాలు, సాంస్కృతిక కళాకారులతో కళకళలాడింది. భజనలు, మాతృపూజ, సేవా కార్యక్రమా లతో వేదిక ఆధ్యాత్మిక వాతావరణంలోనిండిపోయింది. మొత్తం గా, నందిగామలో నిర్వహించిన సత్యసాయి 100వ జయంతి వేడుకలు ఆధ్యాత్మికత, సేవా భావం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచాయి.

తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : మంత్రులు

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులతో కలిసి ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్నదని,మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐక్యతతో ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న: కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) చదువుతూనే అన్ని సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివి సమాజంలో మంచి స్థానానికి రావాలని ఆమె విద్యార్థినిలకు పిలుపునిచ్చారు.

రంగారెడ్డి

* జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమమే —తెలంగాణ వచ్చినా.. ప్రభుత్వాలు మారినా..* –రాతమారని జర్నలిస్టుల బతుకులు* –జర్నలిస్టులు తెలంగాణ పోరాటం చేయలేదా..* –అక్రిడియేషన్ కార్డులకు ఎందుకు ఇంత జాప్యం ఎందుకు..?* –రాజీలేని పోరాటాల ద్వారానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం* –చలో జర్నలిస్టుల రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆందోళన కార్యక్రమం* —జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కి వినతి పత్రం సమర్పణ*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 19 : తెలంగాణ కోసం ఓవైపు అక్షర పోరాటం చేశాం.. మరోవైపు ఉద్యమంలో పాలుపంచుకున్నాం.. తెలంగాణ వచ్చింది.. ప్రభుత్వాలు మారాయి.. కానీ జర్నలిస్టుల మా రాత మాత్రం మారలేదు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా జర్నలిస్టుల బతుకులు తెల్లారుతున్నాయి.. ఇంకా ఎంతకాలం వేడుక చూస్తారు.. అంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వం పైనా, అధికారుల పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులు, విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కోరుతూ బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.అధ్యక్షుడు శేరిబాయి గణేష్ కార్యదర్శి మైల సైదులు మాట్లాడుతూ రెండేళ్లు దాటిన ఇప్పటిదాకా జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్లతో కాలక్షేపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీనివల్ల జర్నలిస్టు వృత్తి నుంచి తొలగించబడిన వ్యక్తులు కార్డులు ఉపయోగించుకుంటుండగా, కొత్త జర్నలిస్టులకు ఇప్పటివరకు కార్డులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులు, డి పి ఆర్ ఓలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా అక్రిడియేషన్ కార్డులు ఇచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలల్లో ఫీజు రాయితీ విషయంలోనూ డీఈవో లేఖలు ఇచ్చిన ప్రైవేటు విద్యాసంస్థలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా రంగంలో ఉంటూ నాయకులకు సేవ చేస్తూ జర్నలిస్టులు సాధించింది ఏమీలేదని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇస్తామన్న ఆశలు కూడా నీరుగారిపోయాయని పేర్కొన్నారు. సమాజంలో అందరి బాగోగులను పట్టించుకుంటాం.. కానీ మన బాగోగులు ఎవరూ పట్టించుకోరు. జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్ దొందు దొందే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విషయంలో గత పది ఏళ్లలో బీఆర్ఎస్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జర్నలిస్టు కేపీ అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండేళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటివరకు జర్నలిస్టుల సమస్య ల గురించి ప్రస్తావన లేదని అన్నారు. జర్నలిస్టుల విషయంలో రెండు ప్రభుత్వాలు దొందు దొందే అన్నట్టు వ్యవహరించడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవచేసి జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా జర్నలిస్టుల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు తీర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకు వెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు..

E-పేపర్

కోఠి ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిండు గర్భిణీ మిస్సింగ్

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 కోఠి ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిండు గర్భిణీ మిస్సింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం , కాగజ్ ఘాట్ విలేజ్ నుండి భర్త శివకుమార్ మరియు తల్లి పారేష తో కలిసి నిన్న డెలివరీ కోసం కోఠి ప్రసూతి హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్వప్న (25) ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిపోయిన గర్భిణీ స్వప్న 24 గంటల్లో డెలివరీ ఉండగా కనిపించకండ వెళ్ళిపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు భర్త శివకుమార్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్న సుల్తాన్ బజార్ పోలీసులు.

E-పేపర్

ఆర్యాపురంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. సిపాయిల తిరుగుబాటు నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలు ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల ముత్యాల రాయుడు మిత్రమండలి,మేడా మహా మిత్రమండలి మరియు ముత్యాల రాయుడు మిత్రమండలి వాట్సాప్ గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రాజమహేంద్రవరం ఆర్యాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది సుంకర వెంకట భాస్కర రంగారావు అధ్యక్షత వహించగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను,ప్రముఖ చరిత్రకారులు,రాజమహేంద్రవరం ఎస్. కే.వి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ పాలపర్తి ఎబెల్ రాజబాబు ముఖ్యఅతిథిగాను విచ్చేశారు. న్యాయవాది పలివెల వీర్రాజు,వ్యాపారవేత్తలు కోటిపల్లి కేశవ, హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ న్యాయవాది మరియు ముత్యాల రాయుడు మిత్రమండలి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పేడూరి అంబేద్కర్ తొలుత స్వాగతం పలకగా న్యాయవాది నామన సీతారాం చివరిగా వందన సమర్పణ చేసినట్లు ఏజెన్సీ టైగర్ కీర్తిశేషులు ముత్యాల ముత్యాల రాయుడు మిత్రమండలి ప్రజా సంబంధాల అధికారి ఆనాపు లక్ష్మీనారాయణ అలియాస్ బాబి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ సౌజన్యంతో నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మేడా శ్రీనివాస్ ను డాక్టర్ రాజబాబు చేతులు మీదుగా ఘనంగా సత్కరించినట్లు బాబి తెలిపారు. END

E-పేపర్

వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమo

వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమo రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి ఓబులవారిపల్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఓబులవారిపల్లె మండలం వై కోట పంచాయతి నందు జరిగినది. ,మాజీ జెడ్పిటిసి మాజీ టూరిజం డైరెక్టర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తుచేశారు,గత జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి అని ,ఈ ప్రభుత్వం పేదలు అంటే చులకన గా చూస్తుంది అని, నెలల తరబడి ఆఫీస్ లు చుట్టూ తిరుగుతున్నా కూడా పనులు కావటం లేదు అని గుర్తు చేశారు,ఆంధ్రప్రదేశ్ రాష్టం కలిసి ఉన్నపుడు మెడికల్ కాలేజీలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో వచ్చాయని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు వైద్యం అందాలని, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో ఎక్కువ అయ్యాయని, వాటిలో పేదలు ఖర్చు భరించలేరని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేయించారని, ఐదు మెడికల్ కళాశాలను పూర్తి చేయగా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేట్ పరం చేయాలి అని చూస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి కట్టిగా పోరాడాలి అని గుర్తుచేశారు దానిలో భాగంగా కోటి సంతకాలు చేసి గవర్నర్ కి సమర్పించాలి అని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మల్లెం ఈశ్వరయ్య,కో ఆప్షన్ నంబర్ మౌల,చింతకుంట గురవయ్య, గడ్డం రఘురామయ్య ,గడ్డం వెంకటేష్ ,మల్లెం దేశయ ,మారే సుకుమార్,మాచినేని శంకర ,సూరాల చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.