Sunday, 7 December 2025

Blog

రంగారెడ్డి

*బీజేపీ, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరికలు –అగర్ మియగూడ నుంచి తరలివచ్చిన మహిళలు –మంచి అభ్యర్థులను ఎన్నుకోండి: లక్ష్మారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 : మహేశ్వరం నియోజకవర్గంలో భారీగా బీజేపీ, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. శనివారం కందుకూరు మండలం అగర్ మియగూడ నుంచి మహిళలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.అగర్ మియగూడ సీనియర్ నాయకులు ఈర్లపల్లి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తుక్కుగూడ కార్యాలయంలో కేరళ సమక్షంలో చేరారు.బీజేపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ వార్డు మెంబర్ నీరటి రమేష్ ముదిరాజ్, నరసింహా, లక్ష్మమ్మ సహా పలువురు నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కిచ్చెన్న ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… గ్రామాభివృద్ధి అధికారంలో ఉన్న హస్తం పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మంచి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు పెద్దసంఖ్యలో మహిళలు, యువకులు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరటం సంతోషమన్నారు. నిలబెట్టిన సర్పంచ్, వార్డు సభ్యులందరినీ భారీ మేజార్టీతో గెలిపించుకుంటామని నినాదించారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల నాయకులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*ఎంఐఎం మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు – ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి –బడంగ్ పెట్ ను ప్రత్యేక జోన్ గా వెంటనే ప్రకటించాలి – శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలనం చేస్తూ వాటికి జోన్ లను కేటాయిస్తూ విడుదలైనటువంటి జీవోలో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను సౌత్ జోన్ లో ఉన్నటువంటి చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శనివారం కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీర కర్ణ రెడ్డి ల ఆధ్వర్యంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బడంగ్పేట్ కో బచావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, బిజెపి పార్లమెంట్ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని… మెజారిటీ ప్రజల అభిప్రాయానికి గౌరవించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ బడంగ్ పేటను చార్మినార్ లో విలీనం చేయడం ద్వారా మరో 20 సంవత్సరాలు మన ప్రాంతం వెనుకబడుతుందని ఎలాంటి అభివృద్ధికి నోచుకోమని తెలిపారు. పాతబస్తీ లోని హిందువులందరూ అక్కడి బాధలు భరించలేక ఈ ప్రాంతంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని మళ్లీ ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి చార్మినార్ లో కలిపి వారి మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ నాయకులు, వివిధ కాలనీ అధ్యక్షులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలిపారు.

రంగారెడ్డి

*ఎంఐఎం మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు – ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి –బడంగ్ పెట్ ను ప్రత్యేక జోన్ గా వెంటనే ప్రకటించాలి – శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలనం చేస్తూ వాటికి జోన్ లను కేటాయిస్తూ విడుదలైనటువంటి జీవోలో భాగంగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను సౌత్ జోన్ లో ఉన్నటువంటి చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శనివారం కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీర కర్ణ రెడ్డి ల ఆధ్వర్యంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బడంగ్పేట్ కో బచావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, బిజెపి పార్లమెంట్ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని… మెజారిటీ ప్రజల అభిప్రాయానికి గౌరవించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ బడంగ్ పేటను చార్మినార్ లో విలీనం చేయడం ద్వారా మరో 20 సంవత్సరాలు మన ప్రాంతం వెనుకబడుతుందని ఎలాంటి అభివృద్ధికి నోచుకోమని తెలిపారు. పాతబస్తీ లోని హిందువులందరూ అక్కడి బాధలు భరించలేక ఈ ప్రాంతంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని మళ్లీ ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి చార్మినార్ లో కలిపి వారి మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే బడంగ్ పేట్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ నాయకులు, వివిధ కాలనీ అధ్యక్షులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలిపారు.

రంగారెడ్డి

*అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 : మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ గ్రామం లోని చప్పిడి అడవి రెడ్డి గార్డెన్ లో బంగారు శ్రీకాంత్ అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి మహా పడిపూజను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరై అయ్యప్ప స్వామి వారికి ఎంతో వైభోపేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రామిడి వీర కర్ణ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర నాయకులు శూరకర్ణ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్ బంగారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

గూడూరు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాల ఘన నివాళి

గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక సమానత్వ పోరాట యోధుడు, ప్రపంచ మేధావి అయిన స్వర్గీయ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకులు అధ్యాపకులు డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు తదితరులు మాట్లాడుతూ పేద వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని, ఆయన దేశానికి చేసిన సేవలు తరతరాలు గుర్తుంటాయని, స్వతంత్ర భారత మొదటి న్యాయశాఖ మంత్రిగ, రాజ్యాంగ రూప శిల్పిగ, సమాజ సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తిగ అంబేద్కర్ సేవలు ప్రశంసింపదగినవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సింహాద్రి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు కిరణ్మయి, కృపా కరుణ వాణి, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ శైలజ, శ్రీధర్ శర్మ, భీమవరపు లక్ష్మి, హిమబిందు, జనార్ధన్, శైలజ, శ్రీలత, ఉష, పద్మమ్మ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గూడూరు

బ్రేకింగ్ న్యూస్…వాకాడు ఎస్సై నాగబాబు బదిలీ నూతన ఎస్సైగా ఆర్.నిఖిల్ బాబు

వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నటువంటి నాగబాబు బదిలీ పైన వెళ్లారు ఆయన స్థానంలో వాకాడు స్టేషన్లోనే ట్రైనీ ఎస్సైగా ఉన్నటువంటి ఆర్.నిఖిల్ బాబు పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు… ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పాలన సాగిస్తోంది: మంత్రి పొంగులేటి

హైదరాబాద్ డిసెంబర్ (పున్నమి ప్రతి నిది) ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో కలిసి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏర్పాట్ల పురోగతిని వివరిస్తూ, పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, దాదాపు అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. 2035 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర వివరాలను ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రపంచానికి తెలియజేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతి, వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో చర్చించనున్నట్లు వెల్లడించారు. రేపు 7వ తేదీ సాయంత్రం ముందస్తుగా డ్రైవ్ రన్ నిర్వహించి, పూర్తిస్థాయి ప్రణాళికాబద్ధంగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచేలా ప్రభుత్వం నిర్వహించనుందని మంత్రి పేర్కొన్నారు. డిసెంబర్ 8న 2034 – 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఇండిగో విమానాల రద్దు ప్రభావం గ్లోబల్ సమ్మిట్‌పై ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వస్తున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేసి… ప్రపంచ దేశాలకు మన రాష్ట్ర ఔన్నత్యం, సామర్థ్యాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా చాటుదాం అని మంత్రి పిలుపునిచ్చారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఏపీ లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్థాపనకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ లో కళా, సాంస్కృతిక వైభవాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరింత వేగంగా సాగుతున్నాయి. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, శనివారం స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత, నాటక, నృత్య శిక్షణ సంస్థలు ఏర్పాటుచేయాలని సూచించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ కోల్పోయిన శిక్షణా సంస్థలను తిరిగి పునఃప్రతిష్టించాల్సిన అవసరముందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఆయన వెల్లడించిన దిశానిర్దేశం ప్రకారం, కళారూపాలను నేటి తరానికి చేరవేయడం, సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అలాగే భారతీయ సంగీతం మరియు నాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ముఖ్య లక్ష్యాలుగా పెట్టుకున్నారు. అనుబంధంగా, “సంగీతం, నాట్యం, నటన, జానపద కళల మధ్య సుస్థిర అనుబంధాన్ని కాపాడుకోవాలి” అని పేర్కొనగా, సంగీతపట్ల యువతలో ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో, “భారతీయ సంగీతం, కర్ణాటక సంగీతం” వంటి కళారూపాలను ప్రోత్సహించే సంకల్పం కూడా వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా, “కృష్ణవేణి సంగీత నీరాజనం” వేడుకను విజయవంతంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా, కళాకారుల ప్రోత్సాహం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, అలాగే సంగీత, నాటక అకాడమీలను ప్రబలంగా స్థాపించడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మరియు పర్యాటక శాఖ అధికారులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

51వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్‌గా మెట్ట దమయంతికి పదోన్నతి — మహిళా నాయకత్వానికి గుర్తింపుగా పార్టీ నిర్ణయం

51వ వార్డులో విశ్వసనీయత, క్రమశిక్షణ, ప్రజాసేవలకు ప్రతీకగా నిలిచిన మెట్ట దమయంతికి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక గుర్తింపు లభించింది. గతంలో 51వ వార్డు మహిళా ప్రెసిడెంట్‌గా పని చేసిన దమయంతి, మహిళల శ్రేయోభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వార్డు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందించారు. ఆమె నిబద్ధత, ప్రజాసేవ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా పరిశీలించి, 51వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్‌గా పదోన్నతి కల్పించింది. పార్టీ నాయకులు మాట్లాడుతూ— “మెట్ట దమయంతి పార్టీకి బలమైన శక్తి. అండదండలతో పని చేయకుండా ప్రజల్లో ఉండి సేవలందించిన నాయకురాలు. ఆమె సేవలే ఈ పదవికి అర్హతను తీసుకొచ్చాయి,” అని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన దమయంతి మాట్లాడుతూ— “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మరింత బలంగా, సమర్థంగా ప్రజల కోసం పనిచేస్తాను,” అని తెలిపారు. అదేవిధంగా, ఈ పదవి అందుకునేందుకు కారణమైన స్థానిక కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేకే రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా దమయంతి పదోన్నతిని హర్షిస్తూ, వార్డు అభివృద్ధిలో ఆమె నాయకత్వం మరింత దూకుడుగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్నమయ్య

చిట్వేలి ఎస్.ఐ.గా వినోద్ కుమార్ బాధ్యతల స్వీకరణ

-అన్నమయ్య ఎస్పీ ఆదేశాల మేరకు చిట్వేలికి కడప జిల్లా దువ్వూరు నుంచి బదిలీ -గతంలో పుల్లంపేటలో సమర్థవంతంగా పని చేసిన అధికారి రాకతో ప్రజల్లో హర్షం చిట్వేలి, డిసెంబర్ 6: ఎల్లో సింగం ప్రతినిధి చిట్వేలి మండలంలో నూతన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా ఎస్. వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం, డిసెంబర్ 6, 2025న సరిగ్గా ఉదయం 11:00 గంటల సమయంలో ఆయన చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధుల్లో చేరారు. -బదిలీ నేపథ్యం: ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వినోద్ కుమార్ , గతంలో కడప జిల్లాలోని దువ్వూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై చిట్వేలికి రావడం జరిగింది. చిట్వేలి పోలీస్ స్టేషన్ పరిధి విస్తృతంగా ఉండటం, ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ సవాలుతో కూడుకున్నది కావడంతో, సమర్థవంతమైన అధికారిని నియమించాలనే ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు ఈ బదిలీని చేపట్టినట్లు సమాచారం. -గతంలో నిక్కచ్చిగా విధులు: ఎస్ఐ వినోద్ కుమార్ గతంలో విధులు నిర్వహించిన ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గతంలో పుల్లంపేట పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన నిక్కచ్చిగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించినట్లుగా స్థానిక పోలీస్ సిబ్బంది, సాధారణ ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.ఆయన పనితీరు, ప్రజలతో స్నేహపూర్వక విధానం, కానీ చట్టాన్ని అమలు చేయడంలో ఏమాత్రం రాజీ పడకపోవడం వంటి లక్షణాల కారణంగా పుల్లంపేట ప్రాంతంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని అక్కడి ప్రజలు తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అనుభవం, సమర్థత కలిగిన అధికారి చిట్వేలికి రావడం పట్ల ఇక్కడి పోలీస్ సిబ్బందితో పాటు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -రానున్న సవాళ్లు: నూతన ఎస్‌ఐ వినోద్ కుమార్ చిట్వేలి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను పటిష్టం చేయడంతో పాటు, స్థానిక సమస్యలు, యువతలో పెరుగుతున్న నేర ప్రవృత్తిని అరికట్టడం వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వినోద్ కుమార్ పలువురు పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.