Saturday, 19 July 2025

Blog

E-పేపర్

విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి

అన్నమయ్య జిల్లా: నందలూరు (మం) మండలం కుమ్మరపల్లె పొలాల్లో విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి… బహిర్భూమి కి వెళ్ళి వస్తుండగా అడవి పందుల కోసం తీసిన విద్యుత్ తీగ తగిలి మారెం సుబ్రమణ్యం (64) అనే వృద్ధుడు మృతి…. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు… దర్యాప్తు చేస్తున్న నందలూరు పోలీసులు…

తెలంగాణ పెద్దపల్లి

అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అంతర్గాం, జులై 17, పున్నమి ప్రతినిధి: పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అంతర్గాం మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పోట్యాల గ్రామంలోని ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, పాఠశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. పాఠశాలల్లోని పిల్లలకు విష జ్వరాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ‌పాఠశాలలకు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాల పాటు ఎటువంటి అవసరాలు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని, వాటిని వెను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్దిరాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారం అధికారులు అందించాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అంతర్గాం ఎంపీడీఓ వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, హౌసింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీ రాజ్ డీఈ అప్పల నాయుడు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

జులై 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఎంబీసి అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం

*జులై 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఎంబీసి అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం* *_పెద్దపల్లి జిల్లా బీసి అభివృద్ధి అధికారి జే.రంగారెడ్డి_* పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: ఈ నెల 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఆసక్తి, అర్హత గల ఎంబీసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతీ యువకుల కు వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమం 4 రోజుల పాటు హైదరాబాద్ లో అందించడం జరుగుతుందని అన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజన సదుపాయం, టీఏ, వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల వయసు లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలని, ఎంబిసి 36 కులాల వారికి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం అందుతుందని, వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు ఉండాలని అన్నారు. ఆసక్తి, అర్హత కల అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 21 లోపు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొని, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లతో దరఖాస్తు జత చేసి పెద్దపల్లి కలెక్టరేట్ లో ఉన్న బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జూలై 22 లోపు సమర్పించాలని, నిరుద్యోగ ఎంబీసీ యువతీ యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే. రంగారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ మెదక్

నర్సాపూర్: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

నర్సాపూర్: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నర్సాపూర్, జులై 17, పున్నమి ప్రతినిధి: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, కేంద్రంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల బాగోగులే తమ ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉండి, ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతుందనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుడు 600 స్క్వేర్ ఫీట్స్ లోపు ఇంటిని నిర్మించుకోవాలనీ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మహిళల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ, ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలు ఆర్థికంగా ముందుకు వస్తున్నారని, స్వయం శక్తితో, స్వయం ఉపాధిలో మహిళలు రాణిస్తూ చిన్నతరహా వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కుటుంబాలను ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

తెలంగాణ

తెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు

*తెలంగాణ: ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారు* హైదరాబాద్, పున్నమి ప్రతినిధి; తెలంగాణ ప్రభుత్వం జిల్లా పరిషత్ స్థానాలు, మండల పరిషత్ స్థానాలను ఖరారు చేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీటీసీ స్థానాలు మొత్తం 566 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 5,773 గా ఖరారు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సంఖ్యను ఫైనల్ చేసింది. 71 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5,817 నుండి 5,773 కు తగ్గింది. ఈ మార్పు ఇటీవల ఇంద్రేశం, జిన్నారం వంటి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కారణంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాలకు వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం గవర్నర్ కు పంపారు. గవర్నర్ సంతకం కాగానే ఈ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంచాయతీ రాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు ఎన్నికల ప్రక్రియను అధికారులు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. చివరిసారిగా 2019లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. 2019 ఎన్నికలలో, మొత్తం 538 జెడ్పీటీసీ లు, 5,817 ఎంపీటీసీ ల కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి మున్సిపాలిటీలు పెరిగినందున కౌన్సిలర్ సీట్లు పెరుగుతాయి. భారత రాజ్యాంగంలో 73, 74 వ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ వ్యవస్థ గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పాలకవర్గాలను కలిగి ఉంటుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉంటారు. ప్రతి మండలం ఒక జెడ్పీటీసీ నియోజకవర్గంగా పరిగణిస్తారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. జిల్లా పరిషత్‌లలో మైనారిటీల నుండి ఇద్దరు వ్యక్తులు జెడ్పీటీసీ లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమించవచ్చు. ఎంపీటీసీ సభ్యులు కూడా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. వీరు మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. 2019లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 534 జెడ్పీటీసీ స్థానాలలో 446, 5,800 ఎంపీటీసీ స్థానాలలో 3,556 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 76 జెడ్పీటీసీ, 1,377 ఎంపీటీసీ స్థానాలను గెలిచింది. బీజేపీ 8 జెడ్పీటీసీ, 211 ఎంపీటీసీ స్థానాలను గెలిచింది.

యాదాద్రి భువనగిరి

భవిష్యత్తు తరాలకు ఆలోచన

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య భువనగిరి పట్టణంలో పుస్తక ప్రదర్శనలు భవిష్యత్తు తరాలకు ఆలోచనకు చరిత్రలకు నిజాలకు సాక్ష్యాలు పుస్తకాలు, అట్లనే విద్యార్థులు ప్రజలు పుస్తకాలను చదువుతు గ్రామాలలో లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసే విధంగా నాయకులు, ప్రజలు మరియు స్థానిక ఎంఎస్ఏ,మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చొరవ తీసుకొని తీసుకొని ప్రజల్లో మార్పు దిశగా అడుగులు వేయించాలని ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రావుల శశి కిరణ్, ముస్కాన్, సోమ శివ,ఉదయ్, తెలియచేశారు

యాదాద్రి భువనగిరి

మినర్వా కాపీ బ్లూ ఫాక్స్ హోటల్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు

పున్నమి ప్రతినిధి సిద్దయ్య యాదాద్రి భువనగిరి జిల్లా లో మినర్వా కాపీ బ్లూ ఫాక్స్ హోటల్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అరూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వలిగొండ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

నిజాలకు సాక్షాలు పుస్తకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య భువనగిరి పట్టణంలో పుస్తక ప్రదర్శనలు భవిష్యత్తు తరాలకు ఆలోచనకు చరిత్రలకు నిజాలకు సాక్ష్యాలు పుస్తకాలు, అట్లనే విద్యార్థులు ప్రజలు పుస్తకాలను చదువుతు గ్రామాలలో లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసే విధంగా నాయకులు, ప్రజలు మరియు స్థానిక ఎంఎస్ఏ,మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చొరవ తీసుకొని తీసుకొని ప్రజల్లో మార్పు దిశగా అడుగులు వేయించాలని ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రావుల శశి కిరణ్, ముస్కాన్, సోమ శివ,ఉదయ్, తెలియచేశారు

ఆంధ్రప్రదేశ్

ఇచ్చోడ మండల్ మొట్టమొదటి ఎంపీపీ డుక్రై సుభాష్ పాటిల్ ఆరోగ్యంతో కన్నుమూత.

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మొట్టమొదటి ఎంపీపీగా ఐదు సంవత్సరాలు విశేషంగా ఇచ్చోడ మండల ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎంపీపీగా నిరంతరంగా ప్రజల కోసం పేద బడుగు బలహీనమరాల కోసం ప్రజలే నా దేవుళ్ళు సాదాసీదాగా అందరితో కలుపు మెలుపుగా ఉండే సుభాష్ పాటిల్ బుధవారం సాయంత్రం అనారోగ్యంతో బాధపడుతూ ఇచ్చోడ మండలంలోని అయనా సొంత గ్రామమైన ధరంపురిలోనీ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాయన పూర్తిగా ఆరోగ్యం క్షమించడంతో ఆయన కన్నుమూశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1987లో ఆనాటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభంజనంలో1987లో మొట్టమొదటి నూతనంగా కొత్తగా ఏర్పడిన మండల వ్యవస్థను 1987లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసిన ఆ ఏడాది మండల అధ్యక్షులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగినవి. 1987 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన మండల వ్యవస్థలో మొట్టమొదటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా సుభాష్ పాటిల్ భారీ మెజారిటీతో ఇచ్చోడా మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ లో మండలం నుంచి ప్రత్యక్ష మండల ప్రజా ప్రతినిధిగా ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ లో కీలకపాత్ర వహించారు. ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కి సన్నిహితుడుగా నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి డుకురే సుభాష్ పాటిల్ 1987 నుంచి 1992 వరకు ఐదు సంవత్సరాలు ఇచ్చాడా మండల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేసి పేద బడుగు బలహీన ప్రజలలో మంచి పేరు సంపాదించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అనంతరం వ్యాపార రంగంలో అడుగుపెట్టిన సుభాష్ పాటిల్ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం గత పది సంవత్సరాల క్రితం చురుకుగా రాజకీయాలకు లో పాల్గొంటున్న ఆయన. ఇటు వల్లి ఆరోగ్యం సహకరించకపోవడంతో కిడ్నీ తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. అయినా మృతి పట్ల జిల్లాలోని పలువురు తెలుగుదేశంలో పనిచేస్తూ ప్రస్తుతము కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపిలో పనిచేస్తున్న ఆయన కొలీగ్స్ మిత్రులు బంధువులు స్నేహితులు అభిమానులు మండల ప్రజలు అభిమానాలు చిరుగున్న గొప్ప మహోన్నత వ్యక్తి ఎప్పుడు అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ పలుకుతూ ఈనాడు ఎవరికి అని తలపెట్టిన గొప్ప రాజయ్య దురదరుడు సుభాష్పాటి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అయినా తోటి స్నేహితుల మిత్రులు అభిమానులను నెమరుసుకున్నారు. సుభాష్ పార్టీలకు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోస్టులు మoజూరు చేయండి

ముధోల్, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్లో ప్రారంభం అయినా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2024 సంవత్సరంలో 54 విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. 8మంది అతిథి అధ్యాపకుల నియామకం జరిగింది. ఈ సంవత్సరo కుడా అధ్యాపకుల సహకారంతో ఫేస్ 3 వరకు 86 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. కానీ ఇప్పట్టి వరకు అధ్యాపకులకు పర్మిషన్ ఇవ్వలేదు. అడ్మిషన్స్ షెడ్యూల్ ప్రకారం క్లాస్ లు ప్రారంభమయ్యాయి. అధ్యాపకుల నియామకంలో ఆలస్యం వలన విద్యార్థులు నష్టపోతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవోలో ముధోల్ డిగ్రీ కళాశాల కు పోస్ట్ లు మంజూరు చేయలేదు. దీని వలన ఇక్కడ ఉన్న అధ్యాపకులకు విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కమీషనర్ వెంటనే స్పందించి ముధోల్ కళాశాలకు పోస్ట్ లు-నిధులు విడుదల చేయాలని ముధోల్ వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ కి స్థానిక నాయకులు ఫోన్ చేసి వివరించారు. ఎమ్మెల్యే కూడా ఈ విషయం పై ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్య పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.