కామారెడ్డి
కామారెడ్డి, 03 డిసెంబర్, పున్నమి ప్రతినిధి. : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల ప్రభుత్వ పాఠశాలలో ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ అవగాహన సదస్సుకు పోలీసు సబ్ ఇంటెన్డెంట్ ఎసై సిద్ధిక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సిద్ధిక్ మాట్లాడుతూ, నేటి యువత ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ మత్తులో తమ జీవితాన్ని చిత్తు చేయడం చాలా బాధాకరమని, ఈ వ్యసనాల నుండి బయటపడేందుకు ప్రతి ఒక్కరు కదలివచ్చి కృషి చేయాల్సిన అవసరం వుంది అన్నారు.కామారెడ్డి జిల్లాను డ్రగ్ రహిత జిల్లా చేయాలని కోరుతూ, యోగా, ధ్యానం, క్రీడల ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవాలని, కళాశాలల యాజమాన్యాలు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు.మత్తుపదార్ధాల బారినపడిన వారికి చికిత్స అందించే డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసినట్లు, వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్యం, కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు.కార్యक्रमం ముగింపులో విద్యార్థులు మాదకద్రవ్య ముక్త సమాజం కోసం ప్రతిజ్ఞ చేసుకున్నారు. కార్యక్రమంలో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ ప్రతినిధులు చరణ్, రాజు, నవీన్, పాఠశాల బృందం, గ్రామస్థులు బాలాజీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.