Tuesday, 17 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో యువతి ఆత్మహత్య

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో షేక్ కుబ్రా18 అనే వివాహిత అత్మహత్యకు.పాల్పడింది ఏడు నెలల క్రితం నందిపాడుకు చెందిన మహ్మద్ రఫీ అనే యువకుడితో వివాహం జరిగినట్టు సమాచారం ఈ మేరకు దుత్తలూరు ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

తెలంగాణ

మండల విహాన్ ప్రబోధ్ జన్మదిన సందర్భంగా బద్దిపడగ అంగన్వాడి కేంద్రానికి బహుమతిగా సీలింగ్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలకు మండల గణేష్ కళ్యాణి గారు తమ కుమారుడు మండల విహాన్ ప్రబోధ్ జన్మదిన సందర్భంగా అంగన్వాడి కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ బహుమతిగా ఇవ్వడం జరిగింది

E-పేపర్

దక్షిణాఫ్రికా దూకుడు – భారత్ ఓటమి

దక్షిణాఫ్రికా జట్టు భారత్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఇచ్చిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు సమర్థంగా చేదించింది. కీలక సమయాల్లో ఆఫ్రికా బ్యాట్స్‌మెన్ స్థిరంగా ఆడటంతో మ్యాచ్ తమ వైపుకు మళ్లించగలిగారు. భారత్ పక్షాన కొన్ని ఆసక్తికరమైన ప్రదర్శనలు ఉన్నప్పటికీ, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడం, రన్‌రేట్ తగ్గడం ఫలితంపై ప్రభావం చూపాయి. చివరికి నిర్ణయాత్మక సందర్భాల్లో దక్షిణాఫ్రికా ఆధిక్యం ప్రదర్శించి మ్యాచ్‌ను గెలుచుకుంది.

తెలంగాణ

త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్తుకు మొదటి అడుగు అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ బిల్డింగ్ రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు. ఆడబిడ్డ చదువు ఇంటికి వెలుగని, బాలికలకు ప్రేమ, శ్రద్ధలతో, నాణ్యమైన విద్య అందించాలన్నారు.

విశాఖపట్నం

కైలాసపురం ధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష ముగింపు – 40 రోజుల పాటు భవ్య అన్నదాన సేవ

కైలాసపురం శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో గత నలభై రోజులుగా మండల దీక్షలో పాల్గొన్న భక్తులకు ప్రతిదినం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భవ్యంగా నిర్వహించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఉన్నతాధికారుల సహకారం, ఆలయ కమిటీ సభ్యుల కృషి, దీక్షబూనిన పీఠం స్వాముల నిరంతర సేవలతో ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. నేటితో ఈ 40 రోజుల అన్నదాన సేవ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పీఠం గురుస్వామి మాట్లాడుతూ— విశాఖ పోర్ట్ యాజమాన్యం, అధికారుల సహకారం వల్ల నీరు, విద్యుత్తు, వెలుగులు వంటి అవసరమైన సౌకర్యాలు నిరంతరంగా అందుబాటులో ఉన్నాయని, వారి అబిరామ పర్యవేక్షణతో కార్యక్రమ ప్రతిష్ట మరింత పెరిగిందని తెలిపారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, పీఠం స్వాములు తమదైన శైలిలో సేవలందించి మండల దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించిన మరికొందరు భక్తులు అయ్యప్ప కృపకు పాత్రులయ్యారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవిత్ర సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కార్యాచరణ వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. కైలాసపురంలో ఆధ్యాత్మికత, సేవాస్ఫూర్తి, భక్తి భావాల సమ్మిళితంతో సాగిన ఈ మండల దీక్ష—అన్నదాన కార్యక్రమం స్థానిక భక్తులకు చిరస్మరణీయంగా నిలిచింది.

కామారెడ్డి

మాదకద్రవ్య నిర్మూలనలో యువతదే ముఖ పాత్ర

కామారెడ్డి, 03 డిసెంబర్, పున్నమి ప్రతినిధి. : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల ప్రభుత్వ పాఠశాలలో ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ అవగాహన సదస్సుకు పోలీసు సబ్ ఇంటెన్డెంట్ ఎసై సిద్ధిక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సిద్ధిక్ మాట్లాడుతూ, నేటి యువత ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ మత్తులో తమ జీవితాన్ని చిత్తు చేయడం చాలా బాధాకరమని, ఈ వ్యసనాల నుండి బయటపడేందుకు ప్రతి ఒక్కరు కదలివచ్చి కృషి చేయాల్సిన అవసరం వుంది అన్నారు.కామారెడ్డి జిల్లాను డ్రగ్ రహిత జిల్లా చేయాలని కోరుతూ, యోగా, ధ్యానం, క్రీడల ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవాలని, కళాశాలల యాజమాన్యాలు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు.మత్తుపదార్ధాల బారినపడిన వారికి చికిత్స అందించే డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసినట్లు, వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్యం, కౌన్సిలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు.కార్యक्रमం ముగింపులో విద్యార్థులు మాదకద్రవ్య ముక్త సమాజం కోసం ప్రతిజ్ఞ చేసుకున్నారు. కార్యక్రమంలో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ ప్రతినిధులు చరణ్, రాజు, నవీన్, పాఠశాల బృందం, గ్రామస్థులు బాలాజీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో డిఫెన్స్ క్లస్టర్ పరిశీలన గట్టి పట్టు ఎంపీ కేశినేని చిన్ని సూచనపై బిడిఎల్ ఉన్నతాధికారుల పర్యటన

జగ్గయ్యపేట నియోజకవర్గంలో డిఫెన్స్ క్లస్టర్ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సూచన మేరకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బిడిఎల్ సిఎండి ఏ. మాధవరావు, జిఎం ఎన్. సత్యనారాయణ, ఏపీఐఐసీ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. వారి బృందం వేదాద్రి, జయంతిపురం పరిసర ప్రాంతాల్లో డిఫెన్స్ క్లస్టర్‌కు అనువైన భూభాగాలను సమగ్రంగా పరిశీలించింది. భూస్తితి, రోడ్ కనెక్టివిటీ, నీటి లభ్యత, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు వంటి అంశాలను అధికారులు ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. డిఫెన్స్ అధికారులు మాట్లాడుతూ, “ప్రాంతంలోని అన్ని భూములను పూర్తిగా పరిశీలించాము. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక అంశాలను విశ్లేషిస్తున్నాము. సాంకేతిక మూల్యాంకనం అనంతరం తదుపరి చర్యలు ప్రారంభిస్తాము,” అని తెలిపారు. అలాగే ప్రాథమిక పరీక్షలతో పాటు భూసామర్థ్య నిర్ధారణ కోసం సాయిల్ టెస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించామని, రాబోయే 15 రోజుల్లో సాంకేతిక బృందాలు తిరిగి వచ్చి మరిన్ని లోతైన పరిశీలనలు చేస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ, “డిఫెన్స్ క్లస్టర్‌తో జగ్గయ్యపేట పరిశ్రమల కేంద్రంగా మారుతుంది. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది,” అని అన్నారు. డిఫెన్స్ శాఖ వేగంగా స్పందించి పరిశీలనకు రావడం ప్రభుత్వాల మధ్య సమన్వయపూర్వక కృషి ప్రతిఫలమని తెలిపారు. ఈ మహత్తర ప్రాజెక్ట్ జగ్గయ్యపేటకు రావడంలో కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, తహసీల్దార్ మనోహర్, ఎంపీ కార్యాలయం నుండి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Blog

కూలీలకు భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి

కూలీలకు భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు దీత్వా తుఫాన్ కారణముగా రైల్వే కోడూరులో 6 రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు రోజువారి కులిలు పనులు లేక రెక్క ఆడితే గాని డొక్క ఆడని పరిస్థుతుల్లో ఉన్నా నిరు పేడలకు రైల్వే కోడూరు లోని ఓంటెలనగర్కు చెండిన నిరుపేద కుటుంబలకు భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మండల నాగేంద్ర మరియు కమిటి సభ్యులు అధ్వర్యంలో సుమరు 50 మంధికి భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి ఈకార్యక్రమములోపాల్గోనవారు చెన్నంశెట్టి రమేష్ బాబు, వాస బాబు, కొప్పల శంకరయ్య తన్నీర్ ఆంజనేయులు, పెనుకొండ సుబ్బరాయుడు, శేఖర్ చెన్నంశెట్టి పురుషోత్తం తధితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

బిటెక్ విద్యార్థిని హారికకు ఆర్యవైశ్య సంఘం సాయం – ₹66,987 అందజేత

నందిగామ, డిసెంబర్ 3: వాసవి మాత విద్యాసేవ కార్యక్రమం లో భాగంగా ఆర్యవైశ్య సంఘం–నందిగామ ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థిని కి ఆర్థిక సహాయం అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం బొబ్బెళ్ళపాడు గ్రామానికి చెందిన **కటకం హారిక (19)**కు చదువుల నిమిత్తం ₹66,987ను సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు ఈరోజు ఆమె ఇంటిలోనే స్వయంగా వెళ్లి అందజేశారు. హారిక తల్లిదండ్రులు ఆ గ్రామంలో చిన్న ఇడ్లీ హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విద్యలో ప్రతిభ కనబరుస్తూ మంచి మార్కులు సాధిస్తున్న హారిక బీటెక్ చదువు కొనసాగించాలన్న పట్టుదల ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలం కాక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న ఆర్యవైశ్య సంఘం ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొబ్బెళ్ళపాటి సాయి, నందిగామ ఆర్యవైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు రాజారావు, ప్రధాన కార్యదర్శి నాళ్ల చిన సత్యంబాబు, సంఘ ప్రముఖులు మారం అమరయ్య, పులిపాటి శ్రీనివాస్, పబ్బతి జనార్దనరావు, చవట సుధాకర్, మొరిశెట్టి చైతన్య, చక్కా రాధాకృష్ణ, బిట్టు రమేష్, తిప్పారెడ్డి వేణు మాధవ్ రెడ్డి, కటకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

కూలీలకు భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి

కూలీలకు భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు దీత్వా తుఫాన్ కారణముగా రైల్వే కోడూరులో 6 రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు రోజువారి కులిలు పనులు లేక రెక్క ఆడితే గాని డొక్క ఆడని పరిస్థుతుల్లో ఉన్నా నిరు పేడలకు రైల్వే కోడూరు లోని ఓంటెలనగర్కు చెండిన నిరుపేద కుటుంబలకు భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మండల నాగేంద్ర మరియు కమిటి సభ్యులు అధ్వర్యంలో సుమరు 50 మంధికి భోజనం ప్యాకెట్ లను పంపిని చేసిన భోళా శంకర్ సేవా సమితి ఈకార్యక్రమములోపాల్గోనవారు చెన్నంశెట్టి రమేష్ బాబు, వాస బాబు, కొప్పల శంకరయ్య తన్నీర్ ఆంజనేయులు, పెనుకొండ సుబ్బరాయుడు, శేఖర్ చెన్నంశెట్టి పురుషోత్తం తధితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.