Monday, 16 March 2026

Blog

E-పేపర్

జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన

జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు గడచిన కొన్ని రోజులుగా రైల్వే కోడూరు ప్రాంతంలో భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాల వలన గురువారము పంచాయతీ వెనుక భాగంలో ఉన్న తోటి కార్మికుల ఇళ్లలోకి వర్షము నీరు అధికంగా ప్రవేశించడంతో ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి కోనేటి అమర్నాథ్ వెంటనే పిల్లలను, ముసలి వారిని తాత్కాలికముగా ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించి వారికి భోజన వసతి సదుపాయం కల్పించారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరవ శ్రీధర్, సబ్ కలెక్టర్ భావన,ప్రతి ఇంటిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ వీరికి ప్రభుత్వ పాఠశాల కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రి పైభాగం ఫ్లోర్అంతా ఖాళీగా ఉన్నదని అక్కడికి కొంతమందిని తరలించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. మరలా రేపు ఉదయం వచ్చి అందరు సమస్యలు తీరుస్తానని తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయంలో వినతి పత్రం ఇచ్చానని తెలిపారు. రాజంపేట భౌగోళికంగా బ్రిటిష్ కాలం నాటి భవనాలు, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, దూరం తక్కువ రాజంపేట,రైల్వే కోడూరు ప్రజల రాజంపేట జిల్లా ఆకాంక్ష నెరవేర్చాలని ఉపముఖ్యమంత్రిని కోరానని ఆయన స్పందించారనితెలిపారు.సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడుతూ గత వై 60 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్నామని ప్రభుత్వాలు మారిన, మా బతుకులు మారలేదని మాకు ఇక్కడే నివాసం ఉండేదానికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని వారిదృష్టికి వారితీసుకెళ్లారు. మండల రెవెన్యూ అధికారి అమర్నాథ్ మాట్లాడుతూ ఈ కాలనీ వారికందరికీ బయట ఇళ్ల స్థలం మంజూరు చేసి ఉన్నారని తెలిపారు. వీరు అక్కడికి వెళ్లే దానికి సుఖముఖముగా లేరని అన్ని వసతులు వసతులుకల్పిస్తామని తెలిపారు. నూతన పంచాయతీ కార్యాలయం నిర్మించుకునే దానికి కార్యాలయం నిర్మించుకునే ఈ స్థలమే అవసరమని అందువల్ల పట్టాల మంజూరు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పి రామకృష్ణ హెగ్డే,తెలుగుదేశం ఏఎస్పినాయకులు బత్యాల యువసేన నాయకులు పోతురాజు నవీన్, నార్జాల హేమరాజు, మైనారిటీ నాయకులు పటాన్ మౌలా, జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీదేవి, మాజీ జెడ్పిటిసి బండారు సుభద్రమ్మ, ఎన్డీఏ కోటమి నాయకులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఎన్నికల నియమ నిబంధనలు, నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలి

కామారెడ్డి, 04 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా గురువారం గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ను ఎన్నికల నియమ నిబంధన లు, నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుము దిని అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఎన్నిక ల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుము దిని అన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణ ఎన్నికల కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడు తూ, 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాల ని, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాల ని తెలిపారు. 3వ విడతలో నిర్వహించే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన, ఫారా లు జారీ చేయాలని, ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షం గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, ఫారం 14, 20 వినియో గం పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నామి నేషన్ల ప్రక్రియలో నెలకొన్న సమస్యలు, అందిన ఫిర్యాదుల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసు కోవాలని సూచించారు. నివేదికలు, టి – పోల్ ఎంట్రీలు, రికార్డులు, మిస్ మ్యాచ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ర్యాండమైజే షన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, స్టేజ్ 2 ఆర్. ఓ. ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని ,సర్పంచ్ స్థానాల ఎన్ని క మొదటి విడతలో (11 ) స్థానాలు ఏకగ్రీవం ,(156 ) స్థానాలలో పోలింగ్ నిర్వహించడం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ మదన్ మోహన్ , పంచాయ తీ అధికారి మురళీ, ఆర్డీఓ వీణ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందర్, సంబంధి త అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

87వ వార్డ్ పరిధిలో ముఖ్య మంత్రి సహాయానిది అందజేత….

87వ వార్డ్ పరిధిలో ముఖ్య మంత్రి సహాయానిది అందజేత…. విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం (జగన్). గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో గవరవీధి ప్రాంతానికి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యానికి భరోసాగా సిఎం సహాయనిది అండగా నిలుస్తుందని అందులో భాగంగా గత కొద్దీరోజుల క్రితం అనారోగ్యానికి గురై చికిత్స పొందిన కాండ్రేగుల శ్రీనివాసరావు కు 41048/- రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని. రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ రావు గారు ప్రత్యేక శ్రద్ధతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసి ఆమోదం పొందేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు,ప్రగడ దానయ్య, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ,ఆనంద్ కుమార్, కడుపుట్ల శ్రీను, గండేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అదనపు పీపీగా ప్రార్ధసారథి

అదనపు పీపీగా ప్రార్ధసారథి *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి* ఈరోజు ఐదోవ అదనపు జిల్లా న్యాయమూర్తి కం ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది కర్రి పార్థసారథి నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లా డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పదవిలో మూడేళ్లు విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా విశాఖ టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి,విశాఖ లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్,తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గం నాయకులు మానం శోభనబాబు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి లోడగల కృష్ణ మొదలగున వారు పార్థసారథిని పుష్పగుచ్చము మరియు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసితిరి.

విశాఖపట్నం

పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్*

*పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్* *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-* పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరి పై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కేఎం కీర్తన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అక్రిడేషన్ల మంజూరులో విధిస్తున్న షరతులకు నిరసనగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జాప్ విశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తన్ మాట్లాడుతూ ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా అక్రిడేషన్ కార్డులను పొడిగిస్తూ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా చిన్న పత్రికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబెట్టారు. ఎక్కడ ప్రింటింగ్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే అక్రిడేషన్లు మంజూరు చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో గతంలో మంజూరు చేసినట్లుగానే ఈ ఏడాది అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తే ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల సలహాలను తీసుకోవాలని కీర్తన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నిర్వహించే కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో చిన్న పత్రికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి విడనాడాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో అన్యాయం జరిగితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కీర్తన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జర్నలిస్టులను దారిద్యరేఖకు దిగువున ఉన్నవారిగా గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్రాలు ఇస్తున్న మాదిరిగా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి కే అప్పలరాజు,తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి!

సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి! *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి* పూర్ణ మార్కెట్ ఇసుక కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గురువారం నాడు మార్గశిర పౌర్ణమి వైభవంగా జరిగింది. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ ప్రధాన అర్చకులు పి నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4:00 గంటల నుండి భక్తులందరూ ముందుగా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి ఐదు ప్రదక్షణలు చేసినంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 167 సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగాయి. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం, స్వామి వారి ఫోటో, నూక ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ ఈఓ టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

విశాఖపట్నం

ఏ యూ లో విద్యార్థులు విలవిల : కాంగ్రెస్*

*ఏ యూ లో విద్యార్థులు విలవిల : కాంగ్రెస్* *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అధ్యక్షతన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి సునీల్ అహిరా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలు చోట్ల పర్యటించారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రీడింగ్ రూమ్ లో విద్యార్థులతో ఆయన మాట్లాడారు, విద్యార్థుల తమ గోడును ఆయనతో విన్నవించున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయట్లేదని, ఏళ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తునామని మా వయసు అయిపోతే మేము అర్హత కోల్పోతామని మా కలలు కలలుగానే మిగిలిపోతాయని, మా తల్లిదండ్రులు కూలి పనులు చేసుకొని మమల్ని చదివిస్తున్నారని, మాకు ఉద్యోగాలు రాకపోతే వారికి గుండే కోత మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు, మా సమస్యల పై పోరాడమని వారు విజ్ఞప్తి చేసారు. యూనివర్సిటీలో సదుపాయాలుతో క్లినిక్ లేకపోవడం, ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థి మరణం జరిగిందని పలువురు విద్యార్థులు చెప్పారు, దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరుగుతున్న మన రాష్ట్రంలో ఆంక్షలు విధించడం దుర్మార్గమని, విద్యార్థి సంఘం నాయకులు ఉంటే యూనివర్సిటీలో సమస్యల పై పలువురు విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు మార్టిన్ లూథెర్, అమర్ జహన్ భైగ్, పీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్, డీసీసీ కోఆర్డినేటర్ ఎల్ ఎన్ హాసిని వర్మ, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఆలీ, సీనియర్ నాయకులు చిన్నబాబు, డా విజయ్ చంద్రా, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్, సీనియర్ నాయకులు ఉమ్మిడి భాస్కర్, కాకినాడ చిన్నబాబు,అప్పారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రశ్నిస్తే చంపేస్తారా

– ప్రశ్నిస్తే చంపేస్తారా – బీసీ నాయకుడు విజయ్ భాస్కర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – విశాఖ వైసీపీ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబియాల విజయభాస్కర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు రవీంద్ర భరత్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీలపైన అనేక దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపకపోగా దాడులకి ప్రోత్సహించడం ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు బీసీలు నోరెత్తకూడదు అనే విధంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, చంపేస్తాం అని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా రాష్ట్రంలో బీసీలను అనగ తొక్కాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రానున్న రోజుల్లో తిప్పికొడతామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం గళం వినిపిస్తూ ఉంటామని, ప్రభుత్వం ఇటువంటి పిరికి చర్యలు మానుకోవాలని హితవు పలికారు ఇటువంటి చర్యలు ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఉదాహరణగా చెప్పొచ్చని భావించారు, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరు ప్రశ్నించినా ప్రచారం చేసిన వారిని టార్గెట్ చేసి ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం బీసీ అధ్యక్షులు బోండాడ వెంకటరమణ, 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి కంటుముచ్చు సాగర్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ బెవర మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ చోడిపల్లి శివ, 37వ వార్డు ఇన్చార్జి గనగళ్ళ రామరాజు, దక్షిణ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు ఆకుల శ్యామ్, 38వ వార్డు యువజన అధ్యక్షులు చాపల నూకరాజు, యలమంచిలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

చీటింగ్ కేసులో సదరం శివ( రిటైర్డ్ రైల్వే TTE) సదరం ప్రేమ్ సాగర్ తండ్రి కొడుకులు అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు

చీటింగ్ కేసులో సదరం శివ( రిటైర్డ్ రైల్వే TTE) సదరం ప్రేమ్ సాగర్ తండ్రి కొడుకులు అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * డబ్బులు ఆశ చూపి మాయమాటలతో మభ్యపెట్టి కే రమ్య రాజు అనే మహిళను ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఒక కోటి 97 లక్షలు నమ్మించి పెట్టుబడి పెట్టించారు. అవి వెనక్కి రాకపోగా ఆమె ఆ డబ్బులు కోసం సదరం ప్రేమ్ సాగర్ ని అడగగా ఇంకొంత డబ్బులు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు వెనక్కి వస్తాయని ఆమెను నమ్మించారు. ఆమె నా దగ్గర ఇంకా డబ్బులు లేవని చెప్పగా ఇంట్లో బంగారం ఉంటే తీసుకురమ్మని చెప్పగా ఆమె వారి మాటలు నమ్మి 75 తులాల బంగారం వారిద్దరూ ఆనంద్ అనే వ్యక్తి ద్వారా తాకట్టు పెట్టి మరల ఆ డబ్బుల్ని కాజేశారు. ఆమె పలుమార్లు డబ్బులు కోసం అడగగా ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేసేవారు. విషయం తెలుసుకున్న ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ ను రిమాండ్ కి తరలించారు.

విశాఖపట్నం

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:-* విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు, కార్యకర్తలను కలిసి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్ అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగిన మంత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని గ్రామానికి వెళ్లనున్న మంత్రి లోకేష్ సాయంత్రం భామిని గ్రామంలో పాలకొండ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి అనంతరం పాలకొండ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.