51వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా మెట్ట దమయంతికి పదోన్నతి — మహిళా నాయకత్వానికి గుర్తింపుగా పార్టీ నిర్ణయం
51వ వార్డులో విశ్వసనీయత, క్రమశిక్షణ, ప్రజాసేవలకు ప్రతీకగా నిలిచిన మెట్ట దమయంతికి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక గుర్తింపు లభించింది. గతంలో 51వ వార్డు మహిళా ప్రెసిడెంట్గా పని చేసిన దమయంతి, మహిళల శ్రేయోభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వార్డు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందించారు. ఆమె నిబద్ధత, ప్రజాసేవ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా పరిశీలించి, 51వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్గా పదోన్నతి కల్పించింది. పార్టీ నాయకులు మాట్లాడుతూ— “మెట్ట దమయంతి పార్టీకి బలమైన శక్తి. అండదండలతో పని చేయకుండా ప్రజల్లో ఉండి సేవలందించిన నాయకురాలు. ఆమె సేవలే ఈ పదవికి అర్హతను తీసుకొచ్చాయి,” అని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన దమయంతి మాట్లాడుతూ— “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మరింత బలంగా, సమర్థంగా ప్రజల కోసం పనిచేస్తాను,” అని తెలిపారు. అదేవిధంగా, ఈ పదవి అందుకునేందుకు కారణమైన స్థానిక కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేకే రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా దమయంతి పదోన్నతిని హర్షిస్తూ, వార్డు అభివృద్ధిలో ఆమె నాయకత్వం మరింత దూకుడుగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.










