Monday, 16 March 2026

Blog

విశాఖపట్నం

51వ వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్‌గా మెట్ట దమయంతికి పదోన్నతి — మహిళా నాయకత్వానికి గుర్తింపుగా పార్టీ నిర్ణయం

51వ వార్డులో విశ్వసనీయత, క్రమశిక్షణ, ప్రజాసేవలకు ప్రతీకగా నిలిచిన మెట్ట దమయంతికి వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక గుర్తింపు లభించింది. గతంలో 51వ వార్డు మహిళా ప్రెసిడెంట్‌గా పని చేసిన దమయంతి, మహిళల శ్రేయోభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వార్డు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందించారు. ఆమె నిబద్ధత, ప్రజాసేవ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా పరిశీలించి, 51వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్‌గా పదోన్నతి కల్పించింది. పార్టీ నాయకులు మాట్లాడుతూ— “మెట్ట దమయంతి పార్టీకి బలమైన శక్తి. అండదండలతో పని చేయకుండా ప్రజల్లో ఉండి సేవలందించిన నాయకురాలు. ఆమె సేవలే ఈ పదవికి అర్హతను తీసుకొచ్చాయి,” అని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన దమయంతి మాట్లాడుతూ— “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మరింత బలంగా, సమర్థంగా ప్రజల కోసం పనిచేస్తాను,” అని తెలిపారు. అదేవిధంగా, ఈ పదవి అందుకునేందుకు కారణమైన స్థానిక కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేకే రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా దమయంతి పదోన్నతిని హర్షిస్తూ, వార్డు అభివృద్ధిలో ఆమె నాయకత్వం మరింత దూకుడుగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్నమయ్య

చిట్వేలి ఎస్.ఐ.గా వినోద్ కుమార్ బాధ్యతల స్వీకరణ

-అన్నమయ్య ఎస్పీ ఆదేశాల మేరకు చిట్వేలికి కడప జిల్లా దువ్వూరు నుంచి బదిలీ -గతంలో పుల్లంపేటలో సమర్థవంతంగా పని చేసిన అధికారి రాకతో ప్రజల్లో హర్షం చిట్వేలి, డిసెంబర్ 6: ఎల్లో సింగం ప్రతినిధి చిట్వేలి మండలంలో నూతన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా ఎస్. వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం, డిసెంబర్ 6, 2025న సరిగ్గా ఉదయం 11:00 గంటల సమయంలో ఆయన చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధుల్లో చేరారు. -బదిలీ నేపథ్యం: ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వినోద్ కుమార్ , గతంలో కడప జిల్లాలోని దువ్వూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై చిట్వేలికి రావడం జరిగింది. చిట్వేలి పోలీస్ స్టేషన్ పరిధి విస్తృతంగా ఉండటం, ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ సవాలుతో కూడుకున్నది కావడంతో, సమర్థవంతమైన అధికారిని నియమించాలనే ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు ఈ బదిలీని చేపట్టినట్లు సమాచారం. -గతంలో నిక్కచ్చిగా విధులు: ఎస్ఐ వినోద్ కుమార్ గతంలో విధులు నిర్వహించిన ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గతంలో పుల్లంపేట పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన నిక్కచ్చిగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించినట్లుగా స్థానిక పోలీస్ సిబ్బంది, సాధారణ ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.ఆయన పనితీరు, ప్రజలతో స్నేహపూర్వక విధానం, కానీ చట్టాన్ని అమలు చేయడంలో ఏమాత్రం రాజీ పడకపోవడం వంటి లక్షణాల కారణంగా పుల్లంపేట ప్రాంతంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని అక్కడి ప్రజలు తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అనుభవం, సమర్థత కలిగిన అధికారి చిట్వేలికి రావడం పట్ల ఇక్కడి పోలీస్ సిబ్బందితో పాటు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -రానున్న సవాళ్లు: నూతన ఎస్‌ఐ వినోద్ కుమార్ చిట్వేలి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను పటిష్టం చేయడంతో పాటు, స్థానిక సమస్యలు, యువతలో పెరుగుతున్న నేర ప్రవృత్తిని అరికట్టడం వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వినోద్ కుమార్ పలువురు పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

రైతుల నీటి సమస్యపై ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య చర్యలు – పులిచింతల నుంచి నీటి విడుదల పెంచేందుకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ కృష్ణా జిల్లాలో సాగునీటి కొరత తీవ్రతను తగ్గించేందుకు రైతులు అనేక సమస్యలను ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా పంచాయతీ నుంచి రైతులు పేర్కొన్నట్లు, 2014-19మధ్యలో గుంటూరు జిల్లాలో చేపట్టిన జల రవాణా ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదిలోని ప్రవాహం గుంటూరు వైపు మళ్లిపోయింది. ఈ పరిణామం వల్ల కృష్ణా డెల్టా స్కీమ్లకు సరిపడా నీరు అందడం లేదు. రైతులు, అధికారులతో కలిసి, పశ్చిమ కృష్ణా సాగులో నీటి సమస్యను పరిష్కరించేందుకు పులిచింతల నుండి రోజుకు 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని, అలాగే ఎన్‌టి‌ఆర్ జిల్లాలో కృష్ణా నదిలో సప్లయ్ చానల్ నిర్మించాల్సిన అవసరం మీద దృష్టి పెట్టారు. తంగిరాల సౌమ్య, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, త్వరలో పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, 2014-19 కాలంలో నిలిచిపోయిన గుడిమెట్ల-3, కాసారబాద-3, బొబ్బిల్లపాడు చెరువులకు ఎత్తిపోతాల పథకాలను తిరిగి ఆమోదం పొందేందుకు APSIDC MD ను ఉత్తరం రాయాలని సూచించారు. ఈ సమావేశంలో నిత్యజీవిత సమస్యలపై చర్చించి, స్థానిక రైతులు, అధికారులు, నీటి సంఘాల చైర్మన్లు, APSIDC అధికారులు మరియు స్థానిక నాయకులు కలిసి పరిష్కార మార్గాలను విశ్లేషించారు. *ముఖ్య వ్యక్తులు:* •తంగిరాల సౌమ్య – ప్రభుత్వ విప్ • కోట వీరబాబు – నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఛైర్మన్ • APSIDC MD తిరుమలరావు • SE సుబ్రమణ్యం • APSIDC డైరెక్టర్ ఇందిరాప్రియ దర్శిని • కృష్ణా డెల్టా EE రవి.

E-పేపర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులు రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబటి రాధాకృష్ణ, నగరి పాటి చంగయ్య, గడ్డం శ్రీనివాసులు, మనీ, మహేష్, సుబ్బరాయుడు, ధనుష్, శేఖర్, చిన్న, ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో సత్కరించి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త ఆయన దేశానికి రాజ్యాంగం రచించి మహానుభావుడు ఆయన సూర్యుడు చంద్రుడు ఉన్నంతవరకు ఏ వ్యక్తి మర్చిపోలేని మరిచిపోని రాజ్యాంగం సృష్టించిన గొప్ప మేధావి ఆయన వర్ధంతి మేము జరుపుకోవటం మాకు దేవుడిచ్చిన వరమని కొన్ని ఆడారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో అంబేద్కర్ 69వ వర్ధంతి – జనసేన పార్టీ ఘన నివాళి

జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా: జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశముల మేరకు,భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రైతు బజారు సెంటర్ నందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, మున్సిపల్ ప్రతినిధులు, మరియు స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేననాయకులు, డా.బి.ఆర్.అంబేద్కర్ కృషిని స్మరించుకుంటూ, ఆయన రచించిన రాజ్యాంగం వలన దేశంలోని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నా రని తెలిపారు. వారు కులాలు, మతాలు అన్నీ సమానంగా ఉన్నాయనే సందేశాన్ని ప్రసారం చేసిన మహనీయునిగా అంబేద్కర్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ, మున్సిపల్ కౌన్సిలర్ కొలగాని రాము, జనసేన నాయకులు, ఇతర నాయకులు మరియు ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ ఆలోచనలు, ఆయ‌న చేసిన పోరాటాలు, సమాజంలో ప్రతిభావంతుల కోసం ఆయన ప్రోత్సాహం అందించిన గొప్పతనాన్ని ప్రజలు గుర్తు చేసుకున్నారు. *ప్రధాన పాల్గొనేవారు:* తుమ్మల ప్రభాకరరావు (జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్) తునికిపాటి శివ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్) కొలగాని రాము (మున్సిపల్ కౌన్సిలర్) ఈమని కిషోర్ కుమార్, ఆవాల భవాని ప్రసాద్, చిలుకూరి శ్రీనివాసరావు, కటారి హరిబాబు, తదితరులు. నివాళి కార్యక్రమంలో పాల్గొన్న మరికొందరు: గొల్లపూడి ముక్తేశ్వరరావు, జాగు జనార్ధన్, మహమ్మద్ జాన్ బాషా, న్యాయవాదులు గుంటక లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, పాల హరికృష్ణ, గొర్రెపాటి సుదర్శన్,తదితరులు. *ముగింపు:* ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ నాయకులు, అంబేద్కర్ గొప్పతనాన్ని మరింత బలపరిచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సముద్రాన్ని తలపిస్తున్న పొలాలను బోటులో పరిశీలించిన సోమిరెడ్డి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*సముద్రాన్ని తలపిస్తున్న పొలాలును అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మనుబోలు ప మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి* *కొలనకుదురులో నీటమునిగిన వరినాట్లు, నారుమడులను పరిశీలించడంతో పాటు జలదిగ్భందంలో ఉన్న ఎస్టీ కాలనీ సందర్శన* *కట్టువపల్లి, బద్దెవోలు తదితర గ్రామాల్లోనూ ప్రజలను పలకరించి వినతుల స్వీకరణ* *వేలాది ఎకరాల్లో వరినారు మడులు, నాట్లు దెబ్బతిన్నాయని, రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరినట్లు వెల్లడి* *నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా*

హైదరాబాద్

ఫుడ్ బిజినెస్ చేస్తున్నారా..? లైసెన్స్ ఉందా?

పున్నమి ప్రతి నిధి ఫుడ్ బిజినెస్ నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, క్యాటరింగ్, ఫుడ్ ప్యాకెజింగ్, ఫుడ్ ట్రాన్స్‌పోర్ట్ వంటి అనేక రంగాలకు సంబంధించిన వ్యాపారాలు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఫుడ్ వ్యాపారం చేస్తున్నట్లయితే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాపారం స్థాయి ఆధారంగా రిజిస్ట్రేషన్, స్టేట్ లైసెన్స్, సెంట్రల్ లైసెన్స్‌గా మూడు రకాల లైసెన్స్‌లు ఉంటాయని తెలిపారు. చిన్న వ్యాపారులు వార్షిక టర్నోవర్ ఆధారంగా సాధారణ రిజిస్ట్రేషన్ చేసుకోగా, పెద్ద వ్యాపారాలు స్టేట్ లేదా సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా లైసెన్స్‌లకు నిర్ణీత రుసుములు ఉన్నాయని, నిబంధనలు పాటించకుండా ఫుడ్ ఉత్పత్తులు విక్రయిస్తే రూ.2,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణలో భాగంగానే ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని, ఫుడ్ వ్యాపారాలు నిర్వహించే వారు వెంటనే తమ లైసెన్స్‌లను సక్రమంగా పొందాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు కరెంట్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషి అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ మనుబోలు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు మనుబోలు కరెంట్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

E-పేపర్

కే ఎస్ యు ఎఫ్ . ఆధ్వర్యంలో టోల్గేట్ దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ బహిరంగ ర్యాలీని

రైల్వేకోడూరు స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ కే ఎస్ యు ఎఫ్ . ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట ను కేంద్రంగా చేయాలని నినాదంతో స్థానిక రైల్వేకోడూరులోని టోల్గేట్ దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ బహిరంగ ర్యాలీని చేయడం జరిగింది. ఈ బహిరంగ ర్యాలీకి అందుతూ మద్దతు తెలుపుతూ రైల్వే కోడూరు ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేసిన కోడూరు యూనియన్ స్టూడెంట్ ఫోర్స్ అధ్యక్షుడు బండారు మల్లికార్జున.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉపాధ్యక్షులు హస్తి భరత్ కుమార్ రాజు మండల కన్వీనర్ శివారెడ్డి,సెక్రటరీ జెట్టి హరీష్ కుమార్, హేమంత్ కుమార్, శ్రీధర్, కిరణ్, సుబ్బరాయుడు, నవీన్ కుమార్, రెడ్డయ్య, వెంకటేష్ మొదలగు వారు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అంబేద్కర్ వర్ధంతి—అభిలాషల సాధనకే ప్రతి అడుగు: ఎమ్మెల్యే సౌమ్య

చందర్లపాడులో రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ “అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేసిన మహానేత. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహిళలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ఆయన అందించిన అమూల్య మైన వరం” అని పేర్కొన్నారు. సమానత్వం–సోదరభావం అంబేద్కర్ ఆశయాల మూలం అని, ఆ విలువలను ప్రతి పౌరుడు ఆచరించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.