Monday, 16 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*సాహో ఫౌండేషన్ వారిచే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ*.

*మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* మర్రిపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న 350 మంది విద్యార్థులకు సాహో ఫౌండేషన్ మర్రిపాడు వారి సహకారంతో ఇంగ్లీషు విషయ నిపుణుడు ఉమామహేశ్వరరావుచే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించబడ్డ ఇంగ్లీషు మెటీరియల్ ను మండల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిష్ బిట్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత,సాహో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడచల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి ఒక ముఖ్యమైన మైలురాయి అనీ,అత్యుత్తమ మార్కుల సాధన కోసం,విద్యార్థులు కష్టతరంగా భావించే ఇంగ్లీషు విషయానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ను సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించి మండలం లోని అందరు విద్యార్థులకు అందించడం జరిగిందనీ,విద్యార్థులు ఈ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని ఉత్తమ మార్కులు సాధించాలని అన్నారు.మండల విద్యాశాఖ అధికారి-1 తిరుపతయ్య మాట్లాడుతూ మండలంలో విద్యా సంబంధిత కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి-2 ధనలక్ష్మి,కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర,స్టడీ మెటీరియల్ రూపకర్త ఉమామహేశ్వరరావు,రిసోర్స్ పర్సన్ రాజేంద్రకుమార్,మండలంలోని అన్ని పాఠశాలల ఇంగ్లీషు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఆపన్నహస్తం

-కుమ్మరపల్లిలో లబ్ధిదారురాలికి రూ. 39,205 చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ -ప్రజల కష్టకాలంలో వెంటనే స్పందించడం ప్రభుత్వ లక్ష్యం: నాయకుల ఉద్ఘాటన చిట్వేలి, డిసెంబర్ 8: పున్నమి ప్రతినిధి ప్రజల అత్యవసర సమయాల్లో అండగా నిలబడి, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. -చెక్కు అందజేత: చిట్వేలి మండలం, నగిరిపాడు పంచాయతీ పరిధిలోని కుమ్మరపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కట్ట సుమిత్ర చెందిన ఆర్థిక సాయం చెక్కును సోమవారం ఆమె స్వగృహం వద్ద అందజేశారు. సుమిత్ర గారికి రూ. 39,205/-(ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఐదు రూపాయలు) విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అరవ శ్రీధర్ పాటు, రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి సంయుక్తంగా అందజేశారు. -అరవ శ్రీధర్ గారి ప్రసంగం: ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ… “కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే ఎంతోమంది పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. విద్య, వైద్యం వంటి అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫండ్‌ను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా స్థానిక నాయకులు, అధికారులు నిరంతరం కృషి చేయాలని” కోరారు. -ముక్కా వరలక్ష్మి వ్యాఖ్యలు ముక్కా వరలక్ష్మి గారు మాట్లాడుతూ… “సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రజల కష్టకాలంలో నిజమైన ఆదారం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం నేరుగా చేరేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కష్టాల్లో ఉన్నవారు ధైర్యాన్ని కోల్పోకుండా, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. లబ్ధిదారురాలికి సాయం అందించడం తమకు సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. -పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో అధికార కూటమి (ఎన్డీఏ) నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం పట్ల లబ్ధిదారురాలు సుమిత్ర గారు మరియు ఆమె కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతను తెలియజేశారు.

తెలంగాణ

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఆకట్టుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సందర్శకుల దృష్టిని దోచుకున్నది ప్రత్యేక రోబో. వీఐపీలకు మనిషిలా నడుచుకుంటూ స్వాగతం పలుకుతూ అందరి ఆకర్షణగా నిలిచింది. దాని చురుకైన యాక్టివిటీస్, స్పందన గెస్టులకు విశేషంగా నచ్చాయి. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, భారతదేశం నలుమూలల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పాల్గొనడం సమ్మిట్‌కి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.

తెలంగాణ

ఆత్మీయత సేవా సొసైటికి నేషనల్ గౌరవం – బయ్యన మహేందర్ గారికి ‘గోల్డెన్ నంది అవార్డు–2025

గత 8 సంవత్సరాలుగా ఆత్మీయత సేవా సొసైటి ని ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంస్థ నుండి చేస్తునందుకు మనం ఫౌండేషన్, కడప వారు ఈ నెల 27 వ తేది నా హైదరాబాద్ లో జరుగు అవార్డ్స్ వేడుకలో ఆత్మీయత సేవా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ గారికి ” Best Sewa Golden Nandi National Award 2025″ ని బహుకరించడం జరుగుతుందని, మనం ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ Dr. K. చక్రవర్తి గారు తెలియజేయడం జరిగినది. ఈ సందర్బంగా మనం ఫౌండేషన్ చైర్మన్ గారికి ఆత్మీయత సేవా సొసైటి ఫౌండర్ & అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఈ సేవా కార్యక్రమములకు సహకరిస్తున్న సొసైటి సభ్యులకు మరియు దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు బయ్యన మహేందర్ గారు తెలియజేయడం జరిగినది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో హెల్మెంట్ పంపిణీకి సహకరించిన వారిని సన్మానించిన డి.ఎస్.పి .సీఐ.ఎస్ఐ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి విశేష సహకారం అందించిన స్థానిక నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలను డీఎస్పీ శ్రీ జి. శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గార్లు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంలో వారి సహకారం అభినందనీయమని అధికారులు తెలిపారు. సేవాభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి శాలువాలు కప్పి అభినందించారు. అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే కీలక అలవాటు అని ప్రజలకు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మనుబోలు టిడిపి నాయకులు రాజా గౌడ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో హెల్మెంట్ పంపిణీకి సహకరించిన వారిని సన్మానించిన డి.ఎస్.పి .సీఐ.ఎస్ఐ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి విశేష సహకారం అందించిన స్థానిక నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలను డీఎస్పీ శ్రీ జి. శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గార్లు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంలో వారి సహకారం అభినందనీయమని అధికారులు తెలిపారు. సేవాభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి శాలువాలు కప్పి అభినందించారు. అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే కీలక అలవాటు అని ప్రజలకు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మనుబోలు టిడిపి నాయకులు రాజా గౌడ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో హెల్మెంట్ పంపిణీకి సహకరించిన వారిని సన్మానించిన డి.ఎస్.పి .సీఐ.ఎస్ఐ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి విశేష సహకారం అందించిన స్థానిక నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలను డీఎస్పీ శ్రీ జి. శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గార్లు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంలో వారి సహకారం అభినందనీయమని అధికారులు తెలిపారు. సేవాభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి శాలువాలు కప్పి అభినందించారు. అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే కీలక అలవాటు అని ప్రజలకు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మనుబోలు టిడిపి నాయకులు రాజా గౌడ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

SECOND INTERNATIONAL CONFERENCE లో SDM SIDDHARTHA MAHILA కళాశాల అధ్యాపకులు

డిసెంబర్ 5, 6 .2025 వ తేదీన జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ * డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ బియాండ్ అటామస్ అండ్ అల్గారిథమ్స్ రిప్లై * అనే అంశంపై రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండియన్ నాలెడ్జి కమిటీ వారు శ్రీమతి కె .శశి, డాక్టర్ అయినవోలు మంజుల పాల్గొని శ్రీ చైతన్య సరస్వతి ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకోవటం జరిగినది .ఈ సదస్సు శ్రీ చైతన్య సరస్వతి math,వెస్ట్ బెంగాల్ మరియు పిబి సిద్ధార్థ కాలేజ్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసినది.

ఆంధ్రప్రదేశ్

దాత ఆశయానికి తూట్లు… వెయ్యి కోట్లు విలువైన ఆనంద నిలయం భూమిపై అక్రమార్కుల పాగా… అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కొండబాబు ఘాటైన ఆరోపణలు… త్వరలోనే ఆనందనిలయం ఆస్తుల పరి రక్షణ కు ప్రజా ఉద్యమానికి సన్నాహాలు..

కాకినాడ, కాకినాడ జిల్లా, పున్నమి ప్రతినిధి: పిఠాపురం మహారాజా చిన్నారుల విద్య–వికాసం కోసం అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘాటుగా హెచ్చరించారు. ఆనంద నిలయం పరిధిలోని 19 ఎకరాల భూమిని ఆక్రమించేందుకుచోటుచేసుకుంటున్న కుట్రలు దాత ఆశయానికే తూట్లు పొడుస్తున్నాయని ఆయన తీవ్రఆగ్రహంవ్యక్తంచేశారు.ఆదివారం ఆనందనిలయం ప్రాంగాణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు వెయ్యి కోట్లు విలువ చేసే ఈ భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డి దోవలో పాగా వేయడానికి పన్నాగం పన్నెరని తెలిపారు. వారి ఆటలు ఇక సాగవని.ఎవరు కొనడానికి ముందుకొస్తే వారు ఇబ్బందుల్లో పడతారని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే చిన్నారుల గూడు అయిన ఆనంద నిలయాన్ని కాకావికాలం చేసిందని ఆయన మండిపడ్డారు.1910 సంవత్సరంలో దాత ఈ భూమిని దానం గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించిన వ్యక్తుల నుంచి రికవరీ చేసి బాధితులకు అందించామని గుర్తుచేస్తూ,మిగిలిన భూభాగం కూడా ఎవరి బాపాతం కాదన్నారు. దాత ధర్మాన్ని కాపాడాలన్నారు. భూమి వ్యవహారాలపై జరుగుతున్న అనుమానాస్పద చర్యలను అధికారులే పెనుభూతిగా మారుస్తున్నారని చెప్పారు.కాకినాడలో అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు పూర్తి వివరాలతో నివేదించామని వెల్లడించారు. ఆనంద నిలయం ఆస్తుల రక్షణ కోసం త్వరలోనే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, హాస్టల్ అధికారులు,ఆర్‌ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర పుస్తకావిష్కరణ

శ్రీకాళహస్తి డిసెంబర్ 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో వెలసియున్న శ్రీ సంకల్ప సిద్ధి వినాయక ఆలయంలో రిటైర్డ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ APSPDCL రాజేంద్రన్ ధర్మపత్ని అయిన కీ.శే. రమాదేవి జ్ఞాపకార్థం శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర సంక్షిప్త విశేషాల పుస్తకాన్ని పూజ చేసి ఆవిష్కరించడం జరిగినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.